Venu Swamy: వేణు స్వామి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. సినీ సెలెబ్రెటీల జాతకాలు చెబుతూ పెద్ద ఎత్తున ఈయన వార్తల్లో నిలిచారు. సమంత నాగచైతన్య విషయంలో ఈయన చెప్పిన జోస్యం నిజం అవడంతో అప్పటినుంచి ఈయన చెప్పే మాటలు వినే వారి సంఖ్య అధికమయింది.ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీల జాతకాలు చెప్పిన ఈయన తాజాగా నటుడు నరేష్ రమ్య రఘుపతి పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తాను వ్యక్తిగతంగా సూపర్ స్టార్ కృష్ణ గారికి పెద్ద అభిమానిని వేణు స్వామి వెల్లడించారు. ఈ క్రమంలోనే తరచూ వారి ఇంట్లో ఎన్నో పూజలు కూడా చేశానని వేణు స్వామి తెలిపారు. ఇకపోతే 2014 సంవత్సరంలో అనుకుంటా ఒకసారి విజయనిర్మల కృష్ణ గారి జాతకాలు చూసినప్పుడు 2020 సంవత్సరంలో వారిద్దరిలో ఎవరో ఒకరు చనిపోతారని తాను జాతకం చెప్పినట్లు వేణు స్వామి వెల్లడించారు.ఈ విషయం విన్న విజయనిర్మల ఎంతో భయపడిందని అయితే తాను భయపెట్టాలనే ఉద్దేశంతో అలా చెప్పలేదని వారి జాతకం అలాగే ఉందని వేణు స్వామి తెలిపారు.
తాను చెప్పిన విధంగానే విజయనిర్మల చనిపోయారు. ఇక వీరి జాతకాలు చెబుతున్న సమయంలో నరేష్ కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు ఆయనకు రమ్య రఘుపతి తో పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే నరేష్ రమ్య జాతకం చూసిన తాను వీరిద్దరు పెళ్లి చేసుకున్నా విడిపోతారని చెప్పాను. అయితే నరేష్ వీటిని పట్టించుకోకుండా రమ్యను పెళ్లి చేసుకున్నారు.
ప్రస్తుతం ఫలితం మనం చూస్తున్నాము అంటూ వేణు స్వామి తెలిపారు. నరేష్ రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్న విడిపోతారని నాకు తెలుసు. ఈ విషయం వారికి చెప్పిన వినలేదు అందుకే వీరి పెళ్లిని తాను చేయలేదని ఈ సందర్భంగా నరేష్ పెళ్లి విడాకుల గురించి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…