ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ టాపిక్ ఏదంటే.. చైసామ్ విడాకుల మ్యాటర్. మామూలుగా కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీనే అది ఓ ఊపు ఊపింది. ఇద్దరం విడిపోతున్నామంటూ సింపుల్ గా ట్వీట్ల ద్వారా సమంత, నాగ చైతన్య ఇద్దరూ ప్రకటించారు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు చైసామ్ అభిమానులు కూడా ఒక్కసారిగా బిత్తరపోయారు. నిజానికి.. వాళ్లిద్దరూ విడిపోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి మీడియా కోడైకూసినా కూడా అదంతా ఉత్తి పుకారే అని చాలామంది కొట్టిపారేశారు. చివరకు సమంత కూడా విడాకుల విషయంపై పలువులు జర్నలిస్టులపై సీరియస్ అవడంతో.. ఎహె.. వాళ్లెందుకు విడాకులు తీసుకుంటారులే అని అంతా అనుకున్నారు.
అంతలోనే సడెన్ గా అందరికీ షాక్ ఇస్తూ ఇద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించారు. అయితే వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోతున్నారో అటు నాగచైతన్య గాని, ఇటు సమంత గాని సరైన కారణం చెప్పలేదు. అది వాళ్ల వ్యక్తిగత విషయం. అందరికీ చెప్పాల్సిన అవసరం వాళ్ళిద్దరికీ లేదు. అయినా కూడా అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. సమంత – నాగచైతన్య విడిపోవడానికి కారణం సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ అంటూ వారిద్దరికీ ఎఫైర్ అంటగట్టారు. అయితే దీనిపై అటు సమంత, ప్రీతమ్ జూకాల్కర్ ఇద్దరూ ఘాటుగానే స్పందించారు.
ప్రీతమ్ జుకల్కర్ అయితే తానూ సమంతను అక్క అని పిలుస్తానని.. మారిద్దరి మధ్య ఉన్న బంధం ఏమిటో నాగచైతన్యకు కూడా తెలుసని, దీనిపై నాగచైతన్య స్పందించాలని చెప్పాడు. అయితే తాజగా ఈ విషయంపై నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆమె మట్లాడుతూ తనకు తెలిసినంత వరకూ సమంత – నాగచైతన్య విడిపోయేందుకు ప్రీతమ్ కారణం కాదని నేను కచ్చితంగా చెప్పగలనని చెప్పారు.దీనికి కారణం ప్రీతమ్ ఒక గే అని, అటువంటి ప్రీతమ్ తో సమంత సంబంధం ఎలా పెట్టుకుంటుందని ఆమె ప్రశ్నించారు. అవన్నీ వొట్టి పుకార్లని తెల్చిపారేసింది శ్రీరెడ్డి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…