Featured

Srikanth : కేవలం డబ్బుకి కక్కుర్తిపడి మజిలీ లో ఆ క్యారెక్టర్ చేశా….!

Srikanth : శ్రీకాంత్ కృష్ణస్వామి అయ్యంగార్ తెలుగు సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వతహాగా వైద్యుడైన శ్రీకాంత్ సినిమా మీద మక్కువతో సినిమా పరిశ్రమలోకి వచ్చారు. అటు రైటర్ గానూ కొన్నాళ్ళు ఉన్న శ్రీకాంత్ ఇపుడు పూర్తిగా నటుడుగా సినిమాల్లో నటిస్తున్నారు. ‘ప్రతిరోజు పండగే’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ తన పాత్రలను ఎలా ఎంపిక చేసుకుంటారో తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

కక్కుర్తి పడి మజిలీ సినిమాలో చేశా…

సినిమా పరిశ్రమలో అందరితోనూ ఒక కుటుంబంలా ఉంటానని నన్ను కూడా అందరూ బాబాయ్, పప్పా, భయ్యా అంటూ పిలుస్తారని చెప్పారు. ఎప్పుడైనా ఎవరైనా విసుక్కున్నా వాళ్ళు పని ఒత్తిడిలో అలా చేస్తారు తప్ప మామూలుగా ఉంటే అలా చేయరు కదా అని అనుకుంటా తప్ప అలాంటివి పట్టించుకోను. అయితే ఎవరైనా కావాలని కెలికితే మాత్రం వద్దు అని మొదటే చెబుతా వినకుంటే ముఖం పై చెప్పేసి పక్కకు వచ్చేస్తా అంటూ చెప్పారు.

ఇక పాత్రల ఎంపిక విషయంలో రెమ్యూనరేషన్, డేట్స్ సర్దుబాటుకి మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఒకసారి కుటుంబంతో కలిసి గోవా వెళ్ళాలి అనుకున్న సమయానికి శివ నిర్వాణ ఫోన్ చేసి ఒక్క సన్నివేశం ఉంది మజిలీ సినిమాలో చేస్తారా అని అడుగగా సరే ఒక ముప్పై, నలభై వేలు వస్తాయి కదా ట్రిప్ కి పనికి వస్తాయని డబ్బుకి కక్కుర్తి పడి చేశాను. అంతే పాత్ర ఏంటి ఎలా అని ఏం ఆలోచించలేదు. ఇక ఆ సినిమా చూసి దర్శకుడు మారుతీ ఫోన్ చేసి ప్రతిరోజు పండగే సినిమా ఆఫర్ ఇచ్చారు. మజిలీ లో మీ నటన బాగుందని చెప్పారు. అందుకే పాత్రల విషయంలో ఇదే చేయాలి అదే చేయాలి అని పెద్దగా ఆలోచించను అంటూ చెప్పారు శ్రీకాంత్.

Bhargavi

Recent Posts

వేడి బైక్ సీటు.. పురుషుల ఫెర్టిలిటీకి ముప్పా? రోజూ బైక్ వాడేవారికి ముఖ్య సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి

వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…

8 hours ago

డ్రై ఫిష్ తింటే ఎముకలు బలంగా మారుతాయా? ఆశ్చర్యపరిచే లాభాలు!

ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…

8 hours ago

మురాది ఆంజనేయస్వామి ఆలయంలో భారీ హుండీ ఆదాయం.. భక్తుల విశ్వాసం మరోసారి రుజువు!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

8 hours ago

శ్రీకాకుళం టూర్‌లో ఉపరాష్ట్రపతి.. అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాల్లో ప్రత్యేక పూజలు!

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…

8 hours ago

జై వాసవి నినాదాలతో మారుమోగిన సిద్దిపేట.. అంగరంగ వైభవంగా రథయాత్ర!

తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…

8 hours ago

మోహిని ఏకాదశి వ్రతం చేస్తే ఏమవుతుంది? పురాణాల్లో ఆసక్తికర విశేషాలు!

వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…

8 hours ago