తెలుగు బుల్లితెరపై అదుర్స్, పటాస్ వంటి కార్యక్రమాలకు యాంకర్ గా చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ మొదట్లో వెండితెరపై పలు సినిమాలలో నటించిన శ్రీముఖి ఆ తర్వాత బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ విధంగా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో ఏకంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బుల్లితెరకు కొద్దిరోజులపాటు దూరంగా ఉంటున్న శ్రీముఖి తాజాగా పలు ఈవెంట్లకు, యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా గత కొద్ది రోజుల క్రితం ఓంకార్ యాంకర్ గా నిర్వహిస్తున్నటువంటి సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ద్వారా వచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీముఖి శేఖర్ మాస్టర్ తో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్టేజ్ పై చిందులు వేస్తూ శ్రీముఖి కొరియోగ్రాఫర్ కు ముద్దు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా శేఖర్ మాస్టర్ కు ముద్దులు పెట్టడంతో ఈ ఎపిసోడ్ బాగా హైలెట్ అయ్యింది. ఇదిలా ఉండగా ఈ ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్టార్ మా లో ప్రసారం కాబోయే “కామెడీ స్టార్స్” కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా శేఖర్ మాస్టర్ వ్యవహరిస్తున్న సంగతి మనకు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా శ్రీముఖి ఈ కార్యక్రమంలో పాల్గొని మరోసారి శేఖర్ మాస్టర్ తో కలిసి స్టేజ్ పై చిందులు వేశారు. ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ బుగ్గపై మరో సారి శ్రీముఖి ముద్దు పెట్టడం వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే శ్రీముఖి వేషధారణలో ఉన్న ముక్కు అవినాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆ ముద్దు మొత్తం బయట వైరల్ గా మారింది తెలుసా.. అనగా అందుకు శేఖర్ మాస్టర్ స్పందిస్తూ… ఆ ముద్దు తర్వాత మా ఇంట్లో నాకు వైరల్ ఫీవర్ వచ్చింది తెలుసా నీకు అంటూ.. కౌంటర్ వేశారు. ఈ విధంగా శ్రీముఖి స్టేజ్ పైన శేఖర్ మాస్టర్ కు మరోసారి ముద్దు పెట్టడంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన “జననాయగన్” సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ…
విద్యపై పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులైనా అడ్డుకావని మరోసారి నిరూపించిన వ్యక్తిగా రాజస్థాన్కు చెందిన మాజీ సైనికుడు దశరథ్ సింగ్…
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమహేంద్రవరంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. ఈ మహోత్సవానికి భారీగా భక్తులు…
సింహాచలం దేవస్థానంలో ఈ నెల 20న జరగనున్న అప్పన్న స్వామి చందనోత్సవానికి విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది జరిగే…
టాలీవుడ్లో తాజాగా విడుదలైన సినిమా వేడుకలో జరిగిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మృణాళ్…
భారత సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు అలరించిన గానలెజెండ్ ఆశా భోంస్లే కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని…