Health News

కరోనా సెకండ్ వేవ్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ తగ్గడంతో పాటు పలు జిల్లాల్లో 50 లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా కేసులు తగ్గినా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాజాగా కరోనా సెకండ్ వేవ్ గురించి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శీతాకాలం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గడంతో కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో జగన్ మాట్లాడుతూ యూరప్ లో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని చెప్పారు. ఢిల్లీలో కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. అమెరికా సైతం కరోనా వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు.

ఫ్రాన్స్, లండన్‌ వైరస్ వ్యాప్తి వల్ల షట్ డౌన్ లో ఉన్నాయని.. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ అమలవుతోందని అన్నారు. సెకండ్ వేవ్ రాకుండా కరోనా నిబంధనలు పాటించి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. కాలేజీలు, పాఠశాలలు తెరుస్తున్నామని కలెక్టర్లు కరోనా వైరస్ మళ్లీ విజృంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

గతంతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందని.. అయితే సెకండ్ వేవ్ ఇతర దేశాల్లో వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలు సైతం కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

21 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

22 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago