ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ తగ్గడంతో పాటు పలు జిల్లాల్లో 50 లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా కేసులు తగ్గినా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాజాగా కరోనా సెకండ్ వేవ్ గురించి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శీతాకాలం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గడంతో కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో జగన్ మాట్లాడుతూ యూరప్ లో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని చెప్పారు. ఢిల్లీలో కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. అమెరికా సైతం కరోనా వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటోందని చెప్పారు.
ఫ్రాన్స్, లండన్ వైరస్ వ్యాప్తి వల్ల షట్ డౌన్ లో ఉన్నాయని.. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ అమలవుతోందని అన్నారు. సెకండ్ వేవ్ రాకుండా కరోనా నిబంధనలు పాటించి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. కాలేజీలు, పాఠశాలలు తెరుస్తున్నామని కలెక్టర్లు కరోనా వైరస్ మళ్లీ విజృంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
గతంతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందని.. అయితే సెకండ్ వేవ్ ఇతర దేశాల్లో వస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలు సైతం కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…