Sudigali Sudheer - Rashmi Gautam: రష్మి గౌతమ్తో ఆ రాత్రి..! ఏం జరిగిందో చెప్పిన సుడిగాలి సుధీర్.. !
Sudigali Sudheer – Rashmi Gautam: టీవీ షోలతో కూడా చాలా మంది పాపులర్ అవుతున్నారు. ముఖ్యంగా జబర్థస్త్ షోద్వారా చాలా మంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. జబర్థస్త్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్ రేటెడ్ షోగా ఉంది.
ఈ షో వస్తుందంటే.. ఆటోమేటిక్ గా టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతుంటాయి. జబర్దస్ట్ బూతులతో నిండి ఉందని.. డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటున్నాయని కొంత మంది విమర్శిస్తున్నా.. ఇప్పటికీ ఈ షోకు ఉన్న ఆదరణే వేరు. ఇదిలా ఉంటే హైపర్ ఆది- అనసూయ, సుడిగాలి సుధీర్- రష్మీ గౌతమ్ మధ్య కెమిస్ట్రీ కూడా ఫన్ తెప్పిస్తూ ఉంటుంది.
ముఖ్యంగా సుధీర్, రష్మీల మధ్య కెమిస్ట్రీ ఈ షోకే హైలెట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు బుల్లి తెరపై కనిపిస్తే.. అభిమానులకు పండగే. గతంలో ఢీ షోలో కూడా వీరి కెమిస్ట్రీ అదుర్స్ అని చెప్పవచ్చు. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ వచ్చే వారం ప్రోమో విడుదలైంది. ఈసారి సుధీర్, రష్మీ ఓ స్కిట్ లో వీరిద్దరు కనిపించారు.
వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని వాడుకుంటూ… 4 నిమిషాల ప్రోమోను కట్ చేశారు. అందులో సుధీర్, బుల్లెట్ భాస్కర్లను ఇంటరాగేషన్ చేస్తారు నలుగురు పోలీసులు, రష్మి గౌతమ్. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సుడిగాలి సుధీర్ దిమ్మతిరిగే పోయే సమాధానాలు ఇస్తుంటాడు. దీంతో ఫన్ జనరేట్ అయింది మొబైల్ పాస్ వర్డ్ ఏంటనీ రష్మీ గౌతమ్ అడగగా ‘ఉమ్మా’ అని చెప్తాడు సుధీర్. అలాగే జీ మెయిల్ పాస్ వర్డ్ ను అడగగా ‘తొందరగా వచ్చేయ్’ అంటాడు. నువ్వు గోడలు ఎందుకు దూసుకుతున్నావు అని రష్మి అడగ్గానే.. సుధీర్ ఇచ్చట మూత్రం పోయరాదు.. అని రాసి ఉండటంతో అటు వైపు మూత్రం పోసేందుకు గోడ దూకుతున్నా అని సమాధానం ఇస్తాడు.. ఈ సీన్ మరింత కామెడీగా అనిపిస్తుంది. పొద్దున్నే ఏం చేస్తావురా నువ్వు అంటే.. మా ఇంటికి వెళ్లిపోతాను అంటూ చెప్పాడు సుధీర్. రాత్రి ఎక్కడికి వెళ్తావ్ అంటే దానికి మరో పంచ్ పేలుస్తాడు సుధీర్ దీంతో నవ్వు ఆపుకోలేకపోతారు. ఇలా ఈ స్కిట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వీరిద్దరి ఫ్యాన్స్.
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…
టాలీవుడ్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…
దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి. తాజాగా FASTag సేవల పేరుతో భారీ ఆన్లైన్ మోసం వెలుగులోకి…
తెలంగాణలో ఉన్నత విద్యను ఆశించే విద్యార్థులకు కీలక సమాచారం. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో…
ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…