తెలుగు బుల్లితెరపై గత రెండు దశాబ్దాల కాలం నుంచి తన సత్తా ఏంటో నిరూపించుకుంటూ విజయపథంలో దూసుకుపోతున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లి తెర పై ఏ ఛానల్ పెట్టినా అందులో మనకు సుమ దర్శనమిస్తారు. స్పష్టమైన మాటతీరు, తనదైన శైలిలో పంచులు వేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఒకవైపు బుల్లితెర పై పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ సోషల్ మీడియాలో కూడా అభిమానులకు దగ్గరగా ఉంటూ అభిమానుల సందడి చేస్తున్నారు.
సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాలలో క్యాష్ ఒకటి. తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే క్యాష్ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈవారం క్యాష్ ప్రోగ్రాంకు పవన్ – అంజలి, విశ్వ -ప్రశాంతి, కరుణ -వాసుదేవ్, శిరీష -సన్నీ జంటగా వచ్చారు. ఈ విధంగా అందరితో కలిసి సుమ చేసిన రచ్చ మామూలుగా లేదు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో వీరితో సుమ తనదైన శైలిలో పంచులు వేస్తూ రచ్చ చేశారు. వీరు కూడా సుమకు దీటుగా సమాధానాలు చెబుతూ ఎంతో సరదాగా పంచులు వేస్తూ ఆడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఈ షోలో భాగంగా సన్నీ మాట్లాడుతూ స్వామి రారా సినిమా తరువాత వెస్మా తీసుకున్నానని చెప్పడంతో వెంటనే సుమ మరి టైటానిక్ సినిమా చూసి ఏం తీసుకున్నావ్ అంటూ ప్రశ్నించింది.ఈక్రమంలోనే వాసుదేవ్ కల్పించుకొని టైటానిక్ సినిమా తీసిన తర్వాత ఆ సినిమాలోని ఫోజ్ ట్యాంక్ బండ్ పై ట్రై చేశాడు. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేశారు అని చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. వాసుదేవ ఇలా మాట్లాడగా సన్నీ కల్పించుకొని మీరు మాట్లాడేది ఏ ఫోజ్ గురించి అని అడగడంతో బొమ్మ గీసాడు కదా అది కాదు కదా అని అంటాడు. అప్పుడు సుమ కలుగజేసుకుని..”కాదు జాక్.. రోజ్ బొమ్మ గీశాడు కానీ, రోజ్.. జాక్ బొమ్మను గీసి ఉంటే ఏమయ్యేదో “అంటూ ఆ ఫోటో గురించి కామెంట్స్ చేస్తూ విపరీతంగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…