విద్యార్థి ఇంట్లో వెలుగులు నింపిన ఉపాధ్యాయులు.. ఏం చేశారంటే!
సాధారణంగా ఒక విద్యార్థికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన బాధ్యత గురువు ఉంటుంది. ఈ క్రమంలోనే గురువులు విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకు వచ్చి వారిని జీవితంలో మంచి ఉన్నత స్థాయిలో నిలబెడతారు. అయితే కేరళలో మాత్రం ఉపాధ్యాయులు కేవలం విద్యార్థి జీవితంలో వెలుగులు నింపడమే కాకుండా వారి ఇంట్లో కూడా వెలుగులు నింపి అందరి చేత ప్రశంసలు పొందారు. ఈ విధంగా ఉపాధ్యాయులు చేసిన పనికి స్థానికులు ఉపాధ్యాయుల పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలలు సైతం విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్ తరగతులు వినాలంటే తప్పకుండా ఇంట్లో కరెంట్ సౌకర్యం ఉండాలి. ఈ క్రమంలోనే కేరళలోని వడకర సమీపంలో ఉన్న కీజల్ యూపీ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారా లేదా అని గ్రామంలో పర్యటించారు.
ఈ క్రమంలోనే ఓ విద్యార్థి ఇంట్లో విద్యుత్ సదుపాయం లేక ఆన్లైన్ తరగతులను తినలేకపోతున్నానని గుర్తించిన ఉపాధ్యాయుడు శ్రీజన్ ఆ విద్యార్థి ఇంటికి విద్యుత్ వైరింగ్ చేసి వెలుగులు నింపాడు.ప్రస్తుతం విద్యార్థి ఇల్లు నిర్మాణ దశలో ఉండటంతో వైరింగ్ చేయడానికి మరికొంత ఆలస్యం అవుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు తెలపడంతో ఉపాధ్యాయుడు శ్రీజన్ వైరింగ్ కోర్సు పూర్తి చేయడంతో ఇతర ఉపాధ్యాయుల సహాయంతో విద్యార్థి ఇంటిలో వైరింగ్ పూర్తిచేసి విద్యుత్ సదుపాయం కల్పించారు.
ఈవిధంగా ఉపాధ్యాయుల సహకారంతో తన ఇంటిలో వెలుగు చూసిన విద్యార్థి మోములో చిరునవ్వు కనిపించిందని ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శ్రీజన్ తెలిపాడు. ఈ క్రమంలోనే ఆ విద్యార్థికి ఆన్లైన్ తరగతులను వినడానికి DYFI కమిటీ ఒక మొబైల్ ఫోన్ కూడా అందించారు. ఈ విధంగా ఉపాధ్యాయుడు చేసిన పనికి విద్యార్థి తల్లిదండ్రులు స్థానికులు ఆ ఉపాధ్యాయుడు పై ప్రశంసలు కురిపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…