Suriya: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సూర్య వరుస సినిమాలలో నటిస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. సూర్య రెగ్యులర్ కథలకు కాకుండా వైవిద్యమైన కథలను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. సూర్యకి కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సూర్య నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ చేసి విడుదల అవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటున్నాయి. దీంతో ఈ సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉండగా ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషకు మాత్రమే పరిమితమైన సూర్య సినిమాలు ఇకపై పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతున్నాయి. ప్రస్తుతం సూర్య తన 42వ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో 10 భాషలలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమా కథనాలు చాలా భిన్నంగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా మీద మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టైటిల్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమా టైటిల్ కూడా ఇప్పటికే ఫిక్స్ చేశారు.
తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఏప్రిల్ 16వ తేదీన ఉదయం 9:05 నిమిషాలకు సూర్య నటిస్తున్న 42 వ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరో గుర్రం మీద ఎక్కి విల్లు భాణాలతో.. గుర్రాలపై వేటాడే ఒక వేటగాడుగా ఉన్నాడు. ఆ గుర్రంపై ఒక కొండ కొస నుంచి మరో కొండపైకి జంప్ చేస్తున్నట్టుగా ఉంది. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమా మీద అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…