Swetha Lakshmipathi : యాంకర్ గా అలాగే స్క్రిప్ట్ రైటర్ గా కమెడియన్ గా 70 కి పైగా సినిమాల్లో నటించిన లక్ష్మీపతి గారు చేసింది కొన్ని సినిమాలు అయినా తెలుగు ప్రేక్షకులు ఆయనని మర్చిపోలేరు. ఆంధ్రుడు, అల్లరి, కితకితలు, పెద్దబాబు వంటి సినిమాల్లో అయన కామెడీని ఎవరూ మర్చిపోలేరు. ఇక ఆయన విలన్ గా చేసిన ఏకైక సినిమా ఆయన తమ్ముడు శోభన్ దర్శకత్వం వహించిన మహేష్ బాబు సినిమా బాబీ. ఇక చూడాలని ఉంది సినిమాతో కమెడియన్ గా తెలుగులో బ్రేక్ తెచ్చుకున్న లక్ష్మీపతి గారు 2008 లో మరణించారు. అయన మరణం కంటే నెల రోజుల ముందు ఆయన తమ్ముడు డైరెక్టర్ శోభన్ గుండెపోటుతో మరణించారు. ఇక నెల వ్యవధిలో కుటుంబంలో ఇద్దరినీ కోల్పోవడం ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేక పోవడంతో చాలా ఇబ్బందులు పడినట్లు లక్ష్మీపతి గారి కూతురు శ్వేత రెసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన తండ్రి బాబాయ్ తో ఉన్న అనుబంధాన్ని పుస్తకాలు రూపంలో తెచ్చారు శ్వేత.
నాన్నా చనిపోడానికి కారణం…
రేడియో జాకీ గా వైజాగ్ లో పనిచేస్తున్న సమయంలో 2008 జనవరి 7 న బాబాయ్ శోభన్ మరణించారు. ఆయన మరణించిన నెల రోజులకు సరిగ్గా అదే రోజున తండ్రి లక్ష్మీపతి మరణించారు. శ్వేతగారు ఆ సమయంలో జాబ్ చేస్తున్నా ఖర్చులు పోను తన వద్ద 1500 మాత్రమే చేతిలో ఉన్నాయంటూ అసలు ఏం చేయాలో తెలియలేదంటూ తెలిపారు. తన తండ్రి మరణించే రోజు కూడా ఫోన్ చేసారంటూ చెప్పారు. శ్వేతా గారి అమ్మ, తమ్ముడు ఇద్దరూ శ్వేత గారిని చూడటానికి వైజాగ్ వెళ్లగా ఆరోజు తిరిగి హైదరాబాద్ వెళ్లారట. ఇంకా వాళ్ళు ఇంటికి రాలేదని లక్ష్మీపతి గారు కూతురికి ఫోన్ చేసి అడిగితే వస్తారు కాస్త ఎక్కడైనా ఆలస్యమైయుంటుంది అంటూ చెప్పి మామూలుగా మాట్లాడారట. తీరా మధ్యాహ్నం సమయంలో ఆయన అనారోగ్యాంగా ఉంది హాస్పిటల్ తెసుకెళ్ళమని ఫోన్ చేయగా తరచూ లక్ష్మీపతిగారు అనారోగ్యం పాలవుతూ ఉండటం వల్ల శ్వేత సీరియస్ గా తీసుకోలేదట.
అయితే మరో బాబాయ్ ఫోన్ చేసి త్వరగా రా అని చెప్పేసరికి ఏదో జరిగిందని అర్థమై ఫ్లైట్ పట్టుకుని వెళ్లగా ఒక్కసారిగా నాన్న మరణించాడని తెలిసి షాక్ అయ్యాను. సినిమాల్లోకి వచ్చాక తాగడం బాగా అలవాటైపోయింది దాంతో అయన ఆరోగ్యం పాడైంది. ఇక బాబాయ్ మరణంను అసలు తట్టుకోలేని నాన్న ఆ బాధతోనే మరణించారు అంటూ శ్వేత ఎమోషనల్ అయ్యారు. ఆయన అంత్యక్రియలకు మా వద్ద డబ్బులు లేక అందరూ ఆలోచిస్తుంటే ఇండస్ట్రీలో వాళ్ళే కొంతమంది సహాయం చేసారు అంటూ తెలిపారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…