Tag Archives: aha

Anil Ravipudi: దీపికా పిల్లికి ముద్దులు పెట్టిన అనిల్ రావిపూడి.. ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Anil Ravipudi: ప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు ప్రసారమవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెరపై కామెడీ స్టార్స్, జాతి రత్నాలు, జబర్దస్త్ వంటి ఎన్నో కామెడీ షోలు ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇకపోతే తెలుగు ఓటీటీ సమస్థ అహా వేదికగా ఇప్పటికే ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలు అలాగే డాన్స్ షోలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది.

ఇకపోతే తాజాగా ఆహాలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కామెడీ షో కూడా ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి న్యాయ నిర్ణేతగా వ్యవహరించగా సుడిగాలి సుదీర్, దీపికా పిల్లి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముక్కు అవినాష్, సద్దాం, హరి వంటి కమెడియన్లు సందడి చేయబోతున్నారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

Anil Ravipudi: హైలెట్ గా మారిన అనిల్ రావిపూడి…

ఈ ప్రోమోలో భాగంగా ముక్కు అవినాష్ సద్దాం కామెడీ పంచ్ లతో అందరిని నవ్వించారు. ఇక యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి సుడిగాలి సుదీర్ ను సైతం వదలకుండా తనపై కూడా తమదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ సందడి చేశారు. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి ఏకంగా యాంకర్ దీపిక పిల్లికి ముద్దు పెట్టడం ఈ ప్రోమోలో హైలెట్ గా మారిపోయింది. ఇది చూసిన పలువురు అనిల్ రావిపూడిలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Un Stoppable: అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ లో సందడి చేయనున్న చంద్రబాబు వైరల్ అవుతున్న ఫోటోలు?

Un Stoppable: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు. ఆహాలో స్ట్రీమింగ్ అయిన అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా హోస్ట్ గా మారిన బాలకృష్ణ షో కి హాజరైన సెలబ్రెటీలను తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ.. వారితో ఎంతో సరదాగా ఎపిసోడ్ మొత్తం పూర్తి చేశారు.

ఈ విధంగా మొదటి సీజన్ కి మంచి
ప్రేక్షకాదరణ లభించి మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంది. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ మంచి హిట్ అవటంతో మేకర్స్ సీజన్ 2 కూడా మొదలు పెట్టమన్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 కి సంబంధించిన పనులు మొత్తం పూర్తి చేసుకుని తొందరలోనే ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లో మొదటి గెస్ట్ ఎవరు అనే విషయంపై ఉత్కంఠత వీడింది.

ఈ కార్యక్రమానికి మొదటి గెస్ట్ గా బాలకృష్ణ వియ్యంకుడు.. ఏపీ మాజీ సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Un Stoppable: బావను ప్రశ్నించడానికి సిద్ధమైన బాలయ్య..

ఇలా మొదటి ఎపిసోడ్ లోనే బాలకృష్ణ తన అల్లుడు వియ్యంకుడితో కలిసి రచ్చ చేయటానికి సిద్ధమయ్యాడు. అంతేకాకుండా ఈ షో చివరిలో బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Srirama Chandra: బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర.. మెగా కాంపౌండ్ లోకి ఎంటర్..! దేని కోసమంటే..

Srirama Chandra: తెలుగులో ప్రసారం అయిన బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ పూర్తయింది. 105 రోజుల ఈ జర్నీ ఎట్టకేలకు ఇటీవల గ్రాండ్ గా ముగిసింది. అయితే హౌస్ లో 19 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టగా.. మొత్తానికి చివరకు 5గురు టాప్ లో ఉన్న వారిలో సన్నీ విజేతగా నిలిచాడు. తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడానికే తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు చెప్పిన శ్రీరామచంద్ర టాప్ 3లో నిలిచాడు.

Srirama Chandra: బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర.. మెగా కాంపౌండ్ లోకి ఎంటర్..! దేని కోసమంటే..

అక్కడ డబ్బులను ఆశగా చూపించినా.. శ్రీరామచంద్ర లొంగకుండా.. అలానే ఉన్నాడు. చివరకు బయటకు వచ్చిన తర్వాత అతడికి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి షాక్ అయ్యాడు. తాను అనుకున్నది సాధించినట్లు పేర్కొన్నాడు శ్రీరామ్. ఇక తాజాగా అతడు.. బంపర్ ఆఫర్ ను కొట్టేశాడు. ఏకంగా మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెట్టాడు. అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో బిగ్గెస్ట్ స్టేజ్ షోను నిర్వహించబోతోన్నాడు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.

Srirama Chandra: బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీరామచంద్ర.. మెగా కాంపౌండ్ లోకి ఎంటర్..! దేని కోసమంటే..

సుదీర్ఘకాలం పాటు సాగే స్టేజ్ షో ఇది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఓ గొప్ప అవకాశాన్ని అందుకున్నాడు శ్రీరామచంద్ర. గతంలో ఇండియన్ ఐడల్ 5 విజేతగా నిలిచిన శ్రీరామ్ కి ఇప్పుడు ఆ ఆఫర్ రావడంతో అతడి అభిమానులతో పాటు అతడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఈ బిగ్గెస్ట్ స్టేజ్ షోను సమర్థవంతంగా నడిపించడానికి పాటపై మంచి పట్టు ఉండాలి. ఆ అర్హత ఉన్న ఏకైక సింగర్‌గా శ్రీరామచంద్రను గుర్తించింది ఆహా మేనేజ్‌మెంట్. అందుకే అతడికి సెలెక్ట్ చేసినట్లు తెలిపారు.

తెలుగులో మొదటిసారి ప్రారంభమవుతున్న అద్భుతమైన కార్యక్రమం:

ఇక ఆహా ఓటీటీ గురించి చెప్పుకుంటే.. ఎన్నో వెబ్ సిరీస్ లు, టాక్ షోలు , రియాల్టీ షోలతో దూసుకుపోతోంది. తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ స్టార్ట్ చేసి క్రేజీ రెస్పాన్స్ ను దక్కించుకుంది ‘ఆహా’. ఇక తాజగా తెలుగు ఇండియన్ ఐడల్ ను మొదలు పెట్టి.. యంగ్ సింగర్స్ కోసం ఓ కొత్త అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిలో పాల్గొనేవారికి 14 నుంచి 30 సంవత్సరాలలోపు ఉన్న వారు అర్హులుగా పేర్కొన్నారు. పాల్గొనదలిచిన వారు తెలుగు పాటలు మాత్రమే పాడాల్సి ఉంటుంది. సీజన్ 1లో పాల్గొనడానికి ఎలాంటి ప్రీ-రిజిస్ట్రేషన్ అవసరం లేదని పేర్నొన్నారు. హిందీలో సోనీ టీవీ ఇండియన్ ఐడల్ 12 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. దేశంలో మారుమూల గ్రామాల్లో ఉన్న సింగర్స్‌ను గుర్తించడానికి ఈ షోను నిర్వహిస్తూ వస్తోంది ఛానల్ యాజమాన్యం. ప్రస్తుతం తెలుగులో మొదటిసారిగా ఆహా యజమాన్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

మరో షోతో ముందుకు వస్తున్న ఆహా.. ‘తెలుగు ఇండియన్ ఐడల్’గా..!

తెలుగు ఓటీటీల్లో దూసుకువెళ్తోంది ‘ఆహా’ ఓటిటీ. అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ  ‘ఆహా’ ఓటీటీ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు. ఆహా వచ్చిన తక్కువ కాలంలోనే అందరి అభిమానాలను పొందింది. ఎప్పటికప్పుడు కొత్తగా అభిమానుల ముందుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లతోనే కాకుండా టాక్ షోలతో గుర్తింపు పొందుతోంది.

ఇటీవల బాలయ్యతో చేసిన అన్ స్టాపబుల్ ఎంత సక్సెస్ అయిందో మనకందరికి తెలిసిందే. బాలక్రిష్ణ అన్ స్టాపబుల్ షో ఓటీటీలో దుమ్ము రేపుతోంది. తాాజాగా మరో సంచాలనానికి తెరతీసింది ఆహా..‘తెలుగు ఇండియన్ ఐడల్’ పేరుతో సరికొత్త షోతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇంతకుముందు మననకు ఇండియన్ ఐడల్ షో గురించి తెలుసు.

హిందీలో ప్రసారమైన ఈ షో దేశవ్యాప్తంగా చాలా ప్రాచుర్యాన్ని పొందింది. సింగింగ్ కాంపిటీషన్ షోగా అందర్ని ఆకట్టుకోంది. మన తెలుగు వ్యక్తులు శ్రీరామ్ చంద్ర, కారుణ్య, రేవంత్ వంటివారు ఇండియన్ ఐడల్ లో పాల్గొని విజేతలుగా నిలిచారు. అయితే ఇప్పడు తెలుగులో కూడా ఇలా సింగింగ్ కాంపిటీషన్ కోసం ఆహా.. తెలుగు ఇండియన్ ఐడల్ ను ప్రారంభించనుంది. ఇందులో తెలుగు టాలెంట్ ను ఎంకరేజ్ చేయనుంది.

దీనికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వెల్లడించింది ఆహా. ఇందుకు సంబంధించి ఆడిషన్స్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించింది. డిసెంబర్‌ 26న తొలి ఆడిషన్స్‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం 14 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న గాయనీగాయకులకు ఆహ్వానం అందించారు. ఇక ఈ ఆడిషన్స్‌ హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని ఒయాసిస్‌ స్కూల్‌లో ఆడిషన్స్‌ను నిర్వహించనున్నారు. తాజాగా ‘ఆహా’ తీసుకువచ్చే ఈ షో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

ఆహాలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్‌ ..

ఈ సంవత్సరం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువగా హిట్ అయిన సినిమాల్లో చెప్పుకునేవి లవ్ స్టోరీ మరియు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇద్దరు బ్రదర్స్ బంపర్ హిట్ కొట్టేశారు. ఇది అక్కినేని ఫ్యామిలీకి డబుల్ సందడి అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా.. త్వరలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాను ఆహా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఆహా విడుదల చేసింది. థియేటర్లలో సినిమా చూడని వారు ఇంకా ఉంటే.. ఈ ట్రైలర్ ను మీరూ చూసేయండి. ఇక సినిమా విషయానికి వస్తే.. బొమ్మరిల్లు భాస్కర్ కు గత కొన్ని సంవత్సరాల నుంచి మంచి హిట్ దొరకలేదు.

ఒకానొక సమయంలో అతడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారట.. కనీసం దర్శకత్వం వహించడానికి సినిమాలు చేతిలో లేక ఎన్నో కష్టాలను అనుభవించారట. ఇకపోతే.. ఈ సినిమాకు అల్లు అరవింద్ అతడికి నెలకు శాలరీ చొప్పున పారితోషికం ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పటికీ ఉంటుంది.

చాలా రోజుల తరువాత బొమ్మరిల్లు భాస్కర్‌కు మళ్లీ సక్సెస్ వచ్చినట్టు అయింది. దీనిలో హీరోగా నటించిన అఖిల్ అక్కినేనికి కూడా చాలారోజుల నుంచి మంచి హిట్ దొరకలేదు. ఈ సినిమాతో ఆ లోటు తీరింది. దీంతో బొమ్మరిల్లు భాస్కర్ కు, అక్కినేని అఖిల్ కు ఈ సినిమా వాళ్ల కెరీర్ కు పెద్ద ఉపశమనం కలిగించిందనే చెప్పాలి. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా ఆహాలో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

ఆ టాక్ షో కి బాలకృష్ణ అంత రెమ్యూనరేషన్ తీసుకోనున్నారా..?

నందమూరి బాలయ్య అభిమానులు కొన్ని రోజుల నుంచి మంచి జోష్ లో ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే.. అతడు ఆహాలో త్వరలో ప్రసారం కానున్న అన్‌స్టాపబుల్‌ షో కి హోస్ట్ గా వ్యవహరించునున్నారు. బాలయ్య ఈ అన్‌స్టాపబుల్‌ షోలో ఎలా యాంకరింగ్ చేయనున్నారో చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అల్లుఅరవింద్ ఆ హీరోను ఒప్పించడంలో సఫలం అయ్యారు. ఈ షో నవంబర్ 4 నుంచి ఆహాలో టెలికాస్ట్ కానుంది.

ఈ షో లాంచ్ వేడుకలో బాల‌కృష్ణ‌ మాట్లాడుతూ.. పొట్టివాళ్లు గట్టివాళ్లు అంటూ అల్లు అరవింద్ ను ఆట పట్టించారు. తన తండ్రితో ఇండస్ట్రీలో ఎవరికీ లేని చనువు కేవలం అల్లు రామలింగయ్యకు మాత్రమే ఉండేదని.. ఎన్టీఆర్ ను బండోడు అనే వాడని గుర్తు చేసుకున్నారు.

ఇలా అతడి సంభాషణ అంతా సందడి సందడిగా సాగిపోయింది. ఇదిలా ఉండగా.. బాలకృష్ణ ఈ షోకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనేది అభిమానులు తెలుసుకోవాలని ఉత్సుకతను చూపిస్తున్నారు. అయితే ఈ షోకు అతడు భారీగా పారితోషికమే అందుకోనున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఒక్క సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

బాలయ్యతో యాంకరింగ్ అంటే మామూలు విషయం కాదు.. దానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. అల్లు అరవింద్ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అతడు ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు రూ.40 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిలో మొత్తం 12 ఎపిసోడ్లు ఉంటాయి. మొత్తం లెక్కేస్తే.. దాదాపు రూ.6 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తీసుకోనున్నారు బాలయ్య.

వ్యాఖ్యతగా మారనున్న బాలకృష్ణ.. అన్‌ స్టాపబుల్‌ షో కర్టెన్‌రైజర్‌లో అలరించిన బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ అనగానే డైలాగ్స్ గుర్తుకువస్తాయి. అతడు చెప్పే డైలాగ్ డెలివరీ తెలుగు సినీ పరిశ్రమలోనే ఎవరికీ సాధ్యం కావు. అలా ఉంటాయి అతడి డైలాగ్స్. అయితే అతడు ఓ సంచలనాలకు తెర లేపుతున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అతడు మొదటి సారి వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్నారు. అన్‌స్టాపబుల్ అనే షో కోసం బాలయ్య వ్యాఖ్యతగా అలరించబోతున్నారు.

ఈ షో నవంబంర్ 4 నుంచి ప్రసారం కానుంది. దీనికి సంబంధించి ఆహా ఓ ప్రోమో ద్వారా ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబుతో పాటు ఇంకెంతో మంది స్టార్ హీరోలను బాలయ్య ఇంటర్వ్యూ చేయనున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ షోకి సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది.

రాయి శిల్పంగా కావాలంటే.. ఉలి దెబ్బలు తినాలి.. ఆ తర్వాతనే దానికి రూపం వచ్చి ప్రతీ ఒక్కరూ అపురూపంగా చూస్తారు. ప్రతీ మనిషి జీవితంలో కూడా ఇలాంటి ఎత్తుపల్లాలు ఉంటాయని.. వాటిని అధిగమించి ముందుకు సాగాలన్నారు. ఈ షో కాన్సెప్ట్ నచ్చడంతో తాను ఒప్పుకున్నట్లు పేర్కొన్నాడు బాలయ్య. అల్లు రామలింగయ్య అంటే.. తన తల్లిదండ్రులకు ఎంతో అనుబంధం ఉందంటూ.. చెప్పుకొచ్చాడు.

ఈ కార్యక్రమానికి వచ్చే నటీనటులతో మాట్లాడి వాళ్ల భావోద్వేగాలను పంచుకుంటూ.. వాళ్లమాటలను మీ ముందు ఉంచుతానని బాలయ్య అన్నారు. ఇక అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బాలయ్య సినిమాలో హీరో మాత్రమే కానీ.. నిజజీవితంలో కాదు అంటూ చెప్పాడు. ఏవి తనలో దాచుకోరని.. బాధ, ప్రేమ, ఏదైనా బయటకు చూపిస్తాడన్నారు. ఈ కాన్సెప్ట్ గురించి డిస్కషన్ చేస్తున్న సమయంలో బాలయ్య చేస్తే ఎలా ఉంటుందని మా సభ్యులతో చెప్పినప్పుడు.. చాలామంది ఓకె చేశారని.. వెంటనే బాలయ్యకు ఫోన్ చేయగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పుకున్నట్లు చెప్పాడు.

ఆహాలో మెగాస్టార్ పొలిటికల్ థ్రిల్లర్.. విడుదలైన వన్ ట్రైలర్..?

ప్రతిక్షణం ఎంతో ఆశక్తికరమైన సినిమాలను, వెబ్ సిరీస్ లను, టాక్ షో లను ప్రజల ముందుకు తీసుకువస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న ఓటీటీ మాధ్యమాలలో “ఆహా” ఒకటని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ ఓటిటి సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు.కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో విడుదలైన సినిమాలను తెలుగులోకి అనువదించి డబ్ చేసి ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు.

ఈ క్రమంలోనే తమిళ మెగా స్టార్ మమ్ముట్టి హీరోగా సంతోష్ విశ్వనాథ్ దర్శకత్వంలో, ఇచ్చాయిస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్. శ్రీలక్ష్మి నిర్మించిన సినిమా ‘వన్’. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ఎంటరై రాజకీయాలలో వచ్చే ఒడిదుడుకులను ఎలా ఎదుర్కొని ప్రజలకు సేవ చేస్తాడనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలో ముమ్ముట్టి ముఖ్యమంత్రిగా ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి ఆహా ద్వారా ప్రేక్షకులకు చేరువ చేయనున్నారు. ఈ క్రమంలోనే నేను కేవలం 15 లక్షల మందికి మాత్రమే ముఖ్యమంత్రిని కాదు.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడున్నర కోట్ల మందికి కూడా నేను ముఖ్యమంత్రిని అంటూ చెప్పే డైలాగులు ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

https://youtu.be/QvhQHRKcutE

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఆహా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఈ నెల 30వ తేదీ నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

సమంత పారితోషకం చూసి నోరెళ్లబెడుతున్న స్టార్ హీరోయిన్లు..?

సమంత.. ఏమాయ చేసావే అంటూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా ఈ హీరోయిన్.. ఆతర్వాత తన నటనతో క్యూట్ నెస్ తో అందరిని ఆకట్టుకుంది. తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్న ఈ భామ అక్కినేని వారి కోడలు అయ్యి అందరిని ఆశ్చర్యపరిచింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ తన అభిమానులకు దగ్గర ఉన్న ఈ భామ సినిమాలు మాత్రమే కాకుండా బుల్లితెరపై, ఓటిటిపై యాంకర్ గా కూడా షోస్ చేస్తూ మరింత దగ్గరగా ఉంటుంది.

అందుకే మొన్నటి వరకు సినిమాకు 2 కోట్లు తీసుకునే ఈ హీరోయిన్ ఇప్పుడు ఓ రేంజ్ కు వెళ్ళిపోయింది. ఒక షో కి సమంత ఏకంగా అక్షరాల కోటి రూపాయల పారితోషకం అందుకుంది. విని షాక్ అవుతున్నారా..! నిజంగానే ఈ హీరోయిన్ అక్షరాల కోటి రూపాయిల పారితోషికం అందుకుంది. ఓటిటి ‘ఆహా’లో ప్రసారం అవుతున్న సామ్ జామ్ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కి ఆమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి రూపాయలు పారితోషికం అందుకుంది.

పెళ్లి తర్వాత సమంత అసలు సినిమాల్లోకి రాదు అనుకుంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ లాక్ డౌన్ లో సైతం సమంత అభిమానులకు దగ్గరగా ఉంటూనే బోలెడన్ని అడ్వేర్టైజ్మెంట్లు చేసి కోట్లలో సంపాదించిది అంటూ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు కూడా వైరల్ అయ్యాయి. ఇక లాక్ డౌన్ లో టెర్రాస్ గార్డెనింగ్, వంటకాలు చెయ్యడంతో పాటు మెగా కోడలు ఉపాసనతో కలిసి ప్రజలకు హెల్త్ టిప్స్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఈ లాక్ డౌన్ సఖీ అంటూ బట్టల షాప్ ని కూడా ప్రారంభించింది సమంత. ప్రస్తుతం ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్ లో విలన్ పాత్రలో నటిస్తుంది. ఏది ఏమైనా అక్కినేని కోడలు అన్నిటిలోను ముందు ఉంటుంది అని అనడంలో సందేహం లేదు.