Tag Archives: aishwarya

Dhanush Father: ధనుష్ – ఐశ్వర్య మళ్లీ కలుస్తారు… విడాకుల పై స్పందించిన ధనుష్ తండ్రి కస్తూరి రాజా!

Dhanush Father: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుమారు 18 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఈ జంట ఒక్కసారిగా వీరి విడాకుల గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

Dhanush Father: ధనుష్ – ఐశ్వర్య మళ్లీ కలుస్తారు… విడాకుల పై స్పందించిన ధనుష్ తండ్రి కస్తూరి రాజా!

ఈ విధంగా ఈ జంట విడాకుల గురించి ప్రకటించడంతో అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం షాక్ కి గురయ్యారు.ఇకపోతే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ధనుష్ ఐశ్వర్య విడాకుల విషయం పై ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు.

Dhanush Father: ధనుష్ – ఐశ్వర్య మళ్లీ కలుస్తారు… విడాకుల పై స్పందించిన ధనుష్ తండ్రి కస్తూరి రాజా!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా అందరు భార్యాభర్తల మధ్య ఉండే గొడవలే ఐశ్వర్య, ధనుష్ మధ్య ఉన్నాయి త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తిరిగి వీరిద్దరూ కలుస్తారని కస్తూరి రాజా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ చెన్నైలో లేరని, హైదరాబాద్ లో ఉన్నారని, ఇద్దరికీ ఫోన్లు చేసి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.


రజినీకాంత్ కూడా సలహా ఇచ్చారు…

ఈ క్రమంలోనే కస్తూరి రాజా మాట్లాడుతూ చాలా మంది సినీ సెలబ్రిటీలు వారి పిల్లల భవిష్యత్తు కోసం విడాకుల నిర్ణయానికి వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని కస్తూరి రాజా పేర్కొన్నారు.రజినీకాంత్ కూడా వీరితో మాట్లాడారని విడాకుల గురించి మరొకసారి ఆలోచన చేయాలని వీరిద్దరికీ సూచించినట్లు తెలిపారు. అయితే రజనీకాంత్, కస్తూరి రాజా చెప్పిన మాటలను విని వీరి విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదంటే విడాకులు తీసుకొని విడిపోతారా అనేది తెలియాల్సి ఉంది.

Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా.. రజనీ ప్రయత్నాలు ఫలించలేదా?

Dhanush – Aishwarya Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య దంపతులు సోమవారం రాత్రి ఎవరూ ఊహించని విధంగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.18 సంవత్సరాల వైవాహిక జీవితంలో కలహాలు లేకుండా ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంట విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అని పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా.. రజనీ ప్రయత్నాలు ఫలించలేదా?

ఈ క్రమంలోనే ఇద్దరు విడిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… ఐశ్వర్య కేవలం దర్శకురాలిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ఈమె ఒక పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించాలని భావించగా అందుకు ధనుష్ ఒప్పుకోలేదని సమాచారం. అదేవిధంగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కాలా చిత్రాన్ని ధనుష్ నిర్మించారు. ఈ సినిమా భారీ నష్టాలను ఎదుర్కొంది ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా.. రజనీ ప్రయత్నాలు ఫలించలేదా?

అదేవిధంగా ఈ మధ్యకాలంలో హీరో ధనుష్ మరొక హీరోయిన్ తో చాలా చనువుగా ఉంటున్నారనే విషయం కూడా వినపడుతుంది.ఇలా వారి మధ్యలోకి మరొక హీరోయిన్ రావడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఐశ్వర్య ధనుష్ విడాకులు ఇవ్వాలని భావించినట్లు సమాచారం.

వారి నిర్ణయానికే వదిలేసిన రజిని…

ఇలా వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో రజనీకాంత్ ఆ సమస్యను పరిష్కరించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా రజనీకాంత్ ప్రయత్నాలు ఫలించకపోవడంతో రజినీకాంత్ చివరికి వారి నిర్ణయాన్ని వారికే వదిలేశారు.దీంతో వీరిద్దరు కలిసి ఉండటం కన్నా విడిపోవడమే మంచిదని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని పెద్దఎత్తున ఫిలింనగర్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.మరి వీరు విడాకులకు అసలు కారణం ఇదేనా మరేదైనా ఉందా అనే విషయం స్వయంగా ధనుష్ ఐశ్వర్య ప్రకటిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులకు కారణం ఆ డైరెక్టరే… భారీగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు!

Dhanush – Aishwarya Divorce: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం అనేది సర్వ సాధారణం అయిపోయింది. ఒకప్పుడు విడాకులు అనే వ్యవహారం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్,టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినీ సెలబ్రిటీలు వరుసగా విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులకు కారణం ఆ డైరెక్టరే… భారీగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు!

ఈ క్రమంలోనే గత కొన్ని నెలల క్రితం సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.ఇలా వీరి విడాకుల గురించి మరిచిపోక ముందే మరొక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్యల విడాకుల గురించి అధికారికంగా ప్రకటన చేస్తూ అందరికి షాక్ ఇచ్చారు.

Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులకు కారణం ఆ డైరెక్టరే… భారీగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు!

ఈ క్రమంలోనే ఎంతోమంది 18 సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈ జంట ఉన్నఫలంగా విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం పై సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కొంతమంది నెటిజన్లు నాగచైతన్య సమంత, ధనుష్ ఐశ్వర్య జంటలు విడాకులు తీసుకోవడానికి గల కారణం డైరెక్టర్ శేఖర్ కమ్ముల అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

విడాకులకు శేఖర్ కమ్ములకి కనెక్షన్ ఉంది…

ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదల అయిన వెంటనే నాగచైతన్య సమంత దంపతులు విడాకుల ప్రకటన చేశారు.ఈ క్రమంలోనే హీరో ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక పూర్తిస్థాయి తెలుగు చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ఈ జంట కూడా విడాకులు తీసుకోవడంతో వీరు విడాకులకు శేఖర్ కమ్ములకి కనెక్షన్ ఉంది అంటూ పెద్దఎత్తున డైరెక్టర్ శేఖర్ కమ్ముల పై ఇదెక్కడి కో-ఇన్సిడెన్స్ అంటూ నెటిజెన్స్ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులు ప్రకటించిన స్టార్ కపుల్?

Dhanush – Aishwarya Divorce: కోలీవుడ్ హీరో ధనుష్- ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న  ఈ జంట విడిపోతుండటం.. చాలా మంది ఫ్యాన్స్ ను షాక్ గురిచేసింది. 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. తాము ఇద్దరం విడిపోతున్నట్లు ట్విట్టర్ వేదికగా లేఖను విడుదల చేశారు. 18 ఏళ్లుగా స్నేహితులుగా, భార్యభర్తలుగా కలిసి ఉన్నామని.. ప్రస్తుతం విడిపోతున్నట్లు ఐశ్వర్య తెలిపారు.

Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులు ప్రకటించిన స్టార్ కపుల్?

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. ఇలా ఇద్దరు విడిపోవడం సినీ లవర్స్ తో పాటు, వారి ఫ్యాన్స్ ను షాక్ గురి చేస్తోంది. 

Dhanush – Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులు ప్రకటించిన స్టార్ కపుల్?

సెలబ్రెటీ జీవితాల్లో ఏ చిన్న విషయం ఉన్నా.. వెంటనే లీకులు, పుకార్లు వస్తుంటాయి. అలాంటిది సూపర్ స్టార్ రజినీ కాంత్ కూతురు ఐశ్వర్య, టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ దంపతులు విడిపోతున్నారంటే.. ఎంతో కొంత సమాచారం బయటకు వస్తుంటుంది. కానీ ఇక్కడ ఇదేమి జరగలేదు. కనీసం ఒక చిన్న రూమర్ కూడా రాలేదు. హఠాత్తుగా విడిపోతున్నట్లు ప్రకటించారు ఐశ్వర్య- ధనుష్. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ సమ్మతితోనే విడిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 


విడిపోవడం కామన్ గా మారింది..

ఇటీవల సెలబ్రెటీ కుటుంబాల్లో వరసగా విడిపోవడం కామన్ గా మారింది. అమిర్ ఖాన్ – కిరణ్ రావ్, నాగచైతన్య- సమంత ఇలా సెలబ్రెటి జంటలు విడిపోయాయి. తాజాగా ధనుష్- ఐశ్వర్య విడిపోయారు. అయితే ఈ మధ్యనే భారత ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను మామ రజినీకాంత్, అల్లుడు ధనుష్ తీసుకున్నారు. ఆ సమయంలో కూడా భార్య ఐశ్వర్య, ధనుష్ పక్కన ఉంది. కేవలం కొన్ని రోజలు వ్యవధిలోనే ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవడం అందర్ని షాక్ గురించేంది.

ఆ దర్శకుడిని కొట్టకుండా ఉండడమే నేను చేసిన అతి పెద్ద తప్పు… నటి ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఐశ్వర్యగా ప్రసిద్ధి చెందిన శాంత మీనా.. నటి లక్ష్మి కుమార్తె. ఆమె తమిళం, మలయాళంతో పాటు తెలుగు సినిమాలలో నటించింది. అయితే ఇటీవల ఆమె ఈటీవీలో అలీ హోస్ట్ గా ప్రసారం అవుతున్న అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది. దానిలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఐశ్వర్య ఇలా చెబుతూ.. తాను స్ట్రెయిట్ ఫార్వర్డ్ వ్యక్తినని.. అనవసరమైన వాటి జోలికి తాను వెళ్లనని చెప్పుకొచ్చింది. ఇక ఓ దర్శకుడు చేసిన పనులను తాను అస్సలు మర్చిపోలేదని.. అయినా తాను అన్ని మర్చిపోయి అతడి వద్దకు వెళ్లి పలకరించాను అని చెప్పింది. తన ముందు అన్నీ బాగానే మాట్లాడి.. తాను వెళ్లిపోయిన తర్వాత లేనిపోనివి చెబుతూ కోపం తెప్పిస్తాడని ఆరోపించింది.

ఆ దర్శకుడిని తాను కొట్టకుండా తప్పు చేశానని.. నా కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు అదే అని చెప్పింది. ఆ ఒక్క దర్శకుడు తప్ప.. తాను సినిమాలు చేసిన ప్రతీ దర్శకుడిని గౌరవిస్తానని.. ప్రతీ ఒక్కరు నాకు గురువులతో సమానం అంటూ చెప్పుకొచ్చారు. ఇక తాను సినిమా ఇండస్ట్రీకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఇక ఈ ప్రోమోలో మరో విషయాన్ని ప్రస్తావించారు.

ఎవరైనా తనకు ఫోన్ చేసి.. ఎలా ఉన్నావు అని అడగకుండా.. ఎక్కడ ఉన్నావు అని అడిగితే ఒళ్లు మండిపోతుందని చెపుకొచ్చింది. తాను సినిమా బ్రేక్ సమయంలో వెళ్లి వస్తానని చెప్పి.. పెళ్లి చేసుకున్నానని.. అంతే స్పీడ్ లో విడాకులు కూడా జరిగాయంటూ చెప్పుకొచ్చారు. ఇక చివరగా ఎందుకు తల్లితో దూరంగా ఉంటున్నావని అలీ అడగ్గానే భావోద్వేగానికి లోనయ్యారు.

టూ టౌన్ రౌడీ సినిమాలో హీరోయిన్‌ గా ఐశ్వ‌ర్య‌ను అనుకుని.. ఎందుకు తప్పించారో తెలుసా?

దాసరి నారాయణరావు దర్శకత్వంలో.. విక్టరీ వెంకటేశ్ హీరోగా వచ్చిన సినిమా ‘టూ టౌన్ రౌడీ’. ఇందులో వెంకటేష్, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. ఇది హిందీ చిత్రం తేజాబ్కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరీ అంత హిట్ కాకపోయినా యావరేజ్ సినిమాగా ఆడింది.

ఇదిలా ఉండగా.. హీరోయిన్ గా రాధను మొదట అనుకోలేదట. ఆమె కాకుండా సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి కూతురు ఐశ్వ‌ర్య‌ను అనుకున్నారట. ఆమెకు మొదట ఈ సినిమాలోనే అవకాశం వచ్చిందట. కానీ నటి లక్ష్మి వల్ల ఆ ఛాన్స్ మిస్ చేసుకోగా.. జగపతిబాబు సరసన అడ‌విలో అభిమ‌న్యుడు అనే సినిమాలో నటించారు ఐశ్వర్య. నటి లక్ష్మి ఆ ఆఫర్ ను మిస్ చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే..

టూ టౌన్ సినిమాలో హీరోయిన్ ఓ సీన్ లో స్విమ్మింగ్ డ్రస్ వేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఐశ్వర్య ఓకె చెప్పినా.. నటి లక్ష్మి మాత్రం దానికి ఒప్పుకోలేదు. దీంతో ఆమె టూటౌన్ రౌడీ సినిమాలలో నటించకుండా అయిపోయింది. లేదంటే ఆమెకు అదే మొదటి సినిమా అయ్యేది. ఐశ్వర్య అంతకముందే హోస‌కావ్య అనే క‌న్న‌డ మూవీలో నటించేందుకు ఒప్పుకుందట..

ఆ కారణంగానే నటి లక్ష్మిని తన సినిమాలో నటించేందుకు డి. రామానాయుడు అడిగినట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు ఓకె చెప్పిన తర్వాత.. ఈ స్విమ్మింగ్ డ్రస్ కు సంబంధించి సీన్ రావడంతో ఆమె ఆ పాత్ర నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.. అలా అని అనకుండా ఐశ్వర్య తల్లి లక్ష్మినే తప్పించారని చెప్పవచ్చు.

కోట్ల విలువ చేసే లగ్జరీ ఫ్లాట్ ను అమ్ముకున్న అభిషేక్, ఐశ్వర్య దంపతులు.. ఎందుకో తెలుసా..?

ఆస్తులను అమ్ముకుంటున్న అభిషేక్, ఐశ్వర్య దంపతులు. అవును మీరు విన్నది నిజమే.. ఎందుకు ఇలా చేస్తున్నారో ఇప్పడు తెలుసుకుందాం. అమితాబ్ బచ్చన్ గతంలో ABCL కార్పోరేషన్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించి ఆర్ధికంగా చితికి పోయారు. అప్పడు ఓ అందాల పోటీకి నిర్వాహకులుగా ఉండటం కూడా ఆర్థికంగా చితికిపోవడానికి ఓ కారణం అని చెప్పొచ్చు.

ఆ తర్వాత కేబీసీ ప్రోగ్రాంతో పాటు.. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రలతో మళ్లీ ఆస్తులను కూడబెట్టుకున్నారు. ఇదిలా ఉండగా.. బిగ్ బీ తరహాలో కాకుండా ఓ మోస్తరు తన వారసుడు అభిషేక్ బచ్చన్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఐశ్వర్య రాయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తర్వాత వీరిద్దరు తమ లగ్జరీ ఫ్లాట్‌ను అమ్మేసినట్టు సమాచారం.

2014లో రూ. 41 కోట్లతో ముంబైలోని ఒబెరాయ్ 360 వెస్ట్‌లో ఈ లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ఇప్పుడు దీనిని రూ. 45.75 కోట్లకు అమ్మేసారట. అయితే ఇదే స్థలంలో అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ సహా పలువరు బాలీవుడ్ హీరోలకు కూడా ప్లాట్స్ ఉన్నాయట.

అక్షయ్ రూ.52.5 కోట్లకు కొనుగోలు చేస్తే.. షాహిద్ కపూర్ రూ. 53 కోట్లకు అక్కడ ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే ఇంత ధర ఉన్న ప్లాట్ కేవలం రూ. 45.75 కోట్లకు అభిషేక్ అమ్మడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాళ్లకు సినిమాలు లేకనే ఇలా చేశారా.. లేదా ఇంకేమైనా బలమైన కారణం ఉందా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తు బాగాలేక దీన్ని విక్రయించారా అని కూడా అనుకుంటున్నారు.

ఐశ్వ‌ర్య తండ్రి ఎలా మరణించాడో తెలుసా.. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల కారణంగా..

సినీ కుటుంబం నుంచి వచ్చిన ఐశ్వర్యారాజేశ్ తొలినాటి తెలుగు సినీ హీరోల్లో ఒకడిగా ఉన్నఅమ‌ర్‌నాథ్ మనుమరాలు. ఆమె తండ్రి రాజేశ్ ఒకప్పుడు అతడు ‘మల్లెమొగ్గలు’ రాజేశ్ అందరికీ సుపరిచితుడు. ఆనంద భైర‌వి, రెండు జెళ్ల సీత‌ వంటి సినిమాల్లో హీరోగా నటించి కొన్ని సినిమాల్లో నెగెటివ్ రోల్స్ లో కనిపించాడు. అయితే అతడు యుక్తవయస్సులో ఉన్నప్పడు అర్థంతరంగా కన్నుమూశాడు. దీంతో వారి కుటుంబంలోనే కాక అభిమానుల గుండెల్లో విషాదాన్ని నింపాడు.

రాజేష్ కు భార్యతో పాటు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఆర్థికంగా మంచిగా ఉన్న రోజుల్లో అతడిని కొంతమంది అతడి వద్ద రుణాలు తీసుకొని చెల్లించకపోవడంతో రాజేశ్‌పై ఆ భారం ప‌డేద‌ని చెప్పుకునేవారు. దీంతో ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక తాగుడుకు బానిసగా మారాడు. దీంతో కుటుంబ భారం మొత్తం భార్య తీసుకొని ఎల్ ఐసీ ఏజెంట్ మారి భ‌ర్త‌నూ, న‌లుగురు పిల్ల‌ల‌నూ పోషించుకుంటూ వ‌చ్చారు.

ఆమె సంపాద‌న‌లో అధిక భాగం రాజేశ్ వైద్యానికే ఖ‌ర్చ‌య్యేది. ఆయ‌న లివ‌ర్ అప్ప‌టికే బాగా దెబ్బ‌తిని పోయింది. ఎంత వైద్యానికి ఖర్చు చేసిన అతడు బతకలేదు. ఐశ్వ‌ర్య‌కు ఏడెనిమిదేళ్ల వ‌య‌సులో రాజేశ్ కన్నుమూసారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురైన వారు అద్దె ఇంట్లోనే ఉంటూ పిల్ల‌ల‌ను పెంచుతూ వ‌చ్చారు.

ఆ తర్వాత అనుకోని ఘటనలో ఇద్దరు కుమారులను కోల్పోడంతో ఆ కుటుంబం ఇంకా కుంగిపోయింది. అలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ వ‌చ్చిన ఐశ్వ‌ర్య ఇవాళ న‌టిగా మంచి పేరు తెచ్చుకుని తండ్రి వార‌స‌త్వాన్ని నిల‌బెట్ట‌డ‌మే కాకుండా, ఆర్థికంగా కుటుంబాన్నీ నిల‌బెట్టింది. ఇప్పుడు ఆమె తల్లి కూతురుకు వస్తున్న మంచి పేరును చూసి ఎంతో గర్విస్తున్నారు. అప్పట్లో లేడీ కమెడియన్ అందరినీ నవ్వించిన శ్రీ‌ల‌క్ష్మి ఐశ్వర్యకు స్వయానా మేనత్త వరుస అవుతుంది.