Dhanush Father: ధనుష్ - ఐశ్వర్య మళ్లీ కలుస్తారు… విడాకుల పై స్పందించిన ధనుష్ తండ్రి కస్తూరి రాజా!
Dhanush Father: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుమారు 18 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఈ జంట ఒక్కసారిగా వీరి విడాకుల గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ విధంగా ఈ జంట విడాకుల గురించి ప్రకటించడంతో అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం షాక్ కి గురయ్యారు.ఇకపోతే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ధనుష్ ఐశ్వర్య విడాకుల విషయం పై ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణంగా అందరు భార్యాభర్తల మధ్య ఉండే గొడవలే ఐశ్వర్య, ధనుష్ మధ్య ఉన్నాయి త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తిరిగి వీరిద్దరూ కలుస్తారని కస్తూరి రాజా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ చెన్నైలో లేరని, హైదరాబాద్ లో ఉన్నారని, ఇద్దరికీ ఫోన్లు చేసి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ఈ క్రమంలోనే కస్తూరి రాజా మాట్లాడుతూ చాలా మంది సినీ సెలబ్రిటీలు వారి పిల్లల భవిష్యత్తు కోసం విడాకుల నిర్ణయానికి వెనక్కి తీసుకోవాలని కోరుతున్నామని కస్తూరి రాజా పేర్కొన్నారు.రజినీకాంత్ కూడా వీరితో మాట్లాడారని విడాకుల గురించి మరొకసారి ఆలోచన చేయాలని వీరిద్దరికీ సూచించినట్లు తెలిపారు. అయితే రజనీకాంత్, కస్తూరి రాజా చెప్పిన మాటలను విని వీరి విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేదంటే విడాకులు తీసుకొని విడిపోతారా అనేది తెలియాల్సి ఉంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…