Seniour Naresh: నేను టాప్ లో ఉండడానికి కారణం అదే.. ఈ ఏడాది నుంచి సినిమాలు నిర్మిస్తా: సీనియర్ నరేష్!
Seniour Naresh: సినీ ఇండస్ట్రీలో సీనియర్ నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నేడు (జనవరి 20) నరేష్ పుట్టినరోజు కావడంతో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా నరేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తాను పుట్టిన రోజు వేడుకలను జరుపుకోలేదని తెలిపారు.1972 లో వచ్చిన పండంటి కాపురం సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చాను. ఇలా నా సుదీర్ఘ ప్రయాణంలో నాకు ఎంతగానో సహకరించిన కృష్ణ విజయనిర్మల అలాగే తన గురువు గారు జంధ్యాల గారికి నరేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి సుమారు 50 సంవత్సరాలు అవుతుందని ఈ ఏడాది నుంచి తిరిగి ఈ బ్యానర్ పతాకాన్ని ఎగుర వేయాలని భావిస్తున్నట్లు నరేష్ తెలిపారు. అందుకే ఈ ఏడాది నుంచి ఈ బ్యానర్ పై చిత్రాలను నిర్మిస్తానని ఈ సందర్భంగా నరేష్ తెలియజేశారు.
ఈ ఏడాది అమ్మ పేరుతో స్టూడియోను అందుబాటులోకి తీసుకు వస్తున్నాను. నాలుగు స్తంభాలాట సినిమా సమయంలో గౌరవం నువ్వు ఆశించకు.. అందరికీ ఇవ్వు అని ఎప్పుడు మా అమ్మ చెప్పేదని, ఆ మాటలు ఇప్పటికీ ఫాలో అవడం వల్లే నేను టాప్ లో ఉన్నానని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు.కేవలం సినిమాలు నిర్మించడమే కాకుండా దర్శకత్వం చేయాలనే కోరిక కూడా ఉందనే విషయాన్ని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ సినిమాలో అలాగే నవీన్ పోలిశెట్టి సినిమాలో చేస్తున్నారని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు. ఇక సినిమా టికెట్ల వ్యవహారం పై స్పందించిన ఈయన ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్నాయి అయితే మంచి నిర్ణయం వస్తుందని ఆశిద్దాం అంటూ టికెట్ల గురించి స్పందించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…