Dhanush - Aishwarya Divorce: ధనుష్, ఐశ్వర్య.. విడాకులకు కారణం ఆ డైరెక్టరే… భారీగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు!
Dhanush – Aishwarya Divorce: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకోవడం అనేది సర్వ సాధారణం అయిపోయింది. ఒకప్పుడు విడాకులు అనే వ్యవహారం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్,టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినీ సెలబ్రిటీలు వరుసగా విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలోనే గత కొన్ని నెలల క్రితం సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.ఇలా వీరి విడాకుల గురించి మరిచిపోక ముందే మరొక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్యల విడాకుల గురించి అధికారికంగా ప్రకటన చేస్తూ అందరికి షాక్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ఎంతోమంది 18 సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఈ జంట ఉన్నఫలంగా విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం పై సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కొంతమంది నెటిజన్లు నాగచైతన్య సమంత, ధనుష్ ఐశ్వర్య జంటలు విడాకులు తీసుకోవడానికి గల కారణం డైరెక్టర్ శేఖర్ కమ్ముల అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా విడుదల అయిన వెంటనే నాగచైతన్య సమంత దంపతులు విడాకుల ప్రకటన చేశారు.ఈ క్రమంలోనే హీరో ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక పూర్తిస్థాయి తెలుగు చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ఈ జంట కూడా విడాకులు తీసుకోవడంతో వీరు విడాకులకు శేఖర్ కమ్ములకి కనెక్షన్ ఉంది అంటూ పెద్దఎత్తున డైరెక్టర్ శేఖర్ కమ్ముల పై ఇదెక్కడి కో-ఇన్సిడెన్స్ అంటూ నెటిజెన్స్ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…