Tag Archives: akhil

Naga Chaitanya Mother: నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విషయాలు తెలుసా.. విడాకులకు కారణం అదేనా?

Naga Chaitanya Mother: నాగార్జున ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత దగ్గుబాటి వారసురాలు దగ్గుబాటి లక్ష్మీని వివాహం చేసుకున్నారు.దగ్గుబాటి రామానాయుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సమయంలోనే లక్ష్మి జన్మించారు. ఈమె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే ఇంటీరియర్ డిజైనర్ గా స్థిరపడ్డారు.ఇకపోతే రామానాయుడు ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగుపెట్టిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో మంచి పరిచయం ఏర్పడింది.

ఈ విధంగా ఈ రెండు కుటుంబాల మధ్య మంచి పరిచయం ఏర్పడటంతో వీరిద్దరూ వియ్యంకులుగా మారాలని భావించారు.ఇలా అనుకున్నదే తడవు దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మీతో నాగార్జున వివాహానికి అన్ని సిద్ధం చేశారు. అయితే అమెరికా జీవన శైలికి అలవాటు పడిన లక్ష్మి ఇండియా రావడానికి ఇష్టపడలేదు. అయితే ఆమెకు నచ్చజెప్పి ఇండియా రప్పించి వీరి వివాహాన్ని చెన్నైలో ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు.

ఇకపోతే వివాహమైన తర్వాత లక్ష్మి ఇండియాలో ఇమడలేకపోయింది దీంతో తాను అమెరికా వెళ్లి స్థిరపడాలని నాగార్జునపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే నాగార్జున ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా రాణించాలనే ఉద్దేశంతో తాను అమెరికా వెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.వీరి మధ్య గొడవలు జరగడంతో ఇరు కుటుంబ సభ్యులు వీరికి నచ్చ చెప్పారు.

ఇండియాలో ఉండలేక గొడవలు పడి విడిపోయిన లక్ష్మి..

ఇక ఈ దంపతులకు నాగచైతన్య జన్మించకా లక్ష్మి ఇండియాలో ఉండలేక నాగార్జునతో గొడవలు పడి విడాకులు తీసుకుని విడిపోయారు.విడాకులు ఇచ్చిన తర్వాత నాగార్జునకు అమల పరిచయం కాగా ఆమెతో ప్రేమలో పడి తనని వివాహం చేసుకున్నారు. అదేవిధంగా లక్ష్మీ సైతం తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని తిరిగి అమెరికాలో స్థిరపడ్డారు.ఇక నాగచైతన్య కొద్దిరోజుల పాటు తన తల్లి లక్ష్మీ వద్ద పెరిగినా అనంతరం తండ్రి నాగార్జున దగ్గర కూడా పెరిగారు.

బిగ్‌బాస్‌ హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్లు.. ఇక సందడే సందడి..ఎవరెవరు వెళ్లనున్నారో తెలుసా..!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 5 ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. మరో రెండు రోజుల్లో ఎవరు బిగ్ బాస్ విన్నర్ అనేది తెలియనుంది. ఇక పోతే ఈ రెండు రోజులు కూడా హౌజ్ లో పెద్ద హంగామానే జరగనుంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఫైనల్ కు భారీగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మాజీ కంటెస్టెంట్లను హౌజ్ లోకి పంపించి సందడి చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్‌లాగే ఈ సారి కూడా సీనియర్లు హౌస్‌లోని ఫైనలిస్టులతో ముచ్చటించనున్నారు. దీనికి సంబంధించి ఎపిసోడ్ నేడు రాబోతోంది. అయితే బయట కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాళ్లు హౌజ్ లోనే ఓ రూంలో ఉండి వాళ్లతో ముచ్చటించనున్నారు.

తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 2 రన్నర్ గీతామాధురి, బిగ్ బాస్ సీజన్ 4 రన్నర్ అఖిల్ సార్థక్, రోల్ రైడా మరియు హరితేజలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. వీళ్ల రాకతో బిగ్ బాస్ హౌస్ మొత్తం సందడి సందడిగా మారనుంది. ఎవరి ఆట ఎలా ఉంది..ఎవరికి పంచ్ లు ఇస్తారో.. ఎవరిని పొగడ్తలతో ముంచెత్తుతారో చూడాలి. ఇక పోతే ఫైనల్ ను ఈ సారి బిగ్ బాస్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ రోజు సాంగ్స్ సెట్ పై షూట్ చేశారట. ఫైనల్ రోజు బిగ్ బాస్ టెలికాస్ట్ అనేది సాయంత్రం 6.00 లేదా 6.30 సమయాల్లో ఉండనుంది. ఇక ఓటింగ్ ప్రకారం చూసుకుంటే.. సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర మధ్య టైటిల్ పోరు ఉండనుందనేది తెలుస్తోంది. నిన్నటి వరకు శ్రీరామ చంద్ర ఓటింగ్ లో మూడో స్థానంలో ఉండగా.. ఒక్కసారిగా రెండో స్థానంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాదు..సన్నీ ఫ్యాన్స్ కూడా రిలాక్స్ అయ్యారని.. షణ్ముఖ్ కు కూడా ఓట్లు బాగానే వస్తున్నాయనేది టాక్. ఏదేమైనా ఎక్కవ శాతం ఈ సారి టైటిల్ సన్నీ గెలుస్తాడనేది చాలామంది నమ్ముతున్నారు.

షణ్ముఖ్ పాలప్యాకెట్లు ఎత్తుకుపోయేవాడు.. యూట్యూబర్ పై మండిపడిన అఖిల్..!

అఖిల్ సార్దక్.. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదేంటో పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. ఇదిలా ఉండగా 12 వ వారంలో యాంకర్ రవి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

అతడు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడి ఫ్యాన్స్ నానా హంగామా చేస్తున్నారు. ఫేక్ ఎలిమినేషన్ చేశారంటూ.. బిగ్ బాస్ పై చిర్రెత్తిపోతున్నారు. పింకీ, సిరి కంటే తక్కువగా యాంకర్ రవికి ఓట్లు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిలో కూడా ప్రాంతీయ బేధం చూపించారని తెలంగాణ జాగృతి సభ్యులు ఆరోపించారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లు బాగానే ఉన్నారు కానీ.. బయట ఫ్యాన్స్ మాత్రం ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు.

తాజాగా ఓ యూట్యూబర్‌ షణ్ముఖ్‌పై దారుణ వ్యాఖ్యలు చేశాడు. ‘షణ్నును ఎక్కడో చూసినట్లుంది… పొద్దున్నే పాల ప్యాకెట్లు ఎత్తుకుపోయేది, కాగితాలు ఏరుకునేది మీరే కదా గుర్తుపట్టాను, మీ ముఖం అయితే 5 పైసలు ఉంటది. కాగితాలు ఏరుకునేటోడు ఓ రాయి పట్టుకుని కుక్కల వెనకాల తిరుగుతుంటడు చూడు.. వాడు సేమ్‌ నీలాగే ఉంటడు షణ్ను..’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వీడియోను అఖిల్‌ సార్థక్‌ తన ఇన్ స్టాలో ట్యాగ్ చేసి ఇలా అన్నాడు.

గేమ్ ను గేమ్ లాగే చూడండి.. దయచేపి తప్పుగా మాట్లాడకండి అంటూ అన్నాడు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ను గెలిపించుకోవడం కోసం అవతలి వాళ్లను కించపరచడం అనేది తప్పు అంటూ అతడు చెప్పుకొచ్చాడు. దీనిపై దీప్తి సునయనా స్పందించారు. షణ్ముఖ్ జశ్వంత్ కొరకు స్టాండ్ తీసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది. ఏదేమైనా హౌస్ లో కంటే..ఫ్యాన్స్ మధ్యే హీట్ విపరీతంగా పెరిగిపోతోంది.

ఆగిపోయిన అఖిల్ ఏజెంట్ సినిమా… కారణం అదే!

స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటిసారిగా అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తరువాత చిన్న చిన్నగా ఎదుగుతూ స్టార్ హీరోల సినిమాలను కూడా డైరెక్ట్ చేశాడు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా వంటివి భారీ చిత్రాలను కూడా తెరకెక్కించారు.

అలా సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న సురేందర్ రెడ్డి తాజాగా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ కోసం హంగేరికి వెళ్లి వచ్చాక కరోనా బారిన పడ్డారు. సురేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబానికి కూడా కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు సమాచారం.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఆయన కుటుంబం మొత్తం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
సురేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఏజెంట్ సినిమా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. హీరో అఖిల్ ఏజెంట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సురేందరర్ సంయుక్త సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది.

ఇక హంగేరిలో ఈ సినిమాలోని పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తుంది. సురేందర్ రెడ్డి కోలుకున్న తర్వాత ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలు కానుంది.

ఆహాలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్‌ ..

ఈ సంవత్సరం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువగా హిట్ అయిన సినిమాల్లో చెప్పుకునేవి లవ్ స్టోరీ మరియు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇద్దరు బ్రదర్స్ బంపర్ హిట్ కొట్టేశారు. ఇది అక్కినేని ఫ్యామిలీకి డబుల్ సందడి అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా.. త్వరలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాను ఆహా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఆహా విడుదల చేసింది. థియేటర్లలో సినిమా చూడని వారు ఇంకా ఉంటే.. ఈ ట్రైలర్ ను మీరూ చూసేయండి. ఇక సినిమా విషయానికి వస్తే.. బొమ్మరిల్లు భాస్కర్ కు గత కొన్ని సంవత్సరాల నుంచి మంచి హిట్ దొరకలేదు.

ఒకానొక సమయంలో అతడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారట.. కనీసం దర్శకత్వం వహించడానికి సినిమాలు చేతిలో లేక ఎన్నో కష్టాలను అనుభవించారట. ఇకపోతే.. ఈ సినిమాకు అల్లు అరవింద్ అతడికి నెలకు శాలరీ చొప్పున పారితోషికం ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పటికీ ఉంటుంది.

చాలా రోజుల తరువాత బొమ్మరిల్లు భాస్కర్‌కు మళ్లీ సక్సెస్ వచ్చినట్టు అయింది. దీనిలో హీరోగా నటించిన అఖిల్ అక్కినేనికి కూడా చాలారోజుల నుంచి మంచి హిట్ దొరకలేదు. ఈ సినిమాతో ఆ లోటు తీరింది. దీంతో బొమ్మరిల్లు భాస్కర్ కు, అక్కినేని అఖిల్ కు ఈ సినిమా వాళ్ల కెరీర్ కు పెద్ద ఉపశమనం కలిగించిందనే చెప్పాలి. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా ఆహాలో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

సొంత ఇంటి కల నిరవేర్చుకున్న గంగవ్వ.. గృహప్రవేశానికి హాజరైన అఖిల్, శివ జ్యోతి ఫోటోలు వైరల్..!

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయారు. ఇలా మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయమైన గంగవ్వ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో పల్లెటూరి వీడియోలను తీస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గంగవ్వ నేడు ఒక సెలబ్రిటీగా మారిపోయింది.

ఈమెకు యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లోకి అడుగుపెట్టింది.ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున గంగవ్వకు ఇంటిని కట్టిస్తానని మాట ఇచ్చారు. ఈ క్రమంలోనే తన సొంత ఇంటి కలను నెరవేర్చుకునే గంగవ్వ గృహ ప్రవేశం చేసింది.

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా 11 లక్షల రూపాయలను గెలుచుకున్న గంగవ్వకి నాగార్జున మరో 7 లక్షల సహాయం చేశారు. గంగవ్వ మరో మూడు లక్షల దాకా అప్పులు చేసి తాను కలలు కన్నా సొంత ఇంటి కలను నెరవేర్చుకుంది.ఈ క్రమంలోనే గంగవ్వ గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక గంగవ్వ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొన్న అఖిల్ సార్థక్,శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్‌ షో టీం సభ్యులు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు గంగవ్వకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరోసారి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ సినిమా..!

సాధారణంగా దర్శకులు సినిమాను తెరకెక్కించిన అప్పుడు కొన్ని ఫ్లాప్ అవుతాయి కొన్ని హిట్ అవుతాయి. పలువురు దర్శకులకు అయితే వరుసగా వారి తెరకెక్కించిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అలాంటివారికి తెలుగు సినీ ఇండస్ట్రీలో గీతాఆర్ట్స్ మంచి ఆప్షన్ అంటూ ఉంటారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది యువ దర్శకులు ఇలా గీతా ఆర్ట్స్ కు వచ్చి మళ్లీ మంచి హిట్ ట్రాక్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు.

అలాంటివారిలో పరశురామ్ కూడా ఒకరు. గోవిందం సినిమా తో సూపర్ హిట్ ను అందుకునీ మహేష్ బాబు తో సినిమా తీసే అవకాశాన్ని కొట్టేశారు. బొమ్మరిల్లు భాస్కర్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ తన తర్వాత సినిమా కూడా గీతాఆర్ట్స్ లోనే చేస్తాడు అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

గీతా ఆర్ట్స్ నుంచి ఉదయం హీరో కోసం కథ సిద్ధం చేసుకో అని బొమ్మరిల్లు భాస్కర్ కి ఇటీవల పిలుపు వచ్చిందట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విజయంతో భాస్కర్ ఇన్ని రోజుల నిరీక్షణకు తెరపడింది.అయితే ఈ సారి కూడా గీతా ఆర్ట్స్ లో ఉండి చేస్తాడా లేక? కథ సిద్ధం చేసుకొని సినిమా చేస్తాడా అనేది తెలియాలి మరి. భాస్కర్ తన తరువాత చిత్రం ఎవరితో చేస్తాడు అన్నా విజయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

గీతా ఆర్ట్స్ వద్ద రెండు యువ హీరోల డేట్లు ఉన్నాయి.ఇక అందులో కార్తికేయ, విజయ్ దేవరకొండ అలాగే నిఖిల్ వంటి వారు కూడా ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శిరీష్ కెరియర్ కూడా బిల్డ్ చేయాల్సి ఉంది. అయితే భాస్కర్ సిద్ధం చేస్తున్న కథ ఆ యువ హీరోల కోసమా లేక శిరీష్ కోసమా అన్న విషయం ఇంకా తెలియలేదు. ఈ విషయం గురించి మరింత సమాచారం తెలియాలి అంటే అధికారంకంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మరి.

సంతోషంలో నాగార్జున.. అందుకే వారికి గ్రాండ్ పార్టీ..!

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఎంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు.అందుకు గల కారణం నాగార్జున ఇద్దరు కొడుకులు నటించిన సినిమాలు ఈ ఏడాది వరుసగా విజయాలు సాధించడంతో అక్కినేని కుటుంబం ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.చైతన్య లవ్ స్టోరీ అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అద్భుతమైన విజయాలు సాధించడంతో నాగార్జున జోష్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక అఖిల్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుస ఫ్లాపులతో ఎదుర్కోవడంతో అఖిల్ విషయంలో నాగార్జున తీవ్ర ఆందోళన చెందినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన నాలుగవ సినిమాగా బొమ్మరిల్లు భాస్కర్ ని నమ్మి అతని దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అఖిల్ కు అవకాశం ఇప్పించారు.

ఇలా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా రికార్డులను సృష్టించడంతో అటు చిత్ర బృందం, ఇటు అక్కినేని కుటుంబం ఎంతో సంతోషంలో ఉన్నారు.

నాలుగు సంవత్సరాలుగా విజయం కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ విధమైనటువంటి విజయం దక్కడంతో అందుకు కారణమైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్ర బృందానికి నాగార్జున పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే అఖిల్ తన స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇవ్వగా నాగార్జున కూడా సినిమా నిర్మాతలకు అలాగే మిగిలిన చిత్ర బృందానికి గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం దర్శకుడు భాస్కర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

సుమారు 15 సంవత్సరాల క్రితం సిద్ధార్థ్, జెనీలియా, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం బొమ్మరిల్లు. ఈ చిత్రం అప్పట్లో ఎలాంటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన భాస్కర్ కి ఈ సినిమా విజయవంతం కావడంతో అతని పేరు బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయింది. ఇలా బొమ్మరిల్లు సినిమా అద్భుతమైన విజయాన్ని అందించడంతో ఆ తర్వాత భాస్కర్ పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త సినిమాలను తెరకెక్కించిన పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇలా పదిహేను సంవత్సరాల నుంచి మంచి గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ తాజాగా అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం భాస్కర్ ఏకంగా రెండున్నర సంవత్సరాల పాటు కష్టపడ్డారు. అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా విడుదల అయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి విజయం కోసం ఎదురుచూస్తూ విజయాన్ని అందుకున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈయన రెమ్యూనరేషన్ నెలకు రెండు లక్షల చొప్పున తీసుకున్నారని సినిమా విజయం అయిన తర్వాత మరో 40 లక్షల పారితోషికం తీసుకోనున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇలా భాస్కర్ ఈ సినిమా కోసం నెల జీతం తీసుకుంటూ సినిమా కోసం కష్టపడ్డారని అయితే ప్రస్తుతం ఈ సినిమా విజయం సాధించడంతో ఈ సినిమా కోసం భాస్కర్ సుమారు 60 నుంచి 70 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బొమ్మరిల్లు తర్వాత భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ద్వారా మరొకసారి విజయం సాధించారని చెప్పవచ్చు.

‘అయ్యగారు’పేరు వెనుక కథ .. ఆ వీరాభిమాని నేపథ్యం ఇదే..

అయ్యగారు.. ఈ పదం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఎదుకంటే.. అక్కినేని అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ ఎదురుగా ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. అతడు అక్కినేని ఫ్యామిలీకి వీరాభిమాని.

దీంతో అయ్యగారు మీరు గ్రేట్ అంటూ అతడు చెప్పే డైలాగ్ లు చాలా పాపులర్ అయ్యాయి. దీనిపై అక్కినేని అఖిల్ కూడా స్పందించారు. అతడిని తాను కచ్చితంగా కలుస్తానంటూ.. అఖిల్ ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను పోస్టు చేశారు. “బ్రదర్ మీరు ఎవరో నాకు తెలియదు. మీరు నాకు పెట్టిన అయ్యగారు అనే పేరు నా జీవితంలో భాగం అయిపోయింది. మీకు దండం బ్రదర్ ’’ అంటూ చెప్పాడు.

అస్సలు అతడు ఎవరు.. ఆ అభిమాని నేపథ్యం ఏంటి.. విషయాలను తెలుసుకుందాం.. అతడి పేరు నాగరాజు. గుంటూరులో ఓ కూలీగా పని చేస్తున్నాడు. అతడు చిన్నతనం నుంచే అక్కినేని ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. నాగార్జున, నాగచైతన్య సినిమాలు ఏది విడుదల అయిన అతడు ఆ థియేటర్స్ ముందు సందడి చేస్తాడు. అయితే నాగార్జున నటించిన రాజుగారి గది 2 సినిమా విడుదల సందర్భంలో అతడు సినిమా చూసి ఎక్కువగా బాధ పడ్డాడు.

ఆ బాధలోనే ‘కింగ్ కొడుకు రావాలి.. అఖిలే నంబర్ వన్. అయ్యగారే కరెక్ట్.. అటూ అక్కడ నానా రచ్చ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడ నుంచి అఖిల్ కు అయ్యగారు అనే పేరు పడిపోయింది. ఇప్పుడు అఖిల్ సినిమాలో కూడా లాస్ట్ లో హీరోయిన్ అయ్యాగారు అంటూ అఖిల్ ని సంబోధిస్తుంది. దీంతో ఫ్యాన్స్ కేరింతలతో హోరిత్తిపోతుంది. దీంతో నాగరాజు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దీంతో అతడు ఇంకా మోస్ట్ పాపులర్ అయ్యారు.