Tag Archives: anasuya bharadwaj

Anasuya: అనసూయ పట్ల అలిగిన అభిమాని.. అభిమాని అలక తీర్చిన అనసూయ?

Anasuya: బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకొని కెరియర్ పరంగా బిజీ అయినటువంటి వారిలో అనసూయ భరద్వాజ ఒకరు. ఈమె బుల్లితెరపై తన ప్రయాణం మొదలుపెట్టారు. బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ మరోవైపు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా వెళ్తూ సందడి చేస్తున్నారు. అయితే షాపింగ్ మాల్స్ కార్యక్రమంలో భాగంగా ఈమె అభిమానులను నిరాశ పరిచారు అంటూ అభిమాని ఏకంగా అనసూయ పై ఆలిగారు.

ఈ సందర్భంగా అనసూయను ఉద్దేశించి ఆ నేటిజన్ కామెంట్ చేస్తూ షాపింగ్ మాల్స్ కి వచ్చినప్పుడు సెల్ఫీలు ఇస్తామంటారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత కనీసం మా వైపు చూడటానికి కూడా ఇష్టపడరు అంటూ తన మనసులో ఉన్నటువంటి ఆవేదన బయటపెట్టారు. ఇకపై అయిన కాస్త మమ్మల్ని పట్టించుకోండి అంటూ నేటిజన్ చేసిన కామెంట్ కు అనసూయ రిప్లై ఇచ్చారు.

తెలిసి అలా జరగదు.

ఈ సందర్భంగా అనసూయ స్పందిస్తూ ఎంత మాట అన్నారు.తెలియకుండా అలా జరిగిపోయిందేమో కానీ తెలిసి అయితే అసలు అలా జరగదని, త్వరలోనే మనం కలిసి సెల్ఫీ దిగుదాం అంటూ తన అభిమానికి ఇచ్చినటువంటి ఈ రిప్లై వైరల్ గా మారింది. ఇలా అనసూయ పట్ల అలిగిన అభిమాని కోరికను తీర్చుతాను అంటూ ఈమె తనని బుజ్జగిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Anasuya: రాజుల కాలం అయితే ఇంకో తాజ్ మహల్ ఉండేదేమో.. అనసూయ కామెంట్స్ వైరల్!

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండితెర సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇలా వెండి తెరపై వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా వెండితెర సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె బుల్లితెరకు దూరమైన సంగతి మనకు తెలిసిందే. అయితే వెండితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అనసూయ తనుకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇలా తన విషయాలను మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు ఈమె గ్లామరస్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేవారు తాజాగా ట్రెండీ వేర్ లో అనసూయ ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె రాజుల కాలం కాదు రథం గుర్రం లేదు. ఒకవేళ రాజుల కాలం అయితే ఏ రాజో ఎత్తుకెళ్లిపోయేవాడు.. ఇంకో తాజ్ మహల్ కూడా ఉండేదేమో అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఏ రాజో ఎత్తుకెళ్లిపోయేవాడు..

ఇలా రాజుల కాలం కాదు రాజో ఎత్తుకెళ్లిపోయేవాడు అంటూ ఈమె కామెంట్స్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఈమె పుష్ప 2 సినిమాతోపాటు రజకార్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Anasuya: అలాంటి మనుషులను ఎప్పటికీ నమ్మకండి.. వైరల్ అవుతున్న అనసూయ పోస్ట్!

Anasuya: బుల్లితెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి ఈమె వెళ్లి వరుసగా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా వెండితెర నటిగా ఈమె వరుస అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే.

కెరియర్ పరంగా అనసూయ క్షణం పాటు తీరిక లేకుండా కడుపుతో ఉన్నారు ఇలా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

అనసూయ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ.. కుక్కలా విశ్వాసం లేని మనుషులను ఎప్పటికీ నమ్మకండి.. కానీ మనిషిలా లేని కుక్కల్ని మాత్రమే నమ్మండి అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ ద్వారా అనసూయ మనుషుల కంటే ప్రస్తుత కాలంలో జంతువుల చాలా విశ్వాసంగా ఉంటున్నాయి అన్న ఉద్దేశంతోనే చేశారని తెలుస్తోంది.
జంతువులకే విశ్వాసం..

ఇలా మనుషులలో విశ్వాసం లేదని మనుషుల ఆలోచన ధోరణి సరిగా లేదని మనుషులతో పోలిస్తే జంతువులే మనుషుల పట్ల విశ్వాసం చూపుతున్నాయని ఈమె పరోక్షంగా ఈ పోస్టు ద్వారా తెలియజేశారు. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఈమె పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .ఇవే కాకుండా మరికొన్ని సినిమాల్లో కూడా అనసూయ నటిస్తున్న సంగతి తెలుస్తుంది.

Anasuya: తన కొడుకుల వల్ల చాలా నష్టపోతున్నా.. అనసూయ బాధలు మామూలుగా లేవుగా?

Anasuya: యాంకర్ అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం యాంకరింగ్ గుడ్ బై చెబుతూ వెండి తెరపై నటిగా ఎన్నో సినిమాలలో నటిస్తూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలా బుల్లితెరకు దూరమైనటువంటి అనసూయ వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నారు.

ఇలా వెండితెర సినిమాలలో బిజీగా ఉండి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈమె తన కొడుకుల వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నాను అంటూ ఒక పోస్ట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

అనసూయ కొడుకులు వల్ల ఎందుకంత ఇబ్బంది పడుతుందనే విషయానికి వస్తే తన కొడుకులు తమ జోబి కాలి చేయకుండా అలాగే బట్టలు వదిలేస్తారని తాను అలాగే వాషింగ్ మిషన్ లోకి వేయడం వల్ల వాషింగ్ మిషన్ తరచూ పాడవుతుందని రెండు నెలలకు ఒకసారి సర్వీసింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఈమె తన కొడుకులు వల్ల జరిగే నష్టాన్ని తెలియజేశారు.

అలాంటి వాళ్లంటే గౌరవం..

మా ఇంట్లో మాత్రమే ఇలా ఉంటుందా మీకు కూడా ఇలాగే జరుగుతుందా అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే డస్ట్ బిన్ కనిపించే వరకు చెత్త కాగితాలను తమ జోబులో పెట్టుకుంటారో అలాంటివారు అంటే నాకు చాలా గౌరవం అంటూ కూడా అనసూయ ఈ సందర్భంగా తన కొడుకుల వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులను తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Anasuya: రాజకీయాలలోకి ప్రముఖ యాంకర్ అనసూయ… వైరల్ అవుతున్న వేణుస్వామి కామెంట్స్!

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమవుతూ వెండి తెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ క్షణం పాటు తీరిక లేకుండా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.

ప్రముఖ సెలబ్రిటీల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలిచే జ్యోతిష్యులు వేణు స్వామి గతంలో అనసూయ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈయన అనసూయ జాతకం గురించి చెబుతూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కనుక గమనిస్తే ఈమె త్వరలోనే రాజకీయాలలోకి కూడా రాబోతుందని తెలుస్తోంది. మరి అనసూయ గురించి వేణు స్వామి ఏం చెప్పారు అనే విషయానికి వస్తే…

ఈ సందర్భంగా వేణు స్వామి అనసూయ జాతకం గురించి మాట్లాడుతూ 2021 వ సంవత్సరం తర్వాత అనసూయ క్రేజ్ భారీగా పెరిగిపోతుందని తెలిపారు.ఆమెను ఇండస్ట్రీలో ఆపడం ఎవరి తరం కాదని ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకు ఉంటుందని తెలియజేశారు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఈమె రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయని వేణు స్వామి తెలియచేశారు.

Anasuya: రాజకీయాలలోకి రంగమ్మత్త…


ఈ విధంగా వేణు స్వామి అనసూయ జాతకం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ నిజమే అవుతున్నాయని తెలుస్తోంది 2020 వరకు అనసూయ బుల్లితెర యాంకర్ గా మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత వెండితెర సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇలా ఈయన చెప్పిన మాటలు నిజమే అవుతున్నాయని అయితే త్వరలోనే రాజకీయాలలోకి వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని పలువురు ఈ వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు.

Anasuya: నాకు సంబంధం లేని విషయాలలో కూడా నా పేరు ఉపయోగిస్తారు… సంచలనమైన ట్వీట్ చేసిన అనసూయ!

Anasuya: అనసూయ ఈమధ్య కాలంలో కాస్త వివాదాలను తగ్గించింది అనుకోనే లోపు మరో వివాదానికి తెర లేపారు. అనసూయ జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతున్న సమయం నుంచి భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటూ నేటిజన్ల విమర్శలకు కారణమవుతున్నారు. ఇలా తరచూ ఏదో ఒక విషయం ద్వారా ఈమె సోషల్ మీడియా వేదికగా వివాదానికి కారణం అవుతూ ఉండేవారు.

ఇలా పలు వివాదాల ద్వారా వార్తలలో నిలిచినటువంటి అనసూయ విజయ్ దేవరకొండతో ఏర్పడినటువంటి వివాదం ద్వారా సంచలనంగా మారారు. అయితే విజయ్ ఫ్యాన్స్ అదే స్థాయిలో ఈమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన ఈమె తాను ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నానని తెలియజేశారు. ఇలా విజయ్ వివాదానికి చెక్ పెట్టినటువంటి ఈమె అనంతరం సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పెద్దగా పట్టించుకోలేదు.

ఇకపోతే తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా ఈమె చేసినటువంటి ట్వీట్ కనక చూస్తే అనసూయ మరో వివాదానికి తెర లేపారు. అందుకే ఇలాంటి పోస్ట్ చేశారని పలువురు భావిస్తున్నారు.ఇంతకీ అనసూయ ట్విట్టర్ వేదికగా ఎవరిని ఉద్దేశించి ఎలాంటి పోస్ట్ చేశారనే విషయానికి వస్తే… ఈమె చేసినటువంటి ఈ ట్వీట్ లో ఎక్కడా కూడాఎవరి పేరు ప్రస్తావించలేదు కానీ ఈమె చేసిన ట్వీట్ మాత్రం వివాదానికి కారణం అవుతుందని తెలుస్తుంది.

Anasuya: నా పేరు లేకుండా ఏది చెప్పలేకపోతున్నారు..


ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించిన అనసూయ.. వావ్ నేను వాళ్లకు చాలా ముఖ్యం నా ప్రమేయం ఉన్నా లేకున్నా..నాకు సంబంధం ఉన్న లేకపోయినా నా పేరును ఉపయోగిస్తూ ఉంటారు. నా పేరు లేకుండా ఏమాత్రం డిస్కషన్ జరగవు నాపై అంతగా డిపెండ్ అయి ఉన్నారు.పాపం నా పేరు లేకుండా ఏది చెప్పలేకపోతున్నారు అంటూ ఈమె చేసినటువంటి ఈ ట్వీట్ చూసిన నెటిజెన్స్ మళ్లీ మిమ్మల్ని ఎవరు ఏమి అన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Anasuya: నాకు తెలిసిన వాళ్ళ కథలా ఉంది బేబీ సినిమా ట్రైలర్ పై స్పందించిన అనసూయ!

Anasuya: వెండితెర రంగమ్మత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పలు సినిమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కేవలం వెండి తెర సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.

ఇక సినిమా పనులలో ఎంతో బిజీగా ఉండే అనసూయ ఇండస్ట్రీలో పలు సినిమాలకు సంబంధించిన విషయాలు గురించి కూడా సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు వివాదాలు కూడా తలెత్తుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే అనసూయ తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా అనసూయ బేబీ సినిమా ట్రైలర్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మీ సెలబ్రేషన్స్ లో చాలా ఆలస్యంగా జాయిన్ అయ్యాను. సాయి రాజేష్ ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఒరిజినాలిటీ గుండెలను హత్తుకునేలా మాటలు చూస్తుంటే ఈ సినిమా కథ నాకు తెలిసిన వాళ్ళ కథలాగే ఉందని తెలిపారు.

Anasuya పాజిటివ్ కామెంట్స్ చేసిన అనసూయ…


ఇలాంటి ఒక గొప్ప సినిమాను చూడటం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఆనంద్ చాలా ఇంటెన్స్ గా నటించారు.నిర్మాతకు కూడా ఈమె అభినందనలు తెలిపారు. ఇలా చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే విజయ్ దేవరకొండపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అనసూయ తన తమ్ముడు ఆనంద దేవరకొండ సినిమా పట్ల ఇలాంటి పాజిటివ్ కామెంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Anasuya: అనసూయా వేసుకొనే పొట్టిబట్టలపై ఆమె పెద్ద కొడుకు రియాక్షన్ ఏమిటో తెలుసా..?

Anasuya: బుల్లితెర గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర మీద ప్రసారమైన అనేక టీవీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తూ అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇలా యాంకర్ గా వచ్చిన గుర్తింపుతో సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకొని నటిగా మంచి గుర్తింపు పొందింది. బుల్లితెర మీద ప్రసారమైన టీవీ షోలో ఎంతో హాట్ గా కనిపించే అనసూయ సినిమాలలో మాత్రం వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ డి గ్లామర్ పాత్రలో ఎక్కువగా నటిస్తోంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అనసూయ తరచూ తన గ్లామర్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో అనసూయ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా అనసూయ వేసుకొని పొట్టి బట్టలకు సోషల్ మీడియాలో అనేక విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఈ అమ్మడు తగ్గేదేలే అన్నట్లు తనను విమర్శించిన వారి మీద ఫైర్ అవుతూ ఉంటుంది. ఇక ఇటీవల పెళ్ళి రోజు సందర్భంగా భర్త తో కలిసి సముద్రం ఒడ్డున బికినీ ధరించి అనసూయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anasuya: పొడవు దుస్తులు వేసుకోమని చెబుతాడు..


ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తాను ధరించే బట్టల గురించి తన పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో తెలిపింది. ఈ క్రమంలో అనసూయ మాట్లాడుతూ ‘ తాను ఎప్పుడైనా షాట్స్, మినీస్ లేదా బొడ్డు కనిపించే విధంగా బట్టలు ధరిస్తే తన పెద్ద కొడుకు ఎందుకు మమ్మీ ఇలా బట్టలు వేసుకుంటున్నావ్..కాస్త పెద్దవి వేసుకో అని మొహం మీద చెబుతున్నాడని తెలిపింది. అయితే తాను మాత్రం.. నా బట్టలు నా ఇష్టం. బట్టలు వేసుకోవడంలో నాకు స్వేచ్ఛ కావాలి అంటూ బట్టల విషయంలో మహిళలకు స్వేచ్ఛ ఉండాలని ఇప్పటినుండే తన పిల్లలకు పాఠాలు చెబుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఎప్పటిలాగే నెటిజెన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Anasuya: విజయ్ దేవరకొండ బర్త్ డే అనసూయకు కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్!

Anasuya: అనసూయ గత రెండు రోజులకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ పరోక్షంగా చేసిన పోస్ట్ కారణంగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య అనసూయ మధ్య పెద్ద ఎత్తున వార్ నడుస్తుంది. విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న ఖుషి సినిమా నుంచి పోస్టర్ విడుదల కాగా అందులో ది విజయ్ దేవరకొండ అని ఉంది.

ఇది చూసిన అనసూయ పరోక్షంగా వామ్మో ది అంట ఈ పైత్యం మనకు అంటకుండా చూసుకోవాలి అంటూ కామెంట్ చేశారు. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు తమ హీరోని ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు మరికొందరైతే నువ్వు కూడా ఆంటీ పక్కన ది అని పెట్టుకో ఎవరైనా వద్దన్నారా అంటూ మరోసారి అనసూయను ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు చెబుతూనే మరోవైపు యాంకర్ అనసూయకు కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది. ఇక హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ …

Anasuya: అనసూయకు గట్టి కౌంటర్ ఇచ్చాడుగా…


ది ది కామ్, ది హీరో, ది యాంగర్ కంట్రోల్ ఇలా ది అంటూ విషెస్ చెప్పాడు. అనసూయకు కౌంటర్లు వేయాలనే ఉద్దేశంలో విజయ్‌కి విషెస్ చెప్పాడో ఏమో గానీ.. విజయ్ ట్విట్టర్‌ హ్యాండిల్‌ని తప్పుగా ట్యాగ్ చేశాడు. దీంతో కావాలనే చేశావా? తెలిసే చేశావా? అంటూ విజయ్, ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే అనసూయకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చావు అన్న అంటూ ఈ పోస్ట్ పై కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.

Anchor Anasuya: పైత్యం అంటూ మరోసారి విజయ్ అభిమానులను గెలికిన అనసూయ… ఫైర్ అవుతున్న విజయ్ ఫ్యాన్స్!

Anchor Anasuya: సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా కొన్నిసార్లు అనసూయ చేసే కామెంట్స్ సంచలనాలకు కారణమవుతుంటాయి.

అయితే గతంలో ఈమె విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసినటువంటి ట్వీట్ ఎలాంటి వివాదాలకు కారణమైందో మనకు తెలిసిందే. విజయ్ ఫ్యాన్స్ ఈమెను భారీ స్థాయిలో ట్రోల్ చేయగా ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించింది. అయితే ఈ వివాదం ముగిసింది అనే లోపే తాజాగా మరోసారి ఈమె విజయ్ దేవరకొండ అభిమానులను గెలికారు.

అనసూయ చేసిన పోస్ట్ చూసినటువంటి విజయ్ అభిమానులు తీవ్రస్థాయిలో అనసూయ పై ఫైర్ అవుతున్నారు ఇంతకీ అనసూయ ఏమని పోస్ట్ చేశారు అనే విషయాన్ని వస్తే…ఇప్పుడే ఒకటి చూశాను. ‘The’ naa?? బాబోయ్!!! పైత్యం.. ఏంచేస్తాం. అంటకుండ చూసుకుందాం.’ అంటూ ట్వీట్ చేసింది. అనసూయ ఈ ట్వీట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించే చేశారు అంటూ మండిపడుతున్నారు.

Anchor Anasuya పోస్టర్ ను టార్గెట్ చేసిన అనసూయ..

తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్నటువంటి ఖుషి సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ పై The Vijay Deverakonda’ అని ఉండటమే కారణమని తెలుస్తుంది. ఇలా పోస్టర్ పై ది విజయ్ దేవరకొండ అని ఉండడంతో అనసూయ ఇలా వ్యంగంగా విజయ్ దేవరకొండను ఉద్దేశించి పోస్ట్ చేశారు అంటూ అభిమానులు తనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి ఈ ట్వీట్ ఎన్ని పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.