Tag Archives: anchor anasuya

Anchor Anasuya: నెగెటివ్ ట్రోల్స్ పై యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు..! దానిని నమ్ముతా అంటున్న అనసూయ..!

Anchor Anasuya: అనసూయ స్టార్ యాంకర్ గానే కాకుండా.. సినిమాల్లో కూడా పాపులర్ అవుతోంది. వరసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. రంగస్థలం, పుష్ప వంటి సినిమాలతో తన కెరీర్ ను సుస్థిరం చేసుకుంటుంది. రంగస్థలంలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ అనసూయకు ఎంత గుర్తింపు తెచ్చిందో మనందరకి తెలసిందే.

Anchor Anasuya: నెగెటివ్ ట్రోల్స్ పై యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు..! దానిని నమ్ముతా అంటున్న అనసూయ..!

తాజాగా పుష్ప సినిమాలో నెగిటివ్ రోల్ ద్రాక్షాయణి క్యారెక్టర్ లో తన నటనతో ప్రశంసలు దక్కించుకుంటోంది. ఓ వైపు టీవీ షోలతో మరో వైపు సినిమాలో బిజీ అవుతోంది అనసూయ. ఇక పుష్ప సినిమా 2 పార్ట్ లో ద్రాక్షాయణి క్యారెక్టర్ కీలకం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడూ ఏదో వివాదంతో సోషల్ మీడియాలో ఉంటారు అనసూయ.

Anchor Anasuya: నెగెటివ్ ట్రోల్స్ పై యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు..! దానిని నమ్ముతా అంటున్న అనసూయ..!

గతంలో తన డ్రెస్సింగ్ పై, బాడీ షేమింగ్ చేస్తూ.. ట్రోలింగ్ కామెంట్లు చేసిన వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది అనసూయ. కొంతమంది పని కట్టుకుని నాపై నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడింది. ఇటీవల కోట శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలపై కూడా మండిపడింది అనసూయ.


ప్రతి ఒక్కరి సంగతి చూస్తానంటూ వార్నింగ్..

కోటా వంటి సీనియర్ నటుడినినే వదిలిపెట్టని అనసూయ.. సాధారణ నెటిజెన్లు ట్రోలింగ్ చేస్తే ఊరుకుంటుందా మరి. అందుకే నెటిజెన్లకు ఘాటు రిప్లైలు కూడా ఇస్తోంది. అయితే ఇటీవల అలీతో సరదాగా షోకు హాజరైంది. నెగిటివ్ ట్రోలింగ్ పై స్పందించింది. తనపై ట్రోలింగ్ చేస్తున్నవారి చిట్టా తన దగ్గర ఉందని.. ప్రతి ఒక్కరి సంగతి చూస్తానంటూ స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలో ఈ ట్రోలింగ్ వలన తాను.. తన కుటుంబం ఎన్ని కష్టాలని చవి చూసిందో.. ఎంతగా డిప్రెషన్ లోకి వెళ్లిందో చెప్పుకొచ్చింది అనసూయ. నెగిటివ్ ట్రోలింగ్ ను ఎలా ఎదుర్కొంటున్నారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తన దైన శైలిలో సమాధానం ఇచ్చింది అనసూయ. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని.. అది కచ్చితంగా అందరికీ న్యాయం చేస్తుందని తెలిపింది. ఒకరిని నువ్వు తిడితే.. ఇంకొకరు నిన్ను తిడతారు.. నువ్వు ఒకడిని బాధ పెడితే.. నిన్ను ఒకరు బాధపెడతారు అంటూ ఫిలాసఫీ చెప్పింది.

Hyper Aadi-Anchor Ansuya: అనసూయ నన్ను ప్రేమిస్తోంది..! రెచ్చిపోయిన హైపర్ ఆది..!

Hyper Aadi-Anchor Ansuya: ‘జబర్దస్త్’ షో దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరలో అత్యంత ప్రాచుర్యం పొందిన షో.  ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చిందంటే చాలు జబర్దస్త్ చూడని వారు ఉండరంటే  అతిశయోక్తి కాదు.

Hyper Aadi-Anchor Ansuya: అనసూయ నన్ను ప్రేమిస్తోంది..! రెచ్చిపోయిన హైపర్ ఆది..!

దీనికి తగ్గట్లుగానే బబర్థస్త్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.  ఈ షోకు భారీగా టిఆర్పి రేటింగులు కూడా వస్తున్నాయి. ఇక ఇది పక్కన ఉంచితే యాంకర్లు అనసూయ, రష్మీ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ. టీమ్ ఫెర్ఫామెన్స్ ఒకెత్తు అయితే.. యాంకర్ల గ్లామర్ మరో ఎత్తు.

Hyper Aadi-Anchor Ansuya: అనసూయ నన్ను ప్రేమిస్తోంది..! రెచ్చిపోయిన హైపర్ ఆది..!

ఇక యాంకర్లతో టీమ్ లీడర్ల కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయింది. జబర్థస్త్ తో అనసూయ- హైపర్ ఆది, ఎక్ట్రా జబర్థస్త్ లో రష్మీ- సుడిగాలి సుధీర్ ల మధ్య ఫన్నీ సన్నివేశాలు, సెటైర్లు షోకే హైలెట్ గా నిలుస్తాయి. 


పుష్ప రాజ్ గా హైపర్ ఆది రచ్చ రచ్చ..

తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో యాంకర్ అనసూయ, హైపర్ ఆది జోడి ఇప్పుడు ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలగజేస్తుంది.  జబర్దస్త్ ప్రోమో లో కూడా హైపర్ ఆది రెచ్చిపోయాడు. తనదైన శైలిలో యాంకర్ అనసూయ పైన పంచులు వేశాడు. పుష్ప సినిమాను జబర్దస్త్ స్కిట్ లో చేశాడు. ఈ స్కిట్ షోకే హైలెట్గా నిలిచింది. పుష్ప రాజ్ గా హైపర్ ఆది రచ్చ చేశాడు. అనసూయ  ఉద్దేశిస్తూ.. పలు కామెంట్ కూడా చేశాడు. అచ్చం పుష్పరాజ్ హావభావాలతో అనసూయ చూస్తూ.. అనసూయ నన్ను లవ్ చేస్తుందని నాకు తెలుసు రా ..అంటూ పుష్ప సీన్ రీ క్రియేట్ చేశాడు ఆది. దీనికి అనసూయ కూడా సిగ్గుపడు పోవడం షోకే హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. జనవరి 20వ తేదీన ఇందుకు సంబంధించి ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

అనసూయ డౌట్ ను క్లియర్ చేసిన మంత్రి కేటీఆర్?

తెలుగు బుల్లితెర ఫై సందడి చేసే స్టార్ యాంకర్ లలో జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. యాంకర్‌గా తన టాలెంట్‌తో ఆకట్టుకుంటోన్న అనసూయ తన అందమైన ఫొటోషూట్‌లతో నెటిజన్ లను మాయ చేస్తోంది.జబర్దస్త్ వల్ల ఫేమ్ అయిన యాంకర్ అనసూయ, బుల్లితెర మీదే కాదు అటు వెండి తెర మీద కూడా అవకాశాలు సంపాదిస్తూ ముందుకి దూసుకెళ్తుంది.

ప్రస్తుతం అనసూయ తెలుగు బుల్లి తెర పై తనకంటూ మాస్ ఫాలోయింగ్ ని సంపాదించుంది. అలాగే హాట్ బ్యూటీగా కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పై వచ్చే రూమర్స్ కు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అలాగే తన అభిమానులతో తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా అనసూయ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ను ఒక డౌట్ అడిగింది.. డియర్ కేటీఆర్ సార్..అసలు లాక్‌డౌన్‌ ఎందుకు వచ్చిందో .. ఆపై అన్ లాక్ కూడా ఎందుకు వచ్చిందో మనందరికీ తెలిసిందే. అయితే మనందరికీ వ్యాక్సిన్ తీసుకున్నాము అన్న భరోసా ఉండవచ్చు. మరి వ్యాక్సిన్ కు దూరంగా ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి సార్ అంటూ ట్వీట్ చేసింది.

అలాగే పాఠశాలలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి? అంటూ తనకు వచ్చిన డౌట్ ను కేటీఆర్ కు పోస్ట్ చేసింది అనసూయ. పిల్లలకు స్కూల్ లో ఉన్నప్పుడు వారికి ఏమైనా జరిగితే మాకు బాధ్యత లేదని పాఠశాల యాజమాన్యం సంతకం చేయించుకుంటున్నాయని, ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి సార్.. మీరు ఎప్పటిలాగే మాకు సరైన మార్గనిర్దేశం చేస్తారనే ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ మరొక ట్వీట్ చేసింది అనసూయ.

ఆ యాంకర్ కంటే నేను చాలా అందంగా ఉంటాను.. కానీ ఎందుకిలా?

సీనియర్ యాంకర్, నటి గాయత్రి భార్గవి గురించి మనందరికీ తెలిసిందే. ఈమె బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించారు. అదేవిధంగా వెండితెరపై కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది. అయితే ఈమె తెలుగు సినీ పరిశ్రమ పై కోపంగా ఉందట. ఇందుకు గల కారణం తాను ఒక మంచి యాంకర్ ని అని, అలాగే ఒక నటిని కూడా అయినప్పటికీ తనకు తగిన అవకాశాలు రాలేదని ఆమె గాయత్రి భార్గవి ఫీలవుతోందట.

హీరోయిన్ రేంజ్ లో గ్లామర్ ఉన్నా కూడా తనకు చిన్నాచితకా పాత్రలకు మాత్రమే పరిమితం చేశారంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. తనను కేవలం చిన్న నటిగానే చూస్తున్నారని, అలాగే చిన్న యాంకర్గానే చూస్తున్నారని గాయత్రీ భార్గవి తెగ ఫీలై పోతోందట. ఎంత టాలెంట్ ఉన్నా కూడా కెరీర్ లో ఎప్పుడో ఒకసారి ఓటమి అనేది చూడాల్సిందే అని సన్నిహితులు ఆమెకు సర్ధి చెబుతున్న కూడా ఆమె శాంతించడం లేదట.

నాకెందుకు అవకాశాలు ఇవ్వరు? నాకేం తక్కువ? నేను యాంకర్ అనసూయ కంటే బాగుంటాను కదా?అంటూ ఆమె విరుచుకుపడ్డారు. అంతే కాకుండా ఈ మధ్య టీవీ షోలలో కూడా తనకు సరైన అవకాశాలు రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వెండితెరపై పలు సినిమాలలో నటించినా ఆమె కెరీర్లో చెప్పుకోదగ్గ పాత్రలు అయితే ఒక్కటి కూడా రాలేదు.

అందుకే ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని గాయత్రీ భార్గవి బాధపడింది. ఇప్పటి నుంచి అయినా తనకు మూవీస్ లో బిజీ కావాలనే గాయత్రి తెగ ఆరాటపడుతోంది. ఏదిఏమైనప్పటికీ ఆమె ఈ అవకాశాల విషయంలో మాత్రం చాలా బాధపడుతోందని అర్థం అవుతోంది. ఆమె కంటే టాలెంట్ తక్కువగా ఉన్నవారు చక్కగా కెరీర్లో మంచి అవకాశాలతో దూసుకుపోతుంటే.. భార్గవి మాత్రం సరైన ఛాన్స్ అంటూ ఎదురు చూడటం చాలా బాధాకరమైన విషయమే.

నీ బుద్ధి ఇంత నీచమైనదా.. సీనియర్ నటుడిపై అనసూయ సీరియస్..

ఇటీవల యాంకర్ అనసూయ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని.. ఆమె వేసుకునే వ‌స్త్ర‌ధార‌ణ‌పై ‘మా’ ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీనివాస‌రావు కామెంట్స్ చేసిన నేప‌థ్యంలో అన‌సూయ భ‌రద్వాజ్ ట్విట్ట‌ర్ వేదికగా ఆయ‌న పేరు చెప్ప‌కుండా త‌ప్పు పడుతూ ట్వీట్ చేశారు. కోటి శ్రీనివాసరావు ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను మాట్లాడారు.

తెలుగు ఇండస్ట్రీలోని కొందరు నటులు, షోలపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా జబర్దస్త్ షోను టార్గెట్ చేసి.. ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌‌పై ఈయన కామెంట్స్ చేశాడు. అనసూయ మంచి డ్యాన్సరే కాకుండా అద్భుతమైన నటి కూడా.. ఆ అమ్మాయి చేసిన సినిమాలు కూడా నేను చూసాను.. కానీ ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్‌ చేసాడు కోట.

అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారు.. ఆమె అలాంటి చిట్టి పొట్టి బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు.. ఆమె ఎంత మంచి నటి అయినా కూడా తన డ్రెస్సింగ్ నాకు నచ్చదని చెప్పాడు కోట. ఆ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరిస్తున్నా రోజా ఎంత పద్ధతిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు కోట. ఈ విష‌యంపై అన‌సూయ భ‌రద్వాజ్ స్పందించారు. కోట శ్రీనివాస‌రావు పేరుని ప్ర‌స్తావించ‌కుండా ఆయ‌న తీరుని ట్విట్ట‌ర్ వేదిక‌గా విమ‌ర్శించారు.

తన వ‌స్త్ర‌ధార‌ణ గురించి ఆయన మాట్లాడారు. అలాంటి అనుభ‌వ‌మున్న వ్య‌క్తి అలా నీచంగా మాట్లాడ‌టం అనేది నాకు చాలా దుఃఖాన్ని క‌లిగించిందని వాపోయింది. ఒక‌రు ధ‌రించే దుస్తులు వారి వ్య‌క్తిగ‌తం అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. తన పైన కామెంట్ చేసిన ఆ సీనియర్ నటుడు.. సినిమాలలో స్త్రీలను కించపరిచిన సన్నివేశాలు ఎన్నో ఉననాయని.. వారిని సోషల్ మీడియా ఎందుకు పట్టించుకోదో.. నాకు అర్థం కాదన్నారు. ఏదేమైనా అనసూయ వ్యాఖ్యలు.. కోట వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నిన్న గెలిచాను.. నేడు ఓడిపోయాను.. ఇదెలా సాధ్యం: యాంకర్ అనసూయ..

మొదటి నుంచి ఎంతో వివాదాలతో.. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎట్టకేలకు మా ఎన్నికలు పూర్తి చేశారు. ఆదివారం సాయంత్రం వరకు ఎవరు గెలుస్తారో తెలియని ఉత్కంఠ నెలకొంది. ఫలితాల్లో మొదట ప్రకాష్ రాజ్ ప్యానెల్ దూసుకెళ్లింది. తర్వాత మంచు విష్ణు ప్యానెల్ దూసుకెళ్లింది.

ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో ఈసీ మెంబర్ గా ఉన్నా యాంకర్ అనసూయ గెలిచినట్లు ప్రకటించారు. తర్వాత ఎవరు ఎన్నికల్లో గెలిచారు అనే దానిపై అధికారులు జాబితా రిలీజ్ చేశారు. అందులో అనసూయ పేరు లేకపోవడం గమనార్హం. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల ఫలితాలపై యాంకర్‌ అనసూయ స్పందించింది. ఆమె ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించింది. ‘‘క్షమించాలి .. ఒక్క విషయం గుర్తొచ్చి తెగ నవ్వొస్తుంది ..

మీతో పంచుకుంటున్న ఏమనుకోవొద్దే ..! నిన్నా “అత్యధిక మెజారిటీ” “భారీ మెజారిటీ” నుండి గెలుపు అని చెప్పిన వారు.. ఈరోజు “ఓడిపోయింది” “ఓటమి” అంటున్నారు .. రాత్రికి రాత్రి ఎంజరుగుంటుందబ్బా.. అంటూ అనసూయ ట్వీట్ చేశారు. ఎలక్షన్స్‌ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి.. ? అంటూ వరుస ట్వీట్లు చేసింది.

ఉన్న 900 మంది ఓటర్లలో 600 మంది ఓట్లు వేశారు. వాటిని లెక్కించడానికి రెండో రోజు కూడా పట్టిందా..? ఇలా ఎందుకు టైం పట్టినట్లు అర్థం గాక అడుతుతున్నా అంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల అధికారి రిలీజ్‌ చేసిన మా విజేతల జాబితాలో అనసూయ పేరు లేకపోవడంతో ఆమె షాక్‌కి గురయ్యింది.

మంచం రెడీగా పెట్టు అన్న హైపర్ ఆది… సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ.. అసలు ఏమైంది?

బుల్లితెర పైప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ఎంతో మందికి ఎంతో మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. ఈ కార్యక్రమంలో పలువురు కమెడియన్లు చేసే స్కిట్ ల ద్వారా ఎనలేని అభిమానులను సంపాదించుకుని వెండితెరపై కూడా మంచి అవకాశాలతో రాణిస్తున్నారు. అలాంటి కమెడియన్ లలో హైపర్ ఆది ఒకరు.

జబర్దస్త్ వేదికపై హైపర్ ఆది తన స్కిట్ లో చేసే రచ్చ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ప్రతి వారం తన స్కిట్ లో భాగంగా ఎవరో ఒకరిని పరిచయం చేయడం పరిపాటిగా వస్తోంది. ఈ క్రమంలోనే వచ్చేవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి హైపర్ ఆది ముగ్గురమ్మాయిలతో ఎంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. వాళ్ళతో పాటే యాంకర్ అనసూయని కూడా స్కిట్ లో భాగం చేశాడు. వీరందరూ కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా వచ్చేవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో హైపర్ ఆది మాట్లాడుతూ.. ఆ సమయంలో నీతో బ్రేక్ ఫాస్ట్ చేస్తా.. మధ్యాహ్నం నీతో లంచ్ చేస్తా అన్నాడు. ఈ క్రమంలోనే అనసూయ వైపు చూస్తూ నీతో అన్నబోయే సరికి ఆమె చంపేస్తా అంటుంది. దీనికి అందుకే మీతో ఏం చేయట్లే అంటూ హైపర్ ఆది బదులిచ్చాడు. ఆ తరువాత హైపర్ ఆది అనసూయను నువ్వు మంచం రెడీ చేసి పెట్టు అని అన్నాడు. అలాగే డాన్సర్ తేజస్వితో నువ్వు మల్లెపూలు రెడీగా పెట్టు… అనగా అప్పుడు పక్కనే ఉన్న రోహిణి మరి నేనేం చేయాలి అని అడగగా అందుకు హైపర్ ఆది నువ్వు బయటకు వెళ్లి తలుపు గొళ్లెం పెట్టు అంటూ పంచులు వేయడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

యాంకర్ అనసూయ… శివ.. ఆదిల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు… ఎందుకంటే?

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి విపరీతమైన క్రేజ్ ఉందనే విషయం మనకు తెలిసిందే. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ కార్యక్రమంపై కొన్నిసార్లు వ్యతిరేకత కూడా ఏర్పడుతుంది.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ప్రతి వారం స్కిట్ లో భాగంగా ఎవరో ఒకరిని పరిచయం చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే గతవారం ప్రసారమైన కార్యక్రమంలో భాగంగా యాంకర్ శివను జబర్దస్త్ వేదిక పైకి తీసుకు వచ్చారు.

జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చిన శివ ఆది స్కిట్ లో భాగంగా సందడి చేశారు. ఈ క్రమంలోనే యాంకర్ శివ ప్రశ్న శైలి ఏ విధంగా ఉంటుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గతవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఆ ప్రోమోలో భాగంగా యాంకర్ శివ, అనసూయ వస్త్రధారణ పై కామెంట్ చేయడంతో అనసూయ అక్కడి నుంచి ఎంతో కోపంగా బయటకు వెళ్ళినట్లు చూపించారు.

ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ఇదంతా నిజంగానే జరిగిందా లేక రేటింగ్స్ కోసం ఇలా ప్రోమో కట్ చేశారా అనే ఆలోచనలో పడ్డారు. అయితే చివరికి ఈ కార్యక్రమం ప్రసారం కాగానే అనసూయ అలా హైపర్ ఆది పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్ళటం కేవలం రేటింగ్స్ కోసమేనని గతవారం ప్రసారమైన ఎపిసోడ్ ద్వారా బట్టబయలైంది.ఇదంతా కేవలం అనసూయ ఆది ఆడిన నాటకమని, ఇదంతా రోజా గారిని నమ్మించడం కోసమే చేశామని చెప్పారు.

ఈ క్రమంలోనే రోజా మాట్లాడుతూ అదంతా తన నమ్మలేదని.. అనసూయ చేసిన ఓవరాక్షన్ పై సెటైర్లు వేశారు. ఏదిఏమైనా కేవలం రేటింగ్స్ కోసం ఈ విధమైనటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసిన అనసూయ, ఆది, శివ లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కేవలం రేటింగ్స్ కోసం ఈ విధంగా చేస్తారా అంటూ మండిపడుతున్నారు.

మేకప్ లేని యాంకర్ అనసూయను ఎప్పుడైనా చూశారా ?

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా పలు అవకాశాలను దక్కించుకుని తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ అమ్మడు కెరియర్ పరంగా ఎంతో బిజీ గా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అనసూయపై ఎన్నో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కు దీటుగానే స్పందిస్తుంటారు.

అనసూయ బుల్లితెరపై లేదా వెండి తెరపై ఎంతో అందంగా కనబడుతూ అందరిని మంత్రముగ్దుల్ని చేస్తుంది. సోషల్ మీడియాలో సైతం ఆమె మేకప్ లేకుండా మనకు కనిపించడం చాలా అరుదు. అయితే తాజాగా అనసూయ మేకప్ లేకుండా ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. మొహంపై మేకప్ లేకుండా తన మొహం పై వచ్చిన మొటిమలు గురించి తెలిపారు.

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ… అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. నా మొహం పై నాలుగు మొటిమలు వచ్చాయి అయితే ఒక దానిని గిల్లాను. మొటిమలను గిల్లడం మంచిది కాదు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విధంగా నా మొహం పై మొటిమలు రావడానికి గల కారణం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేశాను.

మొహంపై మొటిమలు రావడానికి కారణం మామిడి పండ్లు తినడం వల్ల వచ్చాయని అనుకుంటున్నాను. అయితే మొటిమలు వస్తాయని మామిడిపండ్లు తినకుండా ఉండలేము. సంవత్సరానికి ఒక్కసారి ఈ సీజన్లో మాత్రమే లభించే మామిడి పండ్లను ఎవరు తినకుండా ఉండలేము కనుక ఏమాత్రం మొహమాట పడకుండా మామిడికాయలను తినండి నేను కూడా మీతోనే ఉన్నాను అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మేకప్ లేకుండా అనసూయ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొడుకు మాటతో కన్నీరుమున్నీరైన అనసూయ.. ఏం జరిగిందంటే..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర యాంకర్ గా యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ షోను హోస్ట్ చేసినా అనసూయ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇటు బుల్లితెరతో పాటు అటు వెండితెరపై కూడా విజయాలు సొంతం చేసుకుంటున్న అనసూయ కొడుకు మాటతో కన్నీరుమున్నీరయ్యానని తాజాగా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

యాంకర్ అనసూయ అంతలా బాధ పడటానికి కారణమేమిటంటే ఆమె తొమ్మిదేళ్ల కొడుకు అనసూయతో కరోనా వైరస్, లాక్ డౌన్, వరదల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో అనసూయ కొడుకు ఆమెతో తాను గడిచిన కాలానికి వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. 2017, 2018, 2019 సంవత్సరాలలో తాను ఎంతో సంతోషంగా జీవించానని తనకు మళ్లీ అలాంటి రోజులు కావాలని తల్లికి తెలిపాడు. అప్పుడు కరోనా, వరదలు లేకపోవడంతో సంతోషంగా జీవనం సాగించానని చెప్పాడు.

అవకాశం వస్తే తాను గడిచిన వెళ్లాలని అనుకుంటున్నానని కొడుకు తనతో చెప్పాడని ఆమె వెల్లడించారు. కొడుకు అలా చెప్పిన తర్వాత తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని.. కన్నీరు పెట్టుకున్నానని తెలిపారు. రాబోయే తరాల వారికి మనం ఏం అందించనున్నాం…? మనం ఎలాంటి పరిస్థితులను కొని తెచ్చుకున్నానం..? అంటూ ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు. అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వినియోగం మనుషుల జీవితంలో భాగమైపోయింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. గతేడాదిలా సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా చాలా సమయమే పట్టేలా ఉంది. దేశంలో కరోనా అంతమైతే మాత్రమే ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించగలిగే అవకాశం ఉంది.