Categories: FeaturedMovie News

అనసూయ డౌట్ ను క్లియర్ చేసిన మంత్రి కేటీఆర్?

తెలుగు బుల్లితెర ఫై సందడి చేసే స్టార్ యాంకర్ లలో జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. యాంకర్‌గా తన టాలెంట్‌తో ఆకట్టుకుంటోన్న అనసూయ తన అందమైన ఫొటోషూట్‌లతో నెటిజన్ లను మాయ చేస్తోంది.జబర్దస్త్ వల్ల ఫేమ్ అయిన యాంకర్ అనసూయ, బుల్లితెర మీదే కాదు అటు వెండి తెర మీద కూడా అవకాశాలు సంపాదిస్తూ ముందుకి దూసుకెళ్తుంది.

ప్రస్తుతం అనసూయ తెలుగు బుల్లి తెర పై తనకంటూ మాస్ ఫాలోయింగ్ ని సంపాదించుంది. అలాగే హాట్ బ్యూటీగా కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పై వచ్చే రూమర్స్ కు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అలాగే తన అభిమానులతో తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా అనసూయ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ను ఒక డౌట్ అడిగింది.. డియర్ కేటీఆర్ సార్..అసలు లాక్‌డౌన్‌ ఎందుకు వచ్చిందో .. ఆపై అన్ లాక్ కూడా ఎందుకు వచ్చిందో మనందరికీ తెలిసిందే. అయితే మనందరికీ వ్యాక్సిన్ తీసుకున్నాము అన్న భరోసా ఉండవచ్చు. మరి వ్యాక్సిన్ కు దూరంగా ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి సార్ అంటూ ట్వీట్ చేసింది.

అలాగే పాఠశాలలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయి? అంటూ తనకు వచ్చిన డౌట్ ను కేటీఆర్ కు పోస్ట్ చేసింది అనసూయ. పిల్లలకు స్కూల్ లో ఉన్నప్పుడు వారికి ఏమైనా జరిగితే మాకు బాధ్యత లేదని పాఠశాల యాజమాన్యం సంతకం చేయించుకుంటున్నాయని, ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి సార్.. మీరు ఎప్పటిలాగే మాకు సరైన మార్గనిర్దేశం చేస్తారనే ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ మరొక ట్వీట్ చేసింది అనసూయ.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

బీపీ 200 దాటితే ఎంత ప్రమాదమో తెలుసా? నిపుణుల హెచ్చరిక!

రక్తపోటు సమస్యను చాలా మంది సాధారణంగా తీసుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా…

28 minutes ago

రాత్రి తలుపు మూసి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…

1 hour ago

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

9 hours ago

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

10 hours ago

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…

10 hours ago

టాలీవుడ్‌కు ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ హాట్ టాపిక్

తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…

10 hours ago