Tag Archives: benefits

Health Tips: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారికి .. అద్భుతమైన చిట్కాలు ఇవే!

Health Tips: ఈ మధ్యకాలంలో అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్యలలో నోటికి సంబంధించిన సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి. దంతాల నొప్పి,నోటి దుర్వాసన వంటి సమస్యలు అధికంగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటి పరిష్కారానికి డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కొంతమందికి ఎటువంటి ఫలితం లేకుండా పోతోంది. వేలకు వేలు ఖర్చు చేసి డాక్టర్ని సంప్రదించటం కంటే మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాల ద్వారా నోటి దుర్వాసన సమస్య చెక్ పెట్టవచ్చు. ఆ పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారికి .. అద్భుతమైన చిట్కాలు ఇవే!

సాధారణంగా మనిషి రోజుకు ఏడు నుండి ఎనిమిది లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. కానీ అతి తక్కువ మంది సరైన మోతాదులో నీటిని తీసుకుంటున్నారు. నీటిని తక్కువగా తీసుకునే వారిలో నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నోటి దుర్వాసన సమస్య తో బాధపడేవారు నీటిలో నిమ్మకాయ రసం కలుపుకొని తాగటం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తొలగిపోయి నోటి దుర్వాసన సమస్య నుండి విముక్తి లభిస్తుంది.

Health Tips: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారికి .. అద్భుతమైన చిట్కాలు ఇవే!

మనం ఇంట్లో లవంగాలు ఖచ్చితంగా ఉంటాయి. లవంగాల ని వంటలలో రుచికోసం వినియోగిస్తూ ఉంటారు. ఇది ఆహారాన్ని రుచిగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. లవంగాలను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. నోట్లో లవంగాలను వేసుకొని నమలటం వల్ల వాటిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు నోటి లోపల ఉన్న బ్యాక్టీరియాను తొలగించి నోటి దుర్వాసన నుండి విముక్తి కలిగిస్తాయి.

రక్తస్రావం సమస్యలు తగ్గుతాయి…

తేనేలోఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. నోటి దుర్వాసన సమస్యతో బాధపడే వారు దాల్చిన చెక్క పొడి చేసి అందులో కొంచెం తేనె కలిపి ఆ మిశ్రమాన్ని నోటిలో రాసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇలా చేయటం వల్ల పంటి నొప్పి, చిగుళ్ళ నుండి రక్తస్రావం వంటి సమస్యలు కూడా అరికట్టవచ్చు.

Health: వయస్సుతో పని లేకుండా..! జుట్టు తెల్లబడుతుందా…. కారణాలు ఇవే!

Health: ఎవరికైనా జుట్టు తెల్లబడటం అనేది సహజం. అది వయస్సు రీత్యా వస్తుంది. అయితే కొంత మందికి ముందుగానే.. అంటే 20 ఏళ్ల వయస్సులోపే చాలామందికి తల వెంట్రుకలు తెల్లగా కనిపిస్తుంటాయి. దానికి కారణం ఏంటి.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

Health: వయస్సుతో పని లేకుండా..! జుట్టు తెల్లబడుతుందా…. కారణాలు ఇవే!

సైన్స్ ప్రకారం.. జుట్టు తెల్లబడటానికి కారణం మెలనిన్ అనే వర్ణ పదార్థం. ఇది ప్రతీ మనిషి శరీరంలో ఉంటుంది. వయస్సు పెరిగే కొద్ది ఈ మెలనిన్ అనేది వర్ణద్రవ్యాన్ని కోల్పోవడం ప్రారంభిస్తుంది.

Health: వయస్సుతో పని లేకుండా..! జుట్టు తెల్లబడుతుందా…. కారణాలు ఇవే!

ఎక్కువగా ఈ రోజుల్లో చాలామందికి జంక్ ఫుడ్స్ అంటే ఎంతో ఇష్టం పడతారు. అంతే కాదు.. వాటితో పాటు.. చక్కెర, పిండి మరియు రసాయనాలతో కూడిన అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా వృద్ధాప్య లక్షణాలు తొందరగా కనిపిస్తాయి.

శరీరంలో ఐరన్ లోపించినప్పుడు..


దీంతో శరీరంపై ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. దీంతో శరీరం లోపల ఉన్న మిలియన్ల కొద్ది హెయిర్ ఫోలికల్స్‌ ఎక్కువ ప్రభావితానికి గురి అవుతుంది. దీని కారణంగానే జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. మరో సాధారణ కారణం మలబద్ధకం మరియు రక్త హీనత. బలమద్దకం ఉన్న చాలామందిలో జుట్టు వేగంగా తెల్లబడటం మొదలవుతుంది. శరీరంలో ఐరన్ లోపించినప్పుడు హిమోగ్లీబిన్ కూడా లోపిస్తుంది. దీని వల్ల కూడా మీ జుట్టు త్వరగా తెల్లబడటం ప్రారంభమవుతుంది. అందుకే పని చేసే సమయంలో ఒకే దగ్గర కూర్చోకుండా.. కాస్త రెస్ట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

GOOGLE PAY: ప్రస్తుతం లావాదేవీలన్నీ ఆన్ లైన్ అవతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా డిజిటల్ లావాదేవీలు చేసే దేశాాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. అతి తక్కువ కాలంంలోనే ఇండియాలోని ప్రజలు డిజిటల్ లావాదేవీలకు అలవాటుపడ్డారు. 

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

కేంద్ర ప్రభుత్వం యూపీఐ తీసుకువచ్చిన తర్వాత.. భీమ్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలాంటి యాప్స్ నేరుగా క్యాష్ లెస్ లావాదేవీలకు ఊతమిచ్చాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ ఉందంటే.. వాటిలో ఈ యాప్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. షాపుల్లో, రెస్టారెంట్లలో, హోటళ్లలో,  మార్కెట్లలో, చివరకు చిన్న స్థాయి వర్తకులు కూడా డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ కరెన్సీని కూడా ఇండియాలో ప్రవేశపెడుతామని… బడ్జెట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

GOOGLE PAY: గూగుల్ పే యూజర్లకు శుభవార్త… లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్

ముఖ్యంగా కరోనా తరువాత ఇండియాలోె డిజిటల్ లావాదేవీల విలువ పెరిగింది. గతంతో పోలిస్తే ఆన్ లైన్ పేమెంట్లు ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది.

గుగూల్ పే ద్వారా రూ. లక్ష పర్సనల్ లోన్:

ఇదిలా ఉంటే.. గూగుల్ పే పే వాడుతున్నవారికి ఆన్ లైన్ పేమెంట్ యాప్ శుభవార్త చెప్పింది. గుగుల్ పే యాప్ ఉపయోగించే వినియోగదారులకు రూ. లక్ష వరకు రుణం పొందేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారు మాత్రమే అర్హులని తెలిపింది. గూగుల్ పే పే ప్రిక్వాలిఫైయర్ యూజర్లకు డీఎంఐ ఫినాన్స్ కంపెనీ.. పర్సనల్ లోన్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ రుణాలు ఇవ్వనుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే వ్యక్తి గత రుణాలు ఇవ్వనుంది. తీసుకున్న రుణాన్ని 36 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో ఈ సదుపాయాన్ని మరింత మందికి  అందుబాటులోకి తేనుంది.

Health Tips: పచ్చి బాదం పప్పు వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలిస్తే షాక్ అవుతారు..!

Health Tips: సాధారణంగా డ్రైఫ్రూట్స్ తినటం వల్ల మన ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో వివిధ రకాల పోషక విలువలు దాగి ఉంటాయి. అందువల్ల ప్రతి రోజు కొంత మొత్తంలో డ్రైఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రతిరోజు మూడు నాలుగు బాదం పప్పులు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎండు బాదం పప్పు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. పచ్చి బాదం పప్పు తినడం వల్ల ఆరోగ్యానికి అంతే నష్టం కలుగుతుంది.పచ్చి బాదం పప్పు ఎక్కువగా తినటం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Health Tips: పచ్చి బాదం పప్పు వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలిస్తే షాక్ అవుతారు..!

సాధారణంగా చాలామంది డ్రై బాదంపప్పును నీటిలో నానబెట్టుకుని వాటిని తీసి తింటారు. ఈ క్రమంలో కొంతమంది పచ్చి బాదంపప్పును తినటానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. పచ్చి బాదం పప్పు ఎక్కువగా తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. పచ్చి బాదం పప్పులు టానిన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరం కొన్నిరకాల పోషకాలను గ్రహించే శక్తిని కోల్పోతుంది.

Health Tips: పచ్చి బాదం పప్పు వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలిస్తే షాక్ అవుతారు..!

పచ్చి బాదం పప్పు ఎక్కువగా తినటం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇవి మన శరీరంలోని కాలేయం మీద ప్రభావం చూపుతాయి. పచ్చి బాదం పప్పు ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగక ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలతో బాధపడేవారు పచ్చి బాదం పప్పు ఎక్కువగా తినటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

మైగ్రేన్ సమస్యతో బాధపడేవారికి ప్రమాదం..

పచ్చి బాదం పప్పులో ఆక్సలేట్ ఉండటం వల్ల కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పచ్చి బాదం పప్పును తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చి బాదం పప్పు ఎక్కువగా తినడం వల్ల మైగ్రేన్ సమస్యతో బాధపడేవారికి దాని తీవ్రత మరింత పెరిగే ప్రమాదం వుంటుంది. అందువల్ల ఏ ఆహారానైనా మితంగా తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండవు.

Health: కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే అలవాటు మీకు ఎక్కువగా ఉందా..! ఈ చిట్కాలు పాటించండి.. !

Health: కొంతమందికి కొన్ని అలవాట్లు వాళ్ల జీవితంతో మర్చిపోలేరు. ఎంత ప్రయత్నించినా అవి మన నుంచి దూరం కావు. మరి కొన్ని అయితే ఎవరు చెప్పినా వినకుండా.. వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఇదే దినచర్యలో ఒక ప్రక్రియగా మారిపోతుంది.

Health: కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే అలవాటు మీకు ఎక్కువగా ఉందా..! ఈ చిట్కాలు పాటించండి.. !

అలాంటి వాటిళ్లో ఒకటి కూర్చున్న సమయంలో.. పడుకునే సమయంలో కాళ్లు ఊపడం. అయితే ఇలా చేయడం మంచిదేనా.. ఆ అలవాటు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.. కూర్చొని స్నేహితులుతో మాట్లాడుతున్న సమయంలో.. ఫోన్ ను అదేపనిగా చేస్తున్న సమయంలో కొంత మంది కాళ్లు ఊపుతారు.

Health: కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే అలవాటు మీకు ఎక్కువగా ఉందా..! ఈ చిట్కాలు పాటించండి.. !

ఇలా చేయడం అనేవి.. ఆందోళన, పని ఒత్తిడికి కారకాలుగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పని చేస్తున్న సమయంలో ఇంట్లోని ఎవరైనా చూసి అలా చేయడం మంచిది కాదని చెప్పినా వారి మాట వినరు. వారి మాటలు పెడచెవిన పెడతారు.

అరటిపండ్లు, బీట్ రూట్ వంటి వాటిని..

ఇక నిద్ర సరిగ్గా పట్టకపోవడం.. హర్మోన్ల సమతుల్యత కారణంగా ఇలా జరుగుతందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వాటికి ఎలా చెక్ పెట్టొచ్చంటే.. ముందుగా వైద్యులను సంప్రదించి ఐరన్ మాత్రలు వేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అంతే కాదు.. అరటిపండ్లు, బీట్ రూట్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలట. టీ, కాఫీలు ఎక్కువగా అలవాటు చేసుకుంటే మంచిదని.. ఉదయం కన్నా రాత్రి ఎక్కువగా నిద్రపోయే సమయంలో ఫోన్ అస్సలు చూడకూడదంటున్నారు. సాధ్యమైనంతగా.. టీవీ, ఫోన్ చూడటం తగ్గిస్తే మంచిది. ఈ చిట్కాలు పాటిస్తే కాళ్లు ఊపే అలవాటు తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

JIO: ఒక్క క్లిక్ చాలు ప్రపంచం మీ ముందరే.. ! సరికొత్త ఇంటర్నెట్ టెక్నాలజీతో ముందుకు రానున్న రిలయన్స్ జియో..!

JIO: భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియోకు ముందు జియో తర్వాత అని చూసుకోవాలి. అంతగా టెలికాం రంగంలో విప్లవానికి నాంది పలికింది. 4జీ నెట్వర్క్ గ్రామస్థాయి వరకు తీసుకుపోవడానికి సహాయపడింది. జియో దెబ్బకి అప్పటివరకు ఉన్న టెలికాం సంస్థలకు భారీ దెబ్బ పడింది. దేశంలో ప్రతి మూలకు ఇంటర్నెట్ చేరడంలో సక్సెస్ అయింది.

JIO: ఒక్క క్లిక్ చాలు ప్రపంచం మీ ముందరే.. ! సరికొత్త ఇంటర్నెట్ టెక్నాలజీతో ముందుకు రానున్న రిలయన్స్ జియో..!

తాజాగా మరో సంచలనానికి రిలయన్స్ జియో నాంది పలుకుతోంది. ఒక్క క్లిక్ తోనే మూడు గంటల సినిమా డౌన్ లోడ్ అయిపోతుంది. దేశంలోని మారుమూల పల్లెల్లో కూడా ఇంటర్నెట్ సేవలు పరుగులు తీస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలలో సర్వర్ డౌన్ అనే మాట ఉండదు.

JIO: ఒక్క క్లిక్ చాలు ప్రపంచం మీ ముందరే.. ! సరికొత్త ఇంటర్నెట్ టెక్నాలజీతో ముందుకు రానున్న రిలయన్స్ జియో..!

ఏకంగా 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లిన ఫుల్ సిగ్నల్ వచ్చే విధంగా ఇంటర్నెట్ విప్లవానికి రిలయన్స్ జియో నాంది పలుకనుంది. శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ అందించేందుకు రెడీ అయ్యింది.


మల్టీ ఆర్బిట్ స్పేస్ టెక్నాలజీ ..

ఇందుకోసం రిలయన్స్ జియో లక్సెంబర్గ్ ఎస్ఈఎస్ జాయింట్ వెంచర్ ప్లాన్ చేసింది. ఈ జాయింట్ వెంచర్ లో జియోలో 51 శాతం వాటా, ఎస్ఈఎస్ కి 49 శాతం వాటా ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీతో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోని ఏ మూలకు అయినా శాటిలైట్ తోనే ఇంటర్నెట్ సర్వీసులు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మల్టీ ఆర్బిట్ స్పేస్ టెక్నాలజీ నెట్వర్క్ ద్వారా సర్వీసులు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. శాటిటైల్ కంటెంట్ కనెక్టివిటీ లో ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఎస్ఈఎస్ సంస్థ తో  రిలయన్స్ జియో ఈ డీల్ కుదుర్చుకోవడం దేశంలో డిజిటల్ విప్లవానికి మరింత దోహదం చేస్తుందని jio డైరెక్టర్ ఆకాశం అని అన్నారు.

Health Benefits: కొర్రల అన్నం తినే అలవాటు ఉందా..! అయితే ఈ వ్యాధి మీకు దరి చేరదు..!

Health Benefits: ప్రస్తుత జీవితంలో చాలా వరకు వర్క్ కు ప్రాధాన్యత ఇచ్చి…. ఫుడ్ ను అశ్రద్ధ చేస్తున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ పుడ్, ఫిజ్జా, బర్గర్లను ఎక్కువగా తింటున్నారు. సంతులిక ఆహారం అన్న మాటే మరిచారు. మనం తినే దాన్ని బట్టే మన ఆరోగ్యం ఆధాపడి ఉంటుంది.

Health Benefits: కొర్రల అన్నం తినే అలవాటు ఉందా..! అయితే ఈ వ్యాధి మీకు దరి చేరదు..!

మన ఆహారమే షుగర్ వంటి వ్యాధులకు కారణం అవుతోంది.  ముఖ్యంగా మిల్లెట్స్ ను పట్టించుకోవడమే లేదు. చిరు ధాన్యాల వల్ల చాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో కొర్రలు సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో మిల్లెట్స్ వాడకం చాలా పెరిగింది.

Health Benefits: కొర్రల అన్నం తినే అలవాటు ఉందా..! అయితే ఈ వ్యాధి మీకు దరి చేరదు..!

వ్యాధుల ప్రభావం కావచ్చు, జనాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడం కావచ్చు… వీటి వాడకం ఎక్కువగా పెరిగింది. ఒకప్పుడు పల్లెలకే పరిమితం అయిన కొర్రల వాడకం ఇప్పడు నగరాలకు కూడా విస్తరించింది. కొర్రలను బియ్యాలో కలుపుకుని తింటున్నారు

ఐరన్ మూలకం ఎక్కువగా..

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి కొర్రలతో చాలా లాభాలు ఉన్నాయి. షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంటే గుణం కొర్రలకు ఉంది. కొర్రల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల.. జీర్ణం బాగా అయి.. డయాబెటిస్, అధిక బరువు తగ్గేందుకు సహాయపడుతోంది. కొర్రల్లో 8 శాతం ఫైబర్.. 12 శాతం ప్రోటీన్లు ఉంటాయి. ఇంతే కాకుండా కొర్రల్లో ఐరన్ మూలకం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తహీనత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నరాల బలహీనత, బీపీ, ఆస్తమా ఉన్నవారికి కొర్రలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. నాడీ వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపే మోరెల్ విటమిన్ వీటిలో ఉంటుంది. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచి వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ ని తగ్గిస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి కొర్రలు. కొర్రలను అన్నంగా కానీ పిండి చేసుకుని కానీ ఆహారంగా వినియోగించుకోవచ్చు.

Helath Benefits: మీకు జామకాయ అంటే ఇష్టమా..! అయితే అందులో ఉండే గింజలు తినొచ్చా..?

Helath Benefits: జామ కాయ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. దీని వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. దీనిలో ఎక్కువగా సీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు దీనిని పేదవాని యాపిల్ అని కూడా అంటారు.

Helath Benefits: మీకు జామకాయ అంటే ఇష్టమా..! అయితే అందులో ఉండే గింజలు తినొచ్చా..?

ఎందుకంటే.. తక్కువ ధరలో ప్రతీ ఒక్కరికీ ఇది అందుబాటులో ఉంటుంది. అంతే కాదు ఏ ప్రాంత రైతులు అయినా దీనిని పండిస్తారు. ఇంటి ఆవరణలో కూడా చాలామంది జామ చెట్లను పెంచుతుంటారు. అందుకే దీనిని పేదవాని యాపిల్ అంటారు. దీనిలో పోషక విలువలు చాలా ఉంటాయని.. ప్రతీ ఒక్కరు దీనిని తీసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Helath Benefits: మీకు జామకాయ అంటే ఇష్టమా..! అయితే అందులో ఉండే గింజలు తినొచ్చా..?

ఇదంతా ఇలా ఉండగా.. జామకాయ తినే సమయంలో కొన్ని కాయల్లో గింజలు తక్కువగాను.. మరికొన్ని కాయల్లో గింజలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే మనం ముక్కలుగా కోసి వాటిపై కారం, ఉప్పు చల్లుకొని తింటుంటాం. అయితే ఈ గింజలను తినడం మంచిదేనా.. దాని వాల్ల ఏమైనా సైట్ ఎఫెక్ట్స్ ఉన్నాయా.. అనే విషయాలు చాలామందికి తెలియదు. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ను..

జామకాయ లోపల కొన్ని తెల్లగాను.. మరికొన్ని ఎరుపు రంగులో విత్తనాలు ఉంటాయి. కానీ ఏ కాయలో అయినా గింజలు అనేవి సహజంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబున్నారు. ఈ విత్తనాలలో ఫైబర్ సమృద్దిగా ఉండటం వలన మలబద్దకం, అసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేయటమే కాకుండా జీర్ణ క్రియ బాగా జరిగేలా చేసి బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుందట. అంతే కాదు రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యకరంగా ఉండటంతో పాటు.. రక్తప్రసరణ మంచిగా జరిగి గెండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉపయోగపడతుంది. ఇక శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ను ఎప్పటికప్పుడు తొలగించి కణాలను రక్షించేందుకు సహాయం చేస్తాయట. అంతే కాకుండా రోగనిరోధక శక్తి పెంపొందేందుకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా కూడా ఉపయోగపడుతుందట. అందుకే జామకాయలో అయినా.. పండులో అయినా విత్తనాలను ఎలాంటి డౌట్ లేకుండా తినేయొచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.

Health Benefits: అటుకులు తినటం వల్ల గర్భిణీ స్త్రీలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..!

Health Benefits: ఈ కాలంలో ప్రతి ఒక్కరిలోనూ కనిపించే సమస్య రక్తహీనత. ఈ సమస్య కారణంగా పెద్దలు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు,బాలింతలు, కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో రక్తహీనత కారణంగా బిడ్డకు జన్మనిచ్చే సమయంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కోవడం మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఈ రక్తహీనత కారణంగా ఆడవారు నెలసరి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. అలాంటి ఈ సమస్యను ఏ విధంగా తగ్గించుకోవాలో చూద్దాం….

Health Benefits: అటుకులు తినటం వల్ల గర్భిణీ స్త్రీలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..!

అటుకుల ఈ పేరుని మనం వినే ఉంటాము.అలాగే మన వంటింట్లో కూడా ఎప్పుడూ చూస్తూ ఉంటాము. అలాంటి ఈ అటుకులను మనము పాయసంగా గాని, ఉప్మా గాని, మసాలా అటుకులుగా గాని చేసుకొని తింటుంటాం. ఇవి మన రక్తహీనతకు కూడా ఎంతో మేలు చేస్తాయి. అది ఎలాగో తెలుసా….

Health Benefits: అటుకులు తినటం వల్ల గర్భిణీ స్త్రీలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..!

ఈ అటుకులలో ఉండే ఐరన్, క్యాల్షియం కార్బోహైడ్రేట్స్ అలాగే విటమిన్స్ కారణంగా రక్తహీనత సమస్యను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ అటుకులను మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తినవచ్చును . అటుకులు కొలెస్ట్రాల్ లను కూడా తగ్గించడంలో ఉపయోగపడతాయి.


రక్తహీనతను దూరం చేస్తుంది..

ఇవి గర్భిణీ స్త్రీలు, ఆడవారు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తహీనతను దూరం చేసుకోవచ్చు.వీటిని పిల్లలకు ఇవ్వడం వలన కూడా వారిని రక్తహీనత నుంచి దూరంగా ఉంచవచ్చు. అటుకులను తినడం వల్ల ఎన్నో సమస్యకు దూరంగా ఉండవచ్చని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Work From Home: వర్క్ ఫ్రం హోంతో ఇన్ని అనర్థాలా..? వీటికి పరిష్కారం ఇదే..!

Work From Home: కరోనా కారణంగా ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రం హోమ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ, సేవల రంగాలకు చెందిన ఉద్యోగులు గత రెండేళ్ల నుంచి ఇంటి నుంచే తమ ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు. అయితే డిసెంబర్ లో మళ్లీ ఆఫీసులకు రావాలంటూ ఉద్యోగులకు పిలుపు వచ్చింది.

ork From Home: కరోనా కారణంగా ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రం హోమ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ, సేవల రంగాలకు చెందిన ఉద్యోగులు గత రెండేళ్ల నుంచి ఇంటి నుంచే తమ

అయితే థర్డ్ వేవ్, ఓమిక్రాన్ భయాల వల్ల మళ్లీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. 
ఇదిలా ఉంటే దీర్ఘకాలం వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజులో ఒకే ప్రదేశంలో కూర్చుని పనిచేస్తుంటారు ఉద్యోగులు. ఇలా చేస్తూనే ఏదో ఒకటి తింటూ ఉంటారు.

ork From Home: కరోనా కారణంగా ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రం హోమ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ, సేవల రంగాలకు చెందిన ఉద్యోగులు గత రెండేళ్ల నుంచి ఇంటి నుంచే తమ

దీని వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. గంటల తరబడి కంప్యూటర్ ముందు కోర్చోవడమే కాదు… శరీరానికి కాస్త వ్యాయామం అవసరమంటున్నారు.ఇలాగే పనిచేస్తే 20 ఏళ్లలో విపరీతంగా బరువు పెరిగిపోవడంతో పాటు ఉబకాయం, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వంటి జబ్బులు వస్తాయి.

గంట – 2 గంటలకు ఓసారైనా ..

దీంతో పాటు రిపీటెట్ టైపింగ్ స్ట్రెస్, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. వెన్నెముక నొప్పితో పాటు మెడ నొప్పులు వస్తాయి. దీంతో పాటు చర్మం పొడిబారిపోతుంది.వీటన్నింటికి చెక్ పెట్టాలంటే వ్యాయామమే సరైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారు గంట – 2 గంటలకు ఓసారైనా పనిని పక్కన పెట్టి నడవాలంటున్నారు. దీంతో పాటు ఉదయం వ్యాయామం చేయాలని చెబుతున్నారు. రోజుకు కంప్యూటర్ పై 6-8 గంటల పనిని మాత్రమే చేయాలంటున్నారు. 7-9 గంటలు చక్కని నిద్ర అవసరమని చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో గడపటం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.