Tag Archives: bigg boss 5

సన్నీ పై కన్నేసిన ఉమాదేవి.. ఏకంగా అల్లుడిని చేసుకొని ప్లాన్ లో..!

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న 19 మంది కంటెస్టెంట్ లలో ఉమాదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకుంది.ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉమాదేవి రెండు వారాల పాటు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచి ఎవరూ ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

ఇలా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన ఉమాదేవి పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి మాట్లాడుతూ ఉమాదేవి కంటెస్టెంట్ సన్నీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈమె సన్నీ గురించి మాట్లాడుతూ ఏకంగా తనని తన అల్లుడిగా చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

ఉమా దేవికి ఇద్దరు కూతుర్లు కావడంతో తన పెద్ద కూతురిని సన్నీకి ఇచ్చి పెళ్లి చేయాలని ఉమాదేవి అనుకున్నదట అయితే ఓసారి షూటింగ్ లో పాల్గొన్నప్పుడు తన చిన్న కూతురు సన్నీని అన్నయ్య అని పిలవడంతో తను కూడా తనని చెల్లెలుగా భావిస్తున్నట్లు ఉమాదేవి తెలిపారు.

కానీ తనని మాత్రం అత్తయ్య అని పిలుస్తారని,తన పిల్లలకు ఏ సమస్య వచ్చినా వెంటనే సన్ని ఆదుకుంటాడని ఈ సందర్భంగా ఉమాదేవి సన్నీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ.. సన్నీ ఎంతో అద్భుతంగా ఆడుతున్నారని, కచ్చితంగా సన్నీ టాప్ ఫైవ్ లో ఉంటారని ఉమాదేవి తెలియజేశారు.

క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ సిరిని దూరం పెట్టిన షణ్ముఖ్.. ఇదే కోవలో మానస్, ప్రియాంక..!

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ఇక రెండు రోజులలో తొమ్మిదవ వారం కూడా పూర్తి చేసుకొనుంది. ఈ కార్యక్రమం ద్వారా కంటెస్టెంట్ లు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నారు. ఇకపోతే నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో భాగంగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో కొన్ని మనస్పర్థల కారణంగా సిరి, షణ్ముఖ్, మానస్, పింకీ మధ్య ఎడబాటు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సిరి అందరి బట్టలు తీసి బయటకు విసరగా ఎందుకు అలా విసిరావంటూ షణ్ముఖ్ అడగడంతో ఎవరి బట్టలు వారిని తీసుకోమని చెప్పు అని అంటుంది. ఆ సమయంలో నువ్వే కదా వేసింది నీకు ఉంటది కదా అంటూ షన్ను చెప్పుకొచ్చాడు. అందుకు సిరి నేను తీయను ఎవరి బట్టలు వాళ్ళని తీసుకోమని చెప్పడంతో షణ్ముఖ ఇక్కడే నీ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది అంటూ సిరిని అంటాడు.

ఆ సమయంలో రవి కల్పించుకుని క్యారెక్టర్ గురించి ఎందుకు అంటూ అనగా మధ్యలో నువ్వు మాట్లాడకు నేను సిరితో మాటాడుతున్నా అంటూ షణ్ముఖ్ రవి పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సమయంలోనే సిరి బాధపడుతూ ఈ దెబ్బల కన్నా నువ్వు అనే మాటలు ఎక్కువగా నొప్పి కలిగిస్తున్నాయి. నేను ఎవరికోసమో ఇక్కడికి రాలేదు నా కోసం నేను ఆడటానికి వచ్చాను అంటూ బాధపడుతుంది.

ఇక గార్డెన్ ఏరియాలో మానస్, పింకీ మాట్లాడుతూ కూర్చోగా..మానస్ మాట్లాడుతూ నీకు ఎవరైనా హాని కలిగిస్తే వారు నాశనం కావాలని కోరుకుంటావు కదా అంటూ పింకినీ అనడంతో పింకీ బాధపడుతూ ఇంకోసారి అలాంటి వర్డ్స్ వాడకు మను వినడానికి కూడా చాలా బాధగా ఉన్నాయి అంటూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

అనారోగ్యంతో బాధ పడిన జెస్సి.. అసలు పట్టించుకోని షన్ను, సిరి…?

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈ రియాలిటీ షో తెలుగులో ఐదవ సీజన్ 8 వారాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ వారంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే 9వ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ హౌస్ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఈ క్రమంలోనే 9వ వారం నామినేషన్లు భాగంగా కేవలం కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్ తప్ప.. మిగిలిన పది మంది కంటెస్టెంట్ లో నామినేషన్ లో ఉన్నారు.

ఈ క్రమంలోనే ఇంట్లో త్రిమూర్తులుగా ఉన్నటువంటి జెస్సీ,షన్ను, సిరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముగ్గురు కలిసి ఎంతో కన్నింగ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తూ ఉంటారు. ఇకపోతే గత ఎపిసోడ్ లో భాగంగా జెస్సీ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.

ఇలా ఉదయం నుంచి జెస్సీ వాంతులు చేసుకుంటూ ఉన్నప్పటికీ అతనికి షన్ను, సిరి ఏ మాత్రం సహాయ పడలేదు. ఇలాంటి సమయంలో జెస్సికీ తోడుగా సన్నీ ఉండి అతని బాగోగులు చూసుకున్నాడు. అనంతరం బెడ్ పైకి వెళ్లిన జెస్సీ ఎంతో అస్వస్థతకు గురైనప్పటికీ షన్ను పక్కనే ఉన్నాగాని తనని చూసి చూడనట్టు వదిలేశాడు కనీసం మాటకూడా మాట్లాడకపోవడంతో జెస్సి ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ ముగ్గురు ఎంతో స్నేహంగా ఉన్నప్పటికీ తనకు అనారోగ్యం చేయడంతో వీరిద్దరూ ఏమాత్రం స్పందించకపోవడం ఎంతో విడ్డూరం.

ఇక ఈ విషయం గురించి మానస్, సన్నీ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లు వారి ముగ్గురి మధ్య మనస్పర్థలు వచ్చాయని మానస్ సన్నీకి చెబుతాడు. మానస్‌ వాళ్ల మధ్యలోకి వెళ్లకని సన్నీకి సలహా ఇచ్చాడు. జెస్సీ కి అనారోగ్యం చేయడంతో షణ్ముక్ సిరి మాట్లాడింది కాకపోవడంతో జెస్సీ అభిమానులు వీరిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఏనిమిది వారాలు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన కంటెస్టెంట్ లోబో రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ హౌస్ లోకి 19మంది కంటెస్టెంట్ లలో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన లోబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన లోబో ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేశారు. మొదటి రెండు వారాలు కంటెస్టెంట్ ఉమాదేవితో ఎంతో చనువుగా ఉంటూ ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్ అందించారు. ఇక ఉమాదేవి ఎలిమినేషన్ తర్వాత లోబో, రవి ఇద్దరూ కలిసి గేమ్ ఆడేవారు.

ఇలా ఎనిమిది వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న లోబో ఒక వారం పాటు సీక్రెట్ రూమ్ లో ఉన్నారు. ఇలా హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్ అందించారు. ఇక 8వ వారం నామినేషన్ లో ఉన్న లోబో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఎనిమిది వారాలకు గానీ బిగ్ బాస్ లోబోకు ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించి ఉంటారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ముందుగా బిగ్ బాస్ లోబోతో కుదుర్చుకున్న డీల్ ప్రకారం అతనికి రోజుకు పాతిక వేలు చెల్లించనున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే లోబో వారానికి లక్షన్నర నుంచి రెండులక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ ప్రకారం చూస్తే ఎనిమిది వారాలకు గానీ లోబో 15 నుంచి 20 లక్షల మధ్య రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది.

ఇక బిగ్ బాస్ ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారం మాత్రమే కాకుండా, బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులకు లోబో అందించిన కంటెంట్ ను దృష్టిలో ఉంచుకొని అతనికి మరింత ఎక్కువగా రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు ఏది ఏమైనా బిగ్ బాస్ ద్వారా లోబో భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ గ్రాఫ్ ను క్రాస్ చేసిన మరో కంటెస్టెంట్..?

యూట్యూబర్ గా పలు వీడియోలు,వెబ్ సిరీస్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నటించిన వెబ్ సిరీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచాయి. షణ్ముఖ్ సంబంధించిన వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయిందంటే కొన్ని రోజుల పాటు టాప్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. ఇలా ఎంతో ప్రేక్షకాదరణ పొందిన షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లోకి అడుగుపెట్టారు.

ఇలా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన షన్నుతో కలిసి మైండ్ గేమ్ ఆడుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షన్ను సైలెంట్ గా ఉంటూనే హౌస్ లో పావులు కదుపుతున్నారు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఏడు వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం 8వ వారంలోకి అడుగుపెట్టింది.

ఇక 8వ వారం కెప్టెన్ గా షన్ను ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యుల నుంచి వచ్చిన లెటర్లను వదులుకున్న వారు నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ వారం రవి, షణ్ముఖ్, సిరి, లోబో, మానస్, శ్రీ రామచంద్ర నామినేషన్ లో ఉన్నారు.

అయితే పలు వెబ్సైట్లు చేసిన సర్వే ప్రకారం ప్రతి వారం ఓట్ల పరంగా షణ్ముఖ మొదటిస్థానంలో ఉండేవాడు. తాజాగా అతని గ్రాఫ్ పడిపోయిందని పలు వెబ్సైట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటి స్థానంలో ఉన్న షణ్ముఖ్ ను వెనక్కి తోసి శ్రీరామచంద్ర మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్నారని పలు సర్వేలు వెల్లడించాయి. ఇక రెండవ స్థానంలో షణ్ముఖ్ ఉండగా మూడవ స్థానంలో మానస్ ఉన్నారు. అయితే ఈ వారం ఎక్కువగా లోబో నామినేట్ అవుతారంటూ సోషల్ మీడియాలో కథనాలు వినబడుతున్నాయి.

హమిదా, శ్రీరామ్ మధ్య రోమాన్స్ మామూలుగా లేదుగా.. ప్రోమో వైరల్..

బిగ్ బాస్ సీజన్ 5 రియల్టీ షో లో తాజాగా మరో ప్రోమో విడుదల అయింది. దీనిలో రవి, కాజల్ జర్నలిస్టులుగా వ్యవహరిస్తారు. దీనిలో ముఖ్యంగా .. హాయ్ హలో బీబీ న్యూస్.. అంటూ ప్రోమో మొదలవుతుంది.ఇంటి సభ్యుల అందరిలో నచ్చని ఇంటి సభ్యుడు ఎవరు అంటూ.. రవి ప్రశ్నిస్తాడు కాజల్ ను.. తర్వాత ఆమె రవి అంటూ సమాధానం చెబుతుంది. తర్వాత ‘రవి గారు మీకు ఒకవేళ పెళ్లాం లేకపోతే .. ఇంటి సభ్యుల్లో ఎవరికి మీరు సైట్ వేస్తారు’ అంటూ కాజల్ ప్రశ్నించగా వెంటనే కాజల్ అంటూ రవి రిప్లై ఇస్తాడు.

వెంటనే కాజల్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ.. అరేహో.. అంటూ నవ్వుతూ ఉంటుంది. తర్వాత లోబో వచ్చి.. ‘నా ప్రేమ కనిపించడం లేదు.. అందుకే పరేషాన్ లో ఉన్నా’ అంటూ అటూ ఇటూ తిరుగుతుండగా.. ఎవరు నీ ప్రేమ అంటూ రవి అడగ్గా.. ఇంకెవరూ పొట్టి (ఉమ) అంటూ లోబో చెబుతాడు. తర్వాత ఎలిమినేషన్ లో నటరాజ్ అన్న మాటలను ఉటంకిస్తూ.. రవి, కాజల్ నటరాజ్ ను ఆట ఆడుకుంటారు. ఒక కుందేలు, సీతాకోక చిలుక, గుంట నక్క కూడా ఉంది.

సందర్భాన్ని బట్టి అక్కడ తనకు అలా అనిపించిందంటూ వాళ్లకు సమాధానం చెబుతాడు నటరాజ్. తర్వాత శ్రీరామ్ ను కాజల్ ఒక ప్రశ్న అడుగుతుంది. ప్రియాలో నచ్చే మీకు ఒక మంచి క్వాలిటీ ఏంటి అని అడగ్గా.. ఆమె ఎప్పుడు తయారు అయినా ఒక బేబీ డాల్ గా ఉంటుందని సమాధానం ఇస్తాడు. దీంతో ఆమె నవ్వుతుంది. ఇక చివరగా రవి మానస్ ను ఆక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే.. నీకు వైఫ్ గా, మరదలుగా, ప్రియురాలిగా, పనిమనిషిగా ఉండాలంటే ఎవరిని ఎంచుకుంటావ్ అని అడుగుతాడు.

దానికి మానస్.. మరదలుగా అయితే ప్రియాంక అని, లహరి వచ్చేసి వైఫ్ గా.. అంటూ చెబుతాడు. తర్వా త అదే ప్రశ్నలను శ్రీరామ్ ను కూడా అడుగుతారు.. అతడు సిరి మరియు హమిదాను ప్రియురాలిగా ఉంటే ఇష్టమంటూ చెబుతాడు. చివరకు హమిదాను నీకు ఎవరంటే ఇష్టమనగానే శ్రీరామ్ అంటూ చెబుతుంది. తర్వాత వీళ్లిద్దరి మధ్య రోమాన్స్ ఒక పీక్ కు వెళ్లిపోయింది. ఈ ప్రోమో లో మొత్తం నవ్వుల జల్లులు కురిసాయి.

ప్రియాకు పెరుగుతున్న మద్దతు.. తన పూర్తి మద్దతు ఆమెకే అంటున్న అఖిల్

బిగ్ బాస్ రియాల్టీ షో మొదటి నాలుగు సీజన్లు పూర్తి చేసుకొని ఐదో సీజన్ ప్రస్తుతం రన్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో 19 మంది కంటెస్టెంట్ మొదట హౌస్ లోకి వెళ్లగా.. మొదటి వారంలో సరయు ఎలిమినేట్ అయింది. అయితే ఇక మిగిలిన 18 మంది కంటెస్టెంట్ల మధ్య వార్ ఓ రేంజిలో పెరిగిపోతోంది.

అయితే అందులో ఉన్న ప్రతీ ఒక్కరికీ బయట ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే ఉంటుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లలో సీనియర్ నటి ప్రియ కూడా ఉన్నారు. తన పూర్తి మద్దతు ప్రియాకే ఉంటుందని.. బిగ్ బాస్ 4 సీజన్ రన్నర్ అఖిల్ సార్దక్ పేర్కొన్నారు. సీజన్ 4 లో అతడు లవ్ ట్రాక్, ఫ్రెండ్ షిప్ ట్రాక్ లాంటివి మెయింటెన్ చేస్తూ చివరి వరకు వచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం అఖిల్ ‘ఫస్ట్‌ టైమ్‌’ అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. హౌస్ లో పవర్ రూంకి వెళ్లిన హమిద ప్రియపై పవర్ ఎఫెక్ట్ ప్రయోగించారు. హౌస్ లో ఉన్నన్ని రోజులు కెప్టెన్ కాకూడదనే షరతు బిగ్ బాస్ విధిస్తాడు. అది హమీద ప్రియపై ప్రయోగిస్తుంది. దీంతో ఆమె కెప్టెన్ గా అయ్యే అర్హత కోల్పోయారు. ఆమె కెప్టెన్ అయ్యే అర్హత కోల్పోయినా ఆమె టాస్క్ ల్లో ది బెస్ట్ ఇవ్వడం అనేది ఎంతో గొప్ప అని.. మీరు గొప్ప ఫైటర్ అంటూ అఖిల్ ఆమెను ప్రశంసిస్తారు.

అయినప్పటికీ మీకు మరింత శక్తి రావాలని కోరుకుంటున్నాను ప్రియగారూ అంటూ ఆమెకు మ‌ద్ద‌తు ప‌లికాడు. తన అభిమానులను కూడా ప్రియాగారికి మద్దతు తెలపండంటూ విన్నవించాడు. దీంతో ప్రియాకు బయట నుంచి మద్దతు బాగానే పెరుగుతోందని తెలుస్తోంది.

‘నీ గేమ్ నువ్వు ఆడుకో.. నాతో మైండ్ గేమ్ ఆడకు’.. రవి వర్సెస్ శ్రీరామ్

బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షో రాను రాను రసవత్తరంగా మారింది. ఒకరిపై ఒకరు ద్వేషించుకుంటూ దూసుకుపోతున్నారు. దానికి తగ్గట్లే బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం ఫిజికల్ టాస్క్ ను ఇచ్చారు. ఈ ఛాన్స్ కోసం ఎదురుచూస్తోన్న హౌస్ మేట్స్ అంతా రెచ్చిపోయి ఆడేస్తున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు పడిపోతూ.. కుమ్మేసుకుంటూ ఆడేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో మొదలైన ఈ టాస్క్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతోంది. ప్రోమోను విడుదల చేసినదాన్ని బట్టి చూస్తే నేడు పోరు వేరే లెవల్లోకి వెళ్లే విధంగా కనిపిస్తోంది.

రవి, శ్రీరామచంద్రల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. దీనిలో మొదట శ్రీరామ్ మాట్లాడుతూ ‘నువ్వు సేఫ్ గేమ్ ఆడాలనుకుంటే ఆడు.. నాతో మైండ్ గేమ్ ఆడొద్దు అంటూ శ్రీరామ్ రవితో అనగా.. దానికి రవి.. ‘ఇది నా గేమ్ బ్రో అంటూ రవి అంటాడు. శ్రీరామ్ రవితోనే కాదు మానస్ దగ్గర కూడా గొడవ పెట్టుకున్నట్లు అనిపించింది. వాళ్లకు వీళ్లకు చెప్పడం కాదు.. నాతో ప్రాబ్లమ్ ఉంటే నాదగ్గర చెప్పు అని శ్రీరామ్.. అనగా మానస్ దానికి ‘నువ్ వినే పొజిషన్ లో లేవు’ అంటూ మానస్ కూడా వాయిస్ రైజ్ చేసి చెప్పాడు.

‘నువ్ ఇంకా చిన్నపిల్లోడివి’ అని శ్రీరామ్.. ‘నీ ఏజ్ ఎక్కువ ఉన్న మెచ్యూరిటీ చూడు ఎలా ఉందో’ అంటూ మానస్ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు. ఇక గేమ్ కు సంబంధించి వాళ్ల టీం సభ్యులతో రవి మాట్లాడుతూ.. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని టార్గెట్ చేద్దాం అంటూ చెబుతాడు. ఇక శ్రీరామ్ వాళ్ల టీం సభ్యులతో మనకు దేహ బలం తక్కువగా ఉంది.. కాబట్టి కొంచెం మైండ్ తో ఆడదాం’ అంటూ చెబుతూ కనిపించాడు. గేమ్ మధ్యలో శ్రీరామచంద్ర ‘పగిలిపోద్ది చెప్తున్నా’ అంటూ సన్నీకి వార్నింగ్ ఇస్తాడు. ఆ తరువాత సిరి.. శ్వేతాను రెచ్చగొడుతూ కామెంట్ చేయడంతో ఆమె సిరి పైకి దూసుకెళ్లింది.

అది చూసిన యానీ మాస్టర్ ‘శ్వేతా నువ్ వెరీ వెరీ వైల్డ్’ అని కామెంట్ చేస్తుంది. అక్కడనే ప్రియా సాయంత్రం అయ్యేసరికి ఏమైనా దెయ్యం పట్టుకుంటుందేమో ఆమెకు అంటూ చురకలు అంటిస్తుంది. మగాడివైతే ఆడుదువు రా అంటూ.. ప్రియ ఎదుటి టీం సభ్యుడైన సన్నీని రెచ్చగొట్టగా.. మగాడు గిగాడు మాటలు వద్దు అంటూ సున్నితంగా వార్నింగ్ ఇస్తాడు సన్నీ.. ఇలా ప్రోమో అంతా హాట్ హాట్ గా అనిపించింది. చూడాలి ఈ రోజు ఎపిసోడ్ లో ఏమవుతుందో.

వారిద్దరి వ్యవహారంపై హీరో నాగార్జున షాక్.. దీని వెనక ఏదో జరిగిందంటూ..

బిగ్ బాస్ సీజన్ 5 లో నాగార్జున సందడి మొదలైంది. ఈ రోజు టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యే బిగ్ బాస్ రియాల్టీ షోలో మొత్తం ఏడుపులే కనిపిస్తున్నాయి. సరయు, సిరి మధ్య పెద్ద యుద్దమే జరిగింది. నాగార్జున అక్కడ నుంచి మాట్లాడుతున్నా ఎవరికి వారు తిట్ల పురాణం మొదలుపెట్టుకొని వాళ్ల పని వాళ్లు కానిచ్చేశారు. తాజాగా మరో ప్రోమో విడుదలైంది. అందులో ఏముందంటే.. మొదట వాళ్లకు ఒక చిన్న టాస్క్ ఇస్తారు నాగార్జున.

అదేంటంటే.. ‘ఎవరితో సెట్టు.. ఎవరితో కట్టు’ అనేది ఇచ్చారు. మొదట శ్వేత అనీ మాస్టర్ ను చూస్తే.. చనిపోయిన మా అమ్మ గుర్తకు వచ్చిందంటూ.. అనీ మాస్టర్ తో సెట్టు అంటూ.. శ్వేత భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత సింగర్ శ్రీరామ్ శ్వేతతో సెట్ అని.. కాజల్ కట్ అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత సరయు విషయానికి వస్తే.. సిరిపై తీవ్రంగా విరుచుకుపడింది.

ఆటలో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఆడాలి.. ఎవరు కోపరేషన్ లేకపోయినా ఆడటం అనేది కష్టం అంటూ సిరితో కట్ అని చెబుతుంది. తనకు ఎవరి సహకారం లేదు కాబట్టి కెప్టెన్ కాలేకపోయానని.. మీరు ఎవరి సహకారం లేకుండా ఆడి చూపించు అంటూ సిరితో కోపంగా అంటుంది సరయు. తనను గెలిపించమని ఏ రోజైనా చెప్పానా నేను అంటూ సిరి తీవ్రంగా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది కూడా.

అది చూసిన నాగార్జున ఇది కెప్టెన్సీ టాస్క్ కాదు.. దీని వెనుక ఏదో జరిగిందంటూ ఆరా తీస్తారు. వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి. దీంతో నాగార్జును కొద్దిసేపు షాక్ అయ్యారు. అయితే ఈ ప్రోమో విపరీతంగా వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ ఆర్ జే కాజల్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్న అభిజిత్ ఫ్యాన్స్.. ఎందుకంటే?

బిగ్ బాస్ సీజన్ 5 లోకి 17 వ కంటెస్టెంట్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు ఆర్. జే. కాజల్. ఈమె హౌస్ లోకి రాగానే ఎంతో ఎగ్జయిట్ అవుతూ హౌస్ మొత్తం కలియతిరుగుతూ ఎంతో సంబరపడ్డారు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే అందరి దగ్గరకు వెళ్లి వారి వ్యక్తిగత విషయాలను అడిగి తెలుసుకుంటూ ఎంతో చురుకుగా ప్రవర్తించారు. అయితే హౌస్ లోకి వెళ్ళినప్పటినుంచి ఆమె ప్రవర్తన గమనిస్తూ ఉన్న తోటి కంటెస్టెంట్ లు చాలా ఓవర్ చేస్తుందని భావించారు.

కాజల్ ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా ప్రవర్తిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.తాజాగా మంగళవారం జరిగే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో అందులో లహరితో గొడవ పడిన కాజల్ ఏడవడం చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున ఈమెపై ట్రోలింగ్ చేస్తున్నారు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ తన కలల హౌస్ అంటూ డ్రీమ్ కార్ పట్టుకున్న ఈమె ఇప్పుడు చైల్డ్ కార్డు పట్టుకొని ఏడుస్తున్నారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ విన్నర్ గా నిలిచిన అభిజిత్ గురించి నెగిటివ్ గా మాట్లాడారు. అభిజిత్ పిఆర్ టీం పెట్టుకున్నాడని ఈమె మాట్లాడటంతో అభిజిత్ ఫాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కాజల్ బిగ్ బాస్ హౌస్ లో ఒక వైరస్ లా వ్యవహరిస్తోందని, వీలైనంత తొందరగా ఆమెను హౌస్ నుంచి బయటకు పంపించడం ఎంతో మంచిదని అభిజిత్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఈ క్రమంలోనే కాజల్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. ఆమె ఎగ్జైట్మెంట్ ను అందరు తప్పుగా భావిస్తున్నారు, ఆమె ఆట చూసి మాట్లాడితే బాగుంటుంది అంటూ కాజల్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. హౌస్ లోకి వెళ్ళిన మొదటి రెండు రోజులకే కాజల్ ఈ విధమైనటువంటి నెగిటివిటీను సంపాదించుకోవడమే కాకుండా ఈ నెగిటివిటీ నుంచి ఎలా బయటపడతారో తెలియాల్సి ఉంది.