Tag Archives: bigg boss 5

షణ్ముఖ్ తన వక్రబుద్ధిని మరోసారి చూపించాడు అంటూ నెటిజన్ల ట్రోల్స్..! ఆ ఒక్కమాటతో మళ్ళీ..

బిగ్ బాస్ సీజన్ 5 నిన్నటితో ముగిసింది. అందరూ అనుకున్నట్లుగానే సన్నీ విన్నర్ గా నిలిచాడు. రన్నర్ షణ్ముఖ్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే టైటిల్ రేసులో ఎక్కువగా మొదటి నుంచి కూడా షణ్ముఖ్ పైనే నమ్మకం ఉండేది. కానీ సిరితో అతడు సాగించిన స్నేహం అనే ముసుగులో.. హగ్గులు ఇచ్చుకోవడం.. కిస్సులు పెట్టడం లాంటివి చేయడంతో అతడి గ్రాఫ్ తగ్గిపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్‌లో అందరికంటే ఎక్కువ క్రేజ్ ఉన్నది షణ్ముఖ్ జస్వంత్‌కి మాత్రమే. ఒక యూట్యూబర్‌కి 4.4 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉండటం అంటే సామన్యమైన విషయం కాదు. ఒకరకంగా చెప్పాలంటే అతను సోషల్ మీడియాలో సూపర్ స్టార్ కిందే లెక్కే.. ఎవరి సపోర్ట్ లేకుండా.. కేవలం యూట్యూబ్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో ఇంత మంది ఫాలోవర్స్‌ని రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. అంత పాపులారిటీ ఉన్న అతడు రన్నర్గా నిలవడానికి కారణం కేవలం అతడు సోంతంగా ఆట ఆడలేదని.. సిరి స్నేహంమే అతడిని చెడగొట్టిందని నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఫినాలే స్టేజ్ పై విన్నర్ గా నిలిచిన సన్నీని అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. ఇంతటి విజయానికి కారణం తన వెనుక ఉన్న 19 మంది కంటెస్టెంట్లతో పాటు.. అందరూ మచ్చాలు సపోర్ట్ గా నిలిచారనన్నారు. వారందరికీ తను ప్రామిస్ చేస్తున్నానని.. తన నుంచి ఎంటర్ టైన్ మెంట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఇక తర్వాత రన్నర్ స్పీచ్ కావాలి అని నాగార్జున అనగానే.. షణ్ముఖ్ మైక్ తీసుకొని మాట్లాడాడు. ఇక ఫైనల్ స్పీచ్ లో ‘‘ప‌ర్లేదు.. ప‌ర్లేదు.. విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.. ఆట ఎలా ఆడాం అన్న‌దే ముఖ్యం’’ అనే స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. విజయం ముఖ్యం కాదు అన్నప్పుడు హౌస్ లో ఇన్ని రోజులు ఎందుకు ఉన్నట్లు అంటూ.. తిట్టిపోస్తున్నారు. రన్నర్ గా నిలిచినా అతడి వక్రముద్ది మాత్రం మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యూట్యూబ్ వీడియోలు చూసి షాక్ అయిన సిరి.. షణ్ముఖ్ తో హగ్గులు, ముద్దులు గురించి క్లారిటీ..!

బిగ్ బాస్ 5 సీజన్ లో అన్నింటి కన్నా ముఖ్యంగా సిరి, షణ్ముఖ్ మధ్య రిలేషన్ పైనే ఆడియన్స్ ఎక్కువగా ఆసక్తి కనబరిచారు. యూట్యూబుల్లో, సోషల్ మీడియాలో వీరిద్దరి రిలేషన్ పైన  అనేక రకాలుగా  ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా ఇద్దరి మధ్య హగ్గింగులు, కిస్సింగులు జనాల్లో బాగా ఫేమస్ అయ్యాయి.

అయితే వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పటికీ.. వీరిద్దరి మధ్య  ఇంకేదో ఉందని నెటిజన్లు, ఆడియన్స్ అనుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీని చూసి సిరి తల్లి శ్రీదేవి కూడా ఒకానొక సందర్భంలో సీరియస్ అయింది. బిగ్ బాగ్ ఆధ్యంతం కూడా సిరి, షణ్ముఖ్ మంచి ప్రెండ్స్ గా కనిపించారు.

ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు అండగా నిలిచారు.  ఇదిలా ఉంటే సిరితో ఈ కెమిస్ట్రీనే షణ్ముఖ్ ను బిగ్ బాస్ ట్రోఫి నుంచి దూరం చేశాయని అనుకుంటున్నారు జనాలు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యూట్యూబుల్లో వీడియోలు, థంబ్ నెల్స్ చూసిన తర్వాత సిరి షాక్ అయింది. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌజ్ లో షణ్ముఖ్ నన్నెంతో మోటివేషన్ చేశారని చెప్పుకొచ్చింది సిరి.

తామెంటో తమ పార్ట్నర్లకు తెలుసని… వెల్లడించింది. అయతే తాము హగ్ చేసుకోవడం బయట రిసీవ్ చేసుకోలేదని చెప్పుకొచ్చింది.  అయితే తన పెళ్లి గురించి కూడా స్పష్టతనిచ్చింది సిరి. సిరి లవర్ శ్రీహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా సార్లు సిరిని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశాడు. సిరి, షణ్ముఖ్ మధ్య రిలేషన్ గురించి క్లారిటీ ఉందని తెలిపాడు కూడా. అయితే ఆయన ఎప్పుడంటే అప్పుడే పెళ్లి అంటూ చెప్పేసింది సిరి.

బిగ్ బాస్ తో మానస్ ఎంత వెనకేసాడో తెలుసా..?

బిగ్ బాస్ 5 సీజన్ ముగిసింది. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలేలో సన్నీ విజేతగా నిలిచారు. రన్నరప్ గా షణ్ముఖ్ నిలిచారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ ముగియడంతో కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే మానస్ కు బిగ్ బాస్ ఎంతమొత్తం ముట్టచెప్పాడనే వార్త ఆసక్తికరంగా మారింది.

బిగ్ బాస్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉన్న మాసస్.. అన్ని టాస్కుల్లో, ఛాలెంజుల్లో తన పని తాను చేసుకుపోయాడు. ఎవరితోనూ ఎక్కువగా వివాదాల జోలికి వెళ్లకుండా క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా సన్నీతో మంచి ప్రెండ్ షిప్ మెంటైన్ చేశాడు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో కూడా విన్నర్ సన్నీ.. మానస్ తో స్నేహం గురించి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. టీవీ షోల్లో చేస్తూ.. బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మానస్ కు ఎంత రెమ్యూనరేషన్ వచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

సీరియళ్లలో యాక్టింగ్ చేస్తూ వారానికి రూ. 1-1.5 లక్షల వరకు మానస్ సంపాదించేవాడు. దాదాపుగా 15 వారాల పాటు మానస్ బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నారు. థర్డ్ రన్నరప్ గా ఉన్నారు. అయితే మానస్ ఆదాయంతో కంపార్ చేసి చూస్తే దాదాపుగా ఓ రూ. 20 లక్షల వరకు వెనకేసినట్లుగా తెలుస్తోంది. ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పాలనే ఆశ ఉందని గతంలో మానస్ అన్నాడు. ఈ డబ్బుతో తన కల సాకారమవుతుందేమో చూడాలి మరి.

బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్ సిరి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..బాగానే సంపాదించిందిగా.. !

బిగ్ బాస్ 5 సీజన్ ముగిసింది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన బిగ్ బాస్ ఆడియన్స్ కు వినోదాన్ని పంచింది. బిగ్ బాస్ టైటిల్ ను సన్నీ గెలుచుకున్నప్పటికీ.. మరో కంటెస్టెంట్ సిరి కూడా అంతే రేంజ్ లో గేమ్ ఆడింది. ముఖ్యంగా షణ్ముఖ్, సిరి మధ్యలో ప్రెండ్ షిప్ , కెమిస్ట్రీ ఈ సీజన్ కే హైలెట్ గా నిలిచాయి.

ముఖ్యంగా సన్నీకి మాటామాటా ఇవ్వడంతో సిరినే టాప్ గా ఉంది. ముఖ్యంగా ఈ సీజన్ లో సన్నీకి, సిరికి మధ్య ఫైట్ అభిమానులకు ఆసక్తి క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఓ లేడి కంటెస్టెంట్ టాప్ 5లో ఉండటం ఇదే మొదటిసారి. సిరి తన ఆట తీరుతో టాప్ 5 లో ప్లేస్ సంపాదించుకుని.. అందరి ఆదరన పొందింది.

ముఖ్యంగా షణ్ముఖ్ తో హగ్గింగులతో ఫేమస్ అయిపోంది.  ఇదిలా ఉంటే బిగ్ బాస్ ద్వారా కంటెస్టెంట్లు ఎంత సంపాదించారనే విషయం అభిమానుల్లో ఆసక్తి క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా 15 వారాలు బిగ్ బాస్ లో ఉన్న సిరి ఎంత సంపాదించిందనే విషయంలో అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.

యూట్యూబ్ సిరీస్, సీరియళ్లలో నటిస్తున్న సిరి వారానికి రూ.1-1.5 లక్షల వరకు సంపాదిస్తుందని తెలుస్తోంది. దీంతో ఈ మేరకే బిగ్ బాస్ తో సిరి ఒప్పందం కుదుర్చకుంది. దీంతో  సిరికి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాదాపుగా రూ. 25 లక్షల వరకు సిరికి ముట్టచెప్పారనే వాదన నడుస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకు పవన్ కళ్యాణ్ రాకపోవడానికి కారణం ఇదే..!

బిగ్ బాస్ 5వ సీజన్ కూడా నిన్నటితో ముగిసింది. భారీ అంచనాల మధ్య ప్రారంభమైన 5వ సీజన్ అంచనాలను అందుకోలేకపోయిందని తెలుస్తోంది. గత సీజన్లలో లాగా ఈ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ముఖ్యంగా ప్రేక్షకులకు తెలియని కంటెస్టెంట్లు ఎక్కువగా ఉండటం ఈ సీజన్ కు మేయిన్ డ్రాబ్యాక్ గా చెబుతున్నారు. దీంతో పాటు బిగ్ బాస్ టాస్కులు కూడా ఆసక్తికరంగా లేకపోవడంతో ఈ షోపై అందరూ పెదవి విరిచారు. దీంతో బిగ్ బాస్ రేటింగ్ కూడా పడిపోయాయి.

అయితే ఈ షో గ్రాండ్ ఫినాలేను గ్రాండ్ గా ప్లాన్ చేశారు నిర్వాహకులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథిగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు. ఒకవేళ పవర్ స్టార్ కనుక వస్తే షో తీరే మారిపోయేది. అయితే భీమ్లా నాయక్ సినిమా పనుల్లో బిజీగా ఉండటంతో పవన్ రావడం కుదరదని చెప్పేశాడట. ముఖ్యంగా బిగ్ బాస్ 4తో పోలిస్తే బిగ్ బాస్ 5 సీజన్ అంతగా ఆదరణ లేకపోవడంతోనే పవన్ కళ్యాణ్ రాలేదని సమాచారం.

 గ్రాండ్ ఫినాలేలో శ్యాంసింగరాయ్ టీం మాత్రమే హల్చల్ చేసింది. నాని, కృతిశెట్టి, సాయిపల్లవి మాత్రం శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకు హాజరయ్యారు. మరోవైపు ట్రిపుల్ ఆర్ టీం కూడా గ్రాండ్ ఫినాలేకు వస్తుందని అనుకున్నప్పటికీ..కేవలం రాజమౌళి మాత్రమే హాజరయ్యారు. శ్రియ, సుకుమార్, రష్మిక కూడా తమ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకు హాజరయ్యారు.

సిరిని ఆలియా భట్ అంటేనే ఫీల్ అయింది.. ఇప్పుడు డైరెక్ట్ గా అలియానే ‘సన్నీ ఐ లవ్ యు’ అంది.. షాక్ లో కింద పడిపోయిన సన్నీ..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఇప్పటికే టాప్ 5లో ఉన్న సిరి, మానస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇక విన్నర్ రేసులో కేవలం ముగ్గురు మాత్రమే మిగిలిపోయారు. అందులో కూడా శ్రీరామచంద్ర రూ.25లక్షలు తీసుకొని.. ఇంటి బటయకు వచ్చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో ఎంత నిజముందో తెలవాలంటే.. ఆదివారం సాయంత్ర 6 గంటల నుంచి దాదాపు 4గంటల పాటుగా టెలికాస్ట్ కాబోతున్న ఈ ఫినాలే చూడాల్సిందే. ఇక ఇందులో సెలబ్రిటీలు చేసిన హంగామాతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ డ్యాన్స్ పెర్ఫామన్స్ తో స్టేజ్ పైకి వచ్చారు.

ఇక ఒక్కొక్కరిగా సాగిన ఎలిమినేషన్ ఉత్కంఠని రేకెత్తిచ్చింది. ముందుగా సుకుమార్ ఇంకా దేవిశ్రీ ప్రసాద్ ఇద్దరూ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి హౌస్ మేట్స్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. దేవీ శ్రీ ప్రసాద్ మరియు నేషనల్ క్రష్ రష్మికా హౌస్ లోకి వెళ్లి.. పుష్ప సినిమా నుంచి ‘రా రా స్వామి’ అనే పాటకు డ్యాన్స్ కూడా వేసేశారు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమోలో అలియా భట్.. రణవీర్ కపూర్ బిగ్ బాస్ వేదికపై కనిపించారు.

హౌస్ లో ఉన్న సభ్యులతో వాళ్లు మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా సన్నీ.. అలియా… అంటూ అరిచాడు. దీంతో అలియా భట్.. అతడిని చూస్తూ.. ‘సన్నీ.. ఐ లవ్ యూ’ అంటూ చెప్పింది. దీతో సన్నీ అక్కడికక్కడే పడిపోయాడు. దీంతో ఈ వీడియో ప్రోమో వైరల్ గా మారింది. అలియా భట్ అంత మాట అనే సరికి సన్నీకి నోటి నుంచి మాట రానట్టుంది. సిరిని ఆలియా భట్ అంటేనే ఫీల్ అయి అలా పిలవద్దు అంటూ చెప్పింది.. ఇప్పుడు డైరెక్ట్ గా అలియాతోనే ‘సన్నీ ఐ లవ్ యు’ చెప్పించు కున్నాడు అంటూ నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

బ్రేకింగ్.. హౌస్ నుంచి రూ.25 లక్షలు తీసుకొని బయటకు వచ్చిన కంటెస్టెంట్.. !

మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 5 సీజన్ ముగియబోతోంది. ఇప్పటికే గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధమైంది. అయితే టాప్ 5 కంటెస్టెంట్ల మధ్య పోటీ రసతవత్తరంగా ఉంది. ముఖ్యంగా సన్నీ, షణ్ముఖ్ మధ్యే పోటీ ఉంటుందని అంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే .. బిగ్ బాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

గెలుపు సంగతి అటుంచితే.. అందర్ని షాకింగ్ కు గురిచేస్తూ ఓ కంటెస్టెంట్ రూ. 25 లక్షలు తీసుకుని టైటిల్ రేస్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. గత సీజన్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. గత సీజన్ లో అభిజిత్, అఖిత్, సోహైల్, అరియానా, హారికలు టాప్ 5 కంటెస్టెంట్లుగా పోటీలో ఉన్నారు. అయితే ఈ సీజన్ లో హరిక 5వస్థానంలో, 4వస్థానంలో అరియానా నిలిచారు. అభిజిత్, సోహైల్, అఖిల్ మధ్య పోటీ నెలకొంది. ఈ సమయంలోనే నాగార్జున ఎవరిపైనా నమ్మకం లేదో వారు రూ. 25 లక్షలు తీసుకుని బయటకు వచ్చేయచ్చు అని చెప్పారు.

దీంతో సోహైల్ ఈ డీల్ కు ఒప్పుకుని బయటకు వచ్చాడు. ఈ సీజన్ లో అభిజిత్ విన్నర్ గా నిలువగా… అఖిల్ రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఈసారి కూడా ఇలాగే డీల్ కుదుర్చుకుని పోటీనుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి నాగర్జున ఆఫర్ ను సింగర్ శ్రీరామ్ చంద్ర తీసుకున్నట్లు వినికిడి. సిరి, మానస్ 4,5 స్థానాలతో ఎలిమినేట్ కాగా… టైటిల్ కోసం సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్ పోటీపడ్డారట. కాగా ఇంకొన్ని గంటల్లో విన్నర్ ఎవరో తెలియబోతోంది. అయితే ఈసారి సన్నీ విన్నర్ గా నిలుస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

షణ్ముఖ్ రెండో స్థానంలో నిలిచారని తెలుస్తోంది. అయితే సిరి వ్యవహారంతో షన్నూ వెనకపడినట్లు ఆడియన్స్ అభిప్రాయం. ఇదిలా ఉంటే గ్రాండ్ ఫినాలేను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఈకార్యక్రమానికి గెస్ట్ లుగా ట్రిపుల్ ఆర్ టీం రామ్ చరన్, అలియాభట్ రానున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శ్యాం సింగరాయ్ టీం నాని, సాయిపల్లవి కూడా వస్తున్నారని తెలుస్తోంది.

సన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఓ అమ్మాయితో డేట్ కోసం వెళ్తే.. ఆమె ఏం చేసిందో చెప్తూ.. !

తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని గంటలే సమయం ఉంది. నేటితో బిగ్ బాస్ సీజన్ 5 ముగుస్తోంది. దీంతో ఎవరు విన్నర్ గా నిలుస్తారో అని అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా సన్నీ, షణ్మఖ్ మధ్య ఎక్కువగా పోటీ నెలకొందని.. నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

వీరిద్దరిలోనే ఒకరు విన్నర్ అవుతారని నెటిజెన్లు తమకు నచ్చిన విధంగా ప్రిడిక్ట్ చేస్తున్నారు. అయితే ఫైనల్ ముందు కంటెస్టెంట్లతో సరదా ఎపిసోడ్ ప్లాన్ చేశారు. దీనికి గత సీజన్లలోని కంటెస్టెంట్లు అతిధులుగా వచ్చారు. ఈ క్రమంలో రాహుల్‌ సిప్లిగంజ్‌, శివజ్యోతి ఓ ఫన్నీ టాస్క్‌ ఇచ్చారు.

బెలూన్లలోని గాలిని పీల్చుకుని దాన్ని బయటకు వదలకుండా మాట్లాడాలన్నారు. దీంతో కంటెస్టెంట్ల గొంతులు మారడంతో అందరూ నవ్వారు. ఇక అఖిల్ సార్థక్ .. సన్నీని ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. మరేప్పుడైనా డేటింగ్ యాప్ లో ఎవరినైనా కలిశారా..? అని అడిగాడు. దీనికి సమాధానంగా.. సన్నీ‘నేను ఓ అమ్మాయిని కలిశాను.

అయితే ఆమె నా ముచ్చట వదిలేసి.. ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పసాగిందని’ అన్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఇక బిగ్ బాస్ ముగింపుకు ముందు ఎపిసోడ్లలోనే ఇంత ఆసక్తి నెలకొంటే.. ఇక గ్రాండ్ ఫినాలే ఎలా ఉంటుందో చూడాలి

రన్నర్ గా శ్రీరామచంద్ర..! విన్నర్ గా సన్నీ..? వార్తలో నిజమెంత..?

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 5 ఎట్టకేలకు ముగింపు దశకు చేరుకుంది. 19 మంది ఎన్నో ఆశలతో బిగ్బాస్ లోకి అడుగుపెట్టగా.. చివరకు 5గురు మిగిలారు. దీనిలో నుంచి ఇప్పటికే సిరి, మానస్ బయటకు వచ్చారనే సమాచారం తెలుస్తోంది. ఇక మిగిలిన ముగ్గురు సన్నీ, షణ్ముఖ్, శ్రీరామచంద్ర మధ్య టైటిల్ పోరు నడవనుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా షణ్ముఖ్ టైటిల్ ఫేవరేట్ గా పేరు తెచ్చుకున్నాడు. నాలుగు వారాల తర్వాత .. సమీకరణాలు అన్నీ తారుమారు అయ్యాయి. ఒక్కసారిగా సన్నీ మొదటి స్థానంలోకి దూసుకొచ్చాడు. ఎవరి అంచనాలకు అందకుండా.. ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. ఈ సీజన్ విన్నర్ సన్నీ అనేది కూడా మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది.

ఇక హౌస్ లో ఉన్న శ్రీరామచంద్ర విషయానికి వస్తే.. తెలుగులో తన పాపులారిటీని పెంచుకోవాడానికి హౌస్ లోకి అడుగుపెట్టారు. అతడు అనుకున్నట్లుగానే తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. విన్నర్ గా సన్నీని అనౌన్స్ చేయగా.. రన్నర్ గా శ్రీరామచంద్ర ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. ఈ సారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు రూ.50 లక్షల ప్రూజ్ మనీ తో పాటు ఒక బైక్ ను మరియు రూ.25 లక్షలు విలువచేసే ఓ ప్లాట్ ను కూడా ఇవ్వనున్నట్లు తెలిసిందే. ఫైనల్ లో మిగిలిన వీళ్ల ముగ్గరికి మనీ ఆఫర్ చేస్తాడనేది కూడా వార్తలు వస్తున్నాయి.

టాప్ 5, టాప్ 4 కంటెస్టెంట్స్ ఎలిమినేట్.. ఎవరో తెలుసా..?

తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. దీనికి నేటితో తెర పడనుంది. ప్రతీ ఒక్కరూ ఎవరు గెలుస్తారని ఎదురు చూస్తున్నారు. అయితే అంతకముందు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫైనలిస్టులతో మాజీ కంటెస్టెంట్లు ఓ ఆట ఆడుకున్నారు. ఫస్ట్ సీజన్ కంటెస్టెంట్ల నుంచి నాలుగో సీజన్ కంటెస్టెంట్ల వరకు ఎనిమిది మంది హౌస్ లో ఉన్న వాళ్లతో మాట్లాడారు.

అన్ అఫిషియల్ గా శనివారం అర్థరాత్రే ఫైనల్ షూటింగ్ అయిపోయినట్లు తెలుస్తోంది. అయితే టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్లలో సిరి, మానస్, శ్రీరామచంద్ర, షణ్ముక్, సన్నీలల్లోల ముందుగా వీక్ గా ఉన్న సిరి ఎలిమినేట్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. ప్రైవేట్ వెబ్ సైట్లు, యూట్యూబ్ సైట్లలోని పోలింగ్ లో కూడా సిరికి అతి తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి.

దీంతో హౌస్ నుంచి బయటకు వెళ్లారనే వార్తలు వస్తున్నాయి. తర్వాత స్టేజ్ పైకి వచ్చి.. షణ్ముఖ్ గెలుపు కోసం తాను వెయిట్ చేస్తున్నానని.. బయటకు వచ్చి.. హౌస్ లో ఉన్నవాళ్లతో ముచ్చటించింది. సిరి ఎలిమినేట్ తర్వాత హౌస్ లో ఇక నలుగురు ఉన్నారు. అందులో కూడా అందరూ అబ్బాయిలే ఉండటం విశేషం. ఇక తర్వాత టాప్ 5 నుంచి టాప్ 4 కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

అదే మానస్. నాగార్జున తనదైన శైలిలో ఇంటి నుంచి బయటకు పంపాడు. మానస్ ఎలిమినేషన్ తన ఫ్రెండ్ సన్నీకి షాక్ ను గురిచేసింది. ఇక తెలిసిన సమాచారం ప్రకారం వీళ్లిద్దరు ఎలిమినేట్ అవ్వగా.. హౌస్ లో టాప్ 3 కంటెస్టెంట్లు మాత్రమే మిగిలిపోయారు. అందులో కూడా ఎవరు విన్ అవుతారనేది వాళ్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్లు కనిపిస్తోంది. విన్నర్ ఎవరనేది ఈ రోజు జరిగే ఎపిసోడ్లో తెలవనున్నది.