Tag Archives: bigg boss telugu 7

Pallavi prashanth: మొదటిసారి అరెస్టుపై స్పందించిన పల్లవి ప్రశాంత్.. చచ్చిపోవాలనిపించింది అంటూ కామెంట్స్?

Pallavi prashanth: పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా బిగ్ బాస్ కార్యక్రమంలో అందరికీ పరిచయమయ్యారు. అంతకుముందు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రశాంత్ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన కప్పు గెలుచుకొని సెలబ్రిటీ అయ్యారు.

ఇక హౌస్ లో ఉన్నప్పుడు ఈయనకు అమర్ తో జరిగిన గొడవ కారణంగా గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు అమర్ కారు పై దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా పలువురు సెలబ్రిటీల కార్లు ధ్వంసం కావడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం కావడంతో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇలా రెండు రోజులపాటు జైలులో ఉన్నటువంటి ప్రశాంత్ అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా విడుదలైనటువంటి ఈయన పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే బిబి ఉత్సవ్ కార్యక్రమంలో కూడా పల్లవి ప్రశాంత్ పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మొదటిసారి తన అరెస్టు గురించి స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.

నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్న…

నేను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని ఎలాగైనా కప్పు గెలుచుకుని తన తండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకున్నాను కానీ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అయితే నేను జైలులో ఉన్నప్పుడు నాన్న కోర్టు దగ్గర పడుకున్న వీడియోలు చూసి ఆ క్షణం నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానా అనిపించింది అంటూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Pallavi prashanth: ఇచ్చిన మాట మరిచి తెగ ఎంజాయ్ చేస్తున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్!

Pallavi prashanth: రైతు బిడ్డగా బిగ్ బాస్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పల్లవి ప్రశాంత్ ఒకరు. ఈయన రైతు బిడ్డగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చి మరింత మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా టైటిల్ కూడా గెలుపొందారు.

ఇక తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తాను ఈ కార్యక్రమంలో విన్నర్ గా నిలబడితే బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బును మొత్తం పేద రైతులకు పంచుతానని ఈయన తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటానని ప్రతి రూపాయికి తాను లెక్క చెబుతానని ప్రశాంత్ తెలిపారు.

ఇలా ప్రతి రూపాయికి లెక్క చెబుతానని పదేపదే చెప్పినటువంటి ప్రశాంత్ ఇచ్చిన మాట మర్చిపోయారని తాజాగా ఆయన వ్యవహారం చూస్తేనే అర్థమవుతుంది. డబ్బులు రైతులకు పంచుతానని చెప్పిన ప్రశాంత్ ఆ మాట మర్చిపోయారని ఇప్పటివరకు ఈయన రైతులకు డబ్బు పంచిన ఒక్క వీడియో కూడా బయటకు రాలేదని తెలుస్తుంది. అయితే ఈయన బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత రైతు బిడ్డ అనే ట్యాగ్ నుంచి సెలబ్రిటీ అనే ట్యాగ్ తగిలించుకున్నారు

పొలం పనులు చేయటం కష్టమే..

ఈయన ఇటీవల కాలంలో పొలం పనులు చేస్తూ కూడా కనిపించలేదు కానీ పెద్ద ఎత్తున పార్టీలు షోస్ అంటూ హైదరాబాద్లోనే సెలబ్రిటీ హోదాని అనుభవిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పలువురు ఈయన వ్యవహార శైలిపై కామెంట్లు చేస్తూ ఒకసారి లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన తర్వాత ఎండలో పొలం పనులు చేయడం కష్టమే అంటూ పలువురు ఈయన వ్యవహార శైలి పై కామెంట్లు చేస్తున్నారు.

Shivaji: శివాజీ గెలవాలని అనాధలకు అన్నదానం చేస్తున్న అభిమానులు.. ఫోటోలు వైరల్!

Shivaji: బిగ్ బాస్ కార్యక్రమంలో హీరో శివాజీ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి పలు విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ విజేత శివాజీ అంటూ మొదటి నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా శివాజీ మొదటి నుంచి కూడా టైటిల్ రేసులో ఉన్నారు కానీ గత రెండు వారాలుగా ఈయన ఓటింగ్ లో కాస్త వెనుకబడ్డారని తెలుస్తుంది.

ఇప్పటికే బిగ్ బాస్ కార్యక్రమం 14 వారాలను పూర్తి చేసుకుంది. మరొక మూడు రోజులలో ఈ కార్యక్రమం విన్నర్ ఎవరు అనే విషయాలను ప్రకటించబోతున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో తప్పకుండా శివాజీ గెలవాలి అంటూ అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయటం విశేషం. శివాజీ బిగ్ బాస్ విన్నర్ గా నిలవాలి అంటూ ఆయన అభిమానులు అనాధలకు పెద్ద ఎత్తున అన్నదానం చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నటువంటి శివాజీ తప్పకుండా ఈ సీజన్ విన్నర్ కావాలని కోరుకుంటూ అభిమానులు ఇలా అనాధలకు పేదవారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి వీడియోలు శివాజీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు అనే విషయాలు మాత్రం తెలియడం లేదు.

కడుపు నింపిన అభిమానులు..

ఈ ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో ఎంతోమంది శివాజీ గెలిచే విషయం పక్కన పెడితే ఆయన గెలవాలి అంటూ ఎంతో మంది అనాధలకు కడుపునిండా భోజనం పెట్టడం నిజంగా ప్రశంసించ దగ్గ విషయం అంటూ అభిమానులపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ విన్నర్ గా శివాజీ కప్పు గెలుస్తారా లేక పల్లవి ప్రశాంత్, అమర్ వీరిద్దరిలో ఎవరో ఒకరు కప్పు గెలుచుకుంటారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Keerthi Bhat: అమర్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు.. కాళ్లు మొక్కుతానంటూ ఎమోషనల్ అయిన కీర్తి?

Keerthi Bhat: బిగ్ బాస్ కార్యక్రమం సమయంలో చాలామంది సెలబ్రిటీలు వారికి నచ్చినటువంటి కంటెస్టెంట్లను సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇతర కంటెస్టెంట్ల అభిమానులు వారిని కూడా ట్రోల్స్ చేస్తూ ఉండటం మనం చూస్తుంటాము. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలు భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కీర్తి భట్ ఎదుర్కొంటున్నారని చెప్పాలి.

ఈమె మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మాత్రమే కాకుండా సీరియల్ నటిగా కూడా అందరికీ సుపరిచితమే అయితే ప్రస్తుతం సీజన్ సెవెన్ లో భాగంగా ఈమె సీరియల్ వారికి కాకుండా గౌతం కృష్ణకు సపోర్ట్ చేశారు. గౌతమ్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో తనని రిసీవ్ చేసుకోవడానికి కీర్తి బట్ కూడా వెళ్లారు. అలాగే పలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొనారు. దీంతో అమర్ ఫ్యాన్స్ ఈమెపై భారీ స్థాయిలో నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు.

తాను సీరియల్ వాళ్లకు సపోర్ట్ చేయలేదంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై తాజాగా కీర్తి భట్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమర ఫ్యాన్స్ పచ్చి బూతులతో నన్ను తిడుతున్నారు మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు కదా మీ అమ్మ కూడా ఒక ఆడదే కదా అంటూ ఈమె కామెంట్స్ చేశారు. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ప్రియాంక మానస్ మహేష్ తప్ప నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదు.

నడిరోడ్డుపై కొట్టిస్తాను…

కూడా ఎవరైతే ఇండిపెండెంట్ గా ఆడుతున్నారో వారికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నాను. మీకు దండం పెడతా దయచేసి ఇలాంటి కామెంట్లతో ట్రోల్ చేయకండి మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా. ఇంత గలీజ్ మాటలు మాట్లాడకండి మీ కాళ్లు మొక్కుతా సోషల్ మీడియాలో ఇలా తప్పుగా మాట్లాడొద్దు నా గురించి చెడుగా కామెంట్స్ చేసిన వారి ఐడిలన్నింటినీ ట్రాప్ చేశానని మీరు ఎక్కడున్నారో వెతుక్కుంటూ మరీ వచ్చి నడిరోడ్డుపై మీ అమ్మతోనే కొట్టిస్తాను అంటూ ఈ సందర్భంగా కీర్తి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

Rathika: ఎలిమినేట్ అవుతానని రతికకు ముందే తెలుసా… ఆ కారణంతోనే బయటకు వచ్చేసిందా?

Rathika: బిగ్ బాస్ కార్యక్రమం 12 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది 11వ వారం ఎలిమినేషన్ లేకపోవడంతో 12వ వారంలో ఏకంగా డబల్ ఎలిమినేషన్ అయింది. ఈ క్రమంలోనే శనివారం అశ్విని హౌస్ నుంచి బయటకు రాగా ఆదివారం రతిక ఎలిమినేట్ అయ్యారు. ఇలా ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత నాలుగు వారాలకి రతిక ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు అయితే తిరిగి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరీ లోపలికి వెళ్లారు.

ఇలా ఆరవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినటువంటి ఈమె తిరిగి 12వ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. మొదటి నాలుగు వారాలు కూడా ఈమె ఆటపై ఏమాత్రం శ్రద్ధ చూపకుండా ముచ్చట్లు పెట్టుకుంటూ గడిపారు. అయితే ఎలిమినేట్ అయి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా తన ఆట తీరులో ఏ మాత్రం మార్పు లేదు ఎప్పుడు చూడు ఆ శివాజీ బ్యాచ్ కి చెంచా గిరి చేస్తూ వారితో ముచ్చట్లు పెట్టుకోవడం జరుగుతోంది.

ఇలా తన ఆట తీరు సరిగా లేకపోవడంతోనే ఈమె నామినేషన్స్ లోకి వచ్చారని ఇక శనివారం అశ్విని ఎలిమినేట్ కావడంతో ఆదివారం తాను ఎలిమినేట్ అవుతానని రతిక ముందుగానే ఊహించిందని తెలుస్తుంది. ఇక నాగార్జున చివరిలో అర్జున్ రతిక ఉండడంతో ఏవిక్షన్ ఫ్రీ పాస్ వీరిలో ఎవరికైనా ఉపయోగిస్తావా ప్రశాంత్ అంటూ అడగడంతో ప్రశాంత్ తనను సేవ్ చేస్తారని రతిక భావించింది కానీ ఆయన మాత్రం నేను 14వ వారం వరకు ఈ ఫ్రీ పాస్ ఉపయోగించను అని చెప్పారు. దీంతో రతిక ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

నేను ఆడక పోవడంతోనే పంపిస్తున్నారు..

ఇలా నాగార్జున రతిక ఎలిమినేట్ అంటూ అనౌన్స్ చేయడంతో ఈమె వెంటనే తనలో తాను బహుశా నేను ఆడలేదని నన్ను పంపిస్తున్నారేమో అంటూ అనుకుంటుంది. ఇలా హౌస్ లో కొనసాగుతున్నటువంటి రతికకు తాను ఎలాంటి పర్ఫామెన్స్ ఇవ్వలేదని అర్థమవుతుంది అందుకే ఆమె ఎలిమినేట్ అయిన నేను ఆడలేదని పంపిస్తున్నారు అంటూ కాంప్రమైజ్ అయిందని, ఎక్కడ కూడా ఫిజికల్ టాస్కులలో హుషారుగా పాల్గొనక పోవటమే ఆమె ఎలిమినేషన్ కి కారణమని చెప్పాలి.