Pallavi prashanth: రైతు బిడ్డగా బిగ్ బాస్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పల్లవి ప్రశాంత్ ఒకరు. ఈయన రైతు బిడ్డగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఎంతో పాపులర్ అయ్యారు. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కార్యక్రమంలోకి వచ్చి మరింత మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఏకంగా టైటిల్ కూడా గెలుపొందారు.
ఇక తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తాను ఈ కార్యక్రమంలో విన్నర్ గా నిలబడితే బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బును మొత్తం పేద రైతులకు పంచుతానని ఈయన తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటానని ప్రతి రూపాయికి తాను లెక్క చెబుతానని ప్రశాంత్ తెలిపారు.
ఇలా ప్రతి రూపాయికి లెక్క చెబుతానని పదేపదే చెప్పినటువంటి ప్రశాంత్ ఇచ్చిన మాట మర్చిపోయారని తాజాగా ఆయన వ్యవహారం చూస్తేనే అర్థమవుతుంది. డబ్బులు రైతులకు పంచుతానని చెప్పిన ప్రశాంత్ ఆ మాట మర్చిపోయారని ఇప్పటివరకు ఈయన రైతులకు డబ్బు పంచిన ఒక్క వీడియో కూడా బయటకు రాలేదని తెలుస్తుంది. అయితే ఈయన బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత రైతు బిడ్డ అనే ట్యాగ్ నుంచి సెలబ్రిటీ అనే ట్యాగ్ తగిలించుకున్నారు
పొలం పనులు చేయటం కష్టమే..
ఈయన ఇటీవల కాలంలో పొలం పనులు చేస్తూ కూడా కనిపించలేదు కానీ పెద్ద ఎత్తున పార్టీలు షోస్ అంటూ హైదరాబాద్లోనే సెలబ్రిటీ హోదాని అనుభవిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పలువురు ఈయన వ్యవహార శైలిపై కామెంట్లు చేస్తూ ఒకసారి లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన తర్వాత ఎండలో పొలం పనులు చేయడం కష్టమే అంటూ పలువురు ఈయన వ్యవహార శైలి పై కామెంట్లు చేస్తున్నారు.
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…
ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…