Tag Archives: bollywood

Kangana Ranaut: డబ్బు కోసం అలాంటి పనులు చేయను.. నాకు ఆత్మగౌరవమే ముఖ్యం: కంగనా

Kangana Ranaut: కంగనా రౌనత్ పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఎమర్జెన్సీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె హీరోయిన్గా కొనసాగుతూనే పలు వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తలలో నిలుస్తుంటారు.

ఈ క్రమంలోనే కంగనా తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈమె తనని సింగర్ లతా మంగేష్కర్ తో పోల్చుకున్నారు. లతా మంగేష్కర్ ఏదైనా ప్రైవేట్ ఈవెంట్స్ లో పాల్గొనాలి అంటే పాడటానికి ఇష్టపడరట. ఇలా డబ్బులు తీసుకుని తనకు పాటలు పాడటం ఏమాత్రం ఇష్టం ఉండదని ఈమె పెళ్లిళ్లకు అసలు వెళ్లేవారు కాదు.

ఈ క్రమంలోనే కంగనా తనకు కూడా డబ్బు తీసుకొని పెళ్లిలలో డాన్సులు వేయడం ఏమాత్రం నచ్చదని తెలిపారు. నాకు డబ్బు కంటే ఆత్మగౌరవమే ముఖ్యమని, డబ్బు కోసం తాను అలాంటి పనులు చేయనని ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఈమె బాలీవుడ్ సెలబ్రిటీలను ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

డబ్బు తీసుకొని డాన్సులు చెయ్యను…
ఇటీవల ముకేశ్ అంబానీ కుమారుడి ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకలలో భాగంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా పాల్గొని సందడి చేశారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున డాన్సులు చేశారు. ఇలా డబ్బు తీసుకొని వీరంతా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారని వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇలాంటి పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

Aaradhya: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆరాధ్య బచ్చన్.. అందంలో తల్లికి పోటీ ఇస్తుందిగా?

Aaradhya: ఆరాధ్య బచ్చన్ పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ స్టార్ హీరో హీరోయిన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యల గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె ఎప్పుడు బయట కనిపించిన తన తల్లి చేతిని పట్టుకొని కనిపిస్తూ ఉంటారు. ఇలా ఐశ్వర్య ఎక్కడికి వెళ్లిన తన కుమార్తెను వెంటబెట్టుకుని వెళుతూ ఉంటారని సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా అమితాబ్ ఫ్యామిలీ మొత్తం అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య చేతిని పట్టుకొని ఆరాధ్య ఒక్కసారిగా ఈ పెళ్లి వేడుకలలో తలుక్కుమన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి గాగ్రా ధరించినటువంటి ఈ తల్లి కూతుర్లిద్దరూ ఒకే విధంగా కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు అసలు ఏంటి ఇక్కడ ఉన్నది ఆరాధ్యనా అంటూ షాక్ అవుతున్నారు.

ఇదివరకు ఈమె హెయిర్ స్టైల్ ఒకలా ఉండేది అయితే ప్రస్తుతం తన హెయిర్ స్టైల్ పూర్తిగా మార్చేయడమే కాకుండా చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు ఒకప్పుడు టీనేజ్ లో ఐశ్వర్యారాయ్ ఎలాగైతే ఉండేదో ఇప్పుడు ఆరాధ్య అలాగా ఉన్నారు. ఈ విధంగా ఐశ్వర్య తన అందంతో తన తల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పాలి.

అచ్చం ఐశ్వర్యలాగే..
ఈ విధంగా ఈ పెళ్లి వేడుకలలో ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యను చూసిన తర్వాత అందరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత అందంగా ఆరాధ్య ఉన్నారా అసలు గుర్తుపట్టలేకపోతున్నాము ఈమె కనుక ఇండస్ట్రీలోకి వస్తే తల్లికి మించిన క్రేజ్ సొంతం చేసుకుంటుంది అంటూ పలువురు ఆరాధ్య లేటెస్ట్ లుక్స్ పై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ramcharan: ఇడ్లీ వడ అంటూ చరణ్ ను అవమానించిన బాలీవుడ్ హీరో.. ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్?

Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన తన భార్య ఉపాసనతో కలిసి అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ముగ్గురు కలిసి వేదికపై నాటు నాటు పాటకు స్టెప్పులు వేశారు అయితే వేదికపై నుంచి ఈ హీరోలు రామ్ చరణ్ ని పిలిచి మరి నలుగురు కలిసి డాన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇకపోతే షారుఖ్ ఖాన్ వేదికపై నుంచి రామ్ చరణ్ ను పిలిచేటప్పుడు ఇడ్లీ వడ అంటూ ఆయనని ఉద్దేశించి పిలిచారు. దీంతో రాంచరణ్ ఫీలవుతూ స్టేజ్ పైనుంచి దిగిపోయారని స్వయంగా ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ షారుక్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ పై అసూయ..
బాలీవుడ్ హీరోలను పావు బాజీ వడపావ్ అని పిలిస్తే ఫీలవుతారు కదా. సరదాగా పిలిచిన ఇలా ఒక హీరోని అవమానించడం సరైనది కాదు అంటూ కొందరు కామెంట్లు చేయగా, మరికొందరు టాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంతో బాలీవుడ్ హీరోలు ఈ విధంగా అక్కసు వెళ్ళకక్కుతున్నారు అంటూ షారుక్ ఖాన్ వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Allu Arjun: అల్లు అర్జున్ కి ఆ హీరో అంటే అంత ఇష్టమా… హీరో ఎవరంటే?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయింది.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోయింది. ఇక ఈ సినిమాలో ఈయన నటనకు నేషనల్ అవార్డు కూడా వరించింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మొట్టమొదట నేషనల్ అవార్డు అందుకున్నటువంటి హీరోగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ కి ఒక హీరో అంటే చాలా ఇష్టం అని తెలుస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఆ హీరోకి అల్లు అర్జున్ డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పాలి.

అమితాబ్ అంటే అంత ఇష్టమా…
ఇక అల్లు అర్జున్ అంతలా అభిమానించే ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు బాలీవుడ్ బిగ్ బి నటుడు అమితాబ్ బచ్చన్ అంటే అల్లు అర్జున్ కి చాలా ఇష్టమని ఆయనే తన ఫేవరెట్ హీరో అంటూ ఓ సందర్భంలో వెల్లడించారు. జంజీర్ మూవీ అంటే చాలా ఇష్టం అంటూ ఈయన చెప్పడంతో అమితాబ్ బచ్చన్ ను అభిమానించే వారు కూడా బన్నీ వ్యాఖ్యలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Sunny Deol: రామాయణంలో హనుమంతుని పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్నారా.. ఇందులో నిజమెంత?

Sunny Deol: బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ గురించి మనందరికీ తెలిసిందే. మొదటి వరకు వరుసగా సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ డియోల్ ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నారు.. ఇప్పుడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. గత ఏడాది విడుదల అయిన గదర్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత సన్నీ డియోల్ డిమాండ్ మరింత పెరిగింది. దీంతో ఇప్పుడు సన్నీ డియోల్ కీ వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న రామాయణం సినిమాలో సన్నీడియోల్ కు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటించేందుకు సన్నీ డియోల్ అంగీకరించినట్లు పింక్‌విల్లా నివేదించింది. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో మాత్రం భారీ హైప్ నెలకొంది. మరోవైపు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉపయోగించి రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి ఎలా ఉంటారు ? అంటూ ఫోటోస్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అందులో భాగంగానె ఈ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఈ రామాయణ సినిమా చాలా భాగాలుగా రూపొందించనున్నారట. ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటించనున్నారని టాక్ నడుస్తుంది.

హనుమంతుడిగా సన్నీ డియోల్..

అలాగే ఇప్పుడు హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆంజనేయుడి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ పాత్రకు నటీనటులు ఎంపిక విషయంలో చిత్రయూనిట్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే విభీషణుడి పాత్ర కోసం విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయాలపై పూర్తి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Karan Johar: సౌత్ స్టార్ తో సినిమా చేయబోతున్న కరణ్ జోహార్.. నెట్టింట ట్వీట్ వైరల్?

Karan Johar: బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాలీవుడ్ లో పలు సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, లవ్ స్టోరీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. అలాగే అడియన్స్ కు కావాల్సిన సినిమాలను అందించడంలో ముందుంటారు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ లాంటి షోల ద్వారా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలకు ఎక్కువగా వల్గర్ బోల్డ్ ప్రశ్నలు వేస్తూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చారు.

ఎక్కువ శాతం ఈయన బోల్డ్ విషయాలలోనే సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు. కాగా ఇక గత ఏడాది రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ సినిమాతో మరో హిట్ అందుకున్నారు కరణ్ జోహార్. రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ ప్రేథ కథ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఇక ఇప్పుడు కొత్త ఏడాది మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు కరణ్. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని కూడా రాసుకొచ్చారు. ఆ పోస్టులో తాను నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టు గురించి తెలిపారు. ఇంతకీ ఆ పోస్టులో ఏముంది అన్న విషయానికి వస్తే.. ఇది సినిమా ప్రకటన కాదు. కానీ ఇది సహకారంతో మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ సినిమా కోసం గత సంవత్సరం నుండి పని చేస్తున్నాము. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి వివరాలను చివరి వరకు రహస్యంగానే ఉన్నాయి.

ఆ విషయం చిత్ర బృందంకి తెలియదు..

ఈ సినిమాతో తెరంగేట్రం చేయనున్న దర్శకుడి ఉద్దేశం కూడా అదే కావడంతో చిత్రబృందానికి కూడా ఈ విషయం తెలియలేదు అని రాసుకొచ్చారు. అలాగే మరో మూడు ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో నటీనటులను అంచనా వేయాలని అభిమానులను కోరాడు. వారిలో ఒకరు సౌత్ సూపర్ స్టార్. ఇటీవల పవర్ ఫుల్ పాన్ ఇండియా సినిమాలో నటించారు. తన టాలెంట్, మోషనల్ ఎనర్జీతో అభిమానులను ఆకట్టుకుంటున్న అభిమాన హీరోయిన్. తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అరంగేట్రం చేస్తున్న నటుడు అతని ప్రతిభ అసాధారణమైనది. తన వృత్తి కోసం చాలా కష్టపడుతున్నాడు. అంటూ రాసుకొచ్చాడు కరణ్. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఆ పోస్టుని చూసిన నెటిజన్స్ సౌత్ సూపర్ హీరో ఎవరు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/p/C2oxEbjI42d/?utm_source=ig_embed&ig_rid=4f12c8c6-3075-4876-84b1-443e061044b2

Katrina Kaif: మరొకసారి డీప్ ఫేక్ వీడియోకు బలైన కత్రినా కైఫ్.. నెట్టింట వీడియో వైరల్?

Katrina Kaif: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఏఐ ఫొటోస్ వీడియోస్ తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. హీరో హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ సహాయంతో నెట్టింట ఎన్నో మ్యాజిక్స్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే శోభన్ బాబు, మహానటి సావిత్రి ఏఐ వీడియోస్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. అయితే కొందరు ఆకతాయిలు ఈ టెక్నాలజీని మరో కోణంలో ఉపయోగిస్తున్నారు. పలువురు స్టార్ నటీనటుల ముఖాలతో అసభ్యకరమైన వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు.

అయితే గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో మనందరికి తెలిసిందే. ఆ వీడియో తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో సంచలనం సృష్టించింది. ఆ విషయంపై టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందించారు. అయితే ఆ విషయంపై సీరియస్ గా స్పందించిన పోలీసులు ఎట్టకేలకు రష్మిక డీప్ ఫేక్ వీడియోను షేర్ చేసిన వ్యక్తి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఒక్క రష్మిక ఫొటోస్ మాత్రమే కాకుండా అలియా భట్, నోరా ఫతేహీ, సోనూ సూద్, కత్రినా కైఫ్ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు టాలీవుడ్ తారల డీప్ ఫేక్ వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి.

అయితే తమ డీప్ ఫేక్ వీడియోస్ గురించి స్పందిస్తూ.. ఇలాంటి వీడియోస్ నమ్మవద్దని అభిమానులకు తెలియజేశారు. కానీ ఇప్పుడు మరోసారి డీప్ ఫేక్ వీడియోకు బలయ్యింది కత్రినా కైఫ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ మరో డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆమె అనర్గళంగా టర్కిష్ మాట్లాడుతూ కనిపించింది. నిజానికి ఈ వీడియో 2014లో హృతిక్ రోషన్, కత్రినా కలిసి నటించిన బ్యాంగ్ బ్యాంగ్ మూవీని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలోనిది. ఈ వీడియోలో కత్రినా టర్కిష్ మాట్లాడుతున్నట్లు డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది.

కత్రినా డీప్ ఫేక్ వీడియో వైరల్..

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. టవల్ ఫైట్ సన్నివేశంలోని స్టిల్స్ డీప్ ఫేక్ ద్వారా మార్ఫింగ్ చేశారు. అయితే కొన్ని గంటల్లోనే రష్మిక డీప్ ఫేక్ వీడియోస్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ నుంచి తొలగించారు. మరి రోజురోజుకీ నేటిజన్స్ ఆకతాయిలా ఆగడాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. దీంతో చాలామంది ఈ విషయం పట్ల అధికారులు కాస్త సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని భావిస్తూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/reel/C1J1UvqMBNh/?utm_source=ig_embed&ig_rid=ded71047-d429-4562-88dc-d3d2cd550188

Janhvi kapoor: చిన్నప్పుడు దొంగతనం చేస్తే అమ్మ తెలుగులోనే తిట్టేది.. జాన్వీ కపూర్ కామెంట్స్ వైరల్!

Janhvi kapoor: జాన్వీ కపూర్ పరిచయం అవసరం లేని పేరు దివంగత నటి శ్రీదేవి వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే నటిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. అయితే దేవర సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఎన్టీఆర్ హీరోగా రాబోతున్నటువంటి ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ అందుకున్నటువంటి ఈమె ఇటీవల కాలంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జాన్వీ కపూర్ చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

తాను చిన్నప్పుడు అమ్మ గదిలోకి వెళ్లి అమ్మ వస్తువులను దొంగతనం చేసేదాన్ని ముఖ్యంగా లిప్ స్టిక్స్ తన పాకెట్ లో పెట్టుకొని బయటకు వస్తూ ఉండేదాన్ని అమ్మ చూసి నీ పాకెట్స్ చూపించు అంటే నోమమ్మా అంటూ నేను చెప్పేదాన్ని. అప్పుడు అమ్మ నన్ను నా కొడకా అంటూ తిట్టేదని జాన్వీ కపూర్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎమోషనల్ అయినా జాన్వీ..

ఇలా చిన్నప్పుడు ఈమె చేసినటువంటి చిలిపి పనులు దొంగతనాలు గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవి మరణించిన తర్వాత జాన్వీ కపూర్ చాలా బాగా తన తల్లిని మిస్ అవుతుందని తెలుస్తుంది. ఈమె ప్రతిసారి తన తల్లిని తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు కూడా చేస్తూ ఉంటారు.

Animal Movie: యానిమల్ సినిమాలో న్యూడ్ పాత్రలో నటించిన తృప్తి దిమ్రి విరాట్ కోహ్లీ చెల్లెలని మీకు తెలుసా?

Animal Movie: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్స్ గా కొనసాగుతూ ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రమే ఎన్ని సినిమాలలో నటించిన రాణి స్టార్ డం ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ సెలబ్రిటీలుగా మారిపోతూ ఉంటారు. అలాంటి ఓవర్ నైట్ స్టార్ సెలబ్రెటీగా మారినటువంటి వారిలో తృప్తి దిమ్రి ఒకరు.

ఈమె యానిమల్ సినిమాలో హీరో రణబీర్ కపూర్ తో కలిసి న్యూడ్ సన్నివేశాలలో నటించారు. తృప్తి ఇదివరకు పలు సినిమాలలో నటించిన రాని గుర్తింపు ఇప్పుడు యానిమల్ సినిమా ద్వారా వచ్చిందని చెప్పాలి. ఈ సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ సెలబ్రెటీగా మారిపోయినటువంటి ఈమె పేరు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మారు మోగిపోతుంది.

ఇకపోతే ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు గురించి నేటిజన్స్ ఆరా తీయగా ఈమె విరాట్ కోహ్లీ కి చెల్లెలు అవుతుంది అనే విషయం తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. తృప్తి విరాట్ కోహ్లీకి చెల్లెలు కావడం ఏంటి అంటూ షాక్ లో అభిమానులు ఉన్నారు. మరి విరాట్ కోహ్లీకి ఈమె చెల్లెలు ఎలా అవుతుంది అనే విషయానికి వస్తే…

అనుష్క శర్మ సోదరుడు కాబోయే భార్య..

తృప్తి గతంలో బుల్ బుల్ అనే సినిమాలో నటించారు .ఈ సినిమాకు నిర్మాత కర్నేష్ శర్మ స్వయంగా అనుష్క శర్మ సోదరుడు కావడం విశేషం ఇక ఈ సినిమా సమయంలో తృప్తి కర్నేష్ మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తుంది. త్వరలోనే వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలా కర్నేష్ స్వయంగా విరాట్ కోహ్లీకి బావ కావడంతో ఆయన భార్య విరాట్ కు చెల్లెలు అవుతుందంటూ వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Animal Movie: యానిమల్ సినిమా స్టోరీ లైన్ ఆ మూవీ కాపీనా… అడ్డంగా దొరికిపోయిన సందీప్ రెడ్డి ?

Animal Movie: అర్జున్ రెడ్డి సినిమా ద్వారా రాత్రికి రాత్రి స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగ త్వరలోనే బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన్న నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ కనుక చూస్తే ఈ సినిమా తండ్రీ కొడుకుల మధ్య నేపథ్యంలో కొనసాగుతుందని తెలుస్తుంది.

ఈ సినిమా ట్రైలర్ కనుక చూస్తే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయని చెప్పాలి. అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తే కనుక ఎక్కడో చూసాము అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలగక మానదు. ఈ సినిమా ట్రైలర్ వెంకటేష్ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ధర్మచక్రం సినిమాను తలపిస్తుంది. అచ్చం ఈ సినిమా కూడా తండ్రి కొడుకుల మధ్య ఉన్న రిలేషన్ నేపథ్యంలో రాబోతోంది. ఇక ఆ సినిమాలో వెంకటేష్ నటించిన విధంగానే ఈ సినిమాలో కూడా రణబీర్ యారిగెంట్ యాటిట్యూడ్‌తో కనిపించారు.

ధర్మచక్రం సినిమా కాపీనా..

ఇలా సందీప్ రెడ్డి ధర్మచక్రం సినిమా స్టోరీ లైన్ ద్వారానే యానిమల్ సినిమా స్టోరీ సిద్ధం చేశారని స్పష్టంగా అర్థమవడంతో పలువురు నెటిజెన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ భారీ స్థాయిలో సందీప్ రెడ్డి పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా సందీప్ రెడ్డి అడ్డంగా బుక్ అవడంతో ఈయన పట్ల భారీ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరి ఈ కాఫీ ఇష్యూపై సందీప్ రెడ్డి స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.