Tag Archives: bollywood

శిల్పా శెట్టి నిద్రపోయాక తన చెల్లెలితో..నైట్ పార్టీలు చేసుకున్న రాజ్ కుంద్రా.. బయటపడుతున్న నిజాలు!

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేస్ హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ చేస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు రావడంతో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను ఈనెల 19న అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు కేసు గురించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.

రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో తన భార్య శిల్పాశెట్టికి కూడా ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు ఆమెను కూడా విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా తన కుటుంబ విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

తాజాగా రాజ్ కుంద్రా శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి పాల్గొన్న కపిల్ శర్మ ఇంటర్వ్యూ వీడియో ఒకటి బయట పడింది.ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా శిల్పా శెట్టి సోదరి రాజ్ కుంద్రా మధ్య ఉన్న పలు రహస్యాలు బయటపడ్డాయి.ఈ వీడియోలో భాగంగా రాజ్ కుంద్రా రాత్రి శిల్పాశెట్టి నిద్ర పోయిన తరువాత తన సోదరితో కలిసి నైట్ పార్టీలకు వెళ్లేవాళ్ళమని తెలిపారు. అలాగే శిల్పాశెట్టి తన వివాహం జరిగినప్పుడు షమితా శెట్టి నెలరోజులపాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన విషయం కూడా బయటపడింది.

శిల్పాశెట్టి సోదరితో కలిసి పార్టీలకు వెళ్లడం విషయంపై శిల్పా శెట్టి స్పందిస్తూ…రాజ్‌.. శెట్టి సోదరీమణులతో ప్యాకేజీ ఒప్పందం కుదుర్చుకున్నాడనీ తెలుపగా ఆ సమయంలో రాజ్ కుంద్రా తన వైపు చూస్తూ తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేననీ చెప్పడంతో తన సోదరి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు అంటూ స్పందించింది. ఇలా వీరందరి మధ్య ఎంతో హాస్యాస్పదంగా సాగిన ఈ వీడియో ప్రస్తుతం అనేక అనుమానాలకు దారి తీయడం గమనార్హం. అయితే ఈ విచారణలో భాగంగా మరెన్ని విషయాలు బయటపడతాయో తెలియాల్సి ఉంది.

శ్రీయ పాత్రలో రెజీనా.. బాలీవుడ్ లో అవకాశం?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ జక్కన్న దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం “ఛత్రపతి”. 2005వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ విజయంగా నిలిచింది. సుమారు 16 సంవత్సరాల తర్వాత ఈ సినిమా తిరిగి బాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

“ఛత్రపతి” రీమేక్ సినిమా ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళి సమక్షంలో ఈ సినిమా ఎంతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. “ఛత్రపతి” సినిమాను రీమేక్ ను వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ సరసన హీరోయిన్ పాత్రలో నటించడం కోసం చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించడానికి రెజీనా
క‌సాండ్రా పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి “ఏక్ ల‌డ్‌కీ కో దేఖా తో ఐసా ల‌గా” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక “ఛత్రపతి”సినిమాకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే తనకు ఇది రెండవ బాలీవుడ్ చిత్రం అని చెప్పవచ్చు.

ఒంటిపై నూలుపోగు లేకుండా నెట్టింట్లో రచ్చ చేస్తున్న.. ప్రభాస్ హీరోయిన్!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా అకౌంట్ ఓపెన్ చేసి తమ అందాలను ఆరబోస్తూ కుర్రకారుల మతిపోగొడుతున్నారు. ఈ విధంగా తమ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నెట్టింట్లో తెగ రచ్చ చేస్తున్నారు. ఈ విధంగా అభిమానులకు టచ్లో ఉంటూ వారిని సందడి చేసే వారిలో బాలీవుడ్ బామ జాక్వెలిన్ ముందు వరుసలో ఉంటారు.

ఈ క్రమంలోనే ఈ బ్యూటీ కొన్నిసార్లు హద్దులు మీరి ఫోటో షూట్లను జరుపుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఫోటోషూట్ జరుపుకున్న ఈమె ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిజానికి శ్రీలంకకు చెందిన ఈ బ్యూటీ పేరున్న మోడల్ గా ఇండియాలో కూడా సరైన గుర్తింపును సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అలాదిన్’తో బాలీవుడ్ లోకి ఎంటర్ అయి ఆ తర్వాత పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది. కేవలం బాలీవుడ్ హీరోలతో మాత్రమే కాకుండా టాలీవుడ్ హీరోలతో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన సాహో సినిమాలో
‘బ్యాడ్ బాయ్’అనే స్పెషల్ సాంగ్ లో ప్రభాస్ తో సందడి చేసింది. అదేవిధంగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న “హర హర వీరమల్లు” చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒంటిపై ఒక్క నూలుపోగు కూడా లేకుండా కేవలం ఒక టవల్ అడ్డుగా పెట్టుకుని తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలను ఈ బ్యూటీ షేర్ చేయడంతో ప్రస్తుతం అవి నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

చిన్నారి పెళ్లికూతురు బామ్మ సురేఖా సిక్రీ కన్నుమూత!

బుల్లితెరపై ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకుల మదిలో మెదులుతుంది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో బామ్మ పాత్రలో నటించిన సురేఖా సిక్రీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సీరియల్లో బామ్మ తన మనవడికి సపోర్ట్ చేస్తూ ఎప్పుడు ఆనంది పై కోప్పడే పాత్రలో మనకు కనిపిస్తారు.

ఈ విధంగా చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా ఎంతోమందిని ఆకట్టుకున్న సురేఖా సిక్రీ తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా 75 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగానే సురేఖా సిక్రీ ముంబైలో తుది శ్వాస విడిచారు.సురేఖా సిక్రీ కేవలం సీరియల్ లో మాత్రమే కాకుండా హిందీ సినిమాల్లో కూడా నటించి అందరి చేత ప్రశంసలు పొందారు.

సురేఖా సిక్రీ 2018 సంవత్సరంలో హిందీ చిత్రం “బధాయ్ హో” అమ్మమ్మ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి అందరి చేత ప్రశంసలు పొందారు. ఈ చిత్రంలో నటించినందుకు గాను ఈమెకు ఉత్తమ సహాయనటిగా జాతీయ చిత్ర అవార్డును దక్కించుకున్నారు. ఇక చివరి సారిగా సురేఖా సిక్రీ జోయా అక్తర్ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ “ఘోస్ట్ స్టోరీస్” లో చివరిసారిగా సందడి చేశారు. అనారోగ్యం కారణంగా ఇతర సినిమాలు సీరియల్స్ లో నటించని సిక్రీ నేడు కన్నుమూశారు. ఈమె మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేశారు.

చావు బతుకుల మధ్య ఆ సీరియల్ నటి.. ఆమె పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు!

సాధారణంగా సెలబ్రిటీలు అంటే వారి దగ్గర ఎంతో డబ్బులు ఉంటాయి. వారి జీవితం చాలా బాగుంటుందని భావిస్తాము.కానీ సినిమా సెలబ్రిటీలు అయిన ఎంతోమంది చివరికి ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని చావుబతుకుల మధ్య ఎంతో మంది సహాయ సహకారాలు కోరడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా బుల్లితెర నటితీవ్రమైన అనారోగ్య సమస్యతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ సమయంలో దాతలు ఎవరైనా తనకు సహాయం చేయాలి అంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.

హిందీ సీరియల్స్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి అనయా సోని. నామ్‏కరన్, క్రైమ్ పెట్రోల్ లాంటి సీరియల్స్‌తో ఈమె బాగానే గుర్తింపు సంపాదించుకున్న నటి ఆర్థికంగా ఎంతో మంచి స్థాయిలో ఉండేది. ఈ క్రమంలోనే ఈమె రెండు కిడ్నీలు పాడవడం తో తన సొంత డబ్బులతో వైద్యం చేయించుకుంది. అయితే ప్రస్తుతం తన చికిత్స కోసం డబ్బులు లేకపోవడంతో దాతల సహాయాన్ని కోరుతూ కన్నీటిపర్యంతమయ్యారు.

ప్రస్తుతం ఈ నటి ముంబైలోని హూలీ స్పిరిట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.రెండు కిడ్నీలు పాడవడంతో తన తండ్రి కిడ్నీ దానం చేయగా అది కూడా పాడైందని ప్రస్తుతం దాతల సహాయంతో ఎంతో అవసరమని, ప్రస్తుతం తనకి కిడ్నీ మార్పిడి తప్ప వేరే అవకాశం లేదని ..అందుకు చాలా డబ్బులు అవసరం అవుతాయని వాపోయింది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో తనకు డయాలసిస్ జరగాల్సి ఉందని. కానీ కిడ్నీ దాత కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతూ తన వివరాలను ట్వీట్ చేసింది.Name :- Sheetal t . soni
Bank name :- Axis bank
Branch:- malad west
Ac no. 915010026602327
IFS code:- UTIB0000062
Pan no . :- EJYPS7926A
upi I’d :- sheetal.soni2@axisbank అంటూ తన వివరాలను తెలుపుతూ దాతలు తనకు సహాయం చేయాల్సిందిగా కోరింది.

ముద్దు సీన్స్ చేసేప్పుడు అలాంటి ఫీలింగ్.. నటి కామెంట్స్ వైరల్!

సాధారణంగా సినిమాలలో నటించేవారు ఎన్నో రకాల సన్నివేశాలలో వివిధ రకాల హావ భావాలను వ్యక్త పరుస్తూ నటించాల్సి ఉంటుంది. అయితే ఎన్నో సినిమాలలో ముద్దు సీన్స్ ఉంటాయి. ఈ విధమైనటువంటి సీన్స్ ఉన్నప్పుడు సదరు నటీనటులు వారి ముఖకవళికలను, హావభావాలను వ్యక్తపరుస్తూ నటించడం కాకుండా జీవించాల్సి ఉంటుంది.మరి ఈ విధమైనటువంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తాజాగా బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా వెల్లడించారు.

“లేడీస్‌ వర్సెస్‌ రికీ భాల్‌” సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమాలో అద్భుతమైన నటన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఆ తర్వాత ఇండస్ట్రీలో పలు అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. తన కెరీర్లో ఎన్నో ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకొని ఎన్నో వాణిజ్య ప్రకటనలకు ప్రచారకర్తగా వ్యవహరించిన పరిణితి చోప్రా తాజాగా సినిమాలలో ఉండే ముద్దు సీన్లపై స్పందించారు.

పరిణితి చోప్రా హీరోయిన్ గా నటించిన ఇషక్ జాదే, శుద్ దేశీ రొమాన్స్, హస్సీ తో పాసి వంటి పలు సినిమాల్లో రొమాంటిక్ సీన్స్‌లో జీవించందని చెప్పాలి. ముఖ్యంగా ముద్దు సీన్లలో ఈమె రొమాన్స్ అదిరిపోయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై స్పందించిన పరిణితి చోప్రా ఈ విధమైనటువంటి రొమాంటిక్ సీన్లు చిత్రీకరించే సమయంలో కట్ అంటే కట్ అని అంటోంది. జస్ట్ సినిమా కోసమే చేస్తాం.. అంతే కానీ అలాంటి సన్నివేశాలపై ఆ తర్వాత ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని తెలిపారు.

సినిమాల చిత్రీకరణ సమయంలో ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు చిత్రీకరణ పూర్తిగా యాంత్రికంగా ఉంటుందని అలాంటప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవని తెలిపారు. ఈ విధంగా ముద్దు సీన్లపై పరిణితి చోప్రా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కరోనా నుంచి కోలుకున్న కంగనా.. ఇక కాంట్రోవర్సీలే?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద ట్వీట్ ద్వారా వార్తల్లో నిలుస్తూ ట్రెండ్ అవుతుంటారు.అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాలుస్తున్నడడంతో సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఈ కరోనా బారిన పడుతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా రంగంలో ఎంతో మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి ఎంతో మంది మరణిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా కరోనా బారిన పడినట్టు మే 8న తెలియజేశారు. ఇంట్లో ఉంటూనే చికిత్స తీసుకున్న కంగన తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షలలో నెగిటివ్ వచ్చినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా కంగనా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ చేశారు. ”నేను ఇంట్లోనే ఉండి కరోనా నుంచి ఎలా కోలుకున్నానో రాయాలని ఉంది. కానీ కరోనాను తక్కువ చేసి మాట్లాడితే కొందరు బాధపడతారు” అంటూ పోస్ట్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత కొంతకాలం నుంచి తన చేస్తున్నటువంటి ట్వీట్స్ ఎంతో వివాదాస్పదంగా ఉండడంతో ట్విట్టర్ ట్వీట్స్ ను బ్లాక్ చేసిన సంగతి మనకు తెలిసిందే. గతంలో కూడా కరోనా వైరస్ ని ఉద్దేశించి అది కేవలం చిన్న ఫ్లూ అని ట్వీట్ చేయడంతో ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ తొలగించిన సంగతి తెలిసిందే. ఈమె చేసే ట్వీట్స్ ట్విట్టర్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని భావించిన ట్విట్టర్ టీమ్ ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను శాశ్వతంగా బ్యాన్ చేసింది.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కంగనా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 23న విడుదల కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

ప్లాప్ టాక్ తో కోట్లు కొల్లగొడుతున్న సల్మాన్ ఖాన్ ‘రాధే’..!!

దేశ వ్యాప్తంగా కోవిడ్19 విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే.. ప్రతీ రోజు కొన్ని లక్షల కేసులు నమోదవుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా ‘రాధే’ ను గురువారం రంజాన్ పండుగ సందర్భంగా జీప్లెక్స్, జీ5 ఓటీటీలతో పాటు రెండు డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే దేశంలో లాక్ డౌన్ షరతుల్లేని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ‘రాధె’ను థియేటర్లలో రిలీజ్ చేశారు.

వాటి ద్వారా వచ్చిన వసూళ్లు నామమాత్రం. ఇక విదేశీ మార్కెట్లలో అవకాశం ఉన్న చోట భారీగానే సినిమాను రిలీజ్ చేశారు.ఐతే సినిమాకు డిజాస్టర్ టాక్ రావడం ప్రతికూలం అయింది. తొలి రోజు ‘రాధె’ విదేశీ మార్కెట్ల నుంచి రూ.5 కోట్ల మేర మాత్రమే వసూళ్లు రాబట్టినట్లు అంచనా. విదేశాల్లోనూ కొవిడ్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ వసూళ్లు మరీ తక్కువ కాదని..పర్వాలేదని అంటున్నారు.

ఇక ఇండియాలో ఈ సినిమా తొలి రోజు ఏ మేర కలెక్షన్లు రాబట్టిందన్నది ఆసక్తికరం.జీ ఓటీటీల్లో ‘రాధె’ సినిమాను తొలి రోజు మొత్తంగా 42 లక్షల మంది చూసినట్లు ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. అదే నిజమైతే.. ఈ మార్గంలో సినిమా తొలి రోజు వసూళ్లు రూ.100 కోట్లను దాటిపోయినట్లే. ఎందుకంటే ఈ చిత్రానికి ఓటీటీలో నిర్ణయించిన టికెట్ రేటు రూ.249..ఈ లెక్క ప్రకారం42 లక్షల మంది తలో 249 రూపాయలు వెచ్చించారంటే వసూళ్లు 104 కోట్లకు పైగానే ఉండాలి.

ఐతే తొలి రోజు ఉన్న ఊపు రెండో రోజుకు కచ్చితంగా ఉండదు. పైగా సినిమాకు పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. మరి రెండో రోజు వసూళ్ల సంగతేంటో చూడాలి. ఐతే రాధె టికెట్ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయానికి తోడు జీ వాళ్లకు పెద్ద ప్రయోజనమే కలిగింది ‘రాధె’ ద్వారా. ఆల్రెడీ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు తోడు కొత్తవాళ్లు ‘రాధె’ కోసం ‘జీ’ ఓటీటీలను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. రాధెతో కలిసి కాంబో ఆఫర్ రూపంలో వార్షిక సబ్‌స్క్రిప్షన్ 499కి అందించింది జీ. ఈ ఆఫర్ వాడుకున్న వాళ్లు లక్షల్లోనే ఉంటారు..అలా ఎటు చూసినా ఓటీటీ వారికి ఈ సినిమా ద్వారా మంచి లాభమే చేకూరిందని చెప్పాలి…!!

ప్రజలకే కాదు.. సెలబ్రటీలకు సోనూనే దిక్కు?

కరోనా దేశవ్యాప్తంగా మొదటి దశ వ్యాపించిన తరుణంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలోనే వలస కూలీలు ఎక్కడివారక్కడ ఉండిపోవడంతో ఎంతోమంది కాలినడకన తమ గ్రామాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటుడు సోనుసూద్ తన వంతు సాయంగా ఎంతోమంది వలస కార్మికులను తన సొంత ఖర్చులతో సొంతగూటికి చేర్చి అందరి దృష్టిలో రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. అప్పటి నుంచి ఎవరైనా కష్టంలో ఉన్నానని చెబితే వెంటనే వారి కష్టాన్ని తీర్చే ఆపద్బాంధవుడిలా ఉండేవాడు.

ప్రస్తుతం రెండవ దశ వ్యాపిస్తున్న నేపథ్యంలోనే ఎంతో మందికి , రాష్ట్రాలతో సంబంధం లేకుండా అవసరం ఉన్న వారందరికీ సహాయం చేస్తూ వస్తున్నారు.ప్రస్తుతం ఆసుపత్రిలో తీవ్ర కొరతగా ఉన్న ఆక్సిజన్, బెడ్లు వంటి సౌకర్యాలను సమకూర్చడంలో కూడా సోనుసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు. ఈ కరోనా సమయంలో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలు సహాయం కోసం సోనుసూద్ వైపు చూస్తున్నారు. కేవలం సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం అతని సహాయం కోరుతున్నారు.

ఇటీవల సురేష్ రైనా సైతం సోనూసూద్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ సాయం అందుకోగా లేటెస్ట్‌గా మరో ఇండియన్ క్రికెటర్‌కు సైతం అడగ్గానే సాయం చేశాడు సోనూసూద్.స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు తెలిసినవారికి ఒకరికి రెండిసివర్ ఇంజెక్షన్ కావాలని దండం పెడుతూ సహాయం కోరగా.. సోనుసూద్ ను అడగాలంటే ఫ్యాన్స్
ట్యాగ్ చేశారు.

ఈ క్రమంలోనే సోను స్పందించి కర్ణాటకలో ఇంజక్షన్ అవసరమైన వారికి తప్పకుండా అందుతుందని తెలుపగా అందుకు హర్భజన్ సింగ్ సోనుసూద్ కి ధన్యవాదాలు తెలుపుతూ, దేవుడి ఆశీస్సులు వల్ల మీరు బాగుండాలని హర్భజన్ సింగ్ ప్రార్థించారు. ఈ విధంగా సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అడిగిన వారికి సహాయం చేస్తూ, దేశంలోనే రియల్ హీరో గా పేరు సంపాదించుకున్నారు.

ఆదుకోమని విజ్ఞప్తి చేసిన అగ్ర దర్శకుడు.. సహాయం చేసిన సోనూసూద్..!!

ఆపదలో ఉన్న వారు ఎవరు అనేది కాకుండా.. అవసరాన్ని గుర్తించి అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అందరి గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి సోనూ సూద్. ఒకటి కాదు రెండు కాదు వేల కొలది సాయాలు చేసి ఎందరో ప్రాణాలు కాపాడారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ సాయాన్ని కూడా తీర్చేచి ఆపద్భాందవుడిలా మారారు. మెహర్ రమేష్ తన సన్నిహితుల కోసం కొన్ని మందులు, ఇంజక్షన్‌ల కోసం చాలా ప్రయత్నించారట. అవి ఎక్కడా దొరకలేదని, ఇక నువ్వే దిక్కని సోనూ సూద్‌ను మెహర్ రమేష్ వేడుకున్నారు.


మెహర్ రమేష్ ట్వీట్‌పై స్పందించిన సోనూ సూద్.. సోదరా, నువ్వు అడిగిన ప్రతి మందు, ఇంజక్షన్ వచ్చేస్తుంది. ప్రాణాన్ని కాపాడుదాం అంటూ సోనూసూద్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సోనూ సూద్ సాయానికి ఉప్పొంగిపోయిన మెహర్ౌ ఆపదలో ఉన్నవారికి ఆ దేవుడు సోనూ సూద్ లాంటి సోదరుడిని పంపారు. అన్ని మందులను సరైన సమయంలో పంపారు. సోనూ సూద్ ఫౌండేషన్ అద్భుతంగా పని చేస్తుంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు మీకు ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను మెహర్ రమేష్ చెప్పుకొచ్చారు.

అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అందరి గుండెల్లో గూడు కట్టుకుంటున్నారు సోనూ సూద్. ఒకటి కాదు రెండు కాదు వేల కొలది సాయాలు చేసి ఎందరో ప్రాణాలు కాపాడారు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ సాయాన్ని కూడా తీర్చేచి ఆపద్భాందవుడిలా మారారు. మెహర్ రమేష్ తన సన్నిహితుల కోసం కొన్ని మందులు, ఇంజక్షన్‌ల కోసం చాలా ప్రయత్నించారట. అవి ఎక్కడా దొరకలేదని, ఇక నువ్వే దిక్కని సోనూ సూద్‌ను మెహర్ రమేష్ వేడుకున్నారు.

మెహర్ రమేష్ ట్వీట్‌పై స్పందించిన సోనూ సూద్..సోదరా, నువ్వు అడిగిన ప్రతి మందు, ఇంజక్షన్ వచ్చేస్తుంది. ప్రాణాన్ని కాపాడుదాం అంటూ సోనూసూద్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సోనూ సూద్ సాయానికి ఉప్పొంగిపోయిన మెహర్ౌ ఆపదలో ఉన్నవారికి ఆ దేవుడు సోనూ సూద్ లాంటి సోదరుడిని పంపారు. అన్ని మందులను సరైన సమయంలో పంపారు. సోనూ సూద్ ఫౌండేషన్ అద్భుతంగా పని చేస్తుంది. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు మీకు ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానని చెప్పాడు మెహర్ రమేష్…!!