ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేస్ హాట్ టాపిక్ గా మారింది. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ చేస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు రావడంతో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను ఈనెల 19న అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు కేసు గురించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.
రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో తన భార్య శిల్పాశెట్టికి కూడా ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులు ఆమెను కూడా విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా తన కుటుంబ విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
తాజాగా రాజ్ కుంద్రా శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి పాల్గొన్న కపిల్ శర్మ ఇంటర్వ్యూ వీడియో ఒకటి బయట పడింది.ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా శిల్పా శెట్టి సోదరి రాజ్ కుంద్రా మధ్య ఉన్న పలు రహస్యాలు బయటపడ్డాయి.ఈ వీడియోలో భాగంగా రాజ్ కుంద్రా రాత్రి శిల్పాశెట్టి నిద్ర పోయిన తరువాత తన సోదరితో కలిసి నైట్ పార్టీలకు వెళ్లేవాళ్ళమని తెలిపారు. అలాగే శిల్పాశెట్టి తన వివాహం జరిగినప్పుడు షమితా శెట్టి నెలరోజులపాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన విషయం కూడా బయటపడింది.
శిల్పాశెట్టి సోదరితో కలిసి పార్టీలకు వెళ్లడం విషయంపై శిల్పా శెట్టి స్పందిస్తూ…రాజ్.. శెట్టి సోదరీమణులతో ప్యాకేజీ ఒప్పందం కుదుర్చుకున్నాడనీ తెలుపగా ఆ సమయంలో రాజ్ కుంద్రా తన వైపు చూస్తూ తనను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేననీ చెప్పడంతో తన సోదరి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు అంటూ స్పందించింది. ఇలా వీరందరి మధ్య ఎంతో హాస్యాస్పదంగా సాగిన ఈ వీడియో ప్రస్తుతం అనేక అనుమానాలకు దారి తీయడం గమనార్హం. అయితే ఈ విచారణలో భాగంగా మరెన్ని విషయాలు బయటపడతాయో తెలియాల్సి ఉంది.
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…
దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల్లో దగ్గు సిరప్ల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దగ్గు మందులు లేదా…
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ (NEET) పరీక్ష చుట్టూ గత కొంతకాలంగా వివాదాలు, పేపర్ లీక్…