Tag Archives: boyapati sreenu

Akhanda Sequel: అఖండ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన బోయపాటి… సంతోషంలో నందమూరి ఫ్యాన్స్!

Akhanda Sequel: బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటేనే నందమూరి అభిమానులకు పూనకాలు వస్తాయని చెప్పాలి. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగించాయి. అలాంటిది మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అనే విషయం తెలియడంతో నందమూరి అభిమానుల సంతోషానికి అవధులు లేవు.

బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో చివరిగా వచ్చిన చిత్రం అఖండ ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిన మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయంలో నటించి మెప్పించారు.ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలు పై డైరెక్టర్ బోయపాటి శ్రీను స్పందించారు.

తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చినటువంటి స్కంద సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి బాలయ్య కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బోయపాటి శ్రీను మాట్లాడుతూ అఖండ సీక్వెల్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Akhanda Sequel:

ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ ప్రస్తుతం తాను స్కంద హడావిడిలో ఉన్నానని ఈ హడావిడి కాస్త పూర్తి కాగానే అఖండ సినిమా పనులు మొదలవుతాయని తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్లానింగ్స్ జరుగుతున్నాయని త్వరలోనే వీటన్నింటిని అధికారికంగా తెలియజేస్తామని బోయపాటి తెలిపారు.ఇలా బోయపాటి చేసిన ఈ వ్యాఖ్యలు విన్నటువంటి బాలయ్య అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈయన మాటలు బట్టి చూస్తే ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందని తెలుస్తుంది.

Sreeleela: అది నాకు వ్యసనంగా మారిపోయింది… నటి శ్రీ లీల షాకింగ్ కామెంట్స్!

Sreeleela: వెండితెరకు పరిచయమైన అతి తక్కువ సమయంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం అరుడజనుకు పైగా సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఒకరు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమా ద్వారా ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ఇలా ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ద్వారా సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తున్నారు. అలాగే బోయపాటి రామ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా షూటింగ్ పనులలో కూడా ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా సుమారు అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి శ్రీ లీల సరదాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా సినిమాలపై తనకు ఉన్న ఇష్టాన్ని బయటపెట్టారు.

Sreeleela: కెమెరా ముందు ఉండటమే ఇష్టం…


తాను ఇండస్ట్రీలోకి ఇప్పుడిప్పుడే వచ్చాను అయితే తనకు మంచి పాత్రలలో నటించే అవకాశాలు రావాలని మాత్రమే తన కోరుకుంటాను గానీ సినిమా మొత్తం తనపైనే ఆధారపడి ఉండాలని అసలు అనుకోనని తెలియజేశారు. ఇక ఇంట్లో ఖాళీ సమయంలో తనకు ఏమాత్రం పాలు పోదని తనకు ఇంట్లో ఉండటం కన్నా షూటింగ్ లొకేషన్లో ఉండడమే చాలా ఇష్టమని శ్రీ లీల తెలిపారు.తాను ఎప్పుడు కెమెరా ముందు ఉండడమే తనకు ఇష్టం అదే తనకు ఒక వ్యసనంగా మారిపోయిందంటూ ఈ సందర్భంగా సినిమాలపై ఈమెకు ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Venu Thottempudi: షోలేలో అమితాబచ్చన్ లాంటి పాత్ర అన్నారు.. కట్ చేస్తే సీన్లన్నీ లేపేశారు.. దమ్ము సినిమా విషయంలో వేణు షాకింగ్ కామెంట్స్ !

Venu Thottempudi: స్వయంవరం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పలు సినిమాలలో నటుడిగా అలాగే కొన్ని సినిమాలలో సహాయ నటుడిగా కూడా నటించి మెప్పించారు. ఈ విధంగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే ఈయన ఇండస్ట్రీకి దూరమయ్యారు.

చివరిసారిగా ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకేక్కిన దమ్ము సినిమాలో ఒక చిన్న పాత్రలో వేణు సందడి చేశారు. అయితే ఈ సినిమాలో ఈయన మధ్యలోనే చనిపోవడం జరుగుతుంది. తాజాగా రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వేణు మాట్లాడుతూ దమ్ము సినిమా గురించి పలు ఆసక్తికరమైన కామెంట్ చేశారు.

బోయపాటి శ్రీను సినిమా అంటే గుడ్డిగా కథను నమ్మి చేశాను. ఈ సినిమాలో తన పాత్ర షోలే సినిమాలో అమితాబచ్చన్ పాత్ర అని చెప్పారు.ఇక ఈ సినిమా తెరకేక్కిన తర్వాత అందులో నా సీన్లు అన్నీ కట్ చేశారు కేవలం చనిపోయే సినిమా పెట్టారు. షోలే సినిమాలో అమితాబచ్చన్ చనిపోతారు ఇక్కడ నా పాత్ర కూడా చనిపోతుందనీ వేణు తెలిపారు.

ప్రతి ఒక్క పాత్రను గౌరవించాలి…

ఇలా తన సీన్స్ తీసేసారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వేణు తెలిపారు. అయితే ఈ సినిమాలో నటించినందుకు తాను ఏమాత్రం రిగ్రేట్ గా ఫీల్ అవ్వలేదని, ఇదొక జర్నీ’. ఈ జర్నీలో నన్ను వెతుక్కుంటూ వచ్చిన పాత్రల్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. నాకు నచ్చిన పాత్ర రాలేదని నా జర్నీ అక్కడే ఆపలేను కదా అంటూ ఈ సందర్భంగా దమ్ము సినిమాలో తన పాత్ర గురించి వెల్లడించారు.

Akhanda: అఖండ చిత్రబృందం పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

Akhanda: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది అభిమానులు వారి అభిమాన హీరో హీరోయిన్లను అనుసరిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రెటీలు సమాజానికి ఉపయోగపడే వాటి గురించి అవగాహన కల్పించడం వల్ల చాలా మందిలో మార్పు వస్తుందని భావిస్తుంటారు.

Akhanda: అఖండ చిత్రబృందం పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ సినీ కెరియర్ లోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రంగా నిలిచిన అఖండ సినిమా ఒకవైపు థియేట్రికల్ రన్ అవుతున్నప్పటికీ, మరోవైపు ఓటీటీలో కూడా తన హవా కొనసాగిస్తోంది.

Akhanda: అఖండ చిత్రబృందం పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

ఈ క్రమంలోనే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లో అఖండ చిత్ర బృందం పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.బాలకృష్ణ నటించిన ఈ సినిమాలో ఒక సన్నివేశంలో బాలయ్య, హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కారులో ప్రయాణిస్తూ సీట్ బెల్ట్ ధరించి ఉంటారు. ఈ సీన్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు.

ఎల్లప్పుడు సీట్ బెల్ట్ ధరించండి..

ఈ ఫోటోలో హీరో హీరోయిన్ ఇద్దరు సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో..కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించండి ఎంత దూరమైనా ఎవరికి ఏమైనా సీట్ బెల్ట్ ధరించి ప్రయాణం చేయండి అంటూ ట్వీట్ చేశారు. ఇలా బాలకృష్ణ అఖండ సినిమా ద్వారా ఎంతో మంచి విషయాన్ని తెలియజేయడంతో ట్రాఫిక్ పోలీసులు అఖండ చిత్ర బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఏ దర్శకుడు తీసుకోని విధంగా బోయపాటికి రెమ్యూనరేషన్.. ఎంతో తెలుసా?

సినీ పరిశ్రమలో వరుసగా సినిమాలు హిట్ అయితేనే హరోలకు అయినా.. సినీ దర్శకులకు అయినా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో హీరోలు కాస్త బెటర్ అనే చెప్పాలి. ఒక్క సినిమా ఫ్లాప్ అయిందంటే.. తర్వాత సినిమాపై అంతగా ఎఫెక్ట్ చూపకపోవచ్చు. కానీ దర్శకుల విషయానికి వస్తే అలా కాదు.

వరుస సినిమాలు హిట్ కొట్టినా.. మరుసటి చిత్రం ప్లాప్ అయిందంటే.. అతడి వెంట నిర్మాతలు కన్నెత్తి కూడా చూడరు. ధైర్యం చేసి అతడితో సినిమా తీయడానికి అస్సలు ముందుకు రారు. అయితే ఈ అనుభవం బోయపాటి శ్రీనుకు ఎదురైంది. వరుస సినిమాలతో ఊపు మీదున్న బోయపాటికి వినయ విధేయ రామ పెద్ద డిజాస్టర్ అయింది.

దీంతో అతడితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు. అంతక ముందు బోయపాటి సినిమాకు రూ.5కోట్లు తీసుకునేవాడు. కానీ ఒక్క ప్లాఫ్ తో సీన్ రివర్స్ అయిపోయంది. అప్పటి వరకు సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకున్న బోయపాటి.. తాజాగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ స్పష్టిస్తున్న అఖండకు మాత్రం తీసుకోలేదట. ఈ సినిమా రూ.70కోట్లతో రూపొందుతుందని.. ముందుగానే నిర్మాతకు చెప్పాడట.

బడ్జెట్ ఎక్కువవవ్వడం వలన నిర్మాతలు ముందే అనుకున్నంత బడ్జెట్ ఇవ్వలేమని డైరెక్ట్ గా చెప్పినట్లు రూమర్స్ కూడా వస్తున్నాయి. దాని కారణంగానే శ్రీను ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు. సినిమా విడుదల తర్వాత మాత్రం లాభాల్లో షేర్స్ ఇస్తారని సమాచారం. ఇక అఖండ కలెక్షన్ల సునామీలో బోయపాటికి దాదాపు రూ.10 కోట్ల వరకు లాభం రావొచ్చనేది టాక్.

ఎన్టీఆర్ కి జరిగిన వెన్నుపోటు పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య!

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దర్శక నిర్మాతలు ఈ సినిమాకు ఊహించిన దానికంటే రెట్టింపు రెస్పాన్స్ వస్తోంది. బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే సినిమా ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేక్షకులు ఊహించిన విధంగానే అఖండ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు.

డిసెంబర్ 2న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా విజయం దిశగా దూసుకుపోతుంది. ప్రేక్షకులు, బాలయ్య ఫ్యాన్స్ అఖండ సినిమా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. చిత్ర యూనిట్ అదే జోష్ తో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బుల్లితెరపై బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనంఅందరికి తెలిసిందే.

తాజాగా అఖండ చిత్ర యూనిట్ ఈ షోకి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 10న స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ షోకి డైరెక్టర్ బోయపాటి శ్రీను, తమన్, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్ హాజరయ్యారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. బాలయ్య చిత్ర యూనిట్ తో కలిసి చిన్నపిల్లవాడిలా గంతులు వేస్తున్నారు. ప్రగ్యా అందమైన చీరలో మెరిసిపోయింది. బోయపాటి సార్.. బాలకృష్ణ సార్ అని ప్రగ్యా పిలుస్తుండటంతో.. సార్ సార్ ఏంటి బాలయ్య అని పిలువు అని అనగా.. వెంటనే ఓకే బాలా అని అనేసింది ప్రగ్యా జైస్వాల్.

ఇక ఈ ప్రోమో చివర్లో బాలయ్య ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తన తండ్రి ఎన్టీఆర్ కి జరిగిన వెన్నుపోటు ఘటన పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక తప్పుడు ప్రచారం జరుగుతోంది.వెన్నుపోటు పొడిచారని అన్నారు. దీని గురించి మాట్లాడుతుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. నేను ఆయన కొడుకుని అంతేకాక అభిమానుల్లో, ఒకడిని అని చెబుతూ బాలయ్య ఎమోషనల్ అయ్యారు. ఇక శ్రీకాంత్ బోయపాటి అలా ఎమోషనల్ గా చూస్తూ ఉండిపోయారు. ఈ వెన్నుపోటు సంఘటన గురించి బాలయ్య ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అన్నది తెలియాలి అంటే డిసెంబర్ 10 వరకు ఆగాల్సిందే.