సినీ పరిశ్రమలో వరుసగా సినిమాలు హిట్ అయితేనే హరోలకు అయినా.. సినీ దర్శకులకు అయినా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో హీరోలు కాస్త బెటర్ అనే చెప్పాలి. ఒక్క సినిమా ఫ్లాప్ అయిందంటే.. తర్వాత సినిమాపై అంతగా ఎఫెక్ట్ చూపకపోవచ్చు. కానీ దర్శకుల విషయానికి వస్తే అలా కాదు.
వరుస సినిమాలు హిట్ కొట్టినా.. మరుసటి చిత్రం ప్లాప్ అయిందంటే.. అతడి వెంట నిర్మాతలు కన్నెత్తి కూడా చూడరు. ధైర్యం చేసి అతడితో సినిమా తీయడానికి అస్సలు ముందుకు రారు. అయితే ఈ అనుభవం బోయపాటి శ్రీనుకు ఎదురైంది. వరుస సినిమాలతో ఊపు మీదున్న బోయపాటికి వినయ విధేయ రామ పెద్ద డిజాస్టర్ అయింది.
దీంతో అతడితో సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు. అంతక ముందు బోయపాటి సినిమాకు రూ.5కోట్లు తీసుకునేవాడు. కానీ ఒక్క ప్లాఫ్ తో సీన్ రివర్స్ అయిపోయంది. అప్పటి వరకు సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకున్న బోయపాటి.. తాజాగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ స్పష్టిస్తున్న అఖండకు మాత్రం తీసుకోలేదట. ఈ సినిమా రూ.70కోట్లతో రూపొందుతుందని.. ముందుగానే నిర్మాతకు చెప్పాడట.
బడ్జెట్ ఎక్కువవవ్వడం వలన నిర్మాతలు ముందే అనుకున్నంత బడ్జెట్ ఇవ్వలేమని డైరెక్ట్ గా చెప్పినట్లు రూమర్స్ కూడా వస్తున్నాయి. దాని కారణంగానే శ్రీను ఒక్కరూపాయి కూడా తీసుకోలేదు. సినిమా విడుదల తర్వాత మాత్రం లాభాల్లో షేర్స్ ఇస్తారని సమాచారం. ఇక అఖండ కలెక్షన్ల సునామీలో బోయపాటికి దాదాపు రూ.10 కోట్ల వరకు లాభం రావొచ్చనేది టాక్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…