Tag Archives: clarity

Sreemukhi: వయసు పెరుగుతుంది … ప్రెజర్ పెరుగుతుందంటూ పెళ్లి పై ఓపెన్ అయిన శ్రీముఖి?

Sreemukhi: శ్రీముఖి పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రీముఖి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె బుల్లితెరపై వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి శ్రీముఖి పెళ్లి వయసు కూడా దాటిపోతుంది.

ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఈమె పెళ్లి గురించి ఎన్నోసార్లు తనని ప్రశ్నిస్తూ వచ్చారు. తాజాగా ఒక కార్యక్రమంలో భాగంగా ఈమెకు మరోసారి పెళ్లి ప్రశ్న ఎదురయింది. పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారనే ప్రశ్న శ్రీముఖికి ఎదురు కావడంతో ఈమె ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు.

నాకు వయసు పెరుగుతూనే ఉంది పెళ్లి ప్రశ్నలు కూడా తరచూ ఎదురవుతూనే ఉన్నాయి. అయితే మా కుటుంబం నుంచి నాకు ప్రెజర్ ఉందని చాలామంది భావిస్తున్నారు. మా కుటుంబంలో నా పెళ్ళికి ఏ విధమైనటువంటి ప్రెజర్ లేదని శ్రీముఖి తెలిపారు. ప్రస్తుతం నేను కెరియర్ పరంగా చాలా బిజీగా గడుపుతున్నాను. నా ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఇదే విషయం చెబుతున్నారు. నువ్వు నీ వృత్తిలో ముందుకు పయనిస్తూ ఉండు నీకు పెళ్లి చేసుకోవాలన్నప్పుడే చేసుకో అంటూ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని తెలిపారు.

లౌడ్ స్పీకర్…
ప్రస్తుతం నేను మంచి మంచి షోస్ చేస్తున్నానని ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా నాకు లేవని శ్రీముఖి తెలియజేశారు. ఇక నేను మాట్లాడితే అందరూ నన్ను లౌడ్ స్పీకర్ అంటారు. ఒకవేళ నా పెళ్లి కనుక సెట్ అయితే నేనే లౌడ్ స్పీకర్ లాగా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తాను అంటూ శ్రీముఖి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anchor Pradeep: పెళ్లి వార్తలపై స్పందించిన ప్రదీప్…. ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ!

Anchor Pradeep: బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి యాంకర్ ప్రదీప్ గురించి అందరికీ సుపరిచితమే.గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమైన ప్రదీప్ అనంతరం ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అదేవిధంగా వెండి తెరపై కూడా పలు సినిమాలలో నటిస్తూ వెండితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా అలాగే సినిమాలలో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ప్రదీప్ పెళ్లి గురించి తరచు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఇదివరకే ప్రదీప్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ప్రదీప్ పూర్తిగా ఖండిస్తూ పెళ్లి వార్తలలో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు. అయితే తాజాగా మరోసారి డిజైనర్ నవ్య మారౌతుతో ప్రేమలో ఉన్నారని వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఈ పెళ్లి వార్తలపై స్పందించిన ప్రదీప్ తాను తన రెండవ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉండటం వల్ల ఈ పెళ్లి వార్తలపై ఆలస్యంగా స్పందిస్తున్నాను అయితే నవ్యతో నా పెళ్లి అంటూ వచ్చిన వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇంతవరకు తాను ఒకసారి కూడా ఆమెతో మాట్లాడలేదని తెలిపారు.

Anchor Pradeep: నా పెళ్ళికి ఇంకాస్త సమయం ఉంది…

ప్రొఫెషన్ పరంగా నా టీం ఆమెతో మాట్లాడి ఉండవచ్చు అలాగే కొన్నిసార్లు తనని ట్యాగ్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పటివరకు తనతో మాట్లాడలేదని, తనతో నా పెళ్లి అంటూ వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే మా కుటుంబం మా నాన్న కోల్పోయిన బాధ నుంచి బయట పడుతున్నారు. అయితే తన పెళ్లికి మరి కాస్త సమయం కావాల్సి ఉందని ప్రస్తుతం తాను తన రెండవ సినిమాతో బిజీగా ఉన్నానంటూ ప్రదీప్ క్లారిటీ ఇచ్చారు.

బిగ్ బాస్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన మోడల్ జశ్వంత్..!

తెలుగు బుల్లితెర ప్రసారమవుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఇప్పటివరకు ఈ కార్యక్రమం నాలుగు సీజన్లను పూర్తి చేసుకుని ఐదవ సీజన్ కూడా పూర్తి కావచ్చింది. ఇప్పటివరకు బిగ్ బాస్ కార్యక్రమంలో ఎక్కువగా నటీనటులు యాంకర్లు యూట్యూబర్స్ సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మోడల్స్ పాల్గొనడం చాలా అరుదు.

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలో మోడల్ జశ్వంత్ ఎంట్రీ ఇచ్చారు. ఎంతో అద్భుతంగా టాస్క్ లో పాల్గొంటూ ఉన్నటువంటి జస్వంత్ అనారోగ్యకారణంగా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రావాల్సివచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జశ్వంత్ గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అసలు జెస్సికి బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చారా లేకపోతే తనే డబ్బులు ఇచ్చి అవకాశం అందుకున్నారా అంటూ పలువురు పెద్ద ఎత్తున పుకార్లు సృష్టించారు.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తాజాగా జెస్సీ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా జస్వంత్ మాట్లాడుతూ బయట ఉన్న వాళ్ళు మాత్రమే కాదు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లు కూడా నా గురించి ఇలాగే అనుకున్నారు. అయితే నా అకౌంట్ లో కేవలం పదకొండు వేలు మాత్రమే ఉన్నాయి.నేను బాగా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాదు చిన్నప్పుడే తండ్రి మరణించడంతో ఉద్యోగం చేస్తూ మోడలింగ్ నేర్చుకొని ఈ స్థాయికి వచ్చాను.

బిగ్ బాస్ అవకాశం కోసం దొడ్డి దారులను ఎంచుకోకుండా స్ట్రైట్ గా వెళ్లాను,అలాగే ఆడాను అందుకే నాకు బిగ్ బాస్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కానీ వారికి ఎదురు డబ్బులు ఇచ్చి వెళ్లే అంత స్థోమత నాకు లేదని ఈ సందర్భంగా తన గురించి వస్తున్న పుకార్లపై మోడల్ క్లారిటీ ఇచ్చారు.

పూర్ణతో ఎఫైర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రవిబాబు.. ఏమన్నారంటే..?

రవిబాబు.. ప్రస్తుతం దర్శకుడిగా పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు నటుడిగా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు. కమెడియన్ గా కూడా అతడు తన మార్క్ ను చూపించాడు. మొదటిసారిగా అల్లరితో దర్శకుడి అవతారమెత్తి ఆ జోనర్లో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.

అల్లరి సినిమా హిట్ కావడంతో.. తర్వాత ఎన్నో సినిమాలను తెరపైకి ఎక్కించాడు. అందులో నచ్చావులే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత అతడు థ్రిల్లర్లు, హర్రర్ సినిమాల వైపు కన్నేశాడు. అందులో భాగంగానే అతడు హీరోయిన్ల పాత్రలకు ఎక్కువగా భూమిక, పూర్ణలను ఎంచుకున్నాడు.

దాదాపు వీళ్లతోనే ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో రవిబాబుకు వీళ్లకు మధ్య ఏదో ఎఫైర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో కోడై కూశాయి. దీనిపై రవిబాబు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తాను ఏ సినిమా తీసినా ఆ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత ఏ ఒక్కరూ ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడిని కాదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఏ ఒక్క హీరోయిన్ తో కలిసి కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు లేవు.

అటువంటి క్యారెక్టర్ నాది కాదు అంటూ చెప్పుకొచ్చాడు. పూర్ణతో వరుసాగా మూడు సినిమాలు తీశాను.. కేవలం ఆమె అభినయం కారణంగానే తన సినిమాల్లో పెట్టుకున్నానని క్లారిటీ ఇచ్చాడు. హీరోయిన్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే.. తనతో మరో సినిమా తీయడానికి ఎలా ముందుకు వస్తారు.. అస్సలు ఇష్టపడతారా.. అంటూ స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ పుకార్లు అంటూ చెప్పుకొచ్చాడు.

అవన్నీ రూమర్సే.. ఇక్కడ నుంచి తాను ఎక్కడకు వెళ్లడం లేదు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..

సమంత, నాగచైతన్య మధ్య గత కొన్ని రోజుల నుంచి విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. రోజుకో వార్తతో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై నాగచైతన్య లేదా సమంత కూడా ఇంత వరకు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు. దీంతో ఇంకా ఆ వార్తలకు బలం చేకూరేలా చేస్తున్నాయి.

కొందరైతే సమంత పెళ్లి రోజున భరణం కింద భారీగా తీసుకుంటుందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కోర్టును ఆశ్రయించారని.. దానికి నాగార్జున కూడా అన్ని సిద్ధం చేశారని కొంతకాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ. అంతే కాదు సమంత ముంబాయ్ కి వెళ్లి అక్కడే బాలీవుడ్ సినిమాలు తీస్తూ అక్కడే కొంత కాలం వరకు ఉండబోతోందని కూడా పుకార్లు వచ్చాయి.

అయితే దీనిపై సమంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సమంతకు సంబంధించి దుస్తుల బ్రాండ్ ‘సాకి’ ఏర్పాటుచేసి నిన్నటితో ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆమె ఓ వేడుకను నిర్వహించింది. అలాగే ఆమె సోషల్ మీడియాలోని అభిమానులతో ముచ్చటించారు. ఇలా చేస్తానని ముందుగానే చెప్పిన సామ్.. చెప్పినట్లుగానే అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ముంబైకి మకాం మారుస్తున్నారట కదా, అని ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు అది రూమర్ మాత్రమే, నాకు లైఫ్ ఇచ్చిన హైదరాబాద్ ని వదిలి ఎక్కడికీ వెళ్ళను అన్నారు. హైదరాబాద్ నా హోమ్ టౌన్ అంటూ చెప్పుకొచ్చారు. ఇటువంటివి అన్నీ రూమర్స్ అని కొట్టిపడేశారు. దీంతో ఇలా వస్తున్న వార్తలు అన్నీ రూమర్సే అని.. ఆమె చెప్పకనే చెప్పారు. ఈ పుకార్లు ఇలా ఉంటే.. ఆమె తన సాకీ ఫ్యాషన్ గార్మెంట్స్ బ్రాండ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సాకీ బ్రాండ్ ని ప్రేమించినందుకు.. ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అక్కినేని ఫ్యాన్స్ కి షాకిచ్చిన సమంత ..! ‘మామ’ కాస్త జస్ట్ నాగార్జున అయ్యారు…

గత కొన్ని రోజుల నుంచి చైతన్య, సమంతలు విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు తెగ వైరల్ గా మారాయి. విడాకుల గోల తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఏ రోజు చూసిన ఏదో ఒక వార్తతో వాళ్లిద్దరు వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ట్విట్టర్ లో పోస్టు చేయగా.. దానికి రీ ట్వీట్ చేసిన సమంత ఆ అనుమానాలను ఇంకా రెట్టింపు చేసింది.

ఎందుకంటే.. అందులో చైతును ట్యాగ్ చేయకపోవడంతో నెటిజన్లు మళ్లీ అనుమానించారు. విడాకుల విషయం నిజమే అంటూ మళ్లీ వార్తలు వచ్చాయి. మొన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత వద్ద ఓ రిపోర్టర్ దీనిపై ప్రశ్నించగా.. బుద్ది ఉందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే నాగ చైతన్య కూడా ఈ మధ్య ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే.. సమంత పేరు తీసుకురావద్దని ఒక కండీషన్ కూడా పెట్టాడు. దీంతో వారిద్దరి మధ్య విడాకులు నిజమే అంటే వైరల్ గా మారింది వార్త. అయితే మరో వార్త ఇప్పుడు చక్కెర్లు కొడుతోంది.

సమంత- నాగ చైతన్య వ్యవహారం విడాకుల వరకు వచ్చి ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ కూడా ఫినిష్ అయిందనే టాక్ నడిచింది. అయితే తాజాగా సామ్ చేసిన ఓ పోస్టుతో జనాల్లో ఓ క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 20 న తనకు స్పెషల్ అంటూ .. తన నాన్న పుట్టునరోజు వేడుకను గుర్తు చేసుకుంటూ నాగార్జున ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్టు చేశాడు. వెంటనే అక్కినేని కోడలు.. సమంత దానికి స్పందించారు. దానికి రీ ట్వీట్ ఇలా చేసింది.. ‘దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్’ అంటూ ట్వీట్ చేసింది. తర్వాత #iamnagarjuna అంటూ చెప్పింది.

దానికి ముందుగానీ వెనుక గానీ గౌరవ సూచికలు లేకుండా పోస్ట్ చేశారు. అంతక ముందు ఆమె ఏ పోస్టు చేసినా నాగార్జున మామా అంటూ పోస్టు చేసేది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఆమె ఏమనుకుందో ఏమో 30 నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్ డిలీట్ చేసి మరో ట్వీట్ చేశారు. మళ్లీ ‘దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్’ అంటూ క్యాప్షన్ పెట్టింది. నాగార్జున ను యాష్ ట్యాగ్ చేస్తూ.. మామా అంటూ సంభోదించింది. దీనిపై కూడా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మొదట అలా ట్వీట్ చేసి.. వ్యతిరేకత రాగానే మళ్లీ డిలీట్ చేసి మరో ట్వీట్ చేయడంతో మళ్లీ అనుమానాలు రేకెత్తాయనే చెప్పాలి.