గత కొన్ని రోజుల నుంచి చైతన్య, సమంతలు విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు తెగ వైరల్ గా మారాయి. విడాకుల గోల తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఏ రోజు చూసిన ఏదో ఒక వార్తతో వాళ్లిద్దరు వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ట్విట్టర్ లో పోస్టు చేయగా.. దానికి రీ ట్వీట్ చేసిన సమంత ఆ అనుమానాలను ఇంకా రెట్టింపు చేసింది.
ఎందుకంటే.. అందులో చైతును ట్యాగ్ చేయకపోవడంతో నెటిజన్లు మళ్లీ అనుమానించారు. విడాకుల విషయం నిజమే అంటూ మళ్లీ వార్తలు వచ్చాయి. మొన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత వద్ద ఓ రిపోర్టర్ దీనిపై ప్రశ్నించగా.. బుద్ది ఉందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే నాగ చైతన్య కూడా ఈ మధ్య ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే.. సమంత పేరు తీసుకురావద్దని ఒక కండీషన్ కూడా పెట్టాడు. దీంతో వారిద్దరి మధ్య విడాకులు నిజమే అంటే వైరల్ గా మారింది వార్త. అయితే మరో వార్త ఇప్పుడు చక్కెర్లు కొడుతోంది.
సమంత- నాగ చైతన్య వ్యవహారం విడాకుల వరకు వచ్చి ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ కూడా ఫినిష్ అయిందనే టాక్ నడిచింది. అయితే తాజాగా సామ్ చేసిన ఓ పోస్టుతో జనాల్లో ఓ క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 20 న తనకు స్పెషల్ అంటూ .. తన నాన్న పుట్టునరోజు వేడుకను గుర్తు చేసుకుంటూ నాగార్జున ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్టు చేశాడు. వెంటనే అక్కినేని కోడలు.. సమంత దానికి స్పందించారు. దానికి రీ ట్వీట్ ఇలా చేసింది.. ‘దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్’ అంటూ ట్వీట్ చేసింది. తర్వాత #iamnagarjuna అంటూ చెప్పింది.
దానికి ముందుగానీ వెనుక గానీ గౌరవ సూచికలు లేకుండా పోస్ట్ చేశారు. అంతక ముందు ఆమె ఏ పోస్టు చేసినా నాగార్జున మామా అంటూ పోస్టు చేసేది. దీంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఆమె ఏమనుకుందో ఏమో 30 నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్ డిలీట్ చేసి మరో ట్వీట్ చేశారు. మళ్లీ ‘దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్’ అంటూ క్యాప్షన్ పెట్టింది. నాగార్జున ను యాష్ ట్యాగ్ చేస్తూ.. మామా అంటూ సంభోదించింది. దీనిపై కూడా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. మొదట అలా ట్వీట్ చేసి.. వ్యతిరేకత రాగానే మళ్లీ డిలీట్ చేసి మరో ట్వీట్ చేయడంతో మళ్లీ అనుమానాలు రేకెత్తాయనే చెప్పాలి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…