రవిబాబు.. ప్రస్తుతం దర్శకుడిగా పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు నటుడిగా తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు. కమెడియన్ గా కూడా అతడు తన మార్క్ ను చూపించాడు. మొదటిసారిగా అల్లరితో దర్శకుడి అవతారమెత్తి ఆ జోనర్లో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.
అల్లరి సినిమా హిట్ కావడంతో.. తర్వాత ఎన్నో సినిమాలను తెరపైకి ఎక్కించాడు. అందులో నచ్చావులే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత అతడు థ్రిల్లర్లు, హర్రర్ సినిమాల వైపు కన్నేశాడు. అందులో భాగంగానే అతడు హీరోయిన్ల పాత్రలకు ఎక్కువగా భూమిక, పూర్ణలను ఎంచుకున్నాడు.
దాదాపు వీళ్లతోనే ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో రవిబాబుకు వీళ్లకు మధ్య ఏదో ఎఫైర్ ఉన్నట్లు సోషల్ మీడియాలో కోడై కూశాయి. దీనిపై రవిబాబు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తాను ఏ సినిమా తీసినా ఆ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత ఏ ఒక్కరూ ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడిని కాదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఏ ఒక్క హీరోయిన్ తో కలిసి కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు లేవు.
అటువంటి క్యారెక్టర్ నాది కాదు అంటూ చెప్పుకొచ్చాడు. పూర్ణతో వరుసాగా మూడు సినిమాలు తీశాను.. కేవలం ఆమె అభినయం కారణంగానే తన సినిమాల్లో పెట్టుకున్నానని క్లారిటీ ఇచ్చాడు. హీరోయిన్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తే.. తనతో మరో సినిమా తీయడానికి ఎలా ముందుకు వస్తారు.. అస్సలు ఇష్టపడతారా.. అంటూ స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ పుకార్లు అంటూ చెప్పుకొచ్చాడు.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…