Tag Archives: crime

Crime News: దేశ రాజధానిలో దారుణం..! బాలికపై విచక్షణ రహితంగా దాడి చేసిన వ్యక్తి!

Crime News: ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. ఆడపిల్లలపై దాడులు ఆగడం లేదు. అఘాయిత్యాలకు పాల్పడుతూ.. బాలికల జీవితాలను చిదిమేస్తున్నారు. దీంతో పాటు వారిపై దాడుల కూడా పాల్పడుతున్నారు. రోజుకు ఎక్కడో ఓ చోట మహిళలపై, బాలికలపై దాడులు జరుగుతున్నాయి. 

Crime News: దేశ రాజధానిలో దారుణం..! బాలికపై విచక్షణ రహితంగా దాడి చేసిన వ్యక్తి!

తాజాగా సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం ఈ దారుణం చోటు చేసుకుంది. అభం, శుభం ఎరుగని ఓ బాలికపై ఓ నిందితుడు.. దాడికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు. బూటుతో తన్నుతూ.. కర్రతో బాదుతూ.. విచక్షణారహితంగా దాడి చేశారు. 

Crime News: దేశ రాజధానిలో దారుణం..! బాలికపై విచక్షణ రహితంగా దాడి చేసిన వ్యక్తి!

ఢిల్లీలో పశ్చిమ విహార్ ప్రాంతంలో ఈ అమానవీయమైన ఘటన చోటు చేసుకుంది. బాలికపై దాడికి పాల్పడుతున్న వైనం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బాలికను పట్టుకుని సదరు వ్యక్తి కర్రలతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. పారిపోయేందుకు బాలిక ప్రయత్నించినా.. వదలకుండా దాడి చేశాడు. అనంతరం బూటు కాలితో తీవ్రంగా తన్నాడు. 

బాధిత బాలికను కొందరు…

దీనిపై స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఢిల్లీ మహిళా కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. దాడికి పాల్పడిన సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన పుటేజీని అందచేసింది. నిందితుడు డ్రగ్స్ కు బానిసగా మారినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధిత బాలికను కొందరు బంధించినట్లు ఆమె.. జీవితం ఆపదలో ఉన్నట్లు ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషనర్ తీవ్రంగా స్పందించింది. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది.

Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!

Crime News: అక్రమ సంబంధాలు, వ్యసనాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. కొంత మంది భార్యలు భర్తలను, పిల్లల్ని హత్య చేస్తుంటే…మరికొంతమంది భర్తలు భార్యల్ని కడతేరుస్తున్నారు. తాజాగా భార్యను చంపి నాటకం ఆడిన ఓ భర్త బండారం బట్టబయలైంది. సొంత మేనకోడలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ… భార్య అడ్డంగా ఉందని దారుణంగా హత్య చేశారు ఓ దుర్మార్గుడు. 

Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!

ఈ ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదొర పాలెం పంచాయతీలో జోడిమెరక గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు(33).. భార్య లక్ష్మీని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తాజాగా తన భార్యను చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Crime News: మేనకోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్న మామ..! అడ్డుగా ఉన్న భార్యను ఏం చేశాడంటే..!

తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన లక్ష్మీతో నాగరాజుకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరికి ఏడు ఏళ్ల బాబు యశ్వంత్ ఉన్నాడు. అయితే వరసకు మేనకోడులు అయ్యే మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు నాగరాజు. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. పలుమార్లు పెద్దల పంచాయతీ నిర్వహించి నాగరాజును మందలించారు.

దారిలోని జీడి తోటల్లోకి తీసుకెళ్లి..

ఎలాగైనా భార్య లక్ష్మీని అడ్డు తొలగించుకోవాలనుకున్న నాగరాజు పథకం ప్రకారం జనవరి 28న రాత్రి 7.30 గంటలకు స్వీట్ షాప్ లో పని ముగించుకుని వస్తున్న నాగలక్ష్మీని తీర్థం పోదామని స్కూటీ ఎక్కించుకున్నాడు. అది నమ్మిన భార్య భర్త మాటలు విని బైక్ ఎక్కింది. తొలుత ఏపీ మోడల్ స్కూల్ వైపు వెళ్లడంతో అనుమానం వచ్చిన లక్ష్మీ స్కూటీపై నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించింది. తిరిగి ఆమెను స్కూటీ ఎక్కించుకుని బలిఘట్టం రెవెన్యూ పరిధిలోని అర్థాన్న పాలెం దారిలోని జీడి తోటల్లోకి తీసుకెళ్లాడు. అక్కడే తనకు విడాకులు ఇవ్వాలని లక్ష్మీని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో బలంగా రాళ్లపైకి తోశాడు. దీంతో రాళ్లకుప్పపై పడి లక్ష్మీ స్పృహ కోల్పోయింది. ఇదే అదునుగా పెద్ద బండరాయితో మోదీ లక్ష్మీని హత్య చేశాడు నాగరాజు. అక్కడే ఉన్న ఎండుపుల్లలు వేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నిందితుడు నాగరాజు. భార్యను హత్య చేసిన నాగరాజును ఉరితీయాలంటూ.. గ్రామస్థులు ధర్నా చేశారు. పోలీస్ స్టేషన్ కు ర్యాలీ తీశారు.

Marital Affair: భార్య చెల్లిపై కన్నేసిన కామాంధుడు..! 7 నెలల గర్భవతి కాగా చివరికి ఇలా!

Marital Affair: ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎన్ని కేసులు నమోదవుతున్నా కామాంధుల తీరులో మార్పలు రావడం లేదు. వావీవరసలు, చిన్న పెద్ద తేడాలు మరిచి ప్రవర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్భయ, పోక్సో వంటి చట్టాలను తీసుకువచ్చినా అత్యాచారాలకు అడ్డుకట్టపడటం లేదు.

Marital Affair: భార్య చెల్లిపై కన్నేసిన కామాంధుడు..! 7 నెలల గర్భవతి కాగా చివరికి ఇలా!

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎక్కువగా లైంగిక దాడులు తెలిసిన వారి వల్లే జరుగుతుండటం విస్మయం కలిగించే అంశం.  కన్నకూతుళ్లను, కూతరు వయసున్న బాలికను కూడా వదలడం లేదు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వారే కాటేస్తున్నారు. దీంతో ఈ బాధను తమలోతామే కుమిలిపోతున్నారు.

Marital Affair: భార్య చెల్లిపై కన్నేసిన కామాంధుడు..! 7 నెలల గర్భవతి కాగా చివరికి ఇలా!

ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా వేధన పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. మైనర్ అయిన సొంత భార్య చెల్లిలిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటక శివమొగ్గలో ఈ ఘటన చోటు చేసుకుంది. చదువుకునేందుకు సొంత అక్క- బావ ఇంటికి వచ్చిన బాలిక పై కన్నేశాడు బావ.

బాలికకు నొప్పులు రాగా…

కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికపై గత కొద్ది రోజులగా భార్యకు తెలియకుండా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. మాయమాటలు చెబుతూ.. లైంగిక వాంఛ తీర్చకుంటూ ఉన్నాడు. అయితే ఇటీవల బాలికకు అనారోగ్యంగా ఉండటంతో అక్క చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా… బాలికకు ఏడు నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. బాలికకు 18 ఏళ్లు నిండాయని చెప్పి ఆస్పత్రి నుంచి బయటకు తీసుకువచ్చారు. బాలికకు నొప్పులు రాగా మెగ్గాన్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే 7 నెలలకే ప్రసవం కాగా బిడ్డ మరణించింది. దీంతో ఈ విషయం వెలుగులోకి రాగా.. పోలీసులు సదరు బావను కటకాల్లోకి నెట్టారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Crime: యువతికి లిఫ్ట్ ఇచ్చి..! గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు.. ! చివరకు ఏం జరిగిందంటే..

Crime: తెలిసీతెలియని వయసు.. నిజానికి, అబద్దానికి తేడా తెలియకపోవడం… కేవలం అట్రక్షన్ నే ప్రేమగా భావిస్తుండటంతో అనేక మంది అమ్మాయిల జీవితాలు దుర్మార్గుల చేతుల్లో నలిగిపోతున్నాయి. శారీరకంగాా అనుభవించి మోహం చాటేస్తున్నారు.

Crime: యువతికి లిఫ్ట్ ఇచ్చి..! గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు.. ! చివరకు ఏం జరిగిందంటే..

కొంత మంది తమకు అడ్డుగా ఉంటుందని అడ్డు తొలగించేసుకుంటున్నారు. ఫలితంగా తమ బంగారు జీవితాన్ని అమ్మాయిలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటను ఎన్నో జరుగుతున్నా.. దుర్మార్గుల చేతితో అమాయకులు మోసపోతూనే ఉన్నారు. 

Crime: యువతికి లిఫ్ట్ ఇచ్చి..! గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు.. ! చివరకు ఏం జరిగిందంటే..

ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. సంతమాగులూరుకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ… మోసం చేశాడు ఓ వ్యక్తి. శారీరకంగా వాడుకుని మోహం చాటేశాడు. దీంతోొ యువతి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.  ఈ సంఘటన సంతమాగులూరు మండలంలోని మక్కెనవారి పాలెంలో సోమవారం జరిగింది. 

బైకు పై మీ స్వగ్రామానికి తీసుకెళ్తా అని చెప్పి..

పోలీసుల కథనం ప్రకారం మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన గుంజి నారాయణ కుమర్తె పదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితం కూలీ పనుల కోసం కొమ్మాలపాడు గ్రామానికి వెళ్లింది. ఆసమయంలో గ్రామానికి చెందిన షేక్ బాజీ అనే మెడికల్ దుకాణం నడిపే యవకుడితో పరిచయం ఏర్పడింది. బైకు పై మీ స్వగ్రామానికి తీసుకెళ్తా అని చెప్పి యువతికి దగ్గరయ్యాడు.  ఈ క్రమంలోనే ఫోన్ నెంబర్ తీసుకుని.. యువతికి మరింత దగ్గరై .. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో సదురు యువతి గర్భం దాల్చింది. ఇది తెలిసి షేక్ బాజీ ఆ అమ్మాయి గర్భాన్ని తీసేయించాడు. ఆ తరువాత యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. దీంతో యువతి సోమవారం ఉదయం ఎలుకల మందు తిని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడే పడిపోయింది. వివరాలు తెలుసుకుని పోలీసులు సమీపంలోని అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Crime News: రెచ్చిపోయిన కామాంధుడు..! సొంత వదినపైనే అఘాయిత్యం..!

Crime News: సొంత మనుషులే వావీ వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. సంబంధాలుకు విలువనీయడం కామాంధులు. సమాజం ఏం అనుకుంటుంది, చట్టం శిక్షిస్తుందనే భయాలు లేకుండా బరితెగిస్తున్నారు. అత్యాచారాలను ఆపేందుకు ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా… కామాంధులు భయపడటం లేదు.

Crime News: రెచ్చిపోయిన కామాంధుడు..! సొంత వదినపైనే అఘాయిత్యం..!

రోజుకో అత్యాచార ఘటన బయటకు వస్తూనే ఉంది. దేశంలో నిర్భయ, దిశ, ఫోక్సో వంటి చట్టాలు తీసుకువచ్చినా… కామాంధులకు భయం కలగడం లేదు. తాజాగా సొంత వదినపైనే అత్యాచారాని పాల్పడ్డాడో కామాంధుడు. హైదరాబాద్  కుషాయిగూడలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.
కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సంపూర్ణ అనే మహిళ తన ఏడాదిన్నర చిన్నారితో పాటు మరో మహిళతో కలిసి నివాసం ఉంటోంది.

Crime News: రెచ్చిపోయిన కామాంధుడు..! సొంత వదినపైనే అఘాయిత్యం..!

అయితే రాత్రి నిద్రిస్తున్న సమయంలో పీకల దాకా తాగి వచ్చిన మరిది వేణగోపాల్.. తనతో పాటు 10 మంది రౌడీలను తీసుకువచ్చి.. సంపూర్ణ నివాసం ఉంటున్న ఇంటి తలుపులు బద్దలు కొట్టాడు. వదినను దుర్బాషలాడుతూ.. దారుణంగా దాడి చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు..

వదిన అని మరిచి లౌంగిక దాడికి పాల్పడ్డాడు. ఈసమయంలో బాధితులు భయంగా అరవగా.. చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. నిందితుడు దాడికి తెగబడటంతో మహిళలు అరవడంతో పాటు చిన్న పిల్ల ఏడుపు విని అక్కడికి చేరుకున్న స్థానికులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా… తప్పించుకున్నారు. ఈక్రమంలో నిందితుడు వేణుగోపాల్ తన బైక్ ను అక్కడే వదిలి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫిర్యాదును నమోదు చేసుకుని… నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Crime: పగలు భిక్షగాడు..! రాత్రి అయిందంటే చాలు పట్ట పగ్గాలు ఉండవు..!

Crime: పగటి పూట యాచకుడిగా.. రాత్రి పూట దొంగ మారుతున్న ఓ వ్యక్తి చివరికి ఓ వ్యక్తి ప్రాణాలను తీశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులే టార్గెట్ గా దోపిడీలకు పాల్పడుతున్నాడు… ఈక్రమంలో ఓ వ్యక్తి మరణానికిి కారణమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ తిరుమలగిరి సమీపంలోని కానాజీగూడకు చెందిన వరగంధం రాఘవుల నర్సింహ అలియాస్ నర్సింగ్(32) యాచకుడిగా జీవిస్తున్నాడు.

పగటి పూట సిగ్నళ్ల వద్ద యాచిస్తూ.. అక్కడే పుట్ పాత్ పై జీవిస్తున్నాడు. గతంలో అతని భార్య విడిచివెళ్లినందుకు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే గాయాలతో బయటపడ్డాడు.  ఇదిలా ఉంటే రాత్రి వేళ మాత్రం తనలోని మరో రూపాన్ని చూపిస్తుంటాడు నర్సింగ్.

మద్యం మత్తులో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులనే టార్గెట్ గా చేసుకుంటూ.. దోపిడీలకు పాల్పడుతున్నాడు. మద్యం మత్తులో వెళ్లేవారిని అటకాయించి.. బెదిరించి వారివద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్లను దోపిడీ చేస్తున్నాడు. అలాగే పుట్ పాత్ పై నిద్రిస్తున్న వారి వద్ద నుంచి నగదు, సెల్ ఫోన్లను దొంగిలిస్తున్నాడు.ఇలాగే గతేడాది డిసెంబర్ 14న రాత్రి సమయంలో కొత్తపేట సమీపంలోని మార్గదర్శి కాలనీకి చెందిన అలుగుబెల్లి కృష్ణారెడ్డి(48) మెట్రోస్టేషన్ వద్ద మద్యం సేవించి ఇంటికి వెళ్లడాన్ని గమనించిన నర్సింగ్… తన పాతపంథాలో భయపెట్టి దోచుకునేందుకు ప్రయత్నించాడు.

అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు…

అయితే కృష్ణారెడ్డి పెద్దగా పట్టించుకోవకపోవడంతో అతనిపై దాడి చేశారు. ఈక్రమంలో కృష్ణారెడ్డి తల పుట్ పాత్ ను ఢీకొనడంతో తీవ్రగాయాలయి అక్కడే పడిపోయాడు. అతని వద్దనున్న సెల్ ఫోన్, రూ.100 నగదు దోచుకున్న నర్సింగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. తెల్లవారేదాకా అక్కడే గాయాలతో పడి ఉన్న కృష్ణారెడ్డిని కుటుంబ సభ్యులు వనస్థలి పురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరగైన చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతూ… కృష్ణారెడ్డి 15 రోజుల తరువాత డిసెంబర్ 30న మరణించారు.  అయితే చోరికి గురైన మృతుడి ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తే మరొక వ్యక్తి ఫోన్ లిఫ్టు చేసి.. తనకు ఈ ఫోన్ దొరికిందని బుకాయించాడు. అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీ కెమెరాలను పరిశీలిస్తే.. నర్సింగ్ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. పుటేజీలో నిందితుడి ఫోటో ఆధారంగా.. ఆ ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ ఆధారంగా కూపీలాగిన పోలీసులు నిందితుడు నర్సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. చోరీ చేసిన ఫోనును ఎల్బీనగర్ లో రూ. 300 విక్రయించగా.. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Crime: సెల్ఫీ కోసం రైలు బోగి ఎక్కిన యువకుడు… విద్యుత్ ఘాతంతో చివరికి ఇలా!

Crime: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు సెల్ఫీల కోసం ఎంతో సాహసానికి ఒడిగడుతున్నారు.ఈ క్రమంలోనే సెల్ఫీ లకు ఫోజులు ఇవ్వడం కోసం ప్రమాదకరమైన స్థలాలను ఎంచుకొని ప్రాణాలతో చెలగాటం ఆడటం వల్ల ఎన్నో ప్రమాదా సంఘటనలు జరుగుతున్నాయి.ఈ ప్రమాదాల బారిన పడి కొంత మంది ప్రాణాలతో బయట పడగా మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

Crime: సెల్ఫీ కోసం రైలు బోగి ఎక్కిన యువకుడు… విద్యుత్ ఘాతంతో చివరికి ఇలా!

ఇప్పటికే ఎంతోమంది కొండ చివరి భాగంలో సెల్ఫీలకు ఫోజులు ఇస్తూ పడిపోవడం, నది ప్రాంతాలలో సెల్ఫీలకు ఫోజులు ఇస్తూ పడిపోవడం వంటి సంఘటనల గురించి మనం వినే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన పిడుగురాళ్లలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Crime: సెల్ఫీ కోసం రైలు బోగి ఎక్కిన యువకుడు… విద్యుత్ ఘాతంతో చివరికి ఇలా!

పిడుగురాళ్ల పట్టణ రైల్వే స్టేషన్ లో ఆగివున్న గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీ దిగాలని భావించాడు. ఈ క్రమంలోనే రైలు చివరి భోగి పైకి ఎక్కి సెల్ఫీ దిగడం కోసం చేయి పైకి ఎత్తాడు. ఈ క్రమంలోనే అతని చేయి పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో అతను విద్యుత్ ఘాతానికి గురయి కింద పడ్డాడు.అయితే అక్కడే ఉన్న మరో యువకుడు బుచ్చయ్య ఈ విషయాన్ని గమనించి రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు.

తలకు తీవ్ర గాయం.. ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు..

ఇలా విద్యుత్ ఘాతంతో రైల్వే భోగి నుంచి కింద పడటంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి అనంతరం అంబులెన్స్ లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలోనే రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Crime: శ్మశాన వాటికలో తన తల్లి సమాధిని తవ్వి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కొడుకు..ఎందుకో తెలుసా..!

Crime: భూమి మీద బతికే ప్రతీ జీవి మరణించాల్సిందే. పుట్టుక అనేది ఎంత నిజమో మరణం అనేది కూడా అంతే నిజం. కాకపోతే ఒకరు ముందు మరణిస్తారు.. మరికొంతమంది ఆలస్యంగా మరణిస్తారు. అయితే ఓ వ్యక్తి చనిపోయిన తన తల్లిని మర్చిపోలేక.. తీవ్ర మనోవేదనకు గురై శ్మశానంలో పాతి పెట్టిన తన తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చాడు.

Crime: శ్మశాన వాటికలో తన తల్లి సమాధిని తవ్వి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కొడుకు..ఎందుకో తెలుసా..!

దీనికి సంబంధించిన వివరాలు ఇవే. తమిళనాడుకు రాష్ట్రం పెరంబూరు జిల్లా కున్నం సమీపంలోని పరవై గ్రామానికి చెందని 38 ఏళ్ల బాలమురుగన్ కు పెళ్లి కాలేదు. అతడి తండ్రి పది సంవత్సరాల క్రితం మరణించాడు. అప్పటి నుంచి అతడి బాగోగులు అతడి తల్లి ముక్కాయి (65) చూసుకుంటూ ఉండేది. 10 నెలల క్రితం ఆమె తల్లి అనారోగ్యానికి గురై మరణించింది.

Crime: శ్మశాన వాటికలో తన తల్లి సమాధిని తవ్వి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కొడుకు..ఎందుకో తెలుసా..!

ఇక ఆ రోజు నుంచి అతడు ఒంటరి వాడు అయ్యాడు. ఏం చేయాలో తోచక అతడు ప్రతీ రోజు శ్మశానానికి వెళ్లి.. తన తల్లి అంత్యక్రియలు జరిగిన ప్రదేశంలో తనలో తానే మాట్లాడుకునే వాడు. అక్కడే ఎన్నో సార్లు నిద్ర కూడా పోయాడు. ఒకానొక సమయంలో వర్షం పడితే సమాధి తడవకుండా ఉండేలా చూసేవాడు. అయితే ఇటీవల అతడు తన తల్లి సమాధిని తవ్వి.. అందులో పాక్షికంగా కుళ్లిపోయిన తన తల్లి శవాన్ని ఇంటికి తీసుకొచ్చాడు.

మానసికి స్థతి సరిగ్గా లేకపోవడంతోనే ఇలా..

ఇలా ఇంట్లోనే ఆ శవాన్ని ఉంచడంతో ఇళ్లంతా దుర్వాసన వచ్చింది. ఓ రోజు అతడి ఇంటికి తన బంధువు వచ్చాడు.. ఏంటి ఈ వాసన అని అడగ్గా.. అతడిని అక్కడ నుంచి పంపించేశాడు. అతడికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి తనిఖీ చేయగా.. విషయం అంతా బయటపడింది. అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. అక్కడ పాక్షికంగా కుళ్లిపోయిన మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విచారణ నిమిత్తం బాలమురుగన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు సమక్షంలో దహనం చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Sad News: ఎవరిదీ పాపం..ఇద్దరు చేసిన తప్పుకు.. ముళ్లపొదల్లో ఇలా..!

Sad News: ప్రస్తుతం ఉన్న జీవవ విధానంతో చాలా మంది సంతాన భాగ్యానికి నోచుకోవడం లేదు. మాతృత్వ మాధుర్యం కోసం లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఐవీఎఫ్, సరోగసీ చేసుకుంటూ పిల్లల్ని కంటున్నారు. అయితే కొంత మంది మాత్రం ఆ మాతృత్వానికే మచ్చ తెస్తున్నారు.

Sad News: ఎవరిదీ పాపం..ఇద్దరు చేసిన తప్పుకు.. ముళ్లపొదల్లో ఇలా..!

కావాలని నవజాత శిశువును ముళ్ల పొదల్లో, చెత్త కుండీల్లో వదిలి వెళుతున్నారు. ఎవరైనా చూస్తే బతికి బయటపడుతున్నారు. లేకపోతే.. మరణిస్తున్నారు. చిన్న పిల్లల్ని అన్ని ఉన్నా అనాథలుగా చేస్తున్నారు. తల్లిదండ్రులు తెలియక మనోవేధనకు గురవుతున్నారు. ఇలాంటి చాలా ఘటనలు దేశవ్యాప్తంగా చూస్తున్నాం.

Sad News: ఎవరిదీ పాపం..ఇద్దరు చేసిన తప్పుకు.. ముళ్లపొదల్లో ఇలా..!

యుక్తవయసులో తప్పటడుగులు వేసి అబార్షన్లు చేయించుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. బయటకు తెలిస్తే సమాజం అవమానిస్తుందని గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేయించుకుంటున్నారు. బిడ్డలు పుడితే ఎక్కడో చోట విసిరేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. 

ముళ్ల పొదల్లో నవజాత శిశువు …

ఖమ్మం జిల్లా పెద్దమండవలో శుక్రవారం ఓ వీధిలో సీసీ రోడ్డు పక్కన ఉన్న ముళ్ల పొదల్లో నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. అయితే పూర్తిగా నెలలు నిండక ముందే శిశువును గర్భం నుంచి తొలగించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ సిబ్బందే.. శిశువును ఖననం చేశారు. ఇదిలా ఉంటే అదే గ్రామానికి చెందిన శిశువు మరణిస్తే ఖననం చేశారని.. కుక్కలు వెలికి తీసి పొదల్లోకి ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ వీడియోలు తీశారు.. ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని అలా చేశారు.

వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరెన్నో కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయాయి. ఇంట్లో పెద్ద దిక్కు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న కటుంబాలు ఎన్నో ఉన్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.

తాజాగా జరిగిన ఘటనలో.. వివాహేత‌ర సంబంధం అడ్డుపెట్టుకుని వివాహిత‌పై అత్యాచారం చేసిన ఘ‌ట‌న బోర‌బ‌డం ప‌రిధిలో కొద్దిరోజుల క్రితం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోరబండకు చెందిన ఓ మహిళ.. వెంకట్ అనే యువకుడితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని అదే కాలనీకి చెందిన ఇస్మాయిల్ అనే యువకుడు గమనించాడు.

ఓ రోజు వీడియోలు, ఫొటోలు తీశాడు. ఆ రోజు నుంచి ఆమెను బెదిరింపులకు గురి చేశాడు. తన కోరిక తీర్చకపోతే.. ఈ వీడియోలు, ఫొటోలు బయటపెడతానని భయపెట్టాడు. ఓ రోజు ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని ఆమెపై ఇస్మాయిల్, యాసిన్ క‌లిసి అత్యాచారానికి ఒడిగ‌ట్టారు. ఇలా అతడు ఒక్కసారి కాదు.. పదే పదే ఇలానే చేస్తుండటంతో విసుగిపోయి.. తన ప్రియుడికి వెళ్లి చెప్పింది.

ఇద్దరు కలిసి పొలంలోకి వెళ్లి అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయాత్నానికి పాల్పడ్డారు. వారిద్దరు అలా అపస్మారక స్థితిలో ఉండగా.. స్థానికులు గుర్తించి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకుపోవడంతో.. చికిత్స నిర్వహించిన అనంతరం ఇద్దరూ కోలుకున్నారు. తర్వాత వారిద్దరి పోలీసులు ప్రశ్నించడగా.. విషయాన్ని చెప్పారు. ఆ జంట ఫిర్యాదు మేరకు యాసిన్, ఇస్మాయిల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.