Tag Archives: Dhee

Pradeep: యాంకర్ గా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన ప్రదీప్… బుల్లితెరకు దూరం అవ్వడానికి ఇదే కారణమా?

Pradeep: బుల్లితెరపై ఎంతోమంది ఫిమేల్ యాంకర్లుగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మేల్ యాంకర్లు చాలా తక్కువగా ఉన్నారని చెప్పాలి. ఇలా మేల్ యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ ప్రదీప్ ఒకరు. ఈయన యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఎన్నో బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించేవారు. అయితే ఈయన హీరోగా కూడా 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించారు.

ఈ సినిమా తర్వాత ప్రదీప్ తన తదుపరి సినిమాలను ప్రకటించలేదు. అయితే ఉన్నఫలంగా ఈయన బుల్లితెరపై ఏ ఒక్క కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించలేదు ఇలా బుల్లితెరకు దూరం అవడంతో అందరూ ప్రదీప్ యాంకరింగ్ కి దూరం కావడానికి గల కారణం ఏంటి అని ఆరా తీయడం మొదలుపెట్టారు.అయితే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.

సినిమాలతో బిజీ..
ఇందులో పెద్ద ఎత్తున ఈయన జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియోలో భాగంగా ప్రదీప్ కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తూ ఉన్నారు. ఇలా ఈయన భారీ స్థాయిలో కష్టపడుతూ ఉండడంతో తన తదుపరి సినిమా కోసమే ప్రదీప్ ఇలా కష్టపడుతున్నారని తెలుస్తుంది. మరి ఈయన తదుపరి సినిమా ఏంటి ఎలాంటి నేపథ్యంలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనేది తెలియాల్సి ఉంది.

Jabardasth: ఒక్కో ఎపిసోడ్ కోసం జబర్దస్త్ జడ్జిలకి మల్లెమాల ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో తెలుసా?

Jabardasth: ఈటీవీలో మల్లెమాల వారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే ఈ కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

జబర్దస్త్ కార్యక్రమానికి మొదట్లో రోజా, నాగబాబు జడ్జిలుగా వ్యవహరించేవారు.అయితే కొన్ని కారణాల వల్ల నాగబాబు తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి సింగర్ మనో వచ్చారు.అదేవిధంగా రోజా గారికి మంత్రి పదవి రావడం చేత రోజా కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో రోజా స్థానంలోకి ఇంద్రజ వచ్చారు. ఇక మనో కూడా ఈ కార్యక్రమానికి స్థిరంగా లేకపోవడంతో ఆయన స్థానంలో ఎవరో ఒకరు వస్తున్నారు.

ఇకపోతే తాజాగా జబర్దస్త్ జడ్జ్ ల కోసం మల్లెమాలవారు ఒక్కో ఎపిసోడ్ కోసం ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది. రోజా ఎక్కువ ఎపిసోడ్ కోసం ఐదు లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే వారట.ఇక ఈమె హీరోయిన్ కావడంతో ఈమెకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చారు ఇక ఈమెతో పాటు జడ్జిగా వ్యవహరించిన నాగబాబుకు మాత్రం ఒక్కో ఎపిసోడ్ కు మూడు లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చేవారు.

Jabardasth: ఒక్కో ఎపిసోడ్ కి లక్షల్లో రెమ్యూనరేషన్..

రోజా స్థానంలో కొనసాగుతున్న ఇంద్రజకు ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్ కు రెండున్నర లక్ష రెమ్యూనరేషన్ అందిస్తున్నారు. అదేవిధంగా నాగబాబు స్థానంలో కొనసాగుతున్న కమెడియన్ కృష్ణ భగవాన్ కు ఒక్కో ఎపిసోడ్ కి 2.50 లక్షల రెమ్యూనరేషన్ అందిస్తున్నారు. ప్రస్తుతం మల్లెమాలవారు జడ్జిలకు ఇస్తున్నటువంటి ఈ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Aadi -Akhil: ఢీ 14 కోసం హైపర్ ఆది, అఖిల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?

Aadi -Akhil: బుల్లితెరపై మల్లెమాలవారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్, ఢీ వంటి కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఢీ కార్యక్రమం ద్వారా ఎంతోమంది డాన్సర్లుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమం 14 వ సీజన్ కొనసాగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది, అఖిల్, నవ్యస్వామి, రవి కృష్ణ వంటి వారు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమైనప్పటికీ ఈయన ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

ఇక ఢీకార్యక్రమంలో మెంటర్ గా ఉన్నటువంటి హైపర్ ఆది తన కామెడీ పంచ్ డైలాగులతో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం కోసం హైపర్ ఆది ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారనే విషయం గురించి హాట్ టాపిక్ గా మారింది.ఈ కార్యక్రమం కోసం హైపర్ ఆది ఒక కాల్ షీట్ కి ఏకంగా ఐదు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది.ఈయన జడ్జెస్ తో పాటుగా ఈ కార్యక్రమంలో రెమ్యూనరేషన్ అందుకోవడం విశేషం.

Aadi -Akhil: భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అఖిల్…

ఇకపోతే ఈ కార్యక్రమంలో బుల్లితెర నటుడిగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అఖిల్ సైతం మెంటర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అఖిల్ ఈ కార్యక్రమంలో కొనసాగుతూ కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. సాధారణంగా ఒకసారి మల్లెమాల వారి కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన తర్వాత వారిని తిరిగి తీసుకోరు. కానీ అఖిల్ మాత్రం ఈ కార్యక్రమం నుంచి వెళ్లి బిగ్ బాస్ లో పాల్గొని, తిరిగి ఢీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్నప్పుడు అఖిల్ ఒక వారానికి సుమారు రెండున్నర లక్ష వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఒక్కో కాల్ షీట్ కి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.