Tag Archives: diabetes

Nirmalamma: ఏంతో మందికి అన్నం పెట్టిన నిర్మలమ్మను చివరి రోజుల్లో పెంచుకున్న పిల్లలు ఎలా ఇబ్బంది పెట్టారో.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Nirmalamma: తెలుగు చిత్ర పరిశ్రమలో నటినిర్మలమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సహజనటిగా ఎన్నో వందల సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిర్మలమ్మ చివరి వరకు సినిమాలలో నటిస్తూ ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఇక ఈమె వయసు పై పడటంతో చనిపోవడానికి కొన్ని నెలల ముందు సినిమాలకు దూరమయ్యారు.

ఇకపోతే నిర్మలమ్మ సినిమాలలో ఎంతో సహజత్వంగా నటిస్తూ ఎంతో మంచి ఆదరణ పొందారో వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె అలాంటి ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఈమెకు పిల్లలు లేకపోతే సమీప బంధువుల పిల్లలను పెంచుకొని పెద్ద చేశారు అయితే ఈమె చివరి రోజులలో మాత్రం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మలమ్మ సహజ నటిగా మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసున్న వ్యక్తిగా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని ఎంతోమంది కడుపు నింపిన ఆమె చివరి రోజులు మాత్రం చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారని ఈయన తెలిపారు.

Nirmalamma: డయాబెటిస్ సమస్యతో బాధపడ్డారు…


నిర్మలమ్మ పెంచి పెద్ద చేసిన పిల్లలు చివరి రోజుల్లో ఆమెను పట్టించుకోవడంలేదని ఆమె డయాబెటిస్ సమస్యతో బాధపడుతూ ఆ విషయాన్ని గుర్తించక ఎంతో ఇబ్బంది పడుతూ తన చివరి రోజులు గడిపారని ఈ సందర్భంగా జర్నలిస్టు రామారావు పేర్కొన్నారు. తాను దత్తత తీసుకొని పెంచి పెద్ద చేసిన పిల్లలు చివరి రోజులలో తన పట్ల నిర్లక్ష్యం వహించారని ఈయన తెలియజేశారు. ఇలా పిల్లలు నిర్లక్ష్యానికి తోడు డయాబెటిస్ రావడంతో ఆమె కాలం చేశారని ఈయన వెల్లడించారు.

డయాబెటిస్ తో బాధపడుతున్నారా.. ప్రతిరోజు ఆహారంలో ఇవి తప్పనిసరిగా!

రోజురోజుకు డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య అధికమవుతోంది. ఇలా డయాబెటిస్ తో బాధపడేవారు డయాబెటిస్ తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మనం తినే ఆహారంలో కొన్ని ఔషధాలు గుణాలు కలిగిన ఆహార పదార్థాలను కలిపి తినటం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. మరి ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం

మనం రోజు ఆహారంలో భాగంగా తీసుకొనే పసుపు, అల్లం మరియు ఉసిరి కాయలతో డయాబెటిస్ ను అదుపులో ఉంచవచ్చు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనీ అందరికీ తెలిసిన విషయం. పసుపులో ఎన్నో యాంటీఆక్సిడెంట్, విటమిన్స్, ఐరన్ ఉంటాయి. పసుపు వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఉసిరికాయలు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఉసిరికాయను పసుపుతో కలిపి తీసుకుంటే రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. అలాగే జామకాయ తినడం కానీ లేదా జామ ఆకులను మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కూడా డయాబెటిస్ అదుపులో ఉంచవచ్చు.

అల్లం మనం ప్రతిరోజు తీసుకొనే ఆహార పదార్థాలలో ఒకటి అని చెప్పవచ్చు. అల్లంలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలలో అప్పుడప్పుడు అల్లం వేసుకొని వండుకొని తినడం వల్ల మన రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది . డయాబెటిస్ తో బాధపడేవారు పాలలో కొంచెం పసుపు లేదా అల్లం కలుపుకొని తాగడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.

మధుమేహాన్ని తగ్గించే సీతాఫలం.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!

ప్రస్తుత కాలంలో మన జీవనశైలిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎన్నోరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అలాంటి వాటిలో మధుమేహం ఒకటి. మధుమేహ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి క్రమంగా పెరుగుతుంది. ఈ సమస్యతో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడానికి శ్రమిస్తారు.

ముఖ్యంగా డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం కోసం ఎన్నో మార్గాలను వెతుకుతుంటారు. అలాంటి వారికి సీతాఫలం ఒక అదృష్టం అని చెప్పవచ్చు.మధుమేహ సమస్యతో బాధపడేవారు వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడానికి సీతాఫలం ఆకులు ఎంతో ప్రయోజనకరం.సీతాఫలం ఆకులను ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు నీటిలో కొన్ని ఆకులను వేసి బాగా మరిగించాలి.ఈ విధంగా సీతాఫలం ఆకులతో కషాయం తయారు చేసుకుని ప్రతిరోజూ పరగడుపున త్రాగటం వల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

సీతాఫలం ఆకులలో అధిక మొత్తంలో మెగ్నీషియం ఉండటం వల్ల గుండె పనితీరును గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుంది. సీతాఫలం ఆకులు అధిక మొత్తంలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.ఈ క్రమంలోనే ప్రతిరోజు ఈ కషాయం తాగడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయని చెప్పవచ్చు.

కేవలం సీతాఫలం ఆకులలో మాత్రమేకాకుండా, కాయలు, బెరడు,వేర్లు ఇలా ప్రతి ఒక్క భాగంలోనూ ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల సీతాఫలం మొక్కలను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ సీతాఫలం మొక్కను వివిధ భాగాలలో ఉపయోగించడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, మధుమేహం, డయేరియా వంటి వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.

మధుమేహంతో బాధపడుతున్నారా… అయితే వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో వ్యాధులను వెంటబెట్టుకొని వస్తుంది. ఈ క్రమంలోనే ఈ వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఈ వర్షాకాలంలో మరిన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం.సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహంతో బాధపడే వారు వర్షాకాలంలో అధికంగా జాగ్రత్తలు తీసుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వర్షాకాలంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

వర్షాకాలం అయినప్పటికీ మధుమేహంతో బాధపడేవారు తరచూ నీటిని తాగుతూ ఉండాలి.మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా మూత్రాశయం వెళ్తుంటారు కనుక వారి శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా అధిక మొత్తంలో నీటిని తీసుకోవాలి. ఈ క్రమంలోనే జ్యూసులు ఇతర పానీయాలకు దూరంగా ఉండాలి.

పచ్చి కూరగాయలు లేదా పచ్చి ఆహార పదార్థాలకు మధుమేహ వ్యాధిగ్రస్తులు వర్షాకాలంలో దూరంగా ఉండటం ఎంతో మంచిది.వర్షాకాలంలో అధికంగా సూక్ష్మ జీవులు ఉంటాయి కనుక వీలైనంత వరకు పచ్చి ఆహార పదార్థాలు, కూరగాయలు తినకూడదు. వాటిని బాగా ఉడికించి తీసుకోవాలి.ఒకవేళ పచ్చి పండ్లు కూరగాయలను తిన్నప్పుడు వాటిని వెనిగర్, నిమ్మరసం, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని తినాలి.

వర్షాకాలం అనేక వ్యాధులకు నిలయం కనుక వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం.కేవలం బ్యాక్టీరియా సూక్ష్మజీవుల నుంచి రక్షణ పొందటమే కాకుండా ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలన్న వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం. అదేవిధంగా ఎలాంటి పరిస్థితులలో కూడా తడిబట్టలతో ఉండకూడదు. వర్షాకాలంలో మధుమేహంతో బాధపడేవారు ఈ విధమైనటువంటి జాగ్రత్తలను తీసుకున్నప్పుడు ఎంతో సురక్షితంగా ఉండగలరని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఆహారంలో ఇవి తప్పనిసరి?

ప్రతిరోజు వివిధ రకాల కూరల్లో వాడే కరివేపాకును చాలామంది సువాసన కోసమే అని భావించి తినకుండా పక్కన పడేస్తుంటారు. అది పొరపాటే! ఎందుకంటే కరివేపాకులో మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, క్యాల్షియం, పాస్ఫరస్‌, ఫైబర్ ,ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, బీటా కెరటిన్‌,మాంసకృత్తులు,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.అలాగే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న కరివేపాకును ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్లభవిష్యత్తులో వచ్చే ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.

కరివేపాకును ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకులో సమృద్ధిగా ఉన్న విటమిన్ ఎ కంటి సమస్యలను దూరంచేసి కంటిచూపును మెరుగు పరుస్తుంది.అలాగే జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.నీటిలో కరివేపాకును బాగా మరిగించి కాస్త నిమ్మరసం,చక్కెర కలిపి ‘టీ’ రూపంలో ప్రతిరోజు తీసుకుంటే వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది. అలాగే శరీరంలో మలినాలు తొలగించి అతి బరువు సమస్య నుంచి బయట పడవచ్చు.

కరివేపాకులో ఉన్న ఔషధగుణాలు క్లోమ గ్రంథిని ఉత్తేజపరిచి ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగు పరుస్తుంది.దాంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి ప్రమాదకర డయాబెటీస్ వ్యాధి నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ పొందవచ్చు. కరివేపాకులో అధికంగా ఉన్న ఐరన్, ఫైబర్, ఫోలిక్‌యాసిడ్‌ ప్రమాదకర రక్తహీనత, కిడ్నీ సమస్యలు, జీర్ణ సమస్యల,గుండె జబ్బులు వంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.

మధుమేహంతో బాధపడేవారికి శుభవార్త.. త్వరలోనే రానున్న మధుమేహా మందు?

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ (మధుమేహం)
వ్యాధి ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఈవ్యాధిని మొదట్లోనే గుర్తించగలిగితే కొంత వరకు అదుపు చేయవచ్చు.డయాబెటిస్ ప్రధానంగా రెండు రకాలు టైప్1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్
వీటిలో సాధారణంగా టైప్-1డయాబెటిస్‌ను చిన్నతనంలోనే గుర్తిస్తారు. ఇలాంటి వారు చిన్నప్పటి నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది.

Doctor making blood sugar test. Hands with gloves on medical background

డయాబెటిస్ వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది.కొంత మందిలో షుగర్ వ్యాధి లక్షణాలు ఉన్నా వాటిని గుర్తించడం కష్టం. షుగర్ వ్యాధికి మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిలను అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే.అంటే శరీరంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగినప్పుడు దానిని కంట్రోల్ చేసే సామర్ధ్యం శరీరానికి లేనప్పుడు షుగర్ వ్యాధి వస్తుంది.

షుగర్ వ్యాధి వచ్చిందంటే జీవిత కాలం పాటు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.తాజా అధ్యయనం ప్రకారం టైప్‌1 మధుమేహ వ్యాధి ముప్పు పొంచి ఉన్నవారికి టెప్లిజుమాబ్‌ మందు తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. ఇలాంటివారికి టెప్లిజుమాబ్‌ ఉపయోగపడుతున్నట్టు, జబ్బు బయటపడటం రెండున్నరేళ్లు ఆలస్యమవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

ఇలాంటి వారిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి మెరుగవ్వటం గమనార్హం.ఒక కోర్సు మందుతోనే దీర్ఘకాలం పాటు ప్రయోజనాలు కనిపిస్తున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఇక టెప్లిజుమాబ్‌ అనుమతి లభిస్తే టైప్‌1 డయాబెటిస్ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనే తొలి మందు ఇదే కావడం విశేషం.

షుగర్ వ్యాధి కంట్రోల్ కావాలంటే… ఇవి తినాల్సిందే!

ప్రస్తుతం కాలంలో ఎంతో మంది బాధ పడుతున్న సమస్యలలో షుగర్ వ్యాధి సమస్య ఒకటి. షుగర్ వ్యాధితో బాధ పడేవారు వారి ఆహార నియమాలలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. ముఖ్యంగా టైప్ డయాబెటిస్తో బాధపడే వారు వారి ఆహార విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూనే శారీరక వ్యాయామాలు వంటివి చేయడం వల్ల షుగర్ వ్యాధిని అదుపు చేసుకోవచ్చు.

షుగర్ వ్యాధితో బాధ పడేవారు సూపర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ పదార్థాలలో హెల్దీ ఫ్యాట్స్ ఉండడం వల్ల అవి హార్ట్ డిసీజ్‌ని ప్రివెంట్ చేస్తాయని, వాటిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి అవి డయాబెటీస్ కంట్రోల్ చేస్తాయని చెప్పవచ్చు. మరి షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే ఫుడ్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

బెర్రీస్: బెర్రీస్ లో ఎక్కువ భాగం మనకు ఫైబర్ లు లభిస్తాయి. అదేవిధంగా ఈ పండ్లలో ఎక్కువగా న్యూట్రియన్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఇవి షుగర్ వ్యాధిని అదుపు చేయడమే కాకుండా వివిధ రకాల క్యాన్సర్ కణాలను అణచివేస్తూ మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

ముదిరిన ఆకుపచ్చ కూరలు: ముదిరిన ఆకుపచ్చ ఆకుకూరలలో ఎక్కువభాగం మనకు ఫైబర్, విటమిన్లు, క్యాల్షియం, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి షుగర్ వ్యాధితో పాటు ఇతర వ్యాధులను అదుపుచేయడానికి కీలక పాత్ర పోషిస్తాయి.

పప్పు ధాన్యాలు: పప్పు ధాన్యాలను అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఈక్రమంలోనే రక్తపోటును అదుపు చేస్తుంది. ఈ పప్పుధాన్యాలలో అధిక భాగం విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు గ్రీన్ టీ, నట్స్, ఆలివ్ ఆయిల్, సాల్మన్ చేపలు వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు.

మధుమేహంతో బాధపడుతున్నారా.. అయితే ఈ టీ తప్పనిసరిగా తాగాల్సిందే.!

ప్రస్తుత కాలంలో కొన్ని కారణాల వల్ల ఎంతోమంది రోజురోజుకీ మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి చిన్న పెద్ద అని వయసుతో తేడా లేకుండా ఈ సమస్యతో బాధపడుతున్నారు.ఈ విధంగా మధుమేహంతో బాధపడేవారు వారి శరీరంలో షుగర్ స్థాయిలను నియంత్రించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహార నియమాలను పాటిస్తూ ప్రతిరోజు మందులను వాడుతూ ఉంటారు. ఈ విధంగా ఈ వ్యాధితో బాధపడే వారికి ఈ వ్యాధి నుంచి విముక్తి పొందటానికి అద్భుతమైన పరిష్కారం ఈ టీ త్రాగటం వల్ల దొరుకుతుందని చెప్పవచ్చు.

సాధారణంగా జామ పండ్లను పేదవాడి ఆపిల్ అని పిలుస్తారు. ఆపిల్ లో లభించే పోషకాలన్నీ జామపండులో మనకు లభిస్తాయి.అదేవిధంగా జామ ఆకుల ద్వారా కూడా ఎన్నో పోషకాలు అందుతాయి కాబట్టి వీటి ద్వారా తయారుచేసుకున్న టీత్రాగటం వల్ల మధుమేహాన్ని పూర్తిగా నియంత్రించడమే కాకుండా మరి కొన్ని అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు. ప్రతిరోజు ఉదయం జామ ఆకులతో తయారు చేసుకున్న టీని తాగడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగి చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి ఈ జామ ఆకుల టీ తాగడం ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు. అయితే ఈ జామాకుల టీ ను దాదాపు పన్నెండు వారాల పాటు తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు

ఈ జామ ఆకుల టీ లో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. ప్రతిరోజు ఈ టీ త్రాగటం వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.అదే విధంగా ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడేవారు ఈ టీ త్రాగటం వల్ల కీళ్ల నొప్పులు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా పట్టి నొప్పి సమస్యతో బాధపడేవారు జామ ఆకులను నమలడం వల్ల తొందరగా ఈ నొప్పి నుంచి విముక్తి పొందవచ్చు. నోటి పూత, చిగుళ్ళు వాపు వంటి సమస్యలను తగ్గించడంలో జామాకులు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మధుమేహంతో బాధపడేవారు ఈ అన్నం తింటే అదుపులో ఉంచుకోవచ్చు..!

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు కనుగుణంగా ఆరోగ్యపరంగా మన శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మన దేశంలో ఎక్కువగా అన్నం తినడం ద్వారా ఎంతో మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక్కసారి మధుమేహంబారిన పడిన వారు అన్నం తినాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇలాంటి వారికి ఇది ఒక శుభవార్తే అని చెప్పవచ్చు.ఈ విధంగా అన్నం తయారుచేసుకుని తినడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే విధానం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా మనం తినే అన్నంలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయి పెరిగి మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే మధుమేహంతో బాధపడేవారు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం కోసం ఒక పూట మాత్రమే అన్నం తీసుకోవడం, మిగిలిన సమయాలలో ఎక్కువగా చపాతి, రొట్టె వంటి వాటిని తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకున్నారు. శ్రీలంక దేశానికి చెందిన కాలేజ్‌ ఆఫ్‌ కెమికల్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ద్వారా అన్నంలో కేలరీలను సగానికి సగం తగ్గించే నూతన విధానాన్ని కనిపెట్టారు. ఇందులో భాగంగానే అన్నం తయారు చేసుకునేటప్పుడు అర కప్పు మరిగే నీటిలో మనం వంట కోసం ఉపయోగించే కొబ్బరి నూనెను వేయటం వల్ల అన్నంలో ఉన్న కేలరీలు సగానికి సగం తగ్గుతాయని కనుగొన్నారు. దీంతో మధుమేహంతో బాధపడేవారు అన్నం తిన్నప్పటికి కూడా శరీరంలో చక్కెర స్థాయిలు పెరగవు.

సాధారణంగా మనం అన్నం తిన్నప్పుడు వెంటనే జీర్ణమవుతుంది అని మనకు తెలిసిందే. ఈ విధంగా కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల శరీరంలో ఆహారం పది రెట్లు ఆలస్యంగా జీర్ణమవుతుందని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు వెల్లడించారు.ఈ విధంగా అన్నం చేసుకోవటం ద్వారా మధుమేహంతో బాధపడే వారు సైతం నిరభ్యంతరంగా అన్నం తినొచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

డయాబెటిస్ రోగులు అస్సలు తినకూడని ఆహార పదార్థాలు ఇవే..?

దేశంలో మధుమేహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మధుమేహంతో బాధపడే వాళ్లు తప్పనిసరిగా తీసుకునే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని ఆహార పదార్థాలను మధుమేహ రోగులు అస్సలు తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శీతాకాలంలో మధుమేహ రోగులు తీసుకునే ఆహార పదార్థాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

టైప్ 2 డయాబెటిస్ ను అదుపులో ఉంచాలంటే షుగర్ లెవెల్స్ పెంచని ఆహార పదార్థాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. మధుమేహ రోగులు పూరీ, మక్కీ రోటీ, వేడివేడి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఈ మూడు షుగర్ లెవెల్స్ ను వేగంగా పెంచుతాయి. నారింజ రసంను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. నారింజలో విటమిన్ సితో పాటు గ్లూకోజ్ ను విడుదల చేసే చక్కెరలు కూడా ఎక్కువగా ఉంటాయి.

నారింజ పండ్లలో ఫైబర్, ప్రోటీన్ తక్కువగా ఉండటం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి. మధుమేహ రోగులు వేగించి ఫ్రై చేసిన ఆహారపదార్థాలను తీసుకోకూడదు. వేగించి ఫ్రై చేసిన ఆహార పదార్థాల్ల్లో ట్యాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ట్యాన్స్ ఫ్యాట్స్ ఇన్ ఫ్లమేషన్ ను పెంచుతాయి. ఇలా జరగడం వల్ల శరీరంలో కణాలు ఇన్సులిన్ కు స్పందించవు.

శరీరంలో కణాలు స్ప్ందించకపోతే గ్లూకోజ్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. వీటితో పాటు పాస్తా, రైస్, వైట్ బ్రెడ్ ను డయాబెటిస్ రోగులు తినకూడదు. చక్కెరతో తయారైన పానీయాలను సైతం అస్సలు తీసుకోకూడదు. ఎక్కువగా ప్రాసెస్ చేసిన తృణధాన్యాలను, ఎక్కువ రుచి కలిగిన కాఫీలను, డ్రై ఫ్రూట్స్ ను, సహజసిద్ధమైన చక్కెరను కలిగి ఉన్న తేనెను, ప్యాక్ చేయబడిన స్నాక్స్ ను, ఫ్రెంచ్ ఫ్రైస్ ను, పండ్ల రసాలు, ఫ్రూట్ ఫ్లేవర్ ఉన్న పెరుగును తీసుకోకూడదు.