రోజురోజుకు డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య అధికమవుతోంది. ఇలా డయాబెటిస్ తో బాధపడేవారు డయాబెటిస్ తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మనం తినే ఆహారంలో కొన్ని ఔషధాలు గుణాలు కలిగిన ఆహార పదార్థాలను కలిపి తినటం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. మరి ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం
మనం రోజు ఆహారంలో భాగంగా తీసుకొనే పసుపు, అల్లం మరియు ఉసిరి కాయలతో డయాబెటిస్ ను అదుపులో ఉంచవచ్చు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనీ అందరికీ తెలిసిన విషయం. పసుపులో ఎన్నో యాంటీఆక్సిడెంట్, విటమిన్స్, ఐరన్ ఉంటాయి. పసుపు వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఉసిరికాయలు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఉసిరికాయను పసుపుతో కలిపి తీసుకుంటే రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. అలాగే జామకాయ తినడం కానీ లేదా జామ ఆకులను మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కూడా డయాబెటిస్ అదుపులో ఉంచవచ్చు.
అల్లం మనం ప్రతిరోజు తీసుకొనే ఆహార పదార్థాలలో ఒకటి అని చెప్పవచ్చు. అల్లంలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహార పదార్థాలలో అప్పుడప్పుడు అల్లం వేసుకొని వండుకొని తినడం వల్ల మన రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది . డయాబెటిస్ తో బాధపడేవారు పాలలో కొంచెం పసుపు లేదా అల్లం కలుపుకొని తాగడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…