వర్షాకాలం వచ్చిందంటే ఎన్నో వ్యాధులను వెంటబెట్టుకొని వస్తుంది. ఈ క్రమంలోనే ఈ వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఈ వర్షాకాలంలో మరిన్ని జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం.సాధారణ వ్యక్తులతో పోలిస్తే మధుమేహంతో బాధపడే వారు వర్షాకాలంలో అధికంగా జాగ్రత్తలు తీసుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు వర్షాకాలంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
వర్షాకాలం అయినప్పటికీ మధుమేహంతో బాధపడేవారు తరచూ నీటిని తాగుతూ ఉండాలి.మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా మూత్రాశయం వెళ్తుంటారు కనుక వారి శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా అధిక మొత్తంలో నీటిని తీసుకోవాలి. ఈ క్రమంలోనే జ్యూసులు ఇతర పానీయాలకు దూరంగా ఉండాలి.
పచ్చి కూరగాయలు లేదా పచ్చి ఆహార పదార్థాలకు మధుమేహ వ్యాధిగ్రస్తులు వర్షాకాలంలో దూరంగా ఉండటం ఎంతో మంచిది.వర్షాకాలంలో అధికంగా సూక్ష్మ జీవులు ఉంటాయి కనుక వీలైనంత వరకు పచ్చి ఆహార పదార్థాలు, కూరగాయలు తినకూడదు. వాటిని బాగా ఉడికించి తీసుకోవాలి.ఒకవేళ పచ్చి పండ్లు కూరగాయలను తిన్నప్పుడు వాటిని వెనిగర్, నిమ్మరసం, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని తినాలి.
వర్షాకాలం అనేక వ్యాధులకు నిలయం కనుక వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం.కేవలం బ్యాక్టీరియా సూక్ష్మజీవుల నుంచి రక్షణ పొందటమే కాకుండా ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలన్న వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం. అదేవిధంగా ఎలాంటి పరిస్థితులలో కూడా తడిబట్టలతో ఉండకూడదు. వర్షాకాలంలో మధుమేహంతో బాధపడేవారు ఈ విధమైనటువంటి జాగ్రత్తలను తీసుకున్నప్పుడు ఎంతో సురక్షితంగా ఉండగలరని నిపుణులు చెబుతున్నారు.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నాంపల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కొనసాగుతున్న…
అమెరికాలో కోట్ల రూపాయల జీతం అంటే అందరూ కలల ప్రపంచంలోకి వెళ్లిపోతారు. కానీ ఆ సంపాదన వెనుక ఉన్న ఖర్చులు…
నిద్ర ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో వైద్య నిపుణులు తరచుగా చెబుతూనే ఉంటారు. సరైన నిద్ర లేకపోతే శరీరంతో పాటు మానసిక…
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన…
కేంద్ర రాజకీయాల్లో తాజా పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా…
డిజిటల్ యుగంలో డేటింగ్ సంస్కృతి కొత్త మలుపు తిరుగుతోంది. సాధారణంగా సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ ప్రేమ సంబంధాల కోసం…