Tag Archives: Directed by Sudhir Varma

Nivetha Thomas: మొహం మొత్తం రక్తపు గాయాలతో నటి నివేద థామస్… ఆందోళనలో అభిమానులు!

Nivetha Thomas: నివేద థామస్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.ఎక్స్ప్రెషన్ క్వీన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో జరిగే ఎక్కిన శాకిని డాకిని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన లభించుకుంది.

ఈ సినిమాలో నివేదా థామస్ తో పాటు రెజీనా కూడా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరూ ట్రైనీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వీరిద్దరూ ఈ సినిమా విడుదలైన అనంతరం నివేదా థామస్ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె తన మొహం మొత్తం రక్తపు గాయాలు అయినటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు నివేద థామస్ కి ఏమైంది అంటూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. కంగారుగా చూస్తే ఈమెకు నిజంగానే ప్రమాదం జరిగిందా అనే ఆలోచన రాకమనదు అయితే ఇదంతా కూడా సినిమా షూటింగ్ సమయంలో ఓ సన్నివేశంలో భాగంగా మేకప్ అయినట్టు తెలుస్తుంది.

 

 

Nivetha Thomas: సినిమా ప్రమోషన్ లో నివేథా…

ఇలా కుడి కనుబొమ్మ పెదవులపై తీవ్రమైన రక్తపు గాయాలతో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయగా ఒక్కసారిగా అభిమానులు ఆందోళన చెందారు. అయితే తనకి ఎలాంటి ప్రమాదం జరగలేదని కేవలం సినిమా షూటింగ్ సమయంలో తీసినటువంటి ఈ ఫోటోని ప్రస్తుతం షేర్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Adivi Sesh: నాకు స్టామినా ఎక్కువ.. మగాళ్ళు, మ్యాగీతో 2 నిమిషాలే అన్నావంట? హీరోయిన్ రెజినాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అడవి శేష్ !

Adivi Sesh: రెజీనా కసాండ్రా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె తాజాగా శాకిని డాకిని అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ థియేటర్లో విడుదల కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నివేద థామస్ రెజీనా ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రెజీనా మగాళ్ళ గురించి మాట్లాడుతూ మగాళ్లు మ్యాగీ మాదిరే రెండు నిమిషాల్లో అయిపోతారు అంటూ కామెంట్ చేశారు.అయితే ఇది జోక్ అని చెప్పినప్పటికీ ఈ మాటలు విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇలా మగాళ్ళ గురించి రెజీనా చేసిన ఈ కామెంట్స్ పై పలువురు స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో అడివి శేష్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొనడమే కాకుండా ఈమె చేసిన ఈ కామెంట్స్ పై స్పందిస్తూ నటి రెజీనాకు స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ఈ క్రమంలోనే శేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Adivi Sesh: నాకు స్టామినా ఎక్కువ..

ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ ఏంటి ఈ మధ్య మగాళ్లు మ్యాగీ అంటూ ఏదో మాట్లాడావట.. నాకు స్టామినా ఎక్కువ అందుకే ఎక్కువ కాలం సినిమాలు చేస్తుంటానని అందరూ అంటూ ఉంటారని శేష్ సమాధానం చెప్పారు. దీంతో రెజీనా స్పందిస్తూ రెండు నిమిషాల్లో చెబుతా అంటూ ఒక్కసారిగా నవ్వేసింది. ఈ విధంగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.