Tag Archives: entry

Bigg Boss 6: బిగ్ బాస్ ఫస్ట్‌ గింప్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ హౌస్.. వైరల్ అవుతున్న వీడియో!

Bigg Boss 6: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం మరో రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ కార్యక్రమాన్ని బుల్లితెరపై ఆరవ సీజన్ ప్రసారం చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇక ఈ సీజన్లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారని వీరిలో 15 మంది ఆదివారం హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా మరో నలుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లను క్వారంటైన్‌కి తరలించారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ప్రోమోలు విడుదల చేయగా ఈ ప్రోమో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయి.

ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్ విడుదల చేశారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కోసం ఏర్పాటు చేసిన హౌస్ చూపించారు. అయితే గత సీజన్ల కన్నా ఈ సీజన్లో ఏర్పాటుచేసిన హౌస్ ఎంతో భిన్నంగా ఉందని తెలుస్తోంది.అదేవిధంగా ఆదివారం ఈ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన ఎంట్రీ, పర్ఫామెన్స్ లను కూడా చూపించారు.

Bigg Boss 6: వైరల్ అవుతున్న కంటెస్టెంట్స్ లిస్ట్…

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయానికొస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ పింకీ, ఆదిరెడ్డి, గలాటగీతు, రీతు చౌదరి, చలాకి చంటి, రేవంత్,బుల్లితెర దంపతులు రోహిత్‌-మెరీనా అబ్రహం, సిరి ప్రియుడు శ్రీహాన్ వంటి కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనే విషయం తెలియాలంటే మరి రెండు రోజులు వేచి ఉండాలి.

Vanitha Vijay Kumar: జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన వనితా విజయ్ కుమార్… ఇక షోలో రచ్చ రచ్చే!

Vanitha Vijay Kumar: ప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాలలో కన్నా ఎక్కువ కాంట్రవర్సీల ద్వారా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భర్తలకు విడాకులిచ్చి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.

Vanitha Vijay Kumar: జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన వనితా విజయ్ కుమార్… ఇక షోలో రచ్చ రచ్చే!

ఇలా నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలిచే ఈ కాంట్రవర్సి బ్యూటీ తాజాగా జబర్దస్త్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కార్యక్రమంలోకి ఎంతో మంది కొత్త వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు.అలాగే ఈ కార్యక్రమంలో ఎన్నో సంవత్సరాల నుంచి కమెడియన్ గా పనిచేస్తున్న వారందరూ ఒక్కసారిగా మాయమవుతున్నారు.

Vanitha Vijay Kumar: జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన వనితా విజయ్ కుమార్… ఇక షోలో రచ్చ రచ్చే!

ఇలా ఎంతో మంది కమెడియన్స్ ఇప్పటికే ఈ కార్యక్రమం నుంచి తప్పుకోగా, ఎంతో మంది కొత్తవారు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి రోజా ఈ వారం కూడా కనిపించలేదు. రోజా స్థానంలో నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.రోజాకు మంత్రి పదవి ఖాయమైందని, అందుకే ఈ కార్యక్రమానికి రావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

కామెడీతో ఆకట్టుకున్న వనితా…

ఇక ఈ వారం ప్రసారమయ్యే ఎపిసోడ్ లో జబర్దస్త్ వేదికపైకి కాంట్రవర్సి బ్యూటీ వనితా విజయ్ కుమార్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఒక స్కిట్ లో భాగంగా తన కామెడీ పంచ్ లతో అందరిని నవ్వించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఎన్నో వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన వనిత ఈ విధంగా జబర్దస్త్ వేదికపైకి ఎంట్రీ ఇవ్వడంతో ఇక షోలో ఎలాంటి రచ్చ జరుగుతుందో తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Big Boss OTT: మరికాసేపట్లో బిగ్ బాస్ నాన్ స్టాప్…. ఎంట్రీ ఇవ్వనున్న కంటెస్టెంట్ లు వీళ్ళే!

Big Boss OTT:బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమం తెలుగులో 5 సీజన్లలో పూర్తిచేసుకుని నేడు ఈ కార్యక్రమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అవుతుంది.

24 గంటల పాటు ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి సిద్ధమైంది. ఇకపోతే ఈ కార్యక్రమంలోకి ఇదివరకే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లతో పాటు మరికొంతమంది యూట్యూబర్స్, యాంకర్స్, సీరియల్ ఆర్టిస్ట్ లు పాల్గొనబోతున్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

17 మంది కంటేస్టెంట్లతో ఈ కార్యక్రమాన్ని మరికాసేపట్లో ప్రారంభించనున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఎంట్రీ ఇవ్వనున్న ఫైనల్ కంటెస్టెంట్ లు వీళ్లే అంటూ ఓ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ లు ఎవరు అనే విషయానికి వస్తే..

వచ్చేవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ…

అరియానా, యాంకర్‌ శివ అఖిల్‌ సార్థక్‌, సరయు, తేజస్వి మదివాడ, మహేష్‌ విట్టా, అషు రెడ్డి ఫస్ట్‌ ఎంట్రీ,హమీదా, నటరాజ్‌ మాస్టర్‌, నిఖిల్‌, మిత్రా శర్మ,ముమైత్‌ ఖాన్‌, ఆర్జే చైతు, శ్రీ రాపాక, అనిల్‌ రాథోడ్‌, అజయ్‌ కతుర్వార్‌ ప్రస్తుతం వీరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈసారి సీక్రెట్ రూమ్ కాకుండా కంటెస్టెంట్స్ అందరిని ఒకేసారి హౌస్ లోకి పంపించనున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే వారం బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉండనున్నట్లు సమాచారం.

Indian Digital Currency: భార‌తీయుల‌కు శుభ‌వార్త‌..! ఆ రోజే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ..

Indian Digital Currency: త్వరలోనే దేశంలో డిజిటల్ కరెన్సీ రాబోతోంది. ఇప్పటికే బడ్జెట్ లో ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే  డిజిటల్ కరెన్సీ వచ్చ ఏడాది తొలినాళ్లలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభత్వ వర్గాలు అంటున్నాయి.

Indian Digital Currency: భార‌తీయుల‌కు శుభ‌వార్త‌..! ఆ రోజే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ..

ఇది ప్రైవేటు కంపెనీలు నిర్వహించే ఎలక్ట్రానిక్ వాలెట్ల రూపంలోనే ఉంటుందని.. కాకపోతే ప్రభుత్వ హామీ ఉండటం దీని ప్రత్యేకత.  రిజర్వ్ బ్యాంకు జారీచేసే ఈ కరెన్సీ యూనిట్లు.. ప్రస్తుతం చెలామనీ అవుతున్న పరిమిత స్ఘాయిలోని భౌతిక కరెన్సీ లాగే ఉంటుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

Indian Digital Currency: భార‌తీయుల‌కు శుభ‌వార్త‌..! ఆ రోజే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ..

డిజిలట్ రూపంలో జారీ చేసే కరెన్సీ.. చెలామనీలో ఉన్న కరెన్సీలాగే ఉపయోగించవచ్చు. అయితే ఇది ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంటే… వచ్చే ఏడాది తొలి నెలల్లో డిజిటల్ కరెన్సీ సిద్ధం అవుతుందని ఆర్బీఐ అధికారులు తెలిపారు. 


లావాదేవీలన్నీంటిని రిజర్వ్ బ్యాంక్ మానిటరింగ్..

ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మొబైల్ వాలెట్ల లావాదేవీలను పరిశీలిస్తే.. యూజర్లు ముందుగా ఓ ప్రైవేట్ కంపెనీకి తమ డబ్బును ట్రాన్ఫర్ చేస్తే.. ఆ తరువాత సదరు సంస్థ ఆ డబ్బును అవతలి పక్షానికి బదలాయిస్తోంది. ఇందుకు ఛార్జీలను కూడా వసూలు చేస్తోంది. అయితే ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటోంది. అదే డిజిటల్ రూపీని విషయానికి వస్తే.. మన డబ్బు రిజర్వ్ బ్యాంకు దగ్గర డిజిటల్ కరెన్సీ రూపంలో ఉంటుంది. మనం చేసే లావాదేవీలన్నీంటిని రిజర్వ్ బ్యాంక్ మానిటరింగ్ చేస్తుంది. దీంతో పాటు ప్రభుత్వ హామీ ఉంటుంది. వివాదాస్పద క్రిప్టో కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారిత అధికారిక డిజిటల్‌ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Singer Sunitha: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సింగర్ సునీత తనయుడు… నిర్మాతగా సునీత భర్త!

Singer Sunitha: సంగీత ప్రేమికులకు సింగర్ సునీత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈమె కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఒంటరిగా తన బిడ్డల బాధ్యతలను చూసుకుంటూ జీవితంతో పోరాటం చేస్తున్న సునీత గత ఏడాది మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేని రెండవ వివాహం చేసుకున్నారు.

Singer Sunitha: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సింగర్ సునీత తనయుడు… నిర్మాతగా సునీత భర్త!

ఇలా రెండవ వివాహం తర్వాత సునీత సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.రెండో వివాహం చేసుకోవడంతో మొదట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న ఈమె తన జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారని చెప్పవచ్చు. ఇక తన భర్త వ్యాపార వ్యవహారాలను చూసుకుంటూ మరోవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్న సునీత తనకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా అభిమానులతో పంచుకున్నారు.

Singer Sunitha: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన సింగర్ సునీత తనయుడు… నిర్మాతగా సునీత భర్త!

ఈ క్రమంలోనే సునీత తన పిల్లల కెరియర్ పట్ల కూడా ఎంతో బాధ్యత కలిగి ఉన్నారని తెలుస్తోంది.ఇప్పటికే తన కూతురిని సింగర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సునీత తన కొడుకుని కూడా హీరోగా పరిచయం చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిర్మాతగా మారిన మ్యాంగో మ్యూజిక్ అధినేత…

ఈ క్రమంలోనే సునీత కొడుకు ఆకాశ్ ను తెలుగు తెరకు హీరోగా పరిచయం చేయాలని సునీత ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఆకాష్ ఇప్పటికీ నటనలో శిక్షణ తీసుకుంటున్నారని త్వరలోనే ఇతనిని ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా ఆకాష్ హీరోగా నటించే సినిమాకు సునీత భర్త రామ్ నిర్మాతగా మారనున్నట్లు సమాచారం. ఇకపోతే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న పూరీ జగన్నాథ్ కూతురు.. అయితే ఇలా!

ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు.. ఏ పరిశ్రమలో అయినా వారసులు రావడం అనేది కామన్. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇప్పటికే మూడు తరాలు ఇలా ఏలేస్తున్నారు. అందులో కూడా నటీనటుల వారసులే ఎక్కువగా నటనవైపు వస్తుంటారు. స్టార్ హీరోల నుండి దర్శక, నిర్మాతల కుమారులు ఎక్కువగా నటులుగా మారుతుంటారు.

కుమార్తెలు మాత్రం వెండితెరకి దూరంగానే ఉంటున్నారు. బాలీవుడ్ లో ఇలా వారసురాళ్లు పరిశ్రమలో బాగానే అడుగుపెట్టేశారు. కానీ మన తెలుగులో మాత్రం అరుదనే చెప్పాలి.
మోహన్ బాబు కుమార్తె మంచు ల‌క్ష్మీ, రాజ‌శేఖ‌ర్ కూతుళ్లు శివాని, శివాత్మిక, సూప‌ర్ స్టార్‌ కృష్ణ కూతురు మంజుల‌, నాగ‌బాబు కూతురు నిహారిక‌ లాంటి వార‌సురాళ్లు వచ్చినా వాళ్ళు పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు.

కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ.. స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలబడలేకపోయారు. ఇక ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర టాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ గా మారింది. ఇప్పటికే పూరి కొడుకు ఆకాష్ హీరోగా రొమాంటిక్ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పవిత్ర ముస్తాబయ్యే తీరు చూస్తుంటే.. కచ్చితంగా హీరోయిన్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కానీ ఆమెకు నిర్మాతగా స్థిరపడాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకుడిగా కాకుండా.. నిర్మాతగా పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో అతడి నిర్మాణ నేపథ్యంలో లైగర్ రాబోతోంది. ఇదే నిర్మాణంలో పవిత్ర కూడా త్వరలోనే కచ్చితంగా భాగం కానుందనేది బయటక వినిపిస్తున్న టాక్.

టీఆర్పీ కోసం బిగ్ బాస్ భారీ స్కెచ్.. ఫ్యామిలీ మెంబర్స్ రాకతో..

బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా తమ ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు బిగ్బాస్. సీజన్ 4 లో కేవలం గ్లాస్ అవుతల నిలబడి మాట్లాడి వెళ్లారు. కారణం అందరికీ తెలిసిందే. కరోనా కారణంగా అంలాంటి పరిస్థితి నెలకొంది.

అయితే ఈ సారి కరోనా వ్యాప్తి తగ్గడం.. అంతే కాకుండా హౌస్ లోకి వెళ్లేవారిని నాలుగు రోజుల ముందే కరోనా టెస్ట్ చేయించి.. క్వారంటైన్ చేసినట్లు సమాచారం. ఈ రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో హౌస్ అంతా ఇక ఫ్యామిలీ మెంబర్స్ తో గడపనున్నారు. అందుకే త్వరగా కెప్టెన్సీ టాస్క్ కూడా ముగించేశారు. బుధవారం, గురువారం, శుక్రవారం వరకు ఫ్యామిలీ మీటింగ్ ఎపిసోడ్లను టెలికాస్ట్ చేయనున్నట్లు సమాచారం.

దీంతో ఆ మూడు రోజులు స్టార్ మా కు మంచి టీఆర్పీ వస్తుందని బిగ్బాస్ విశ్లేషకులు చెబుతున్నారు. హౌస్ లోకి ఏ కంటెస్టెంట్ కోసం ఏ ఫ్యామిలీ మెంబెర్స్ వస్తున్నారో తెలుసుకుందాం.. ఈ మీటింగ్ అనేది బిగ్ బాస్ నిర్వాహకులు చాలా స్పెషల్ గా ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షణ్ముఖ్ కోసం వల్ల అమ్మ ఉమ రాణి, గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా రాబోతున్నారని సమాచారం.

సన్నీ కోసం వాళ్ల అమ్మ కళావతి వస్తున్నారట. ఇక సిరి కోసం వాళ్ల అమ్మ మరియు తను దత్తత తీసుకున్న కుమారుడు హౌస్ లోకి రానున్నారని విశ్వసనీయ సమాచారం. అలాగే ప్రియాంక సింగ్ కోసం వాళ్ల తల్లిదండ్రులు రాబోతున్నారట. మానస్ కోసం వాళ్ల అమ్మ పద్మ వస్తున్నారట. ఇక హౌస్ లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు భావోద్వేగంతో కూడిన సందడి చేయనున్నారు.

ఎన్టీఆర్ సరసన..టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న జాన్వీకపూర్.. !

సగటు తెలుగు ప్రేక్షకుడు ఎప్పటికీ మర్చిపోలేని సినిమా జగదేక వీరుడు.. అతిలోక సుందరి. అంతలా ఆ సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. అందులో అలనాటి తార.. దివి నుంచి దిగి వచ్చిన సుందరిగా కనిపించిన శ్రేదేవి నటన ఓ అద్భుతమనే చెప్పాలి. అయితే ఆమె కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్‏లో టాప్ హీరోయిన్లలో ఒకరుగా నిలిచారు.

ఆమె చేసింది తక్కువ సినిమలే అయినా.. తన అందం.. అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ను నిరూపించుకుంది. దీంతో ఆమెకు అభిమానులు క్యూ కట్టారు. ఇలా ఆమె సోషల్ మీడియా అకౌంట్లకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆమె రెస్ట్ లేకుండా.. వరుస సినిమాలతో బిజీ బిజీగా మారారు.

అయితే అమె గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఆమె తెలుగులో కృష్ణ వంశీ దర్శకత్వంలో ఓ సినిమా మరియు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తీయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎలాంటి అప్ డేట్ రాలేదు. తాజాగా మరో వార్త వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక.. ఎన్టీఆర్ 30 వ సినిమాకు ముందుగా హీరోయిన్ గా శ్రీలీలను అనుకోగా.. మళ్లీ ఇప్పుడు జాన్వీ కపూర్ ను అనుకుంటున్నారట. దీంతోనే టాలీవుడ్ లో జాన్వీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జాన్వీతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అధికారికంగా మాత్రం వెల్లడి కాలేదు.