ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు.. ఏ పరిశ్రమలో అయినా వారసులు రావడం అనేది కామన్. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇప్పటికే మూడు తరాలు ఇలా ఏలేస్తున్నారు. అందులో కూడా నటీనటుల వారసులే ఎక్కువగా నటనవైపు వస్తుంటారు. స్టార్ హీరోల నుండి దర్శక, నిర్మాతల కుమారులు ఎక్కువగా నటులుగా మారుతుంటారు.
కుమార్తెలు మాత్రం వెండితెరకి దూరంగానే ఉంటున్నారు. బాలీవుడ్ లో ఇలా వారసురాళ్లు పరిశ్రమలో బాగానే అడుగుపెట్టేశారు. కానీ మన తెలుగులో మాత్రం అరుదనే చెప్పాలి.
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ, రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక, సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల, నాగబాబు కూతురు నిహారిక లాంటి వారసురాళ్లు వచ్చినా వాళ్ళు పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు.
కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ.. స్టార్ హీరోయిన్ గా మాత్రం నిలబడలేకపోయారు. ఇక ప్రస్తుతం పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర టాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ గా మారింది. ఇప్పటికే పూరి కొడుకు ఆకాష్ హీరోగా రొమాంటిక్ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పవిత్ర ముస్తాబయ్యే తీరు చూస్తుంటే.. కచ్చితంగా హీరోయిన్ అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కానీ ఆమెకు నిర్మాతగా స్థిరపడాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్ దర్శకుడిగా కాకుండా.. నిర్మాతగా పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో అతడి నిర్మాణ నేపథ్యంలో లైగర్ రాబోతోంది. ఇదే నిర్మాణంలో పవిత్ర కూడా త్వరలోనే కచ్చితంగా భాగం కానుందనేది బయటక వినిపిస్తున్న టాక్.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…