Tag Archives: etv show

Anchor Anasuya: నా ఆత్మగౌరవం ఎప్పటికీ చంపుకోను…అవకాశాలు లేకపోతే అంట్లు తోముకుంటా.. అనసూయ కామెంట్స్ వైరల్!

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమయ్యారు.ఇలా తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టిన ఈ కార్యక్రమం నుంచి ఈమె వెళ్లిపోవడం అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది.అయితే తాజాగా అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై నోరు విప్పారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్తుంటే తన సొంత ఇంటిని వదిలి వెళుతున్నాను అనే బాధ తనలో కలిగిందని, టీవీ కార్యక్రమాలకు తాను దూరం అవుతానా అనే భయం కూడా తనలో కలిగిందని ఈమె తెలిపారు. ఇకపోతే తాను ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయిగా ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్న మొదట్లో చాలామంది నువ్వు మేకప్ వేసుకోగలవా? కెమెరాను ఫేస్ చేయగలవా? అంటూ ప్రశ్నించినట్లు ఈమె తెలిపారు.

మనం ఇదే రంగం అని కాదు ఏ రంగంలోకి వెళ్లిన చెడు మంచి అనేది ఉంటాయి. అయితే మనం ఎంచుకొనే గమ్యం పట్టి మన ప్రయాణం ఉంటుందని అనసూయ వెల్లడించారు.ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమం తనకు ఎంతో మంచి పేరు తెచ్చిందని అయినా కానీ ఈ కార్యక్రమంలో కొన్ని ఇబ్బందులు కూడా పడ్డానని ఈమె తెలిపారు. ఇలా నాకు ఈ కార్యక్రమంలో ఎదురైన ఇబ్బందుల వల్లే తాను బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని ఈమె తెలిపారు.

Anchor Anasuya: ఎప్పటికీ ఆ తప్పు చేయను…

తనకు తన ఆత్మ గౌరవం కన్నా ఏది ముఖ్యం కాదని మన ఆత్మగౌరవాన్ని చంపుకొని పనిచేయాల్సిన అవసరం లేదంటూ ఈమె తెలిపారు. ఇక ఈ ఫీల్డ్ లో తన ఆత్మ గౌరవాన్ని చంపుకోవాల్సిన పరిస్థితి వస్తే తాను పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తాను ఎంబీఏ చదివానని అలా ఉద్యోగం చేసుకుంటూ బతుకుతానని తెలిపారు.ఇక అక్కడ కూడా ఇబ్బందులు ఎదురైతే ఇంట్లో కూర్చుని అంట్లు తోముకుంటాను కానీ తన ఆత్మ గౌరవాన్ని ఎప్పటికీ చంపుకోనని అనసూయ ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sridevi Drama Company: ఇక మీరు మారరా… మరి ఇంత దిగజారి పోయారా.. మల్లెమాలపై మండిపడుతున్న నెటిజన్స్?

Sridevi Drama Company: బుల్లితెరపై మల్లెమాలవారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్నాయి. ఇకపోతే ఈకార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఎంతో ఉత్కంఠ భరితంగా ప్రోమోలు కట్ చేయడం మనం చూస్తున్నాము.

ఈ ప్రోమోలు చూడగానే అసలు ఏం జరిగిందోననే కంగారు ఆత్రుత ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో కలిగేలా కట్ చేస్తున్నారు. వేదికపైనే గొడవపడి సెట్ లో నుంచి వెళ్లిపోవడం, ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితులు కల్పిస్తూ ప్రోమోలు కట్ చేశారు.ఇలా ప్రోమోలు చూసిన అభిమానులు ఈ కార్యక్రమాన్నిఅంతే ఆత్రుతగా చూసినప్పటికీ చివరికి అక్కడ ఏమీ లేకపోవడంతో కార్యక్రమ నిర్వాహకులపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

ఇప్పటికే ఇలా ఈ కార్యక్రమం రేటింగ్ కోసం ఇలాంటి ప్రోమోలు కట్ చేసి ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడటంతో మల్లెమాల వారిపై ప్రేక్షకులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో చూస్తుంటే ఈ కార్యక్రమం ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమాన్ని తలపించిందని చెప్పాలి.

Sridevi Drama Company: కన్నీళ్లు పెట్టుకున్న ఆది…

ఈ కార్యక్రమంలో భాగంగా మీకు నచ్చని వారి ఫోటోలను చింపడం లేదా కాల్చివేయడం చేయండి అంటూ రష్మి టాస్క్ ఇస్తుంది. అయితే ఈ టాస్క్ లో భాగంగా అందరూ హైపర్ ఆది ఫోటోలను చింపడంతో ఆయన ఎంతో ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ ప్రోమో కాస్త ఎపిసోడ్ పై భారీ అంచనాలను పెంచేలా ప్రోమో కట్ చేయడంతో ఇది చూసిన నెటిజన్ లు మరోసారి మీ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా మీరు మారరా అంటూ పెద్ద ఎత్తున మల్లెమాలపై నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Rakesh Master: జబర్దస్త్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రాకేష్ మాస్టర్… అక్కడ ఫుడ్ మరి దారుణం !

Rakesh Master: గత కొంతకాలం నుంచి జబర్దస్త్ కార్యక్రమ నిర్వాహకులు పలు వివాదాలను విమర్శలను ఎదుర్కొంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. అందుకు గల కారణం ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఎలాంటి దుమారం రేపాయో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్పీ జబర్దస్త్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా కోట్లు సంపాదిస్తున్న మల్లెమాలవారు కనీసం ఆర్టిస్టులకు ఫుడ్డు కూడా సరిగా పెట్టరంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.

అదేవిధంగా ఆపదలో ఉన్న కానీ ఎవరికీ శ్యాం ప్రసాద్ రెడ్డి సహాయం చేయరంటూ ఈయన చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈయన వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ ఆర్పీ చేసిన వ్యాఖ్యలలో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేశారు. అయితే జబర్దస్త్ కార్యక్రమంలో కొద్ది రోజుల పాటు ప్రేక్షకులను సందడి చేసిన రాకేష్ మాస్టర్ ఈ విషయంపై స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన జబర్దస్త్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కార్యక్రమం గురించి చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు పాలు కరెక్టేనని ఈయన వెల్లడించారు. జబర్దస్త్ కార్యక్రమంలో ఫుడ్ ఏ మాత్రం బాగుండదని ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ ఫుడ్ విషయం గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Rakesh Master: బయట ఫుడ్డు తెప్పించుకొని తింటున్నారు…

తాను జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నప్పుడు బుల్లెట్ భాస్కర్ స్కిట్లో చేశాను అయితే బుల్లెట్ భాస్కర్ ఉన్నన్ని రోజులు నాకు ఫుడ్డు గురించి ఏ విధమైనటువంటి బాధ లేదు అయితే ఒక రోజు ఆయన లేకపోవడంతో తాను కూడా అందరిలాగే వెళ్లి క్యూలో నిలబడ్డానని కానీ అక్కడ ఫుడ్ ఏ మాత్రం బాగాలేదని అని తెలిపారు. బుల్లెట్ భాస్కర్ ఉన్నన్ని రోజులు తనకు బయట నుంచి ఫుడ్ తెప్పించి పెట్టారని ఇప్పటికి కొందరు అలాగే బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంటున్నారు అంటూ రాకేష్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Anchor Anasuya: సిల్వర్ రంగు చీర కట్టి మెరిసిపోతున్న అనసూయ… ముసలమ్మలా ఉన్నావ్ అంటూ నేటిజన్స్ కామెంట్స్?

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా మంచి గుఎంతో ర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈమెకు ఇలా వెండితెరపై అవకాశాలు రావడంతో తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కార్యక్రమానికి కూడా ఈమె గుడ్ బై చెప్పి వెళ్లారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పకున్న అనసూయ స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇలా ఓవైపు బుల్లితెర కార్యక్రమాలలోనూ మరోవైపు వెండితెర సినిమాలలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఈ యాంకరమ్మ.ఇలా పలు కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా నిత్యం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా అనసూయ సిల్వర్ రంగు చీర కట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా సిల్వర్ రంగు చీరలో అనసూయ దేవ కన్యలా మెరిసిపోతూ ఉండగా మరికొందరు మాత్రం ఈమె ఫోటోలపై పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు అనసూయ ఈ ఫోటోలపై స్పందిస్తూ అచ్చం ముసలమ్మలా ఉన్నావు అంటూ కామెంట్ చేశారు.

Anchor Anasuya: వేశ్య పాత్రలో అనసూయ….

ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే అనసూయ వస్త్రధారణ గురించి ఈ విధమైనటువంటి కామెంట్స్ రావడం ఇది మొదటిసారి కాదు.ఇలా ఎంతోమంది ఎన్నో రకాల కామెంట్స్ చేసినప్పటికీ అనసూయ వాటిని చూసి చూడనట్టు వెళ్లిపోవడమే కాకుండా కొన్నిసార్లు వీటిపై రియాక్ట్ అవుతూ ఘాటుగా సమాధానం చెబుతుంటారు. ఇక ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ఈమె మధురవాణి అనే ఒక వేశ్య పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

Subhashini : సుమ వల్లే నేను బ్రతికున్నా.. బంగారు తల్లి అంటూ ఏడ్చేసిన నటి సుభాషిని

Subhashini : ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లగా బుల్లి తెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో యాంకర్ గా వ్యవహరిస్తూ సుమ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. స్టార్ మహిళ షో ద్వారా సుమ ఇంట్లో మనిషిగా మారిపోయింది. ప్రస్తుతం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లతో బిజీగా ఉన్న సుమ ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షోలో మాత్రం యాంకర్ గా వ్యవహరిస్తుంది.

ప్రతివారం ప్రసారమయ్యే ఈ క్యాష్ షోలో సెలబ్రిటీలు సందడి చేస్తూ ఉంటారు. ఈవారం ప్రసారం కాబోయే క్యాష్ ఎపిసోడ్ లో కూడా నలుగురు సీనియర్ సెలబ్రిటీలు సందడి చేశారు.సీనియర్ యాక్టర్స్ జెన్నీ, బాలాజీ,కృష్ణవేణి, సుభాషిని ఈ వారం ప్రసారం కాబోయే క్యాష్ షో లో కనిపించనున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ క్యాష్ షో లో సుమ సీనియర్ యాక్టర్లతో ఫన్నీ టాస్క్ లు ఆడించింది.

ఈ క్రమంలో బట్టతల ఉన్న జెన్నీ తల మీద 10 సెకెన్లు నిమ్మకాయ ఉంచాలని టాస్క్ ఇచ్చింది. ఇక కృష్ణవేణీ గారికి 10 సెకన్లలో బియ్యంలో ఉన్న 10 రాళ్ళు ఏరమని టాస్క్ ఇచ్చింది. ఇలా ఈ షో లో సీనియర్ యాక్టర్లు తమ అల్లరితో సందడి చేశారు. ఇక ఈ షో లో బాలాజి, జెన్నీ కష్టతరమైన ఆసనాలు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉండగా సీనియర్ నటి సుభాషిని ఈ షోలో బాగా ఎమోషనల్ అయ్యారు. తనకి క్యాన్సర్ వచ్చిన సమయంలో సుమ తనకు ఎంతో సహాయం చేసిందని ఇప్పటికీ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి తనకి కావాల్సిన మందులు అమెరికా నుండి తెప్పిస్తుందని చెప్పుకొచ్చారు.

అమెరికా నుంచి నాకోసం మందులు తెప్పించింది…

ఈ క్రమంలో సుభాషిని సుమా గురించి మాట్లాడుతూ నేను ఈరోజు ప్రాణాలతో ఉండటానికి కారణం సుమా. నాకు మళ్ళీ మనిషి జన్మంటూ ఉంటే నీ కడుపున కూతురుగా పుడతాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో సుమ కూడా సుభాషిని వద్దకు వెళ్లి ఆమెను కౌగిలించుకుంది. నువ్వు నా బంగారు తల్లివమ్మా అంటూ సుభాషిని సుమా నుదుటిమీద ముద్దు పెట్టి చాలా ఎమోషనల్ అయింది.

జబర్దస్త్ లో క్యాస్టింగ్ కౌచా!?.. ఇందులో నిజమెంత ?

గత కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెరపై అద్భుతమైన రేటింగ్స్ దూసుకుపోతూ అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం వారంలో రెండుసార్లు ప్రసారమవుతుంది. జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ గా ప్రసారం అవుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ కార్యక్రమానికి ప్రస్తుతం టిఆర్పి రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయని చెప్పవచ్చు.

ఉన్నఫలంగా రేటింగ్స్ తగ్గిపోవడానికి గల కారణం ఈ కార్యక్రమానికి పోటీగా ఎన్నో కార్యక్రమాలు రావడంతో వాటికి ఆదరణ పెరిగి ఈ కార్యక్రమాన్ని చూసే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పటికే జబర్దస్త్ తరహాలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీ స్టార్స్ వంటి కార్యక్రమాలు ప్రసారం కావడంతో వాటికి బాగా ఆదరణ పెరిగింది.

ఇదిలా ఉండగా తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి మరో పెద్ద సమస్య వచ్చింది.ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని భావించాము. కానీ ఇప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ సమస్యలు తలెత్తుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కొందరు స్టార్ కమెడియన్ ఫీమేల్ కమెడియన్స్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం.

ఈక్రమంలోనే స్టార్ కమెడియన్స్ గా ఉన్నటువంటి వారు లేడీ కమెడియన్స్ తో సాయంత్రం ఖాళీగా ఉంటారా కలుద్దామా అంటూ డైరెక్ట్ గా మాట్లాడుతున్నారని ఇలాంటి మాటలు ఎంతో ఇబ్బంది పెట్టడంతో ఇదే విషయాన్ని మల్లెమాల వారికి ఫిర్యాదు చేస్తే వారు ఆ స్టార్ కమెడియన్ కూడా వారిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. ఇలా బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.