Tag Archives: extra jabardasth

Jabardasth: ఒక్కో ఎపిసోడ్ కోసం జబర్దస్త్ జడ్జిలకి మల్లెమాల ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో తెలుసా?

Jabardasth: ఈటీవీలో మల్లెమాల వారు ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే ఈ కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

జబర్దస్త్ కార్యక్రమానికి మొదట్లో రోజా, నాగబాబు జడ్జిలుగా వ్యవహరించేవారు.అయితే కొన్ని కారణాల వల్ల నాగబాబు తప్పుకోవడంతో ఆయన స్థానంలోకి సింగర్ మనో వచ్చారు.అదేవిధంగా రోజా గారికి మంత్రి పదవి రావడం చేత రోజా కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో రోజా స్థానంలోకి ఇంద్రజ వచ్చారు. ఇక మనో కూడా ఈ కార్యక్రమానికి స్థిరంగా లేకపోవడంతో ఆయన స్థానంలో ఎవరో ఒకరు వస్తున్నారు.

ఇకపోతే తాజాగా జబర్దస్త్ జడ్జ్ ల కోసం మల్లెమాలవారు ఒక్కో ఎపిసోడ్ కోసం ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది. రోజా ఎక్కువ ఎపిసోడ్ కోసం ఐదు లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే వారట.ఇక ఈమె హీరోయిన్ కావడంతో ఈమెకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చారు ఇక ఈమెతో పాటు జడ్జిగా వ్యవహరించిన నాగబాబుకు మాత్రం ఒక్కో ఎపిసోడ్ కు మూడు లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చేవారు.

Jabardasth: ఒక్కో ఎపిసోడ్ కి లక్షల్లో రెమ్యూనరేషన్..

రోజా స్థానంలో కొనసాగుతున్న ఇంద్రజకు ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్ కు రెండున్నర లక్ష రెమ్యూనరేషన్ అందిస్తున్నారు. అదేవిధంగా నాగబాబు స్థానంలో కొనసాగుతున్న కమెడియన్ కృష్ణ భగవాన్ కు ఒక్కో ఎపిసోడ్ కి 2.50 లక్షల రెమ్యూనరేషన్ అందిస్తున్నారు. ప్రస్తుతం మల్లెమాలవారు జడ్జిలకు ఇస్తున్నటువంటి ఈ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Anchor Rashmi: రష్మీ హిందూ వ్యతిరేకన్న నెటిజన్… తన స్టైల్ లో సమాధానం చెప్పిన రష్మీ!

Anchor Rashmi: రష్మి గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు బుల్లితెర కార్యక్రమం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ వెండితెరపై పలు సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా వెండితెరపై నటిగా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయిన ఈమె బుల్లితెరపై తనదైన శైలిలో అందరిని సందడి చేస్తున్నారు.

ఇలా బుల్లితెరపై జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ముఖ్యంగా మూగ జంతువులను ఎవరైనా హింసిస్తే తప్పకుండా ఆ ఘటనపై స్పందిస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఇదిలా ఉండగా వినాయక చవితి సందర్భంగా ఓ వినాయకుడి ప్రతిమకు ఏనుగుతో గజమాల వేయించారు.

ఈ ఘటనపై స్పందించిన రష్మీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వినాయకుడికి గజమాల వేయడం కోసం ఆ ఏనుగు ఎంత బాధ అనుభవించుంటుందో నాకు తెలుసు మన సంతోషం కోసం మూగజీవాలను ఇబ్బంది పెట్టకూడదు అంటూ ఈమె ట్వీట్ చేశారు.అయితే రష్మీ ఈ విధంగా ట్వీట్ చేయడంతో కొందరు నెటిజెన్లు స్పందిస్తూ నువ్వు హిందూ వ్యతిరేకివి హిందూ పండుగలనే టార్గెట్ చేస్తావు అంటూ కామెంట్ చేశారు.

Anchor Rashmi: ఆ మూడు రోజులు నొప్పిని భరించలేను…

ఈ విధంగా నెటిజన్ చేసిన కామెంట్ పై స్పందించిన రష్మీ..తాను నంది, గోమాతను పూజిస్తానని అందుకే తాను లెదర్ వస్తువులను అలాగే పాలు పాలతో తయారు చేసిన వస్తువులను తిననని తెలిపారు. ఒక ఆవు పాలు ఇవ్వడం కోసం ఎన్ని సార్లు గర్భవతి అవుతుందనే నిజాన్ని నేను తట్టుకోలేను. అంతెందుకు ఓ మహిళగా రుతుక్రమ సమయంలో వచ్చే మూడు రోజుల నొప్పి కూడా నాకు ఎంతో నరకంగా ఉంటుంది అంటూ ఈ సందర్భంగా ఆమె తన స్టైల్ లో సమాధానం చెప్పుకొచ్చారు ప్రస్తుతం రష్మీ చేసిన ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

Rashmi -Anasuya: అనసూయ గొడవ.. రష్మీనీ గెలికిన నెటిజన్… దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన యాంకర్ రష్మి !

Rashmi -Anasuya: జబర్దస్త్ యాంకర్లుగా రష్మీ అనసూయ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే వీరిద్దరూ యాంకర్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ వీరిద్దరి వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుంది.రష్మీ నిత్యం మూగజీవాల గురించి రోడ్లపై వాటిని ఎవరైనా హింసిస్తే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వాటి గురించి స్పందిస్తూ వాటిని హింసించిన వారికి శిక్షపడేలా చేస్తూ మూగజీవాలపై తన ప్రేమను చాటుకుంటారు.

ఇక అనసూయ సైతం తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ తన గురించి ఎవరైనా ట్రోలింగ్ చేస్తే వారికి తనదైన శైలిలో సమాధానం చెబుతూ ఉంటారు.ప్రస్తుతం అనసూయకు విజయ్ దేవరకొండ అభిమానులకు మధ్య పెద్ద ఎత్తున ట్వీట్ వార్ జరుగుతుంది. ఈ క్రమంలోనే కొందరు నెటిజెన్లు ఈ గొడవ మధ్యలోకి రశ్మిని లాగారు.

ఈ సందర్భంగా ఒక నెటిజన్ రష్మికి ట్వీట్ చేస్తూ అందులో.. ఎవరేమన్నా పట్టించుకోవు నీతో అసలు గొడవే ఉండదు… అసలు ఎవరికీ రిప్లై ఇవ్వవు నీకు తెలుగు అర్థం కాదు అంటూ ఒక నెటిజన్ రశ్మిని ఉద్దేశిస్తూ ఆమె నవ్వుతూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ మరి ఈ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ పై రష్మీ ఎంతో భిన్నంగా స్పందించింది.

Rashmi -Anasuya: రష్మీ చాలా క్లాస్…

ఈ విధంగా నేటిజన్ చేసిన ట్వీట్ కు ఈమె రిప్లై ఇస్తూ… పండగ చేసుకో అంటూ కామెంట్ చేసింది.అందరికీ రష్మీలో నచ్చే విషయం ఇదే తను ఏం చెప్పాలనుకున్న సింపుల్ గా క్లియర్ గా చెప్పేస్తుంది. అనసూయతో పోలిస్తే రష్మీ ఎంతో క్లాస్ అంటూ పెద్ద ఎత్తున నేటిజన్లు రష్మి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో ఆ కార్యక్రమానికి కూడా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

RK Roja: చిన్న చిన్న యాంకర్లే పెద్ద కార్లు కొంటున్నారు.. నేను కొంటె తప్పా… రోజా అన్నది ఆ యాంకర్ నేనా.. వైరల్ అవుతున్న కామెంట్స్!

RK Roja: వెండితెర నటిగా, బుల్లితెర న్యాయ నిర్ణేతగా, రాజకీయ నాయకురాలిగా మంత్రిగా ఎన్నో బాధ్యతలు చేపట్టి విశేషమైన ప్రేక్షకాదరణ గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలో సుమారు 150 సినిమాలకు హీరోయిన్ గా పనిచేశారు. అలాగే రచ్చబండ జబర్దస్త్ వంటి కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా తన మార్క్ ఏంటో చూపించారు. ఇకపోతే మంత్రిగా ఈమె బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రోటోకాల్ ఫాలో అవుతూ జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో రోజా ఎంతో ఖరీదైన కోట్ల విలువ చేసే కారు కొన్నారు. ఈ క్రమంలోనే ఈ కారుపై ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.

అయితే ఈ విషయంపై రోజా స్పందిస్తూ తాను ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నానని తాను ఇలా కోట్ల రూపాయల విలువచేసే కారు కొనడంలో ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ఈమె తెలిపారు.తాను ఎలాంటి అక్రమ సంపాదనతో కొనలేదని కావలసి వస్తే తన ఇన్కమ్ టాక్స్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అంటూ సవాల్ విసిరారు.

RK Roja: యాంకర్ల గురించి రోజా షాకింగ్ కామెంట్స్…

ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల నుంచి యాంకర్లుగా పనిచేస్తున్న వారి పెద్ద పెద్ద ఆడి, బెంజ్, బీఎండబ్ల్యూ కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలా చిన్నచిన్న యాంకర్లే ఖరీదైన కార్లలో తిరుగుతున్నప్పుడు తాను ఇలాంటి కారు కొనడంలో ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ విధంగా రోజా యాంకర్ల గురించి ప్రస్తావన చేయడంతో రోజా అన్నది ఏ యాంకర్ ని..ఈమె యాంకర్ మంజుషని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అంటూ చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే మంజూష ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే బెంజ్ కార్ కొనడం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే రోజా ఈమెను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు.

Anchor Anasuya: నెలలో మూడు రోజులు కేటాయించలేవా.. అనసూయని ప్రశ్నించిన చంటి?

Anchor Anasuya: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ ప్రస్తుతం ఒక్కొక్కరుగా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్తున్నారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ అనసూయ ఒకరు.అనసూయ గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం అనసూయ ఈ కార్యక్రమం నుంచి వెళ్ళిపోతున్నానని పరోక్షంగా వెల్లడించారు.అయితే వచ్చే గురువారము తనకు జబర్దస్త్ కార్యక్రమంలో చివరి ఎపిసోడ్ అని తాజాగా వదిలిన ప్రోమో ద్వారా తెలుస్తుంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా తాగుబోతు రమేష్ అనసూయ గెటప్ లో స్కిట్ చేశారు. నాకు ఈ కార్యక్రమానికి రావడం కుదరట్లేదు వెళ్లిపోతానని చెప్పగా అక్కడ ఉన్నటువంటి వారందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

 

అనసూయ గెటప్ లో ఉన్నటువంటి తాగుబోతు రమేష్ జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. బట్ జబర్దస్త్ మాత్రం స్టిల్ రన్నింగ్ అంటూ కామెంట్ చేస్తుంది. ఇలా తాగుబోతు రమేష్ చెప్పేసరికి అనసూయ ఎమోషనల్ అవుతుంది. జబర్దస్త్ కార్యక్రమం నిన్ను చాలా మిస్ అవుతుంది అంటూ కంటతడి పెట్టుకున్నారు.

చిన్నపిల్లలను వదిలి వచ్చావు…

స్కిట్ అనంతరం చలాకి చంటి మాట్లాడుతూ..చిన్న పిల్లలు ఉన్నప్పుడే నువ్వు ఆ పిల్లలను మీ అమ్మకి ఇచ్చి ఈ కార్యక్రమానికి వచ్చావు. ఇప్పుడు నెలలో మూడు రోజులు ఈ కార్యక్రమం కోసం కేటాయించలేవా అంటూ ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నకు అనసూయ ఏ విధమైనటువంటి సమాధానం చెబుతుందో తెలియాల్సి ఉంది.మొత్తానికి అనసూయకు జబర్దస్త్ కార్యక్రమంలో చివరి ఎపిసోడ్ అని తెలియడంతో ఇంద్రజ సైతం అనసూయను మిస్ అవుతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

రాకింగ్ రాకేష్ పై చేయి చేసుకోబోయిన జడ్జ్ మనో .. ఏం స్కిట్ అంటూ..!

బుల్లితెరపై ప్రసారమౌతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి గురు శుక్రవారాలలో బుల్లితెరపై ప్రసారం అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఈ షో ద్వారా ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇంకొందరు అయితే ఇందులో మంచి గుర్తింపు తెచ్చుకుని వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎక్స్ ట్రా జబర్దస్త్, జబర్దస్త్ ఈ రెండు షోలు ఒకే ఫ్లాట్ ఫామ్ కిందికి వస్తాయి.

ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కమెడియన్ రాకేష్ మందరికి సుపరిచితమే. ఈ షోలో రాకేష్ తనదైన శైలిలో నవ్విస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు చిన్న పిల్లలతో స్కిట్ లు చేస్తుండే రాకేష్, ప్రస్తుతం రోహిణి లాంటి కొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్లు చేస్తున్నారు. రాకేష్ తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా రాకింగ్ రాకేష్ పై జడ్జిగా వ్యవహరిస్తున్న మనో ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇక రాకింగ్ రాకేష్ స్కిట్ అయిపోయిన తర్వాత జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ మనో రాకేష్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.ఈ క్రమంలోనే మనో మాట్లాడుతూ ఎంత గౌరవం అయ్యా నువ్వంటే రాకేష్ నాకు.. ఏంటిది.. పద్దతేనా అస్సలు.. ఏ స్టేజీ.. మీరు చేస్తున్నది ఏంటి అంటూ అతడిపై విరుచుకుపడతాడు. ఐ యామ్ సో సారీ అంటూ అక్కడ నుంచి లేచి వెళ్లిపోతాడు మనో.మనో గారు అంటూ రోజా అంటున్నా కూడా అతడు వినకుండా ఆ చైర్ పై నుంచి దిగి వెళ్లిపోతాడు.

మనో వెళ్లకుండా అడ్డుకున్న రాకేష్ టీం సభ్యులను పైకి వెళ్లండి అంటూ కోపంతో చెబుతాడు మనో. ఐ యామ్.సారీ సార్ అంటూ రాకేష్ అంటున్నా చేయితో కొట్టబోతాడు మనో. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.సారీ మేడం అంటూ రోజాకు చెప్పి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోతాడు సింగర్ మనో. అయితే ఇది కేవలం ప్రోమో కోసం చేసినట్లుగా కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో నిజమెంత తెలియాలి అంటే నవంబర్ 5 న ప్రసారం కానున్న ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే మరి.

వామ్మో.. అందరు చూస్తుండగానే ఆ బ్యూటీకి ముద్దులు పెట్టిన రాకింగ్ రాకేష్..?

బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి అని చెప్పవచ్చు. ఒకప్పుడు ఈ కార్యక్రమంలో పురుషులు స్త్రీ వేషధారణలో ఉండి కామెడీలను పండించేవారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమంలో కూడా కేవలం జెంట్స్ కమెడియన్స్ మాత్రమే కాకుండా, లేడీ కమెడియన్స్ కూడా ఎంటర్ అయ్యారు.ఈ క్రమంలోనే వీరందరూ కలిసి స్టేజ్ పై చేసే హంగామా కొన్నిసార్లు విమర్శలకు తావిస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా జబర్దస్త్ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమో లో భాగంగా రాకింగ్ రాకేష్ స్కిట్ లో భాగంగా కొంచెం హద్దులు మీరి లేడీ కమెడియన్ తో ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ స్కిట్ లో భాగంగా రాకింగ్ రాకేష్ మరొక కమెడియన్ రోహిణితో కలిసి ఒక ఉద్యోగం కోసం వెళ్తారు.అయితే అక్కడ కేవలం భార్యాభర్తలకు మాత్రమే అవకాశం అని రాసి ఉండటంతో వీరిద్దరూ భార్యాభర్తల అన్నట్టుగా నటిస్తారు.

ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్ చూడండి మేము నిజంగానే భార్య భర్తల మంటూ దగ్గర నుంచి రోహిణికి ముద్దు పెడతాడు.రాకేష్ ఉన్నఫలంగా ఇలా చేయడంతో రోహిణి ఎంతో ఆశ్చర్యానికి గురి అవుతుంది. ఈ సీన్ చూసిన జడ్జెస్ కూడ షాక్ అవుతూ నవ్వుకుంటారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ప్రోమో చూసిన నెటిజన్లు కేవలం రేటింగ్స్ కోసమే కమెడియన్స్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని…ఒక స్కిట్ లో లేడీ కమెడియన్స్ ఉంటే వారికి ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూ ఉండాలి కానీ ఈ విధంగా ముద్దులు పెట్టుకోవడం ఏంటి అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

డాక్టర్లు చనిపోతానని చెప్పారు… వీళ్ళ వల్లే బతికాను అంటూ ఎమోషనల్ అయినా కమెడియన్ జీవన్!

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో కేవలం కమెడియన్లు నవ్వులు పండించడమే కాకుండా ఎవరికైనా ఆపద వస్తే అందరూ ఒక్కటై వారిని కాపాడుకోవడంలో ముందుంటారని ఎన్నోసార్లు నిరూపించబడింది. తాజాగా ఓ కమెడియన్ విషయంలో కూడా అదే జరిగింది.గత కొన్ని నెలల నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ జీవన్ కనిపించలేదు. అందుకు గల కారణం అతడు అనారోగ్య సమస్యల కారణంగా కొన్ని నెలల నుంచి ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కమెడియన్ జీవన్ కోలుకొని తిరిగి ఎక్స్ ట్రా జబర్దస్త్ వేదికపై సందడి చేశాడు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మి చాలా రోజుల తర్వాత అనారోగ్యం నుంచి కోలుకున్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి రావడం మీకు ఎలా ఉందని అడగడంతో జీవన్ ఎంతో భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యాడు. అసలు ఈ కార్యక్రమానికి వస్తానని అనుకోలేదు. డాక్టర్లు చనిపోతానని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఉండాలంటే అంతటికీ కారణం జబర్దస్త్ టీం మెంబెర్స్ అని తెలియజేశారు.

ఆరోజు వీళ్ళందరూ ఆదుకోవడంతోనే ఈ రోజు ఈ వేదికపై ఉన్నానని జీవన్ ఎమోషనల్ అయ్యారు.డాక్టర్లు ఇంజక్షన్ లకి కూడా సహకరించడం లేదని ఇతను చనిపోతాడని చెప్పడంతో అమ్మ భోరున ఏడ్చింది. చిన్న బాబు కూడా ఉన్నాడు డాక్టర్లు బతకడం కష్టం అని చెబితే వీళ్లంతా కలిసి బతికించారు మేడమ్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

కేవలం జీవన్ ఒక్కడు మాత్రమే కాదు. మా జబర్దస్త్ ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా మేమందరం ఇలాగే ఉంటామని గెటప్ సీను ఎమోషనల్ అయ్యాడు.ప్రస్తుతం ఈ వారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో ఎంతో ఎమోషనల్ గా సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

వర్షను ముద్దు పెట్టిన బుల్లెట్ భాస్కర్.. ఇది చూసి మండిపడ్డ ఇమ్మానియేల్?

బుల్లితెరపై లవ్ స్టోరీ లు, పులిహోర కలిపే బ్యాచ్ లకి బాగా డిమాండ్ ఏర్పడింది. ప్రేక్షకులు కూడా ఇలాంటి వాటిని బాగా చూడటంతో రోజురోజుకు ఇలాంటి లవ్ ట్రాక్ లు ఎక్కువ అవుతున్నాయి.ఈ క్రమంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి రష్మీ సుధీర్ మధ్య లవ్ ట్రాక్ లను నడిపిన షో నిర్వాహకులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా రష్మీ సుధీర్ అలాగే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న జంటలలో వర్ష – ఇమ్మానియేల్ జంట ఒకటని చెప్పవచ్చు.

ప్రస్తుతం వర్ష ఇమ్మానియేల్ జంటకు ఎంతో పాపులారిటీ ఉంది. ఈ క్రమంలోనే ఈ షో లో వీరు చేసే స్కిట్ లు, ప్రోమోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓసారి కెవ్వుకార్తిక్ తన స్క్రిప్ట్ లో భాగంగా ఈ జంటను ఉపయోగించుకొని ఎంతో పాపులర్ అయ్యాడు. ఈ స్కిట్ లో భాగంగా కెవ్వుకార్తిక్ వీరిద్దరిని విడగొడతాడు. తాజాగా ఇదే ఫార్ములాను బుల్లెట్ భాస్కర్ కూడా ఉపయోగించుకున్నాడు. వచ్చేవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో వర్ష ఇమ్మానియేల్ సందడి చేశారు.

వచ్చేవారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రమోషన్లో భాగంగా బుల్లెట్ భాస్కర్ తన స్కిట్ లో మొట్టమొదటిసారిగా తన తండ్రిని తీసుకువచ్చారు.ఇందులో ఇమాన్యుయేల్‌కు జోడిగా ఫైమాను సెట్ చేశారు. తనకు మాత్రం వర్షను సెట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్తలుగా ఉన్న వర్ష బుల్లెట్ భాస్కర్ చేసిన రొమాన్స్ చూసి ఇమ్మానియేల్ సహించలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇమ్మానియేల్ ను రెచ్చగొట్టడం కోసం బుల్లెట్ భాస్కర్ ఏకంగా వర్ష చేతికి ముద్దు పెట్టాడు. దీంతో మండి పోయిన ఇమ్మానియేల్ ఇందుకేనా జంటలను మార్చింది అంటూ తన మనసులోని బాధను బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.