బుల్లితెరపై ప్రసారమౌతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి గురు శుక్రవారాలలో బుల్లితెరపై ప్రసారం అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఈ షో ద్వారా ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇంకొందరు అయితే ఇందులో మంచి గుర్తింపు తెచ్చుకుని వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎక్స్ ట్రా జబర్దస్త్, జబర్దస్త్ ఈ రెండు షోలు ఒకే ఫ్లాట్ ఫామ్ కిందికి వస్తాయి.
ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కమెడియన్ రాకేష్ మందరికి సుపరిచితమే. ఈ షోలో రాకేష్ తనదైన శైలిలో నవ్విస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు చిన్న పిల్లలతో స్కిట్ లు చేస్తుండే రాకేష్, ప్రస్తుతం రోహిణి లాంటి కొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్లు చేస్తున్నారు. రాకేష్ తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా రాకింగ్ రాకేష్ పై జడ్జిగా వ్యవహరిస్తున్న మనో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇక రాకింగ్ రాకేష్ స్కిట్ అయిపోయిన తర్వాత జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్ మనో రాకేష్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.ఈ క్రమంలోనే మనో మాట్లాడుతూ ఎంత గౌరవం అయ్యా నువ్వంటే రాకేష్ నాకు.. ఏంటిది.. పద్దతేనా అస్సలు.. ఏ స్టేజీ.. మీరు చేస్తున్నది ఏంటి అంటూ అతడిపై విరుచుకుపడతాడు. ఐ యామ్ సో సారీ అంటూ అక్కడ నుంచి లేచి వెళ్లిపోతాడు మనో.మనో గారు అంటూ రోజా అంటున్నా కూడా అతడు వినకుండా ఆ చైర్ పై నుంచి దిగి వెళ్లిపోతాడు.
మనో వెళ్లకుండా అడ్డుకున్న రాకేష్ టీం సభ్యులను పైకి వెళ్లండి అంటూ కోపంతో చెబుతాడు మనో. ఐ యామ్.సారీ సార్ అంటూ రాకేష్ అంటున్నా చేయితో కొట్టబోతాడు మనో. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.సారీ మేడం అంటూ రోజాకు చెప్పి అక్కడ నుంచి బయటకు వెళ్లిపోతాడు సింగర్ మనో. అయితే ఇది కేవలం ప్రోమో కోసం చేసినట్లుగా కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో నిజమెంత తెలియాలి అంటే నవంబర్ 5 న ప్రసారం కానున్న ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే మరి.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…