సమంత విడాకుల వ్యవహారాన్ని మరిచిపోయి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించిన పోస్ట్ లు కూడా పెట్టింది. ఇటీవలే అమ్మాయిల పెళ్లిళ్ల గురించి చేసిన పోస్టు ఎంత వైరల్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఆ తరువాత కూడా పలు ఆసక్తికర పోస్టులను చేసింది. అయితే సమంత తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
అయితే సమంత చేసిన పోస్ట్ వెంటనే డిలీట్ చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంతకీ సమంత ఏం పోస్ట్ చేసిందంటే ఇటీవలే తెలంగాణలో గే కపుల్ పెళ్లికి సిద్ధమైన విషయం అందరికి తెలిసిందే. వీరికి సపోర్ట్ చేస్తూ సమంత పోస్ట్ చేసింది గే మ్యారేజ్ అధికారికమే అంటూ సుప్రీమ్ కోర్టు సైతం చెప్పింది. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మొదటిసారిగా తెలంగాణలో గే కపుల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు రెండు రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.
ఆ గే కపుల్ గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారంటూ, ఇరువురి పెద్దల సమక్షంలో పెద్దల అంగీకారంతో ఈ పెళ్లి డిసెంబర్ లో చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారు ఒక వార్తా పత్రికకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. సమాజం ఏమనుకుంటుందో అన్న విషయాన్ని పక్కన పెట్టి వారు అనుకున్నది చేస్తున్నారు.వాళ్లిద్దరినీ ట్యాగ్ చేస్తూ సమంత అభినందనలు తెలిపింది.
ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 377ను సుప్రీం కోర్టు తొలగించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొదటి స్వలింగ సంపర్క వివాహం ఇదేనని ప్రచారం జరుగుతుంది.ఈ విషయంఫై సినీ ప్రముఖులు ఎవరూ స్పందించకపోగా సమంత మాత్రం ఈ విషయంపై స్పందించింది.గే మ్యారేజ్కు సపోర్ట్ చేస్తూ దానికి సంబంధించిన పోస్ట్ షేర్ చేయడమే కామెంట్ కూడా చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్తో తన…
మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్ను నోట్లో వేసుకుని నీళ్లు…
చర్మంపై చిన్నచిన్న ముడతల్లా కనిపించే వార్ట్స్ (warts) చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇవి సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా, కనిపించే…
చిన్నప్పటి నుంచి సినిమాల్లో అడుగుపెట్టి, తర్వాత హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో తేజస్వి మదివాడఒకరు. తెరపై చలాకీగా కనిపించే ఆమె…
ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్పై స్టాండప్ కామెడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు…