Anchor Rashmi: రష్మి గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు బుల్లితెర కార్యక్రమం జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ వెండితెరపై పలు సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా వెండితెరపై నటిగా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయిన ఈమె బుల్లితెరపై తనదైన శైలిలో అందరిని సందడి చేస్తున్నారు.
ఇలా బుల్లితెరపై జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ముఖ్యంగా మూగ జంతువులను ఎవరైనా హింసిస్తే తప్పకుండా ఆ ఘటనపై స్పందిస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తుంటారు. ఇదిలా ఉండగా వినాయక చవితి సందర్భంగా ఓ వినాయకుడి ప్రతిమకు ఏనుగుతో గజమాల వేయించారు.
ఈ ఘటనపై స్పందించిన రష్మీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వినాయకుడికి గజమాల వేయడం కోసం ఆ ఏనుగు ఎంత బాధ అనుభవించుంటుందో నాకు తెలుసు మన సంతోషం కోసం మూగజీవాలను ఇబ్బంది పెట్టకూడదు అంటూ ఈమె ట్వీట్ చేశారు.అయితే రష్మీ ఈ విధంగా ట్వీట్ చేయడంతో కొందరు నెటిజెన్లు స్పందిస్తూ నువ్వు హిందూ వ్యతిరేకివి హిందూ పండుగలనే టార్గెట్ చేస్తావు అంటూ కామెంట్ చేశారు.
ఈ విధంగా నెటిజన్ చేసిన కామెంట్ పై స్పందించిన రష్మీ..తాను నంది, గోమాతను పూజిస్తానని అందుకే తాను లెదర్ వస్తువులను అలాగే పాలు పాలతో తయారు చేసిన వస్తువులను తిననని తెలిపారు. ఒక ఆవు పాలు ఇవ్వడం కోసం ఎన్ని సార్లు గర్భవతి అవుతుందనే నిజాన్ని నేను తట్టుకోలేను. అంతెందుకు ఓ మహిళగా రుతుక్రమ సమయంలో వచ్చే మూడు రోజుల నొప్పి కూడా నాకు ఎంతో నరకంగా ఉంటుంది అంటూ ఈ సందర్భంగా ఆమె తన స్టైల్ లో సమాధానం చెప్పుకొచ్చారు ప్రస్తుతం రష్మీ చేసిన ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…