Tag Archives: fire

Bandla Ganesh: ఊర కుక్కలా అరవకు అంటూ బండ్ల గణేష్ పై విరుచుకుపడ్డ వైసీపీ నేత.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బండ్ల గణేష్…ట్వీట్ వైరల్!

Bandla Ganesh: వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో వరుస ట్వీట్స్ తో విరుచుకుపడ్డాడు. అయితే తాజాగా ఇదే విషయం పై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ కి ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్స్ సంచలనంగా మారాయి.

Bandla Ganesh: ఊర కుక్కలా అరవకు అంటూ బండ్ల గణేష్ పై విరుచుకుపడ్డ వైసీపీ నేత.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బండ్ల గణేష్…ట్వీట్ వైరల్!

ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రత్యర్థులపై తన మార్కు ట్వీట్స్ తో విరుచుకుపడుతూ ఉంటారు విజయ సాయి రెడ్డి. మరి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం విషయంలో చంద్రబాబు,నారా లోకేష్,పవన్ కళ్యాణ్ లాంటి ప్రత్యర్థులు చేసే ఆరోపణలపై స్పందిస్తూ ట్వీట్ చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా బండ్ల గణేష్ రాష్ట్రంలోని ఒక వర్గాన్ని కించపరిచే విధంగా విజయసాయిరెడ్డి చర్యలు ఉంటున్నాయని అనడంతో ఆ విషయంపై స్పందించిన విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Bandla Ganesh: ఊర కుక్కలా అరవకు అంటూ బండ్ల గణేష్ పై విరుచుకుపడ్డ వైసీపీ నేత.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బండ్ల గణేష్…ట్వీట్ వైరల్!

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ..ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు,అంత ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావ్. మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లవుతాయి గాని, బండ్లు ఓడలు కావు. అయ్యో…గణేశా.. అంటూ విజయ సాయి రెడ్డి ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే బండ్ల గణేష్ విజయసాయి రెడ్డి పై ట్వీట్ చేస్తూ..

నేను కమ్మ వాణ్ణే కానీ టీడీపీ కాదు ….

మీకు కులం నచ్చకుంటే.. కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టండి… చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి. అధికారం శాశ్వతం కాదు. రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు. ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు. నేను కమ్మ వాణ్ణే కానీ టీడీపీ కాదు అని బండ్ల గణేష్ అన్నారు.. నీ పిచ్చకి, నీ కుల పిచ్చకి, నీ డబ్బు పిచ్చకి, కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది అంటూ బండ్ల ట్వీట్ చేశారు. ఈ విషయంపై విజయసాయి రెడ్డి ఆ విధంగా ఊర కుక్క అంటూ బండ్ల గణేష్ పై ట్వీట్ చేయడంతో ఆ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Big Boss Non stop: ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు…. గుద్దుతా అంటూ ఆర్జే చైతూ పై ఫైర్ అయిన ముమైత్!

Big Boss Non stop: బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో వినోదాన్ని అందించే బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నాన్ స్టాప్ గా ప్రసారం అవుతూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తుంది. ఇక ఈ కార్యక్రమం ప్రారంభం అయి వారం రోజులు పూర్తయ్యే సరికి ఇంట్లో నామినేషన్స్ గొడవలు ప్రారంభమయ్యాయి ఈ క్రమంలోని ఒకరిపై మరొకరు దూషించుకోడం, పోట్లాడుకోవడం కొట్టుకోవడం వరకు వెళ్తున్నారు.

Big Boss Non stop: ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు…నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు.. గుద్దుతా అంటూ చైతూ పై ఫైర్ అయిన ముమైత్!

ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఇంటి సభ్యులకు సరికొత్త టాస్క్ నిర్వహించారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే ఎవరి మోహం చూడాలనుకుంటున్నారు ఎవరి మొహం చూడకూడదు అనుకుంటున్నారు చెప్పాలి అని అడిగారు ఈ క్రమంలోనే యాంకర్ చైతు తను ఉదయం నిద్రలేవగానే బిందుమాధవి మొహం చూస్తే తనకు ఆ రోజంతా ఎంతో హ్యాపీగా ఉంటుందని తెలిపారు.

Big Boss Non stop: ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు…నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు.. గుద్దుతా అంటూ చైతూ పై ఫైర్ అయిన ముమైత్!

అదేవిధంగా తనకు ఉదయం లేవగానే బిగ్ బాస్ తో గొడవపడే ముమైత్ ఖాన్ మొహం చూడకూడదు అనుకుంటున్నాను అంటూ తెలిపారు. ఇలా ఈ టాస్క్ లో భాగంగా యాంకర్ చైతు ముమైత్ ఖాన్ ను అవమానించడంతో ఆమె బోరున ఏడ్చేసింది.నాకు తెలుగు సరిగ్గా రాదు కాబట్టి సరిపోయింది. ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తూ నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు … గుద్దుతా అంటూ చైతు పై ముమైత్ ఖాన్ ఫైర్ అయ్యారు.

నవ్వించే ప్రయత్నం చేసిన అషూ రెడ్డి….

ఈ విధంగా తనపై ముమైత్ ఖాన్ ఫైర్ అవ్వడంతో యాంకర్ చైతు ఉదయం లేవగానే సిగరెట్ల కోసం ఏడుస్తుంది అలా ఏడవ కూడదని చెప్పాను అందులో నా తప్పు ఏమాత్రం లేదు అంటూ చైతూ తనని తాను సమర్థించుకున్నాడు. ఇక ఈ టాస్క్ లో భాగంగా ముమైత్ ఖాన్ ఏడవడంతో తనని నవ్వించే ప్రయత్నం చేసింది అషూ రెడ్డి. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా తేజస్వి కెప్టెన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది ఈమె నటరాజ్ మాస్టర్ ను స్టోర్ కీపర్ గా ఎంచుకున్నారు.

Bigg Boss: బిగ్ బాస్ సెట్లో అగ్ని ప్రమాదం…! తప్పిన పెను ముప్పు..!

Bigg Boss: బిగ్ బాస్ ఈ షోకు ఉండే క్రేజ్ వేరు. హిందీలో మొదటగా ప్రారంభమైన ఈ షో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ప్రారంభం అయింది. మన దేశ కల్చర్ ను బిగ్ బాస్ పాడు చేస్తుందంటూ.. చాాలా మంది అనుకుంటున్నా.. కూడా ఈషో చూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తోంది. చిన్న నుంచి పెద్ద వరకు ఈ షోను ఎంజాయ్ చేస్తున్నారు. 

Bigg Boss: బిగ్ బాస్ సెట్లో అగ్ని ప్రమాదం…! తప్పిన పెను ముప్పు..!

అప్పటి వరకు కొంత మందికే పరిచయం ఉన్న వారిని ఓవర్ నైట్ లో బిగ్ బాస్ స్టార్లను చేస్తోంది. బిగ్ బాస్ ఇచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్లు రియాలిటీ షోలు, టీవీ షోలు, సినిమాల్లో ఛాన్సులు కొల్లగొడుతున్నారు. కొంత మంది సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా తెలుగు బిగ్ బాస్5 సీజన్ లో విన్నర్ గా నిలిచిన వీజే సన్నీ కూడా ‘సకలగుణాభిరామ’ సినిమాలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. 

Bigg Boss: బిగ్ బాస్ సెట్లో అగ్ని ప్రమాదం…! తప్పిన పెను ముప్పు..!

 హిందీ బిగ్ బాస్ షోకు దేశంలో పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఉన్నారు. తాజాగా ఈ షో గ్రాండ్ ఫినాలే జనవరి 30న జరిగింది. ప్రేక్షకులు తేజస్వి ప్రకాష్‌కి పట్టం కట్టారు. అత్యధిక ఓట్లు సంపాదించినా తేజస్వి టైటిల్ సొంతం చేసుకున్నాడు. షెహజ్ పాల్ రన్నరప్‌గా నిలిచాడు. బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి ప్రకాష్ టైటిల్ ఫేవరేట్‌గానే ముందు షోకు ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచి తనదైన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకుంది తేజస్వి.

ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం…

ఇదిలా ఉంటే.. హిందీ బిగ్ బాస్ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సెట్ ముంబైలోని ఫిలిమ్ సిటీలో ఉంది. రెండు వారాల క్రితం బిగ్ బాస్ ముగిసినా.. సెట్ మాత్రం అలాగే ఉంది. ప్రస్తుతం దీంట్లోనే అగ్ని ప్రమాదం సంబవించింది. అయితే సెట్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగడంతో నాలుగు ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పేశాయి.

CPI Narayana: ‘‘అందుకే నాగార్జున అంటే అసహ్యం.. ” నాగార్జునపై సీపీఐ నేత నారాయణ ఫైర్..!

CPI Narayana: బిగ్ బాస్ రియాల్టీ షో ఎంత పాపులర్ అయిందో అంత కంటే ఎక్కువగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. బిగ్ బాస్ రియాల్ట షో అనేది దేనికి ఉపయోగపడదని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Narayana: ‘‘అందుకే నాగార్జున అంటే అసహ్యం.. ” నాగార్జునపై సీపీఐ నేత నారాయణ ఫైర్..!

బిగ్ బాస్ సీజన్ 6 కు సంబంధించి ఇప్పటికే అప్ డేట్ వచ్చేసింది. దీనిలో పాల్గొనే వ్యక్తుల పేర్లు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా టిక్ టాక్ దుర్గారావు, ర‌ఘుమాస్ట‌ర్, సిరి హ‌న్మంత్ బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ స‌హా మ‌రికొంద‌రు పేర్లు వినిపిస్తున్నాయి.

Narayana: ‘‘అది బిగ్ బాస్ షో కాదు.. బ్రోతల్ షో’’..! నాగార్జునపై సీపీఐ నేత నారాయణ ఫైర్..!

అయితే ఈ సారి ఈ షోను ఓటీటీలో ప్రసారం కానుండగా .. ఓటీటీలో 24 గంట‌ల పాటూ ప్ర‌సారం చేయ‌బోతున్న‌ట్టు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతోంది. దీని హోస్ట్ నాగార్జునపై నారాయణ ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు.

మాసిన గడ్డంతో ఉంటారనే భ్రమలో ..

గతంలో నారాయణ ఎన్నో సార్లు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అది బిగ్ బాస్ షో కాద‌ని బ్రోత‌ల్ హౌస్ అని నారాయ‌ణ ఆరోపించారు. తాజాగా మరో సారి నాగార్జునపై మండిపడ్డాడు. నాగార్జున అంటే కోపం లేదని.. కానీ అతడంటే అసహ్యం అంటూ వ్యంగ్యంగా విమర్శించాడు. పెళ్లి ఎవరిని చేసుకుంటావ్.. డేటింగ్ ఎవ‌రితో చేస్తావ్…. ఇలాంటి మాటలేనా.. బిగ్ బాస్ అంటే అంటూ మండిపడ్డాడు. అంతే కాకుండా.. అతడు ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు దండం పెట్టే ఫొటోలను ట్రోల్స్ చేశారని అన్నారు. కమ్యూనిస్టులు అంటే.. మాసిన గడ్డంతో ఉంటారనే భ్రమలో ఉన్నారని.. అది ఏ మాత్రం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. ఎంతో మందికి కమ్యూనిస్టు భావాలు ఉన్నాయని.. అందులో చిన జీయర్ కూడా ఉన్నారన్నారు. ప్రస్తుతం అతడి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Garikapati : స్మగ్లర్ కూడా తగ్గేదేలే అంటాడు… పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన గరికపాటి!

Garikapati Narasimha Rao: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ విడుదలైన పాన్ ఇండియా చిత్రం పుష్ప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయ్యి రికార్డులను క్రియేట్ చేయడంతో బన్నీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Garikapati Narasimha Rao: స్మగ్లర్ కూడా తగ్గేదే లే అంటాడు… సమాజానికి ఏం చెబుతున్నారంటూ… ఫైర్ అయిన గరికపాటి!

అయితే తాజాగా ఈ సినిమాపై పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ మలిచిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాలంలో సినిమాలు రౌడీ, ఇడియట్ వంటి సినిమాలు వస్తున్నాయి. అంతెందుకు మొన్న విడుదలైన పుష్ప సినిమాలో స్మగ్లింగ్ చేసే వారిని హీరోలుగా చూపించారు.

Garikapati Narasimha Rao: స్మగ్లర్ కూడా తగ్గేదే లే అంటాడు… సమాజానికి ఏం చెబుతున్నారంటూ… ఫైర్ అయిన గరికపాటి!

ఇలా చూపించడం వల్ల సమాజానికి ఏం చెబుతున్నట్టు అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ సినిమాలో హీరో ఒక స్మగ్లర్ ఆయన కూడా తగ్గేదే లే అంటాడు. ఆ పదం ప్రస్తుతం ఒక ఉపనిషత్తుగా మారిపోయింది. ఈ విషయంపై హీరో లేదా డైరెక్టర్ నాకు సమాధానం చెప్పమనండి అందరిని కడిగి పడేస్తాను.

స్మగ్లర్ ఆ మాట అనకూడదు…

ఈ విధమైనటువంటి డైలాగులు పాత్రల ద్వారా సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి అంటూ పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తగ్గేదే అనే పదాన్ని ఒక స్మగ్లర్ అనకూడదు..ఒక హరిశ్చంద్రుడు లేదా ఒక శ్రీరామచంద్రుడు ఆ పదాన్ని ఉపయోగించాలని ఆయన ఈ సినిమాపై ఫైర్ అయ్యారు.మరి గరికపాటి వ్యాఖ్యలకు పుష్ప డైరెక్టర్ సుకుమార్ లేదా బన్నీ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

Ram Gopal Varma : ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన ఆర్జీవి… ఊర కుక్కలంటూ కామెంట్ !

Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో ఎప్పుడు ఏదో ఒక విషయంపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వర్మ ఏం చేసిన సంచలనమే… ఆయన సినిమాలు చేసే రచ్చ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల పరంగా కన్నా ఇంటర్వ్యూలు, ట్విట్టర్ లో ట్వీట్ ల ద్వారా కూడా ఆ రేంజ్ లో ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు ఆర్జీవి.

Ram Gopal Varma : ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన ఆర్జీవి… ఊర కుక్కలంటూ కామెంట్ !

త‌న‌దైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ట్రోల‌ర్స్‌ ఊరకుక్క‌లతో సమానం అని అన్నారు. అలానే వ‌ర్మ మాట్లాడుతూ… ట్రోలర్స్ అంటే మ‌న‌తో ఉండేవారే. కానీ బ‌య‌ట‌కు మాత్రం వారెవ‌రో తెలియ‌దు. ఎక్క‌డుంటారో తెలియ‌దు. దేశ ప్ర‌ధాని కావ‌చ్చు, ముఖ్య‌మంత్రి కావ‌చ్చు, అమితాబ్ బ‌చ్చ‌న్‌ లాంటి సూప‌ర్ స్టార్ కావ‌చ్చు, ఎవ‌రినైనా ప‌ట్టించుకోరు. ట్రోల్, రివ్యూ, విమ‌ర్శ చేయ‌డానికి చాలా తేడా ఉంటుంది.

Ram Gopal Varma : ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన ఆర్జీవి… ఊర కుక్కలంటూ కామెంట్ !

ట్రోల్ అంటే ఫ‌న్ అనే అనుకోవాలి. అయితే ఈ ఫ‌న్ వ‌ల్ల మ‌నుషులు గాయ‌ప‌డ‌తారంతే. ట్రోల్స్ కార‌ణంగా అలిగి సోష‌ల్ మీడియా నుంచి వెళ్లిపోయిన వారున్నారు. సూసైడ్ చేసుకున్న‌వాళ్లున్నారు అని వర్మ వ్యాఖ్యానించారు. అప్పుడెప్పుడో మీరా చోప్రా జూనియ‌ర్ ఎన్టీఆర్ అంటే నాకు తెలియ‌ద‌ని అందో… మ‌రేదైనా అందో తెలియ‌దు. కానీ ట్రోల‌ర్స్ ఆమెపై రెచ్చిపోయారు. ఆమెను అన‌రాని మాట‌లు అన్నారు. ఆమె ట్రోలింగ్‌పై కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది అని గుర్తు చేశారు.

పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడానికి రీజన్ అదే ?

మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి పెద్ద హీరోపై ట్రోలింగ్ రావ‌డానికి కార‌ణ‌మేంటి ? అని ప్రశ్నించారు. అందుకు ఆర్జీవీ స్పందిస్తూ ‘‘ఒకటి అపోజిట్ హీరో ఫ్యాన్స్ కావచ్చు. లేదా ఆయన రాజకీయాలతో ముడి పడి ఉన్నారనే కారణం కావచ్చు. మన వ్యతిరేకంగా ఓ ఆలోచన ఉందంటే కచ్చితంగా ట్రోల్స్ వస్తాయి అన్నారు ఆర్జీవీ. మరి వర్మ మాటలపై ట్రోల‌ర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Telugu Film Producers Council: ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.. ఏం జరిగిందంటే?

Politics-TollyWood:ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ లకు మధ్య టికెట్ల రేట్ల విషయంలో వివాదం తగ్గడం లేదు. రోజుకో వివాదస్పద వ్యాఖ్యలతో రచ్చ చెలరేగుతూనే ఉంది. గతంలో హీరో నాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. థియేటర్ల కలెక్షన్ల కన్నా .. కిరాణా కొట్టు కలెక్షన్లే బాగున్నాయంటూ నేరుగా ప్రభుత్వంపైనే వ్యాఖ్యలు చేశాడు.

Telugu Film Producers Council: ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.. ఏం జరిగిందంటే?

మరో హీరో సిద్ధార్థ్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేఖించాడు. దీంతో ఏపీ మంత్రి పేర్నినాని వీరిద్దరికి తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.  ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ.. ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

Telugu Film Producers Council: ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.. ఏం జరిగిందంటే?

తాజాగా నిన్న ఆర్జీవీ, మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. వీరిద్దరు టికెట్ రేట్లపై చర్చించారు. టికెట్ రేట్లను తగ్గించడం వల్ల సినిమా క్వాలిటీ దెబ్బతింటుందని.. మంత్రికి ఆర్జీవి వివరించారు.  నిన్న వైసీపీ ఎమ్మెల్యే నన్నపురెడ్డి ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ఇండస్ట్రీ భగ్గుమంటోంది. సినిమా హీరోలు కోట్లు కోట్లు తీసుకుంటున్నారని.. చంద్రబాబు చేతిలో ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు.

చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుందని.

సినిమా వాళ్లు బలికోట్టుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై నిర్మాతల మండలి స్పందించింది. కొవ్వూర్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మొత్తం తెలుగు సినిమా పరిశ్రమను అవమానించినట్టుగా భావిస్తున్నామని అన్నారు. మన తెలుగు సినిమా సక్సెస్ రేటు సుమారుగా 2 నుండి 5% మాత్రమే మిగిలిన సినిమాలు నష్టపోవడం జరుగుతుంది. చిత్రసీమలో ఉన్న 24 కాప్స్ కు పని కల్పిస్తూ, అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీసిన నిర్మాతలు, చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుందని..ఈ నష్టాల బారిన పడ్డ నిర్మాతలు నిర్మాత మండలి నుంచి రూ. 3 వేలు పెంఛన్లు తీసుకుంటున్నారని..గౌరవ సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్మాతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తూ వారి వ్యాఖలను ఉపసంహరించుకోవాలని కోరుచున్నాము” అంటూ లేఖలో పేర్కొన్నారు.

Siddharth : మరో వివాదంలో హీరో సిద్ధార్థ్.. సైనా నెహ్వాల్ ను అంత మాట అంటావా అంటూ నెటిజన్ల ఫైర్..!

Siddharth: హీరో సిద్ధార్థ్ చేసిన ఓ ట్విట్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇటీవల ప్రధాని భద్రతా వైఫల్యంపై ప్రముఖ బ్యాట్మిటన్ క్రీడాకారిని సైనా నెహ్వాల్ ఓ ట్వీట్ చేశారు. సైనా ఏమని ట్వీట్ చేశారంటే.. ప్రధాని కాన్వాయ్ ని పంజాబ్ లో అడ్డగించడంపై ఆమె ఖండించింది. ప్రధానిపై దాడికి యత్నించడం

పిరికిపంద చర్య అని.. ప్రధానిపైనే ఇలా జరిగితే ఆ దేశంలో భద్రంగా ఉన్నట్లు కాదని.. ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై హీరో సిద్ధార్థ్ రీ ట్వీట్ ఇలా అన్నాడు. చిన్న కాక్ తో ఆడే ఓ ఛాంపియన్.. దేవుడి దయ కారణంగా.. మన దేశాన్ని కాపాడే వాళ్లు ఉన్నారు అంటూ ట్వీట్ చేశాడు. అంతే కాదు.. షేమ్ ఆన్ యూ అంటూ..యాష్ ట్యాగ్ రిహానా అంటూ ముగించాడు.

Siddharth: హీరో సిద్ధార్థ్ పై మహిళా కమిషన్ సీరియస్.. సైనా నెహ్వాల్ ను అంత మాట అంటావా అంటూ నెటిజన్ల ఫైర్..!

ఇది చాలా వ్యంగ్యంగా ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక దీనిపై రిహానా, సైనా నెహ్వాల్, చిన్మయి శ్రీపాద కూడా రీ ట్వీట్ చేశారు. సిద్దార్థ్ చేసిన ట్వీట్ కు చిన్మయి తప్పు పడుతూ ట్వీట్ చేశారు.

Siddharth : అతడు చేసిన ట్వీట్‌ను వెంటనే తొలగించాలని..

దేనికైతే తాము పోరాటం చేస్తున్నామో.. ఇంకా తాము మళ్లీ పోరాటం చేసే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. ఇది అత్యంత దారుణం అంటూ చెప్పారు. ఇక మహిళల పట్ల ఇంత దారుణమైన భాషను మాట్లాడం ఏంటని నెటిజన్లు కూడా మండిపడుతన్నారు. హీరోయిన్లను రక్షించే సిద్ధార్థ్.. బయట మాత్రం మహిళలను హింసించే విధంగా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సిద్ధార్థ్‌పై చర్యలు తీసుకోవాలని, అతడు చేసిన ట్వీట్‌ను వెంటనే తొలగించాలని జాతీయ మహిళా కమిషన్‌ చైర్మన్‌ రేఖా శర్మ ఇండియా గ్రీవెన్స్‌ను డిమాండ్ చేశారు. ఇక దీనిపై హీరో సిద్ధార్థ్ ప్రతిస్పదించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని.. తన వ్యాఖ్యలను మరో విధంగా అన్వయించడం అనైతికమని మరో ట్వీట్ చేశాడు. తన ఉద్దేశ్యం ఎవరినీ అవమాన పర్చాలని కాదన్నారు.

Ram Gopal Varma: ఒరేయ్ సుబ్బారావుల్లారా.. ఏంట్రా ఆ ఉదాహరణలు అంటూ ఆర్జీవీ ఫైర్..!

Ram Gopal Varma: ఇటీవల సినిమా టికెట్ల వ్యవహారం పెద్ద దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో మొదలైన ఈ యుద్దం నానీ దగ్గర నుంచి చివరకు ఆర్జీవీ దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఏపీ మంత్రి పేర్నీ నానికి.. ఆర్జీవీకి మధ్య మాటల యుద్ధమే నడించింది.

Ram Gopal Varma: ఒరేయ్ సుబ్బారావుల్లారా.. ఏంట్రా ఆ ఉదాహరణలు అంటూ ఆర్జీవీ ఫైర్..!

టికెట్ల రేట్లను పెంచడానికి ఎందుకు ఇబ్బంది..? ఎందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని ఆర్జీవీ ప్రభుత్వాన్ని అనేక ప్రశ్నలు వేశాడు. అంతే కాదు దీనిపై కోడాలి నానీ మాట్లాడుతుంటే.. అతడు ఎవరో తెలియదు అంటూ కౌంటర్ ఇచ్చాడు. అంతే కాకుండా ఆ ట్వీట్ కు కోడాలి నానీ కూడా రీ కౌంటర్ ఇచ్చాడు.

Ram Gopal Varma: ఒరేయ్ సుబ్బారావుల్లారా.. ఏంట్రా ఆ ఉదాహరణలు అంటూ ఆర్జీవీ ఫైర్..!

చాలామందికి ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయం చాలామందికి తెలియదు అని.. ఇక నేను ఏం తెలుస్తాను.. త్వరలోనే అందరూ తెలుసుకుంటారు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇటీవల ఆర్జీవిని పేర్నీనాని ప్రభుత్వంతో కలిసి సినిమా టికెట్లపై మాట్లాడేందుకు అపాంట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జవనరి 10వ తేదీన అతడికి అపాయింట్ మెంట్ దొరికింది. దీనిపై ఆర్జీవీ.. ధన్యవాదాలు కూడా తెలిపాడు.


మీరిచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ క్రిమినల్ యాస్పెక్ట్స్ లో ఉన్నాయి..

అయితే ఓ మీమ్ ఆర్జీవీ కి సంబంధించి వైరల్ గా మారింది. దానిని స్వయంగా ఆర్జీవీ ట్యాగ్ చేశాడు.
దానిలో ఏముందంటే.. ‘‘టికెట్ రేట్లు పెంచేవాడికి, ప్రేక్షకుడికి ఇబ్బంది లేనప్పుడు ప్రభుత్వానికి ఏంటి నొప్పి..? విటుడికి .. వేశ్యకి ఇబ్బంది లేనప్పుడు పోలీసుకు ఏంటి నొప్పి..? లంచం ఇచ్చేవాడికి తీసుకునే వాడికి లేని నొప్పి.. ఏసీబీకి ఎందుకు నొప్పి..? బ్లూఫిల్మ్ తీసేవాడికి.. చూసేవాడికి ఇబ్బంది లేనప్పుడు సెన్సార్ వాళ్లకు ఎందుకు నొప్పి..? అంటూ ఓ మీమ్ ఉంది. దీనిని ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ ఇలా అన్నాడు.. ‘‘ఒరేయ్ సుబ్బారావు ల్లారా నేను అడిగిన క్వశ్చన్ లీగల్ జ్యూరిస్ట్రిక్షన్ లో ఉంది. మీరిచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ క్రిమినల్ యాస్పెక్ట్స్ లో ఉన్నాయి’’ అంటూ ట్వీట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నీ చోటూకి ఈ మాత్రం తెలవదా.. సిరిపై ఫైర్ అయిన షణ్ముఖ్.. ఎందుకంటే..?

బిగ్ బాస్ తెలుగు 5 లో షణ్ముఖ్ జస్వంత్ ప్రస్తుతం ఇంట్లో ఉన్న బలమైన కంటెస్టెంట్‌లలో ఒకరు. గ్రాండ్ ఫినాలేకి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో, బిగ్ బాస్ తెలుగు 5 ఫైనల్‌కు చేరిన ఇద్దరు ఫైనలిస్టులలో షణ్ముఖ్ తప్పకుండా ఉంటాడని టాక్ వినిపిస్తోంది.

అతని ప్రసిద్ధ వెబ్ సిరీస్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ స్మాష్ హిట్ తర్వాత.. షణ్ముఖ్‌కు కొన్ని ఆఫర్‌లు వచ్చాయి. ఈ లోపు అతడు హౌజ్ లోకి వెళ్లడంతో అవి స్క్రీన్ పైకి రాలేదు. ఒక ప్రముఖ చిత్రనిర్మాత తన చిత్రంలో షణ్ముఖ్‌ను కథానాయకుడిగా ఎంపిక చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా.. హౌజ్ లో సిరి, షణ్ముఖ్ రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వాళ్ల హగ్ లకు సంబంధించి సిరి తల్లి కూడా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే సిరి కోసం.. మొదటి నుంచి షణ్ముఖ్ స్టాండ్ తీసుకుంటున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లో ఎంట్రీ తర్వాత.. వేదికపై కూడా కొంతమంది వచ్చారు. అందులో సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా వచ్చాడు. అప్పడు టాప్ 5 లో ఎవరు ఉంటారనేది అడగ్గా.. అతడు సన్నీ టాప్ లో పెట్టాడు.

దీంతో ఆ విషయాన్ని షణ్ముఖ్.. హౌజ్ లో సిరి ముందు ప్రస్తావించాడు. నీకోసం ఇంత వరకు స్టాండ్ తీసుకుంటున్న విషయం శ్రీహాన్ కు తెలియదా.. వేరే వాళ్లకు శ్రీహాన్ ఎలా సపోర్టు చేస్తాడు అంటూ ఫైర్ అయ్యాడు. హగ్గివ్వడం తప్పయితే ఇదేంటి.. అంటే ఇదంతా ఓకేనా? ఈ ఇంట్లో నీకు తప్ప ఏ అమ్మాయికి స్ట్రయిట్‌ హగ్గివ్వలేదు’ అని చెప్పుకొచ్చాడు. హౌజ్ లో జరిగేవి అన్నీ.. నీ చోటుకు తెలియదు. వెళ్లి చెప్పు.. అంటూ సిరిపై ఫైర్ అవుతాడు.