Tag Archives: good food

జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి.. అవేంటంటే..?

మనం తినే ఆహారంలో ఆయిల్ గానీ.. కారం గానీ అధికంగా ఉంటే కడుపంతా మంటగా.. విసుగ్గా అనిపిస్తుంది. అందుకే.. మనం తినే ఆహారం ఎప్పుడూ తేలికపాటిగా ఉండాలి. అటువంటి సమయంలోనే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు.

మసాలాలు, నూనెలు తక్కువగా ఆహారంలో తీసుకోవాలి. అప్పుడే సరైన పోషకాలు శరీరానికి అందుతాయి. సరైన పోషకాలను అందించే తేలికపాటి ఆహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దక్షిణ భారతదేశంలో ప్రతీ ఒక్కరు ఇష్టపడే తేలికపాటి ఆహార పదార్థం అన్నంలో పెరుగు. ఇది కొన్ని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ప్రతీ ఒక్కరూ చేసేదే.. అన్నంలో కొద్దిగా పెరుగు, ఉప్పు వేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది.

అంతేకాకుండా అజీర్ణ సమస్య కూడా ఉండదు. కడుపులో ఇబ్బందిగా అనిపించినప్పడు ఖిచిడీని తింటే మంచిగా ఉంటుంది. ఇది చాలా తేలికగా ఉంటుంది. లూజ్ మోషన్ సమస్య ఉన్నవారికి ఇది ఒక రెమిడీ లాంటిది. దీనిలో బియ్యం, పప్పు, పసుపు, మసాలా దినుసులు కలిపి ఉండికించి.. వేడి వేడిగా తినేయాలి. కడుపు నొప్పిగా ఉండే వారికి ‘గుల్హత్’ ప్రయోజనకరంగా ఉంటుంది.

అర కప్పు బియ్యం, 2 కప్పుల నీరు, చిటికెడు ఉప్పు వేసి కుక్కర్లో పెట్టాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ తెరిచి బియ్యాన్ని మరింత మెత్తగా చేసుకోవాలి. దీనిని ఊరగాయతో తింటే అదిరిపోతుంది. ఇడ్లీ కూడా తేలికపాటి ఆహారమే. దీనిని తీసుకోవడం వల్ల కూడా అజీర్ణసమస్యలు తొలగిపోతాయి. పై తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

కరోనా వేళా.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాపించి ఉన్న కరోనా పరిస్థితులలో ఏ వస్తువు తాకాలన్న ఎంతో భయం వేస్తుంది. అదే విధంగా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలన్న ఎక్కడ వైరస్ బారిన పడతామో అనే అనుమానాలు కలుగుతుంటాయి. వైరస్ భయం పెట్టుకుని ఏ వస్తువుని తినకుండా ఉండలేము.. అలాగే ఏ పదార్థాలను తాగకుండా ఉండలేము. కనుక మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వైరస్ బారినపడకుండా ఉంటామో జాతీయ పోషకాహార సంస్థ సూచిస్తోంది.

మనం కూరగాయల కోసం మార్కెట్ కు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మన ఇంట్లో ఉపయోగించే సంచిని మన వెంట తీసుకువెళ్లాలి. మార్కెట్లో మనకు అవసరమైన కూరగాయలను మాత్రమే తాకి జాగ్రత్తగా సంచిలో వేయించుకోవాలి.మార్కెట్లో రెండు మూడు రోజుల క్రితం వాడిపోయిన కూరగాయలు కాకుండా తాజాగా ఉన్న కూరగాయలు మాత్రమే తెచ్చుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత కూరగాయలను కొళాయి కింద శుభ్రం చేయాలి. ఈ విధంగా పారుతున్న నీటి కింద శుభ్రం చేయటం వల్ల ఎలాంటి వైరస్ అయిన నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుంది.

ఈ విధంగా కూరగాయలను, మాంసాన్ని శుభ్రంగా కడిగి వాటిని ఫ్రిజ్లో భద్రపరచుకోవాలి. మరికొందరు బయట నుంచి ఆహారపదార్థాలను తెప్పించుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఆహార పదార్థాలు వచ్చినప్పుడు ఆహారపదార్థాలకు తగలకుండా బయట కవర్ పై శానిటైజ్ చేసి ఆ కవర్లను చెత్తకుండీలో పడేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం ఆహారపదార్థాలను చేతితో తాకకుండా గరిటే ద్వారా వడ్డించుకోవాలి.

మనం కూరగాయలను కట్ చేసే కత్తి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క వస్తువును ఎంతో శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి. ఈ విధంగా ప్రతి ఒక్క వస్తువులను శుభ్రం చేసిన తర్వాత తప్పకుండా మన చేతులను కూడా శుభ్రం చేసుకోవాలి. ఫ్రిజ్లో భద్రపరిచి కూరలు ఇతర పదార్థాలకు తప్పకుండ మూతపెట్టి భద్రపరుచుకోవాలి. ముఖ్యంగా మన చేతి గోళ్ళను పెరగకుండా ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలని, ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించినప్పుడు మనం ఎంతో సురక్షితంగా ఉండవచ్చని జాతీయ పోషకాహార సంస్థ పలు సూచనలు చేసింది.

తక్షణ శక్తి కావాలనుకునేవారు.. ఈ పండు తినాల్సిందే!

సాధారణంగా పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయని అదేవిధంగా ఆరోగ్యానికి సరిపడా పోషకాలను అందిస్తాయనే విషయం అందరికీ తెలిసినదే. కానీ కొన్ని పండ్లు మనకు కేవలం సీజన్లో మాత్రమే లభిస్తాయి. సీజన్ లతో సంబంధం లేకుండా దొరికే పండ్లలో సపోటా ఒకటని చెప్పవచ్చు.చూడటానికి ఎంతో చిన్నగా ఉన్నప్పటికీ రుచి మాత్రం ఎంతో అమోఘంగా అనిపిస్తుంది. సపోటా పండ్లలో ఎక్కువ శాతం క్యాలరీలను కలిగి ఉండటం వల్ల మనకు శక్తిని ఇవ్వటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సపోటా పండును తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

సపోటా పండులో ఎక్కువశాతం క్యాలరీలు ఉండడంతో పాటు ఎంతో రుచిగా ఉంటాయి. ఇందులోఉండే ఫ్రక్టోస్ శరీరానికి త్వరగా శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అందుకోసమే క్రీడాకారులు ఎక్కువగా సపోటా పండ్లు తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల వృద్ధులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. సపోటా పండు వాపు కీళ్ళ నొప్పులను తగ్గించడంలో దోహదపడతాయి.

ఈ పండ్లలో ఎక్కువభాగం యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి.ఈ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవడానికి కాకుండా మన శరీరంలో రక్త హీనత సమస్య నుంచి కాపాడుతాయి. సపోటాలు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధక సమస్యతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సపోటా పండ్లను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మద్యం తాగినా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చేయాల్సిన పనులివే..?

దేశంలో మద్యం సేవించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మద్యం తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే మద్యం తాగడం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకుంటే నష్టమని మితంగా మద్యం తీసుకుంటే లాభమని వెల్లడిస్తున్నారు.

తగినంత భోజనం చేస్తే ఏ విధంగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయో మితంగా మద్యం తాగితే అదే స్థాయిలో లాభాలు కలుగుతాయి. దేశంలో అబ్బాయిలతో పాటు మద్యం తాగే అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే దేశంలో ఎక్కువమంది చీప్ లిక్కర్ ను తాగుతూ ఉండటంతో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రోజూ మద్యం తాగేవాళ్లు గ్రీన్ టీని అలవాటు చేసుకుంటే మంచిది.

మద్యం తాగేవాళ్లు గ్రీన్ టీ అలవాటు చేసుకోవడం వల్ల గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మద్యం సేవించే వాళ్లు రోజూ ఆపిల్ ను తీసుకుంటే మంచిది. యాపిల్ ను తీసుకోవడం వల్ల జీర్ణాశయంలోని మంట తగ్గుతుంది. ఆపిల్ లో ఉండే పెప్టిన్ జీర్ణాశయం మంట నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. అయితే మితంగా మద్యం తాగితేనే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

గ్రీన్ టీలో ఉండే తన్నిన్స్, కటేచిన్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్య సమస్యల బారిన పడము. అయితే తక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకున్నా ఇబ్బందులు తప్పవు.