మనం తినే ఆహారంలో ఆయిల్ గానీ.. కారం గానీ అధికంగా ఉంటే కడుపంతా మంటగా.. విసుగ్గా అనిపిస్తుంది. అందుకే.. మనం తినే ఆహారం ఎప్పుడూ తేలికపాటిగా ఉండాలి. అటువంటి సమయంలోనే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఆరోగ్యంగా కూడా ఉంటారు.
మసాలాలు, నూనెలు తక్కువగా ఆహారంలో తీసుకోవాలి. అప్పుడే సరైన పోషకాలు శరీరానికి అందుతాయి. సరైన పోషకాలను అందించే తేలికపాటి ఆహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దక్షిణ భారతదేశంలో ప్రతీ ఒక్కరు ఇష్టపడే తేలికపాటి ఆహార పదార్థం అన్నంలో పెరుగు. ఇది కొన్ని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ప్రతీ ఒక్కరూ చేసేదే.. అన్నంలో కొద్దిగా పెరుగు, ఉప్పు వేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది.
అంతేకాకుండా అజీర్ణ సమస్య కూడా ఉండదు. కడుపులో ఇబ్బందిగా అనిపించినప్పడు ఖిచిడీని తింటే మంచిగా ఉంటుంది. ఇది చాలా తేలికగా ఉంటుంది. లూజ్ మోషన్ సమస్య ఉన్నవారికి ఇది ఒక రెమిడీ లాంటిది. దీనిలో బియ్యం, పప్పు, పసుపు, మసాలా దినుసులు కలిపి ఉండికించి.. వేడి వేడిగా తినేయాలి. కడుపు నొప్పిగా ఉండే వారికి ‘గుల్హత్’ ప్రయోజనకరంగా ఉంటుంది.
అర కప్పు బియ్యం, 2 కప్పుల నీరు, చిటికెడు ఉప్పు వేసి కుక్కర్లో పెట్టాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ తెరిచి బియ్యాన్ని మరింత మెత్తగా చేసుకోవాలి. దీనిని ఊరగాయతో తింటే అదిరిపోతుంది. ఇడ్లీ కూడా తేలికపాటి ఆహారమే. దీనిని తీసుకోవడం వల్ల కూడా అజీర్ణసమస్యలు తొలగిపోతాయి. పై తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…