Tag Archives: guntur kaaram

Mahesh Babu: గుంటూరు కారం నా ఆఖరి తెలుగు చిత్రం… షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ !

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు మహేష్ బాబు ఒకరు. ఈయన ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.  ఇక ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ అనంతరం మహేశ్ బాబు, శ్రీలీల ఇద్దరు కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  ఈ ఇంటర్వ్యూకి సుమ యాంకర్ గా వ్యవహరించారు. ఇక ఈ సినిమాలో మహేష్ క్యారక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్, స్లాంగ్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ విషయం గురించి మహేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు తెలిపారు.

సినిమా మొదలు పెట్టినప్పుడే నేను త్రివిక్రమ్ అయితే ఒక విషయం గట్టిగా అనుకున్నాము. ఈ సినిమాలో ఓ రెండు పాటలు అయినా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే నేను ఈ సినిమా తరువాత తెలుగు సినిమాలు చేయకపోవచ్చు అంటూ మహేష్ షాక్ ఇచ్చారు.మళ్ళీ మన తెలుగు మాస్ సాంగ్స్ కి డాన్స్ చేసే అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదు.

ఇక పై తెలుగు సినిమాలు చేయకపోవచ్చు…

మరో తెలుగు సినిమా వస్తుందో రాదో తెలియకనే ఈ సినిమాలో పాటలను గట్టిగా ప్లాన్ చేసాము. దానికి తగ్గట్టే మూవీలోని మొదటి సాంగ్ అండ్ లాస్ట్ సాంగ్ ని ప్లాన్ చేశాము. అలాగే సెకండ్ హాఫ్ లో గో‌డౌన్‌లో ఒక సాంగ్ బిట్టు వస్తుంది. నెక్లీస్ గొలుసు సాంగ్ చేయాలని ముందుగానే ఫిక్స్ అయ్యామని మహేష్ తెలిపారు. కానీ ఈ అమ్మాయి డాన్స్ చూసే సరికి కాస్త భయం వేసిందని ఈ సందర్భంగా మహేష్ బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu: నేను తాగింది అసలు బీడీనే కాదు.. అసలు విషయం చెప్పిన మహేష్ బాబు!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి కాస్త మిశ్రమ స్పందన దక్కించుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం భారీగా కలెక్షన్స్ రాబడుతూ మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నటువంటి తరుణంలో మహేష్ బాబు శ్రీ లీల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబుకు సినిమాలో తరచూ బీడీ తాగే సీన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి . అయితే ఈ బీడి గురించి మహేష్ బాబు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నాకు అసలు స్మోక్ అంటేనే నచ్చదు. నేను స్మోకింగ్ ఎంకరేజ్ కూడా చేయనంటూ మహేష్ బాబు తెలిపారు.

ఇక నేను గుంటూరు కారం సినిమాలో తాగిన బీడీ రియల్ బీడీ కాదని, అదొక ఆయుర్వేదిక్ బీడీ అంటూ మహేష్ బాబు అసలు విషయం వెల్లడించారు. మొదటి రోజు షూటింగ్లో తాను రియల్ బీడీ తాగాను. నాకు వెంటనే మైగ్రేన్ హెడేక్ వచ్చింది. నా వల్ల కాలేదు త్రివిక్రమ్ గారని చెప్పగానే ఆయన మరేం చేద్దామని ఆలోచించి ఆయుర్వేదిక్ బీడీ తెప్పించారు.

ఆయుర్వేదిక్ బీడీ…

దీంట్లో ఎలాంటి పొగాకు కానీ ఇతర మత్తు పదార్థాలు కాని ఉండవు కేవలం పుదీనా లవంగా ఫ్లేవర్స్ తో ఉందని దానివల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని మహేష్ బాబు తెలిపారు. ఇలా ఒక ఆయుర్వేదిక్ బీడీతోనే సినిమా మొత్తం కానిచ్చేసాము అంటూ ఈ సందర్భంగా మహేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Sreeleela: గుంటూరు కారం ఈవెంట్ లో శ్రీ లీల కట్టిన ఈ చీర ఖరీదు తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే?

Sreeleela: నటి శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈమె మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకేక్కినటువంటి ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఇటీవల గుంటూరులో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో శ్రీ లీల స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ కార్యక్రమానికి ఈమె నెట్టెడ్ శారీ ధరించి వచ్చారు. బాటిల్ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఈ శారీలో శ్రీ లీలా చాలా క్యూట్ గా కనిపించారు. దీంతో ఈమెకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలపై ఎంతో మంది అభిమానులు ఫోకస్ చేస్తూ శ్రీ లీల కట్టుకున్నటువంటి చీర గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు.

ఈ కార్యక్రమానికి శ్రీ లీల కట్టుకున్నటువంటి ఈ చీర ఖరీదు ఎంత అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చీర ఏకంగా 1.59 లక్షల రూపాయల ఖరీదని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికీ ఈ చీర కోసం ఈమె ఇంత ఖరీదు చేసిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు పైనే ఆశలు..

శ్రీ లీల మహేష్ బాబుతో కలిసి ఈ సినిమాలో నటించడంతో ఈమె కూడా ఈ సినిమా పట్ల చాలా ఎక్సైట్ గా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా శ్రీ లీల మాత్రమే కాకుండా మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి పోస్టర్స్ ట్రైలర్ టీజర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి మరి ఈ సినిమా శ్రీ లీలకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Mahesh Babu: నాన్న లేరు.. అన్నీ మీరే అంటూ ఎమోషనల్ అయిన మహేష్ బాబు?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించడమే కాకుండా వరుస ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా వేడుకను గుంటూరులో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన తండ్రి కృష్ణ మరణించిన తర్వాత మొదటి సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో ఈ వేదికపై మహేష్ బాబు తన తండ్రి కృష్ణ గారిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. సంక్రాంతికి నా సినిమా వస్తే హిట్ అవుతుందన్న సెంటిమెంట్ మాలో ఉందని తెలిపారు.

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలను చూసి నాన్న నాకు ఫోన్ చేసి అభినందనలు తెలిపేవారు కానీ ఈసారి నాన్న లేరు. ఇకపై ఆ విషయాలన్నీ మీరే నాకు తెలియచేయాలి. మీరే నా అమ్మానాన్న అంటూ అభిమానులను ఉద్దేశించి ఈయన ఎమోషనల్ కామెంట్ చేయడమే కాకుండా అభిమానులందరికీ చేతులెత్తి దండం పెట్టారు. ఇలా తండ్రిని తలుచుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ అవడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

నాకన్నీ మీరే…

ఇక మహేష్ బాబు నటించిన ప్రతి సినిమాకి కూడా కృష్ణ తన అభిప్రాయాలను తెలియజేసే వారు మొదటిసారి కృష్ణ గారు లేకుండా గుంటూరు కారం సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో మహేష్ బాబు తన తండ్రిని గుర్తుచేసుకొని ఈ సందర్భంగా కామెంట్స్ చేశారు. ఇక ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో శ్రీ లీల మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

Mahesh Babu: నాన్ననుంచే ఆ అలవాటు నేర్చుకున్న… నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటికీ తనే: మహేష్ బాబు

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా మహేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు త్వరలోనే గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదలవుతుంది.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నటువంటి తరుణంలో మహేష్ బాబు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు దుబాయ్ వెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇలా దుబాయ్ నుంచి ఈయన హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా మారిపోయారు.

మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కెరియర్ మొదట్లో నేను నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో నేను కృష్ణ గారి అబ్బాయి అనే ఒత్తిడి నాపై ఎక్కువగా ఉండేది దీంతో ఏం చేయాలో తెలియక రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా సినిమాలు చేశానని మహేష్ బాబు తెలిపారు.

ఇక చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరగడంతో నాన్నలో ఉన్నటువంటి క్రమశిక్షణను నేను అలవాటు చేసుకున్నానని ఈయన వెల్లడించారు. మురారి సినిమా సమయంలో నాన్న నాతో పాటు థియేటర్లో సినిమా చూశారు .అసలు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని నేను కంగారుపడగా నాన్న మాత్రం నా భుజంపై చేయి వేశారు. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేనని మహేష్ బాబు తెలిపారు. ఇక ఒక్కడు సినిమా తర్వాత నాకు మంచి ధైర్యం వచ్చిందని ఈయన వెల్లడించారు.

నమ్రత బెస్ట్ ఫ్రెండ్…

ఇక మహేష్ బాబు తరచూ వెకేషన్స్ వెళ్లడం గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. నాకు చాలా సరదాగా గడపడం ఇష్టం కానీ ఇక్కడ అలా గడపడానికి వీలుకాదు అందుకే నేను విదేశాలకు వెళ్తానని అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత నేను రీఛార్జ్ అయ్యాను అన్న ఫీలింగ్ నాలో ఉంటుందని అందుకే వెళుతూ ఉంటానని తెలిపారు. ఇక మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనే ప్రశ్న ఈయనకు ఎదురు కావడంతో తన భార్య నమ్రత తనకు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఈ సందర్భంగా మహేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Poonam Kaur: ఆ విషయంలో గురూజీ మంచి సమర్థుడే… త్రివిక్రమ్ పై పూనమ్ షాకింగ్ కామెంట్స్?

Poonam Kaur: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వచ్చింది అంటే ఆ సినిమా ఎలాంటి సంచలనాలను అందుకుంటుందో అందరికీ తెలిసిందే. ఇలా త్రివిక్రమ్ సినిమాలంటే ప్రేక్షకులలో కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. అయితే ఈ సినిమా ఒరిజినల్ సినిమా కాదని ఈ సినిమాని త్రివిక్రమ్ యద్దనపూడి సులోచనారాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవలను ఆధారంగా చేసుకుని రాశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా ఈ సినిమా కాఫీ అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఆయన దేనినైనా చేయగల సమర్థుడు అంతేకాకుండా దాని నుంచి ఎలాగా తప్పించుకోవాలో కూడా బాగా తెలిసిన వ్యక్తి అంటూ కామెంట్ లు చేశారు. తన తప్పుడు పనులు ప్రజలకు కనపడకుండా చేయగల నైపుణ్యం ఉన్నవారు.

కొంతమంది గుడ్డిగా నమ్ముతారు..

కొంతమంది ఆయనని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రజలకు సహాయం చేయడానికి రాని గత ప్రభుత్వం ఆయనకు మాత్రం భారీగా సహాయం చేసిందని అది ఎందుకో ఇప్పటికి నాకు అర్థం కాదు అంటూ ఈమె గురూజీ త్రివిక్రమ్ పై చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంలో ఈమె పరోక్షంగా పవన్ పై కూడా సెటైర్స్ వేశారని స్పష్టంగా అర్థం అవుతుంది.