Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా మహేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు త్వరలోనే గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదలవుతుంది.
ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నటువంటి తరుణంలో మహేష్ బాబు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు దుబాయ్ వెళ్లిన విషయం మనకు తెలిసిందే. ఇలా దుబాయ్ నుంచి ఈయన హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా మారిపోయారు.
మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కెరియర్ మొదట్లో నేను నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో నేను కృష్ణ గారి అబ్బాయి అనే ఒత్తిడి నాపై ఎక్కువగా ఉండేది దీంతో ఏం చేయాలో తెలియక రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా సినిమాలు చేశానని మహేష్ బాబు తెలిపారు.
ఇక చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూ పెరగడంతో నాన్నలో ఉన్నటువంటి క్రమశిక్షణను నేను అలవాటు చేసుకున్నానని ఈయన వెల్లడించారు. మురారి సినిమా సమయంలో నాన్న నాతో పాటు థియేటర్లో సినిమా చూశారు .అసలు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని నేను కంగారుపడగా నాన్న మాత్రం నా భుజంపై చేయి వేశారు. ఆ క్షణాలను నేను ఎప్పటికీ మర్చిపోలేనని మహేష్ బాబు తెలిపారు. ఇక ఒక్కడు సినిమా తర్వాత నాకు మంచి ధైర్యం వచ్చిందని ఈయన వెల్లడించారు.
నమ్రత బెస్ట్ ఫ్రెండ్…
ఇక మహేష్ బాబు తరచూ వెకేషన్స్ వెళ్లడం గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. నాకు చాలా సరదాగా గడపడం ఇష్టం కానీ ఇక్కడ అలా గడపడానికి వీలుకాదు అందుకే నేను విదేశాలకు వెళ్తానని అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత నేను రీఛార్జ్ అయ్యాను అన్న ఫీలింగ్ నాలో ఉంటుందని అందుకే వెళుతూ ఉంటానని తెలిపారు. ఇక మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనే ప్రశ్న ఈయనకు ఎదురు కావడంతో తన భార్య నమ్రత తనకు ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఈ సందర్భంగా మహేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…